అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తా: రేణుకా చౌదరి
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే (Manikrao Thakre) ఆహ్వానం మేరకే ఆయన్ను కలిశానని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) అన్నారు. ఠాక్రేతోపాటు తాను కూడా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రలో పాల్గొంటానని చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు ఆహ్వానిస్తామని చెప్పారు. పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామన్నారు.
ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పిన ఆమె.. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీ చేయాలంటూ కొందరు ఆహ్వానిస్తున్నారని, అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తానని రేణుకా చౌదరి అన్నారు.








అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు నల్లగంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్, పలువురు నాయకులు...


Feb 06 2023, 21:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.5k