తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 25 2024, 20:21

ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Former CM KCR) తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది. అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరత్వరగా జరిగిపోయాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్ కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.

ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.

అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరు అవుతారా?... లేదా? అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు

ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో సమావేశాలు మొదలైన తర్వాత మూడవ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. అయితే... బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తారని.. తరువాత సభకు దూరంగా ఉండనన్నట్లు సమాచారం. మరి మరికొద్దిరోజుల పాటు జరిగే సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా?.. లేరా..? అనేది వేచి చూడాలి.

కాగా... మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అందజేశారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి నివాసం ప్రజాభవన్‌లో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులను భట్టి దంపతులు తీసుకున్నారు. అలాగే రూ.2 లక్షల 95 వేల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.

vemulajanardhanreddy54

Jul 22 2024, 19:03

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ శాఖలో జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో వివ‌రించారు.


పోస్టుల వివ‌రాలు.
క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ (22). ఇలా పూర్తిగా 30 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు జౌళి శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా. అయితే, ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు IIHT నుంచి చేనేత టెక్నాలజీ (DTH )లో డిప్లొమా హోల్డర్లు అర్హుల‌ని, వీరు ఈ పోస్టుల‌ల్లో అప్లై చేసుకోవాలని శైలజా రామయ్యార్ తెలిపారు. అభ్యర్థులు మ‌రిన్ని వివరాలను తెలుసుకునేందుకు tsht.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని ఆమె సూచించారు.

Mane Praveen

Jul 17 2024, 21:58

శివన్నగూడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మర్రిగూడ మండలం, శివన్నగూడ గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆవుల చిన్న జంగయ్య మరియు బొంత మంగమ్మ కు పంపిణీ చేసిన శివన్నగూడ శ్రీ నీలకంఠ రామస్వామి దేవస్థానం చైర్మన్ రాపోలు యాదగిరి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మర్రిగూడ మండల మాజీ జెడ్పిటిసి 
మేతరి యాదయ్య, దేవాలయ ధర్మకర్త చిట్యాల రంగారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ వాయిల సోమయ్య,  మండల కాంగ్రెస్ నాయకులు నందికొండ లింగారెడ్డి, శివన్నగూడ గ్రామ పెద్దలు ఇరగదిండ్ల సత్తయ్య, అయితగోని వెంకటయ్య, నల్లవోతు కొమురయ్య, జిల్లాగోని నరసింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA
SB NEWS NLG

Mane Praveen

Jul 15 2024, 22:37

NLG: ఘనంగా రిటైర్డ్ లెక్చరర్ పేర్ల వీరయ్య పెద్దకర్మ

నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జియాలజీ విభాగంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది, ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించడానికి కృషిచేసిన రిటైర్డ్ లెక్చరర్, కీర్తిశేషులు పేర్ల వీరయ్య గారి పెద్దకర్మ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన పూర్వపు రిజిస్టార్ ప్రొఫెసర్ కె. నరేందర్ రెడ్డి, మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ప్రేమ్ సాగర్, డాక్టర్ జి. మచ్చెందర్, డాక్టర్ బిక్షమయ్య, డాక్టర్ చింత శ్యామ్, జి. సుధాకర్, వీరస్వామి, సత్యనారాయణరెడ్డి, షరీఫ్ మరియు ఎన్జీ కాలేజీ ఇన్చార్జి హెడ్ జియాలజీ విభాగం ఇంద్రకంటి చంద్రయ్య మొదలగు వారు పాల్గొని తమ ఆరాధ్య దైవమైన గురువు వీరయ్య సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరయ్య సార్ ఎన్జీ కళాశాలలో సుదీర్ఘకాలంగా జియాలజీ విభాగంలో లెక్చరర్ గా, హెచ్ ఓ డి గా, పనిచేసి విద్యార్థులకు జియాలజి సులభంగా అర్థమయ్యేలా బోధించి, విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడే విధంగా కృషి చేశారని, ఆయన సేవలను కొనియాడారు.

SB NEWS TELANGANA

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:21

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఒక్కొక్కరుగా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా..

ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న (శుక్రవారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ కండువా కప్పుకోగా..

నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (MLA Arikapudi Gandhi) హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఇంతటితో ఆగనట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పార్టీలో గాంధీ చేరనున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

అలాగే రేపు (ఆదివారం) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 10:56

Telangana ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది.. వరంగల్‌ జిల్లాలో దారుణం

Telangana వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాకు చెందిన బానోతు శివ, సుగుణ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.

కూతురు దీపికను అదే గ్రామానికి చెందిన యువకుడు బన్నీ ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్‌తో ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు.

అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై కూడా తల్వార్‌తో బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో బానోతు శివ, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితుడు బన్నీని అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Mane Praveen

Jul 07 2024, 17:34

కొట్టాల, ఇందుర్తి గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీల ఏర్పాటు

మర్రిగూడెం మండలం కొట్టాల, ఇందుర్తి గ్రామాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామ కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య లు మాట్లాడుతూ.. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి గ్రామ బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇందుర్తి మాజీ సర్పంచ్ జంగిలి ప్రసన్న రవి, కొట్టాల మాజీ సర్పంచ్ గంట కవిత యాదయ్య, గంట మల్లేష్, నందికొండ లింగారెడ్డి, పలువురు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Jul 07 2024, 11:08

లెంకలపల్లి: బెల్టు షాపుల నిర్మూలన కమిటీ ఏర్పాటు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామంలోని రెండు బూత్ ల నుండి కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి గ్రామ బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, ఏర్పుల శ్రీశైలం, నందికొండ లింగారెడ్డి, చాపల రవి, అయితగోని వెంకటయ్య, మేతరి శంకర్, దాసరి వెంకన్న, లింగయ్య, హరీష్, , వెంకటయ్య, యాదయ్య, నాగరాజు, శ్రీను, గిరి, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:56

Congress: ఈనెల 10న తెలంగాణకు కురియన్ కమిటీ

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ (AICC) నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో (Telangana) నిజనిర్ధారణ కోసం కురియన్ కమిటీని అధిష్టానం నియమించింది.

కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈనెల 10న రాష్ట్రానికి రానున్న కమిటీ... తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి సమాచారాన్ని సేకరించనుంది. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. కురియన్ కమిటీ రిపోర్ట్ తర్వాతే కార్పొరేషన్ పదవులు ఇద్దామనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నట్లు సమాచారం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:06

చంద్రబాబు, రేవంత్‌ బంధంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వాక్యాలు

Telangana: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

స్పందించారు.

చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్యులు కాదని.. సహచరులని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రేవంత్ చాలా సార్లు చెప్పారన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ తెలంగాణ సీఎం అని తేల్చిచెప్పారు. చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులు అనే వారివి అవగాహనలేని మాటలని కొట్టిపారేశారు. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే అని వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాల కోసం బీఆర్‌ఎస్ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్సుతో ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పుకొచ్చారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేబినెట్ విస్తరణపై పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుందన్నారు.

త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు. పదిహేనేండ్లు తామే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్ వి కల్లిబొల్లి కబుర్లే అంటూ విమర్శించారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. పుట్టింది బతకడానికి... చావడానికి కాదని అన్నారు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పిదాలు ఆయన్ని వెంటాడుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 25 2024, 20:21

ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Former CM KCR) తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది. అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరత్వరగా జరిగిపోయాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. అయితే ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్ కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.

ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.

అయితే ఈ నెల 23 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరు అవుతారా?... లేదా? అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు

ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో సమావేశాలు మొదలైన తర్వాత మూడవ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. అయితే... బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తారని.. తరువాత సభకు దూరంగా ఉండనన్నట్లు సమాచారం. మరి మరికొద్దిరోజుల పాటు జరిగే సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా?.. లేరా..? అనేది వేచి చూడాలి.

కాగా... మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అందజేశారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి నివాసం ప్రజాభవన్‌లో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులను భట్టి దంపతులు తీసుకున్నారు. అలాగే రూ.2 లక్షల 95 వేల కోట్ల బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.

vemulajanardhanreddy54

Jul 22 2024, 19:03

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ శాఖలో జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో వివ‌రించారు.


పోస్టుల వివ‌రాలు.
క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ (22). ఇలా పూర్తిగా 30 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు జౌళి శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా. అయితే, ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు IIHT నుంచి చేనేత టెక్నాలజీ (DTH )లో డిప్లొమా హోల్డర్లు అర్హుల‌ని, వీరు ఈ పోస్టుల‌ల్లో అప్లై చేసుకోవాలని శైలజా రామయ్యార్ తెలిపారు. అభ్యర్థులు మ‌రిన్ని వివరాలను తెలుసుకునేందుకు tsht.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని ఆమె సూచించారు.

Mane Praveen

Jul 17 2024, 21:58

శివన్నగూడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మర్రిగూడ మండలం, శివన్నగూడ గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆవుల చిన్న జంగయ్య మరియు బొంత మంగమ్మ కు పంపిణీ చేసిన శివన్నగూడ శ్రీ నీలకంఠ రామస్వామి దేవస్థానం చైర్మన్ రాపోలు యాదగిరి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మర్రిగూడ మండల మాజీ జెడ్పిటిసి 
మేతరి యాదయ్య, దేవాలయ ధర్మకర్త చిట్యాల రంగారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ వాయిల సోమయ్య,  మండల కాంగ్రెస్ నాయకులు నందికొండ లింగారెడ్డి, శివన్నగూడ గ్రామ పెద్దలు ఇరగదిండ్ల సత్తయ్య, అయితగోని వెంకటయ్య, నల్లవోతు కొమురయ్య, జిల్లాగోని నరసింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA
SB NEWS NLG

Mane Praveen

Jul 15 2024, 22:37

NLG: ఘనంగా రిటైర్డ్ లెక్చరర్ పేర్ల వీరయ్య పెద్దకర్మ

నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జియాలజీ విభాగంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది, ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించడానికి కృషిచేసిన రిటైర్డ్ లెక్చరర్, కీర్తిశేషులు పేర్ల వీరయ్య గారి పెద్దకర్మ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన పూర్వపు రిజిస్టార్ ప్రొఫెసర్ కె. నరేందర్ రెడ్డి, మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ప్రేమ్ సాగర్, డాక్టర్ జి. మచ్చెందర్, డాక్టర్ బిక్షమయ్య, డాక్టర్ చింత శ్యామ్, జి. సుధాకర్, వీరస్వామి, సత్యనారాయణరెడ్డి, షరీఫ్ మరియు ఎన్జీ కాలేజీ ఇన్చార్జి హెడ్ జియాలజీ విభాగం ఇంద్రకంటి చంద్రయ్య మొదలగు వారు పాల్గొని తమ ఆరాధ్య దైవమైన గురువు వీరయ్య సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరయ్య సార్ ఎన్జీ కళాశాలలో సుదీర్ఘకాలంగా జియాలజీ విభాగంలో లెక్చరర్ గా, హెచ్ ఓ డి గా, పనిచేసి విద్యార్థులకు జియాలజి సులభంగా అర్థమయ్యేలా బోధించి, విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడే విధంగా కృషి చేశారని, ఆయన సేవలను కొనియాడారు.

SB NEWS TELANGANA

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 13:21

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఒక్కొక్కరుగా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా..

ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న (శుక్రవారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ కండువా కప్పుకోగా..

నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (MLA Arikapudi Gandhi) హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఇంతటితో ఆగనట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పార్టీలో గాంధీ చేరనున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

అలాగే రేపు (ఆదివారం) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 10:56

Telangana ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది.. వరంగల్‌ జిల్లాలో దారుణం

Telangana వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాకు చెందిన బానోతు శివ, సుగుణ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.

కూతురు దీపికను అదే గ్రామానికి చెందిన యువకుడు బన్నీ ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్‌తో ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు.

అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై కూడా తల్వార్‌తో బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో బానోతు శివ, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితుడు బన్నీని అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Mane Praveen

Jul 07 2024, 17:34

కొట్టాల, ఇందుర్తి గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీల ఏర్పాటు

మర్రిగూడెం మండలం కొట్టాల, ఇందుర్తి గ్రామాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామ కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య లు మాట్లాడుతూ.. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి గ్రామ బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇందుర్తి మాజీ సర్పంచ్ జంగిలి ప్రసన్న రవి, కొట్టాల మాజీ సర్పంచ్ గంట కవిత యాదయ్య, గంట మల్లేష్, నందికొండ లింగారెడ్డి, పలువురు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Jul 07 2024, 11:08

లెంకలపల్లి: బెల్టు షాపుల నిర్మూలన కమిటీ ఏర్పాటు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామంలోని రెండు బూత్ ల నుండి కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి గ్రామ బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, ఏర్పుల శ్రీశైలం, నందికొండ లింగారెడ్డి, చాపల రవి, అయితగోని వెంకటయ్య, మేతరి శంకర్, దాసరి వెంకన్న, లింగయ్య, హరీష్, , వెంకటయ్య, యాదయ్య, నాగరాజు, శ్రీను, గిరి, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:56

Congress: ఈనెల 10న తెలంగాణకు కురియన్ కమిటీ

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ (AICC) నిజనిర్ధారణ కమిటీలు వేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న కురియన్ కమిటీ రానుంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో (Telangana) నిజనిర్ధారణ కోసం కురియన్ కమిటీని అధిష్టానం నియమించింది.

కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈనెల 10న రాష్ట్రానికి రానున్న కమిటీ... తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి సమాచారాన్ని సేకరించనుంది. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. కురియన్ కమిటీ రిపోర్ట్ తర్వాతే కార్పొరేషన్ పదవులు ఇద్దామనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నట్లు సమాచారం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:06

చంద్రబాబు, రేవంత్‌ బంధంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వాక్యాలు

Telangana: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

స్పందించారు.

చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్యులు కాదని.. సహచరులని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రేవంత్ చాలా సార్లు చెప్పారన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ తెలంగాణ సీఎం అని తేల్చిచెప్పారు. చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులు అనే వారివి అవగాహనలేని మాటలని కొట్టిపారేశారు. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే అని వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాల కోసం బీఆర్‌ఎస్ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్సుతో ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పుకొచ్చారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేబినెట్ విస్తరణపై పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుందన్నారు.

త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు. పదిహేనేండ్లు తామే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్ వి కల్లిబొల్లి కబుర్లే అంటూ విమర్శించారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. పుట్టింది బతకడానికి... చావడానికి కాదని అన్నారు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పిదాలు ఆయన్ని వెంటాడుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.