నిజంనిప్పులాంటిది

Mar 31 2023, 20:18

'జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష'కు అత్యంత ప్రాధాన్యం: సీఎం జగన్‌

తాడేపల్లి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు..

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో సర్వే చేపట్టడం లేదని.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం అని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామన్నారు.

ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ కూడా చాలా ఉపయోగమని సీఎం పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు..

జాప్యానికి తావు లేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందని అధికారులు వివరించారు. మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్న సీఎం.. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలని సూచించారు. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందని సీఎం అన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 31 2023, 20:17

KotamReddy: ఆయన చెబితే రాజధాని కదిలే అవకాశం లేదు: కోటంరెడ్డి..

తుళ్లూరు: అమరావతి నుంచి ఒక్క మట్టిపెళ్ల కూడా వైకాపా ప్రభుత్వం కదిలించలేదని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు.

రాజధాని అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకుపోతాయన్నారు.

''రాజధాని అమరావతి 29 గ్రామాలది కాదు.. ప్రపంచంలోని కోట్లాది తెలుగువారిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడెందుకు కాదో జగన్‌ చెప్పాలి. జగన్‌ అమరావతికి జైకొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. ప్రధాని మోదీ చెబితే రాజధాని ఇక్కడి నుంచి కదిలే అవకాశం లేదు. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడే శక్తి అమరావతికి ఉందని చంద్రబాబు నమ్మారు'' అని కోటంరెడ్డి అన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 31 2023, 08:29

నేటి నుంచి ఐపీఎల్‌- సీజ‌న్ 16 ప్రారంభం..

ముంబై: క్రికెట్‌ అభిమానులను వేసవి వినోదంలో ముంచెత్తే ఐపీఎల్‌-2023 సీజన్ నేడు మొదలవుతోంది. పొట్టి క్రికెట్‌ మెగా పండగ ఆరంభం కానుంది.

తమ అభిమాన జట్లలో టైటిల్‌ ఫేవరెట్‌ ఎవరనే దగ్గర్నుంచి, ఏ జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలుస్తుంది? ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? టాప్‌ వికెట్‌ టేకర్‌ ఎవరవుతారు? క్యాచ్‌లు.. సిక్సర్లు.. కళ్లు చెదిరే క్యాచ్‌లు ఇలా.. బంతిబంతికి ఉత్కం ఠను రేకెత్తించే ఐపీఎల్‌ సంబరం గురించి అభిమానుల్లో చర్చ జోరం దుకుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 16వ సీజన్‌ మునుపటి కంటే కాస్తంత విభిన్నంగా జరగనుంది. క్రికెట్‌ ద్వారా మరింత మజాను అందించేలా సిద్ధమైంది.

థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు అభిమానులు ఆతృతగాఉన్నారు. ఆయా ఫ్రాంచైజీలు కూడా కొత్త సీజ న్‌పై కొత్త ఆశలతో మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఐపీ ఎల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొత్తగా అమ లు చేయబోతున్న వినూత్న నిబంధనలు సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నా యి. టాస్‌ తర్వాత కూడా జట్లను ప్రకటించే వెసులుబాటుతోపాటు, వైడ్‌, నో బాల్స్‌పైనా రివ్యూ కోరే అవకాశం, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఈసీజన్‌కు కొత్త

నిజంనిప్పులాంటిది

Mar 30 2023, 10:35

World Bank Chief : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా..

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో

బుధవారం నామినేషన్లు ముగిశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ కొనసాగుతున్నారు.

అయితే, ఆయన పదవీకాలం ఒక సంవత్సరం ఉంది. ముందస్తుగా మాల్సాస్ పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాక్ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు. సాధారణంగా అమెరికా ప్రతిపాదించిన వ్యక్తికే ప్రపంచ బ్యాంక్ నాయకత్వ బాధ్యతలు దక్కుతూ వస్తున్నాయి.

నిజంనిప్పులాంటిది

Mar 30 2023, 10:34

Covid cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 3 వేలు దాటిన కేసులు

భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.

తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, నిన్నటితో పోలిస్తే 40% పెరిగింది..

దాదాపు ఆరు నెలల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.యాక్టివ్ కేసులు 13,509కి పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా నమోదైంది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది..

నిజంనిప్పులాంటిది

Mar 30 2023, 10:33

TSRTC: రాజధాని బస్సులో మంటలు.. NH65పై ట్రాఫిక్‌ జామ్‌

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్‌ వద్ద రాజధాని ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే, బస్సు.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కాగా, బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఎన్‌హెచ్‌-65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక, బస్సును మియాపూర్‌ డిపోకు చెందినదిగా గుర్తించారు.

ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతుడు రాజును మునగాల మండలం ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు..

నిజంనిప్పులాంటిది

Mar 30 2023, 10:31

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే

ఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన..

► విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చింది. విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను..

ఈ సందర్భంగా.. హోం మంత్రి అమిత్‌ షాకి సీఎం జగన్‌ నివేదించిన కీలక అంశాలు

► పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.

► అనూహ్య వరదల కారణంగా డయాఫ్రంవాల్‌ దెబ్బతింది. డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనావేసింది. ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

► రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2,600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను..

నిజంనిప్పులాంటిది

Mar 29 2023, 08:02

Toll Charges: ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

అమరావతి: జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్‌ రుసుములను సమీక్షిస్తారు..

అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు తెలిపారు.

దీంతో రాష్ట్రంలో ఉన్న 58 టోల్‌ ప్లాజాల్లో ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. బీవోటీ కింద గుత్తేదారుల నిర్వహణలో ఉన్న మరో అయిదు టోల్‌ప్లాజాల రుసుమును జులై లేదా ఆగస్టులో సవరిస్తారు..

నిజంనిప్పులాంటిది

Mar 29 2023, 08:00

Hyderabad: నేడు టీడీపీ ఆవిర్భావ సభ.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం

తెలుగుదేశం పార్టీ 41 వసంతాలు పూర్తి చేసుకుంది.

తెలంగాణలో పార్టీని బలపరిచే లక్ష్యంతో పార్టీ 41వ ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.

ఇవాళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది..

రెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహా దాదాపు 15 వేల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సభ నిర్వహణకు 12 కమిటీలను ఏర్పాటు చేశారు..

కష్టపడి పనిచేసే వారికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పార్టీ నేతలకు సమాచారం అందింది..

నిజంనిప్పులాంటిది

Mar 29 2023, 07:58

CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ!

ఏపీలో రాజకీయ పరిణామాలు వేడిగా ఉన్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బలు తగిలాయి.

రాజధాని అమరావతి అంశంపై సుప్రీం కోర్టులో నిన్న విచారణ జరిగింది.

విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని సీఎం జగన్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

ఇక, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదో ఒకటి తేలేలా ఉంది.

ఈ అంశాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో సీఎం జగన్ చర్చిస్తారని అంచనా ఉంది.

పోలవరం ఎత్తు గురించి కేంద్రం కీలక ప్రకటన కూడా చేసింది.

ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.