సమాచార హక్కు వికాస సమితి (SHVS) కనగల్ మండల అధ్యక్షుడిగా ఆదిమల్ల దేవేందర్ నియామకం
నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ మండల సమాచార హక్కు వికాస సమితి (SHVS) అధ్యక్షుడిగా ఆదిమల్ల దేవేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు SHVS వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణ రెడ్డి గారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆదిమల్ల దేవేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణ రెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాచార హక్కు చట్టం (RTI)పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే మండల వ్యాప్తంగా సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా పని చేయడం. మరియు సామాన్య ప్రజలకు చట్టపరమైన సమస్యల్లో అండగా నిలవడం నా ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొని దేవేందర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. "సదా ప్రజా సేవలో, సమాచార హక్కు పరిరక్షణలో ముందుంటాను" అని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.




నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడల పోటీలు సోమవారం ముగిసాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా, బాలికల విభాగంలో అసిఫాబాద్ జిల్లా విజయం సాధించి రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ ఎండి అక్బర్ అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, గౌరవ అతిథిగా జిల్లా గ్రంధాలయ చైర్మన్
గత 4 రోజుల నుండి హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న 2026- సీఎం కప్ ఫుట్బాల్ క్రీడల్లో, నల్గొండ బాలికల టీం అద్భుతమైన ఆటతీరుతో రాష్ట్రస్థాయిలో విజేతలుగా మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ మేరకు జిల్లా క్రీడల అధికారి ఎండి అక్బర్ అలీ, నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలిక ఫుట్బాల్ ప్లేయర్స్ ను పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ: ఈనెల 15, 16, 17 తేదీలలో 2026 సీఎం కప్ క్రీడోత్సవాలను 44 క్రీడాంశాలలో నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఎండి అక్బర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుంటూ, ఎడిషన్ 2 జిల్లా స్థాయి పోటీలలో అత్యంత ప్రతిభ ను ప్రదర్శించిన క్రీడాకారులకు గ్రామీణ స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పించడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని తెలిపి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. హాకీ, బేస్బాల్, టైక్వాండో క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇమామ్ కరీం, ఆర్థిక కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, చెస్ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శులు యాకస్వామి, యునుస్, అనిల్, సుధాకర్, బేస్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు చివుట జ్యోతి, ఎండి అలీమ్, కవిత, అష్రఫ్ అహ్మద్, కోచ్ లు, క్రీడాకారులు క్రీడల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, నిడమనూరు మండలం, ముకుందాపురం గ్రామంలోని శాంతినికేతన్ గురుకుల పాఠశాల పదో తరగతి 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం నిర్వహించారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, సరంపేట గ్రామంలో శ్రీ స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఆదివారం స్వామి వారి రధోత్సవం వైభవంగా జరిగింది. కాగా ఇవాళ కూడా జాతర కొనసాగనుంది.
500 సంవత్సరాల క్రితం స్వయంభూ గా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి కొండ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.

77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడెం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ' నాన్న సేవా సమితి" ఆధ్వర్యంలో, వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు.
అదేవిధంగా సూర్య కిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రిన్సిపల్ నాగలక్ష్మి ,వరలక్ష్మి, సల్మా రాజు, రాజేంద్రప్రసాద్ లతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
అనంతరం విద్యార్థులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాన్న సేవ సమితి వ్యవస్థాపకులు వనగండ్ల సైదులు, రాష్ట్ర ఇన్చార్జి యాతాకుల శేఖర్, నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు ప్రశాంత్, వెంకన్న, సంతోష్ మొదలైన వారు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా: వడ్ల కొనుగోలు మునుపటి కంటే మరింత పారదర్శకం అయ్యిందని, ఎటువంటి అక్రమాలు అవకతవకలకు తావు లేకుండా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.
Apr 26 2026, 23:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.1k