TeluguCentralnews

Aug 31 2024, 12:11

Breaking : స్థానికి ఎన్నికలపై ఎస్ఈసీ భేటీ ‼️

- జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ

- ఎన్నికల ఓట్ల జాబితాకు రంగం సిద్ధం

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల(Telangana local body elections)కు సంబంధించి ఇవాళ(శనివారం) రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశానికి గుర్తింపు పొందిన పలు పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కమిషనర్ పార్థసారథి వారితో కూలంకశంగా చర్చిస్తారు. ఇప్పటికే వార్టుల వారీగా ఓటర్ల జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఆయన స్వీకరించనున్నారు.

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయింది. ఈ సమావేశంలో వాటి ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తదితర కీలక అంశాలపై రాజకీయ పార్టీలతో ఆయన చర్చించనున్నారు. ఓటర్ జాబితా తయారీ అనంతరం ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు..!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలా సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌ నుంచి పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని చెప్పారు. ముందుగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.

శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వమైనవని పార్థసారథి చెప్పారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ వంటి ప్రక్రియలను తక్షణమే పూర్తిచేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 6న ముసాయిదా ఓటరు జాబితా వెలువరించి అభ్యంతరాలను స్వీకరించి 21న తుది ఓటరు జాబితా విడుదల చేయాలని చెప్పారు. జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ముందుగానే సరి చూసుకోవాలన్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల సంఖ్య దాటితే అదనపు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 12:40

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నేడు భూమిపూజ..

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే భూమిపూజా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున హాజరుకానున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్‌లో సీఎం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఓ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 9, 2024న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.

అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. అయితే ఆ స్థానంలో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ మేరకు అక్కడ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసింది. అయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎలా పెడతారంటూ మండిపడింది.

రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణతో ఉన్న సంబంధం ఏంటని, ఆయన విగ్రహం పెట్టాలని అవసరం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఏర్పాటుపై ప్రజాసంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విగ్రహ ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 26 2024, 14:55

హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు

రాష్ట్ర సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు.

తెలంగాణ సర్కార్ (Telangana Govt) హైడ్రాను (Hydra) ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ( Kisan Cell National Vice President Kodanda Reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన కాకముంటే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు.

తాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్‌లో లేక్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేసిందని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటు చేసి ప్రజల మన్నన్నలు పొందుతున్న సీఎం రేవంత్‌పై (CM Revanth Reddy) ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా ర్యాలీ చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, నెక్లస్ రోడ్ ఏర్పాటైందన్నారు.

ప్రకృతిని కాపాడడానికి చెరువులు కాపాడాలన్నారు. హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం కృష్ణ, గోదావరి నీటిని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కారే రానున్న 30 ఏళ్ల వరకు తాగునీటి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. ధర్మం కోసం భగవత్ గీతను కూడా స్ఫూర్తిగా తీసుకున్నా అని సీఎం రేవంత్ నిన్న చెప్పారన్నారు. హెచ్‌ఎండీలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కోదండరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎస్‌సీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 03 2024, 13:00

భూ రికార్డులపై కొత్త ఆర్వోఆర్‌..

భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు సమాయత్తమైంది.

భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు సమాయత్తమైంది. ఈ మేరకు భూ రికార్డుల నిర్వహణ కోసం ‘2024-ఆర్వోఆర్‌’ను తెచ్చేందుకు సంకల్పించింది. తద్వారా ధరణి పోర్టల్‌ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్‌ను తెచ్చే చర్యలను వేగవంతం చేసింది. ఈ 2024-ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లును శుక్రవారం మంత్రి పొంగులేటి సభ ముందుంచారు. ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు కొత్త ఆర్వోఆర్‌ బిల్లుకు తుదిరూపమిచ్చి సభలో ప్రవేశపెట్టనున్నారు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కారించడంతో పాటు భవిష్యత్తులోనూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఈ కొత్త సమగ్ర ఆర్వోఆర్‌-2024 ముసాయిదాకు రూపకల్పన చేసింది

ఈ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం విస్తృత ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ఇందుకుగాను సీసీఎల్‌ఏ ఈ నెల 23 వరకు గడువు విధింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ మెయిల్‌, లేదా పోస్టు ద్వారా తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. మొయిల్‌ ద్వారా అయితే ద్వారా తెలియజేయాలి. లేఖ ద్వారానైతే ల్యాండ్‌ లీగల్‌ సెల్‌, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి, ేస్టషన్‌ రోడ్‌, అన్నపూర్ణ హోటల్‌ ఎదురుగా, ఆబిడ్స్‌, హైదరాబాద్‌ 500001 చిరునామాకు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ముసాయిదా బిల్లుపై సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత.. బిల్లుకు తుదిరూపమిచ్చి.. సర్కారు సభలో ప్రవేశపెట్టనుంది. కాగా కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లులో ధరణిలో పరిష్కారానికి వీల్లేకుండా పోయిన సమస్యలన్నీ పరిష్కారానికి ప్రతిపాదనలు పెట్టారు.

ఈ మేరకు మొత్తంగా 20 సెక్షన్‌ల కింద వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించుకొనే వెసులు బాట కల్పించారు. వ్యవసాయ భూముల మ్యుటేషన్‌కు సంబంధించిన సమస్యలన్నీ తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలోనే పూర్తవుతాయి. గత ఆర్వోఆర్‌లను సవరించుకోవచ్చు. రికార్డుల్లో లేని భూమును రికార్డుల్లోకి ఎక్కించుకోవచ్చు. నమోదులో జరిగిన పొరపాట్లపై అప్పీలుకు వెళ్లే వెసులుబాటు కల్పించారు. సర్వే అనంతరం పర్మినెంట్‌ భూధార్‌ నంబరు కేటాయించనున్నారు.

సెక్షన్‌-5 కింద మ్యూటేషన్‌ పరమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ద్వారా వచ్చిన భూమి పత్రాలను పరిశీలించి నోటీసులు ఇస్తారు. ఆపై విచారణ చేసి మ్యూటేషన్‌ చేసే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తారు. సెక్షన్‌-7 కింద వారసత్వం ద్వారా వచ్చిన భూమి, భాగాల పంపకాల్లో వచ్చిన భూమి, వీలునామా కింద సక్రమించిన భూమిని కూడా తహసీల్దార్లకు మ్యూటేషన్‌ చేసే అధికారం ఉంటుంది.

సెక్షన్‌-8 కింద.. ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలో కొనుగోలు చేసిన భూమి, సాదాభైనామా కింద వచ్చిన భూమి, కౌలుదారు చట్టం కింద సక్రమించిన భూమి, ఇనాం ద్వారా వచ్చిన భూమి, ఓఆర్సీ ద్వారా వచ్చిన భూమిని మ్యూటేషన్‌ చేసే అధికారం ఆర్డీవోలకు కట్టబెట్టారు. మ్యూటేషన్‌ చేసేకంటే ముందు అభ్యంతరాలొస్తే మ్యూటేషన్‌ నిలిపివేసే అధికారం కూడా తహసీల్దార్లు, ఆర్డీవోలకు కల్పించారు

సెక్షన్‌-6 కింద సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ఇప్పటికే వచ్చిన 9 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించనున్నారు. వీటి పరిష్కారానికి ముందు విచారణ చేసి, నోటీసులు ఇచ్చి మ్యూటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

కొత్త దరఖాస్తులు వస్తే రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఫీజలు వసూలు చేసి, సంబంధిత రైతులకు మ్యూటేషన్‌ చేయనున్నారు. ఇక నమోదులో తప్పులు జరిగితే అప్పీళ్లు చేసేందుకు ప్రస్తుతం ధరణిలో అవకాశం లేదు.

కానీ ఈ చట్టం ద్వారా బాధితులు అప్పీలుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. మొదటి అప్పీలు కింద కలెక్టర్‌ లేదా అదనపు కలెక్టర్‌, రెండో అప్పీలు కింద సీసీఎల్‌ఏకు అధికారం కల్పించారు. వీరు ఇచ్చిన తీర్పులను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

రికార్డుల మార్పు కోసం సివిల్‌ కోర్టుకు వెళ్లనక్కర్లేదు. రెవెన్యూశాఖకు వీటిని సవరించే అధికారం కల్పించారు. యాజమాన్యం హక్కుల కోసం మాత్రమే కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. ఈ ఆర్వోఆర్‌ ప్రకారం పహాణిలు మళ్లీ నమోదు చేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 25 2024, 20:21

ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Former CM KCR) తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది. అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరత్వరగా జరిగిపోయాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్ కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.

ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.

అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరు అవుతారా?... లేదా? అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు

ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో సమావేశాలు మొదలైన తర్వాత మూడవ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. అయితే... బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తారని.. తరువాత సభకు దూరంగా ఉండనన్నట్లు సమాచారం. మరి మరికొద్దిరోజుల పాటు జరిగే సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా?.. లేరా..? అనేది వేచి చూడాలి.

కాగా... మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అందజేశారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి నివాసం ప్రజాభవన్‌లో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులను భట్టి దంపతులు తీసుకున్నారు. అలాగే రూ.2 లక్షల 95 వేల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.

vemulajanardhanreddy54

Jul 22 2024, 19:03

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ శాఖలో జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో వివ‌రించారు.


పోస్టుల వివ‌రాలు.
క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ (22). ఇలా పూర్తిగా 30 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు జౌళి శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా. అయితే, ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు IIHT నుంచి చేనేత టెక్నాలజీ (DTH )లో డిప్లొమా హోల్డర్లు అర్హుల‌ని, వీరు ఈ పోస్టుల‌ల్లో అప్లై చేసుకోవాలని శైలజా రామయ్యార్ తెలిపారు. అభ్యర్థులు మ‌రిన్ని వివరాలను తెలుసుకునేందుకు tsht.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని ఆమె సూచించారు.

Mane Praveen

Jul 17 2024, 21:58

శివన్నగూడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మర్రిగూడ మండలం, శివన్నగూడ గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆవుల చిన్న జంగయ్య మరియు బొంత మంగమ్మ కు పంపిణీ చేసిన శివన్నగూడ శ్రీ నీలకంఠ రామస్వామి దేవస్థానం చైర్మన్ రాపోలు యాదగిరి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మర్రిగూడ మండల మాజీ జెడ్పిటిసి 
మేతరి యాదయ్య, దేవాలయ ధర్మకర్త చిట్యాల రంగారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ వాయిల సోమయ్య,  మండల కాంగ్రెస్ నాయకులు నందికొండ లింగారెడ్డి, శివన్నగూడ గ్రామ పెద్దలు ఇరగదిండ్ల సత్తయ్య, అయితగోని వెంకటయ్య, నల్లవోతు కొమురయ్య, జిల్లాగోని నరసింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA
SB NEWS NLG

Mane Praveen

Jul 15 2024, 22:37

NLG: ఘనంగా రిటైర్డ్ లెక్చరర్ పేర్ల వీరయ్య పెద్దకర్మ

నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జియాలజీ విభాగంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది, ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించడానికి కృషిచేసిన రిటైర్డ్ లెక్చరర్, కీర్తిశేషులు పేర్ల వీరయ్య గారి పెద్దకర్మ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన పూర్వపు రిజిస్టార్ ప్రొఫెసర్ కె. నరేందర్ రెడ్డి, మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ప్రేమ్ సాగర్, డాక్టర్ జి. మచ్చెందర్, డాక్టర్ బిక్షమయ్య, డాక్టర్ చింత శ్యామ్, జి. సుధాకర్, వీరస్వామి, సత్యనారాయణరెడ్డి, షరీఫ్ మరియు ఎన్జీ కాలేజీ ఇన్చార్జి హెడ్ జియాలజీ విభాగం ఇంద్రకంటి చంద్రయ్య మొదలగు వారు పాల్గొని తమ ఆరాధ్య దైవమైన గురువు వీరయ్య సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరయ్య సార్ ఎన్జీ కళాశాలలో సుదీర్ఘకాలంగా జియాలజీ విభాగంలో లెక్చరర్ గా, హెచ్ ఓ డి గా, పనిచేసి విద్యార్థులకు జియాలజి సులభంగా అర్థమయ్యేలా బోధించి, విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడే విధంగా కృషి చేశారని, ఆయన సేవలను కొనియాడారు.

SB NEWS TELANGANA

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:21

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఒక్కొక్కరుగా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా..

ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న (శుక్రవారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ కండువా కప్పుకోగా..

నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (MLA Arikapudi Gandhi) హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఇంతటితో ఆగనట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పార్టీలో గాంధీ చేరనున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

అలాగే రేపు (ఆదివారం) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 10:56

Telangana ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది.. వరంగల్‌ జిల్లాలో దారుణం

Telangana వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాకు చెందిన బానోతు శివ, సుగుణ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.

కూతురు దీపికను అదే గ్రామానికి చెందిన యువకుడు బన్నీ ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్‌తో ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు.

అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై కూడా తల్వార్‌తో బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో బానోతు శివ, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితుడు బన్నీని అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TeluguCentralnews

Aug 31 2024, 12:11

Breaking : స్థానికి ఎన్నికలపై ఎస్ఈసీ భేటీ ‼️

- జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ

- ఎన్నికల ఓట్ల జాబితాకు రంగం సిద్ధం

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల(Telangana local body elections)కు సంబంధించి ఇవాళ(శనివారం) రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశానికి గుర్తింపు పొందిన పలు పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కమిషనర్ పార్థసారథి వారితో కూలంకశంగా చర్చిస్తారు. ఇప్పటికే వార్టుల వారీగా ఓటర్ల జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఆయన స్వీకరించనున్నారు.

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయింది. ఈ సమావేశంలో వాటి ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తదితర కీలక అంశాలపై రాజకీయ పార్టీలతో ఆయన చర్చించనున్నారు. ఓటర్ జాబితా తయారీ అనంతరం ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు..!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలా సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌ నుంచి పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని చెప్పారు. ముందుగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.

శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వమైనవని పార్థసారథి చెప్పారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ వంటి ప్రక్రియలను తక్షణమే పూర్తిచేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 6న ముసాయిదా ఓటరు జాబితా వెలువరించి అభ్యంతరాలను స్వీకరించి 21న తుది ఓటరు జాబితా విడుదల చేయాలని చెప్పారు. జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ముందుగానే సరి చూసుకోవాలన్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల సంఖ్య దాటితే అదనపు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 12:40

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నేడు భూమిపూజ..

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే భూమిపూజా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున హాజరుకానున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్‌లో సీఎం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఓ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 9, 2024న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.

అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. అయితే ఆ స్థానంలో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ మేరకు అక్కడ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసింది. అయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎలా పెడతారంటూ మండిపడింది.

రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణతో ఉన్న సంబంధం ఏంటని, ఆయన విగ్రహం పెట్టాలని అవసరం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఏర్పాటుపై ప్రజాసంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విగ్రహ ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 26 2024, 14:55

హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు

రాష్ట్ర సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు.

తెలంగాణ సర్కార్ (Telangana Govt) హైడ్రాను (Hydra) ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ( Kisan Cell National Vice President Kodanda Reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన కాకముంటే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు.

తాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్‌లో లేక్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేసిందని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటు చేసి ప్రజల మన్నన్నలు పొందుతున్న సీఎం రేవంత్‌పై (CM Revanth Reddy) ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా ర్యాలీ చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, నెక్లస్ రోడ్ ఏర్పాటైందన్నారు.

ప్రకృతిని కాపాడడానికి చెరువులు కాపాడాలన్నారు. హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం కృష్ణ, గోదావరి నీటిని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కారే రానున్న 30 ఏళ్ల వరకు తాగునీటి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. ధర్మం కోసం భగవత్ గీతను కూడా స్ఫూర్తిగా తీసుకున్నా అని సీఎం రేవంత్ నిన్న చెప్పారన్నారు. హెచ్‌ఎండీలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కోదండరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. వరసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎస్‌సీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 03 2024, 13:00

భూ రికార్డులపై కొత్త ఆర్వోఆర్‌..

భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు సమాయత్తమైంది.

భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు సమాయత్తమైంది. ఈ మేరకు భూ రికార్డుల నిర్వహణ కోసం ‘2024-ఆర్వోఆర్‌’ను తెచ్చేందుకు సంకల్పించింది. తద్వారా ధరణి పోర్టల్‌ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్‌ను తెచ్చే చర్యలను వేగవంతం చేసింది. ఈ 2024-ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లును శుక్రవారం మంత్రి పొంగులేటి సభ ముందుంచారు. ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు కొత్త ఆర్వోఆర్‌ బిల్లుకు తుదిరూపమిచ్చి సభలో ప్రవేశపెట్టనున్నారు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కారించడంతో పాటు భవిష్యత్తులోనూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఈ కొత్త సమగ్ర ఆర్వోఆర్‌-2024 ముసాయిదాకు రూపకల్పన చేసింది

ఈ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం విస్తృత ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ఇందుకుగాను సీసీఎల్‌ఏ ఈ నెల 23 వరకు గడువు విధింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ మెయిల్‌, లేదా పోస్టు ద్వారా తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. మొయిల్‌ ద్వారా అయితే ద్వారా తెలియజేయాలి. లేఖ ద్వారానైతే ల్యాండ్‌ లీగల్‌ సెల్‌, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి, ేస్టషన్‌ రోడ్‌, అన్నపూర్ణ హోటల్‌ ఎదురుగా, ఆబిడ్స్‌, హైదరాబాద్‌ 500001 చిరునామాకు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ముసాయిదా బిల్లుపై సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత.. బిల్లుకు తుదిరూపమిచ్చి.. సర్కారు సభలో ప్రవేశపెట్టనుంది. కాగా కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లులో ధరణిలో పరిష్కారానికి వీల్లేకుండా పోయిన సమస్యలన్నీ పరిష్కారానికి ప్రతిపాదనలు పెట్టారు.

ఈ మేరకు మొత్తంగా 20 సెక్షన్‌ల కింద వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించుకొనే వెసులు బాట కల్పించారు. వ్యవసాయ భూముల మ్యుటేషన్‌కు సంబంధించిన సమస్యలన్నీ తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలోనే పూర్తవుతాయి. గత ఆర్వోఆర్‌లను సవరించుకోవచ్చు. రికార్డుల్లో లేని భూమును రికార్డుల్లోకి ఎక్కించుకోవచ్చు. నమోదులో జరిగిన పొరపాట్లపై అప్పీలుకు వెళ్లే వెసులుబాటు కల్పించారు. సర్వే అనంతరం పర్మినెంట్‌ భూధార్‌ నంబరు కేటాయించనున్నారు.

సెక్షన్‌-5 కింద మ్యూటేషన్‌ పరమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ద్వారా వచ్చిన భూమి పత్రాలను పరిశీలించి నోటీసులు ఇస్తారు. ఆపై విచారణ చేసి మ్యూటేషన్‌ చేసే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తారు. సెక్షన్‌-7 కింద వారసత్వం ద్వారా వచ్చిన భూమి, భాగాల పంపకాల్లో వచ్చిన భూమి, వీలునామా కింద సక్రమించిన భూమిని కూడా తహసీల్దార్లకు మ్యూటేషన్‌ చేసే అధికారం ఉంటుంది.

సెక్షన్‌-8 కింద.. ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలో కొనుగోలు చేసిన భూమి, సాదాభైనామా కింద వచ్చిన భూమి, కౌలుదారు చట్టం కింద సక్రమించిన భూమి, ఇనాం ద్వారా వచ్చిన భూమి, ఓఆర్సీ ద్వారా వచ్చిన భూమిని మ్యూటేషన్‌ చేసే అధికారం ఆర్డీవోలకు కట్టబెట్టారు. మ్యూటేషన్‌ చేసేకంటే ముందు అభ్యంతరాలొస్తే మ్యూటేషన్‌ నిలిపివేసే అధికారం కూడా తహసీల్దార్లు, ఆర్డీవోలకు కల్పించారు

సెక్షన్‌-6 కింద సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ఇప్పటికే వచ్చిన 9 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించనున్నారు. వీటి పరిష్కారానికి ముందు విచారణ చేసి, నోటీసులు ఇచ్చి మ్యూటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

కొత్త దరఖాస్తులు వస్తే రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఫీజలు వసూలు చేసి, సంబంధిత రైతులకు మ్యూటేషన్‌ చేయనున్నారు. ఇక నమోదులో తప్పులు జరిగితే అప్పీళ్లు చేసేందుకు ప్రస్తుతం ధరణిలో అవకాశం లేదు.

కానీ ఈ చట్టం ద్వారా బాధితులు అప్పీలుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. మొదటి అప్పీలు కింద కలెక్టర్‌ లేదా అదనపు కలెక్టర్‌, రెండో అప్పీలు కింద సీసీఎల్‌ఏకు అధికారం కల్పించారు. వీరు ఇచ్చిన తీర్పులను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

రికార్డుల మార్పు కోసం సివిల్‌ కోర్టుకు వెళ్లనక్కర్లేదు. రెవెన్యూశాఖకు వీటిని సవరించే అధికారం కల్పించారు. యాజమాన్యం హక్కుల కోసం మాత్రమే కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. ఈ ఆర్వోఆర్‌ ప్రకారం పహాణిలు మళ్లీ నమోదు చేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 25 2024, 20:21

ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Former CM KCR) తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది. అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరత్వరగా జరిగిపోయాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్ కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.

ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.

అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరు అవుతారా?... లేదా? అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు

ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో సమావేశాలు మొదలైన తర్వాత మూడవ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. అయితే... బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తారని.. తరువాత సభకు దూరంగా ఉండనన్నట్లు సమాచారం. మరి మరికొద్దిరోజుల పాటు జరిగే సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా?.. లేరా..? అనేది వేచి చూడాలి.

కాగా... మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అందజేశారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి నివాసం ప్రజాభవన్‌లో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులను భట్టి దంపతులు తీసుకున్నారు. అలాగే రూ.2 లక్షల 95 వేల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.

vemulajanardhanreddy54

Jul 22 2024, 19:03

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ శాఖలో జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో వివ‌రించారు.


పోస్టుల వివ‌రాలు.
క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ (22). ఇలా పూర్తిగా 30 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు జౌళి శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా. అయితే, ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు IIHT నుంచి చేనేత టెక్నాలజీ (DTH )లో డిప్లొమా హోల్డర్లు అర్హుల‌ని, వీరు ఈ పోస్టుల‌ల్లో అప్లై చేసుకోవాలని శైలజా రామయ్యార్ తెలిపారు. అభ్యర్థులు మ‌రిన్ని వివరాలను తెలుసుకునేందుకు tsht.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని ఆమె సూచించారు.

Mane Praveen

Jul 17 2024, 21:58

శివన్నగూడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మర్రిగూడ మండలం, శివన్నగూడ గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆవుల చిన్న జంగయ్య మరియు బొంత మంగమ్మ కు పంపిణీ చేసిన శివన్నగూడ శ్రీ నీలకంఠ రామస్వామి దేవస్థానం చైర్మన్ రాపోలు యాదగిరి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మర్రిగూడ మండల మాజీ జెడ్పిటిసి 
మేతరి యాదయ్య, దేవాలయ ధర్మకర్త చిట్యాల రంగారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ వాయిల సోమయ్య,  మండల కాంగ్రెస్ నాయకులు నందికొండ లింగారెడ్డి, శివన్నగూడ గ్రామ పెద్దలు ఇరగదిండ్ల సత్తయ్య, అయితగోని వెంకటయ్య, నల్లవోతు కొమురయ్య, జిల్లాగోని నరసింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA
SB NEWS NLG

Mane Praveen

Jul 15 2024, 22:37

NLG: ఘనంగా రిటైర్డ్ లెక్చరర్ పేర్ల వీరయ్య పెద్దకర్మ

నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జియాలజీ విభాగంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది, ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించడానికి కృషిచేసిన రిటైర్డ్ లెక్చరర్, కీర్తిశేషులు పేర్ల వీరయ్య గారి పెద్దకర్మ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన పూర్వపు రిజిస్టార్ ప్రొఫెసర్ కె. నరేందర్ రెడ్డి, మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ప్రేమ్ సాగర్, డాక్టర్ జి. మచ్చెందర్, డాక్టర్ బిక్షమయ్య, డాక్టర్ చింత శ్యామ్, జి. సుధాకర్, వీరస్వామి, సత్యనారాయణరెడ్డి, షరీఫ్ మరియు ఎన్జీ కాలేజీ ఇన్చార్జి హెడ్ జియాలజీ విభాగం ఇంద్రకంటి చంద్రయ్య మొదలగు వారు పాల్గొని తమ ఆరాధ్య దైవమైన గురువు వీరయ్య సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరయ్య సార్ ఎన్జీ కళాశాలలో సుదీర్ఘకాలంగా జియాలజీ విభాగంలో లెక్చరర్ గా, హెచ్ ఓ డి గా, పనిచేసి విద్యార్థులకు జియాలజి సులభంగా అర్థమయ్యేలా బోధించి, విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడే విధంగా కృషి చేశారని, ఆయన సేవలను కొనియాడారు.

SB NEWS TELANGANA

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:21

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఒక్కొక్కరుగా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా..

ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న (శుక్రవారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ కండువా కప్పుకోగా..

నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (MLA Arikapudi Gandhi) హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఇంతటితో ఆగనట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పార్టీలో గాంధీ చేరనున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

అలాగే రేపు (ఆదివారం) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 10:56

Telangana ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది.. వరంగల్‌ జిల్లాలో దారుణం

Telangana వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాకు చెందిన బానోతు శివ, సుగుణ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.

కూతురు దీపికను అదే గ్రామానికి చెందిన యువకుడు బన్నీ ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్‌తో ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు.

అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై కూడా తల్వార్‌తో బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో బానోతు శివ, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితుడు బన్నీని అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.