AI పై NG కళాశాలలో జాతీయ సదస్సు
NLG: కృత్రిమ మేధస్సుతో రానున్న రోజుల్లో అనేక విప్లవాలు సృష్టించవచ్చు అని చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రకాష్ సాయి వాసన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భౌతిక మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో  'కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) యొక్క శక్తి ఆవిష్కరణ భవిష్యత్ తరాల విప్లవాలు' అనే అంశం పైన జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ప్రకాష్ వాసన్ కీలకోపాన్యాసం చేశారు.

నేటి వేగవంతమైన ప్రపంచంలో, కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలు కేవలం పరిశోధనాంశాలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తున్న విప్లవాలుగా మారుతున్నాయని అన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం ద్వారా మనం విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో అపూర్వమైన, సుస్థిరమైన పురోగతిని సాధించవచ్చునని వారు తెలిపారు.

AI మరియు ML కేవలం ఆటోమేషన్ కోసమే కాకుండా, సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కంప్యూటర్ ప్రొఫెసర్లు రెడిమళ్ళ రేఖ, డా.సుధారాణి, డా.ఎం.జయంతి, డా.డి.సంధ్యారాణి, డా.కె.హరీష్ మాట్లాడుతూ..
AI సహాయంతో ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస వేగానికి మరియు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించవచ్చునని పేర్కొన్నారు.

ML అల్గారిథమ్‌లు భారీ మొత్తంలో ఉన్న వైద్య డేటాను విశ్లేషించి, వ్యాధులను ముందుగానే గుర్తించడంలో వైద్యులకు సహాయపడతాయని అన్నారు. వాతావరణ మార్పులను అంచనా వేయడం, శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచడం ద్వారా పర్యావరణ సంరక్షణకు ఇవి దోహదపడతాయని చెప్పారు. భవిష్యత్ తరాల సంసిద్ధత ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం నాయకత్వం వహించాలంటే, భవిష్యత్ తరాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడం అత్యంత కీలకమని తెలిపారు.

పాఠశాల మరియు కళాశాల స్థాయిలో కోడింగ్, డేటా సైన్స్ మరియు AI యొక్క నైతిక వినియోగంపై అవగాహనను పెంచే విద్యా విధానాలను అమలు చేయాలని సూచించారు.
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచ స్థాయి AI పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు మరియు పరిశ్రమలు సంయుక్తంగా పెట్టుబడి పెట్టాలని కోరారు.
AI మరియు ML సాంకేతికతల సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించడం అనేది నేటి తరం బాధ్యత అని, ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా, మనం అందరికీ మెరుగైన, మరింత సమానమైన మరియు సుస్థిరమైన ప్రపంచాన్ని నిర్మించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు కన్వీనర్ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, కో కన్వీనర్  వెంకట రమణ, వైస్ ప్రిన్సిపాల్స్ డా. రవి కుమార్, డా. అంతటి శ్రీనివాస్, అధ్యాపకులు డా. మునిస్వామి, నాగరాజు, వెంకట రెడ్డి, అనిల్ కుమార్, కిరణ్, నగేష్, రమ, సంధ్యారాణి, తులసి, పుష్ప రాణి, పద్మావతి, శశికళ, గోపి, మధుకర్, కనకయ్య, వెంకటేశం, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరి లో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధులు

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరీ, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని బృందావన్ యోజన మైదానంలో ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రెసిడెంట్ గైడ్ రొయ్య విమల, ఎంపిహెచ్ఎ పాల్గొని జాంబోరి డైరెక్టర్ దర్శన పవర్స్కార్ చేతుల మీదుగా జాతీయ ప్రశంసా పత్రాన్ని పొందారు. రొయ్య విమల 1998లోనే ప్రెసిడెంట్ గైడ్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు నల్లగొండలో ఆర్. విమల మాట్లాడుతూ.. నవంబర్ 23–29, 2025 వరకు పెద్ద ఎత్తున కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. భారతదేశంలో సంస్థ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జాతీయ ఐక్యత, నైపుణ్యాభివృద్ధి మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులు సహా 32,000 మందికి పైగా పాల్గొన్నారు. ముఖ్య కార్యకలాపాలలో సాహస సవాళ్లు, సాంకేతికత మరియు సోషల్ మీడియాపై వర్క్‌షాప్‌లు, డ్రోన్ ప్రదర్శన మరియు సాంస్కృతిక మార్పిడి ఉన్నాయని తెలిపారు. ముఖ్య అతిథి గారైన శ్రీమతి ఆనందన్ పాటిల్ గవర్నర్, ప్రెసిడెంట్ భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఉత్తర్ ప్రదేశ్ గారి చేతుల మీదుగా నేషనల్ BSG ప్రెసిడెంట్ Dr అనిల్ కుమార్ జైన్ , కేకే కండాల వాల జాతీయ చీఫ్ కమిషనర్, ఇతర దేశాల ప్రతినిధులు శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్ , ఏరోనాటిక్, నావికాదళం అతిథులుగా పాల్గొని 19వ నేషనల్ జంబూరి 24వ తేదీ సాయంత్రం BSG అన్ని రాష్ట్రాల విద్యార్థుల బ్యాండ్ విన్యాసాలతో విద్యార్థులచే గౌరవ వందనం తీసుకొని నేషనల్ జంబోరీ ని వైభవంగా ప్రారంభించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావడం తో కార్యక్రమం ముగిసింది. నల్లగొండ జిల్లా నుండి ప్రెసిడెంట్ గైడ్ ఇ.కరుణాకర్ ( జిల్లా సెక్రటరీ ), ఆర్. విమల జిల్లా వైస్ ప్రెసిడెంట్, స్కౌట్ మాస్టర్ సయ్యద్ జిలానీ, ఎం.ఆశ్రిత్ సూర్యం, అభిరామ్, యశ్విన్, వరుణ్ సాయి, గోపీనాథ్, పార్ధివ్, జయంత్, రఘు తేజ్, అశ్రిత్ ఆండ్రూ, హరి ప్రసాద్, సహజ్ గౌడ్, నల్లగొండ జిల్లా నుండి సెయింట్ ఆల్ ఫెన్సెస్ స్కూలు స్కౌట్స్, సూర్యాపేట జిల్లా నుండి తెలంగాణ మోడల్ స్కూల్ హిమంపేట స్కౌట్స్, తదితరులు పాల్గొన్నారు.

కార్తీకమాసంలో ఉసిరికాయకు పెరిగిన డిమాండ్

కార్తీక మాసంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది శివుని రూపంగా మరియు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి దీపం వెలిగించడం, వనభోజనం చేయడం వంటి ఆచారాలు శివకేశవుల అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సుఖశాంతులను అందిస్తాయని నమ్మకం. పాలకొల్లులో వ్యాపారాలు ఉసిరికాయలను కిలో రూ.200, విడిగా ఒక్కోటి రూ.10కు విక్రయిస్తున్నారు.
నేడు కార్తిక పౌర్ణమి..! భక్తులతో కిటకిటలాడునున్న శివాలయాలు.


తెలంగాణ/ఆంధ్రప్రదేశ్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు వేముల వాడ, కాలేశ్వరం, ధర్మపురి, వంటి దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ఇక, శివాలయాల్లో అయితే దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తున్నారు. సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అర్చిస్తారు. కానీ.. కార్తీక మాసంలో ప్రతి రోజు లక్ష్మీదేవిని ఆరాధి స్తుంటారు. ఈ తరుణంలో మహిళలందరూ ఎదురు చూస్తున్న కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 05వ తేదీన వచ్చింది. అంటే.. కార్తీక పౌర్ణమి.ఈ రోజు చాలా విశిష్టమైన రోజు కాబట్టి కొన్ని ఆచారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ తరుణంలో దేవాలయంలో కానీ, రావి లేదా తులసి చెట్టు వద్ద గానీ, నదీతీరంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే మంచిదని పురణాలు చెబుతున్నాయి. అంతేకాదు.. పగలంతా ఉపవాసం ఉండి.. సూర్యా స్తమయంలో దీపారాధన చేసి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధన గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కార్తీక పౌర్ణమి తో పాటు గురు నానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.

గ్రామాల్లో అస్తవ్యస్తం..!
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : ఆసిఫాబాద్ జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల్లో దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది.అభివృద్ధి నిధులు రాక,అధికారులు దృష్టి సారించకపోవడంతో పారిశుద్ధ్యం,మంచినీరు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.గ్రామాలు అపరిశుభ్రతతో నిండిపోయి,చీకటిమయంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో శ్రీ కొత్తపల్లి వెంకట లక్ష్మీ - చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలకు 26 మంది హాజరు కాగా వారిలో 9 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ సందర్భంగా డా. కొత్తపల్లి శ్రీనివాస్  మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చిన వృద్దులను అధైర్య పడవద్దని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ లు చేపిస్తామని ఈ ఉచిత కంటి శిబిరం ప్రతి మంగళవారం నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రజాలందురు సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్తమలజిస్ట్ శ్రీనాథ్, ఐ క్యాంప్ ఇన్చార్జి గోపి పాల్గొన్నారు.
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏవో.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : సబ్సిడీ వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగజ్ నగర్ వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు. మంగళవారం కాగజ్నగర్లోని పీఏసీఎస్లో చైర్మన్ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన వరి విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తోందన్నారు. సాగు విషయంలో ఏ సందేహాలున్నా అధికారులను సంప్రదించి, అధిక దిగుబడి పొందాలని సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన నిత్య అన్నదాన కార్యక్రమం.

పాల్వంచ అయ్యప్ప స్వామి దేవస్థానం లో దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మాధవన్ నంభూతిరి ఈ రోజు ఘనంగా పూజలు చేసి ప్రారంభించినారు. ఈ సందర్బంగా దేవస్థాన ట్రస్ట్ సభ్యులు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ పవిత్ర మాసమైన కార్తీకమాసంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో ప్రతి రోజు దాదాపు 400 ల నుండి 600 వందల మందికి పైగా అన్నదాన వితరణ చేస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మరియు కమిటీ సభ్యులు కోత్వాల శ్రీనివాసరావు, మిడిద సంతోష్ గౌడ్, మిరియాల కమలాకర్, కనగాల రాంబాబు, బేతంశెట్టి వెంకట్, బోగిని శ్రీను, గుండు రాజు, చారి, నాగేందర్,విజయ్, రాము, భూషణం, రమేష్, నరేష్ గౌడ్, ప్రసాద్ మరియు అన్నదాన నిర్వాహకులు బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడ: మౌలిక సదుపాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కేజీబీవీ అభివృద్ధికి రూ.1 కోటి 50 లక్షలు ఖర్చు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో రూ.1 కోటి 50 లక్షల సొంత నిధులతో నిర్మించిన మెరుగైన మౌలిక సదుపాయాలను ( 9 నూతన తరగతి గదులు, 36 బాత్రూంలు, రెండు ఎకరాల ప్లే గ్రౌండ్ మొదలుగునవి ) కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఛైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినులు, సిబ్బంది తమ పాఠశాలను సొంత నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు కోలాటాల తో, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు విద్యార్థినులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు. 

18 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం: కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరిదీ, విద్య వైద్యం విషయంలోనే కాదు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. మర్రిగూడ కస్తూరిబా పాఠశాల ఒక్కటే కాదు మనుగోడు నియోజకవర్గం లో ఉన్న 18 రెసిడెన్షియల్ పాఠశాలలలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు పేరు తెస్తూ ఈ ప్రాంతానికి కూడా పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఆమె చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గారు నియోజకవర్గంలో తండ్రులు కోల్పోయిన ఎంతో మంది పిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో లక్ష రూపాయల డిపాజిట్ చేస్తూ సహాయం చేశారని తెలిపారు. కొందరు నన్ను ఎంపీగా పోటీ చేయమని అన్నారు. కానీ సేవ చేయాలంటే పదవులు అవసరం లేదు మంచి మనసుంటే చాలు అని ఆమె తెలిపారు. 

14 మంది పాఠశాల సిబ్బందికి నెలకు రూ. 5 వేలు చొప్పున రూ.70 వేలు ఇస్తాం: రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 18 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, ఈ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు విద్యార్థులు వాళ్ళ బాధలు చెబితే నాకు భాధ వేసింది. ఆరోజే అనుకున్న ఏదో ఒక చోట ప్రారంభించాలని నిర్ణయం చేసుకొని, అన్ని సౌకర్యాలు ఉండేలా పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పదివేల మందికి పరీక్షలు నిర్వహించి 1500 మందికి ఆపరేషన్లు చేయించాం, మునుగోడు ప్రజల తరఫున కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మికి ప్రత్యేక అభినందనలు అని తెలిపారు.

ఇప్పటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు, వీరికి ఎంత చేసిన తక్కువే అన్నారు. చదువు విషయంలో పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురాకూడదు, చదువుతోపాటు మానసిక దృఢత్వం, శారీరక వ్యాయామం చాలా ముఖ్యం అని చెప్పారు. చదువుతోపాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన ను పెంపొందించాల్సిన బాధ్యత టీచర్ల తో పాటు పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటుందని అన్నారు. మద్యం, డ్రగ్స్ తో యూత్ పెడదోవ పడుతున్నారు, అందుకే ఒకవైపు టీచర్లు మరోవైపు పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లల్ని తల్లిదండ్రులు అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలి, ప్రతి విద్యార్థి పై టీచర్లకు సునిశిత పరిశీలన ఉండాలన్నారు.

విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిగతా పాఠశాలలో కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 

కస్తూరిబా బాలిక పాఠశాలలో పనిచేస్తున్న 14 మంది సిబ్బందికి చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని, వారు. సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి, వాళ్ళ వేతనాల పెంపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ప్రభుత్వం వాళ్ల వేతనాలు పెంచే వరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల వాళ్ళ అకౌంట్లోకి 5000 రూపాయల చొప్పున 14 మందికి 70 వేల రూపాయలు ఇస్తామని సిబ్బందికి ఆయన భరోసా ఇచ్చారు. అన్ని రంగాలలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కష్టపడదామని అన్నారు. విద్యార్థులను ఉద్దేశిస్తూ ఇక్కడున్న మహాలక్ష్మి లందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

గజ్జెల చెన్నారెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి.
గుర్రంపోడు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు గజ్జెల చెన్నారెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సను పొందిన అనంతరం హైదరాబాదులోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి మంగళవారం హైదరాబాదులోని గజ్జెల చెన్నారెడ్డి స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మునుకుంట్ల రాజేష్ రెడ్డి ఉన్నారు.
AI పై NG కళాశాలలో జాతీయ సదస్సు
NLG: కృత్రిమ మేధస్సుతో రానున్న రోజుల్లో అనేక విప్లవాలు సృష్టించవచ్చు అని చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రకాష్ సాయి వాసన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భౌతిక మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో  'కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) యొక్క శక్తి ఆవిష్కరణ భవిష్యత్ తరాల విప్లవాలు' అనే అంశం పైన జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ప్రకాష్ వాసన్ కీలకోపాన్యాసం చేశారు.

నేటి వేగవంతమైన ప్రపంచంలో, కృత్రిమ మేధస్సు (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలు కేవలం పరిశోధనాంశాలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తున్న విప్లవాలుగా మారుతున్నాయని అన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం ద్వారా మనం విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో అపూర్వమైన, సుస్థిరమైన పురోగతిని సాధించవచ్చునని వారు తెలిపారు.

AI మరియు ML కేవలం ఆటోమేషన్ కోసమే కాకుండా, సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కంప్యూటర్ ప్రొఫెసర్లు రెడిమళ్ళ రేఖ, డా.సుధారాణి, డా.ఎం.జయంతి, డా.డి.సంధ్యారాణి, డా.కె.హరీష్ మాట్లాడుతూ..
AI సహాయంతో ప్రతి విద్యార్థి యొక్క అభ్యాస వేగానికి మరియు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించవచ్చునని పేర్కొన్నారు.

ML అల్గారిథమ్‌లు భారీ మొత్తంలో ఉన్న వైద్య డేటాను విశ్లేషించి, వ్యాధులను ముందుగానే గుర్తించడంలో వైద్యులకు సహాయపడతాయని అన్నారు. వాతావరణ మార్పులను అంచనా వేయడం, శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం మరియు వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచడం ద్వారా పర్యావరణ సంరక్షణకు ఇవి దోహదపడతాయని చెప్పారు. భవిష్యత్ తరాల సంసిద్ధత ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం నాయకత్వం వహించాలంటే, భవిష్యత్ తరాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడం అత్యంత కీలకమని తెలిపారు.

పాఠశాల మరియు కళాశాల స్థాయిలో కోడింగ్, డేటా సైన్స్ మరియు AI యొక్క నైతిక వినియోగంపై అవగాహనను పెంచే విద్యా విధానాలను అమలు చేయాలని సూచించారు.
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు ప్రపంచ స్థాయి AI పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు మరియు పరిశ్రమలు సంయుక్తంగా పెట్టుబడి పెట్టాలని కోరారు.
AI మరియు ML సాంకేతికతల సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించడం అనేది నేటి తరం బాధ్యత అని, ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా, మనం అందరికీ మెరుగైన, మరింత సమానమైన మరియు సుస్థిరమైన ప్రపంచాన్ని నిర్మించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, సదస్సు కన్వీనర్ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, కో కన్వీనర్  వెంకట రమణ, వైస్ ప్రిన్సిపాల్స్ డా. రవి కుమార్, డా. అంతటి శ్రీనివాస్, అధ్యాపకులు డా. మునిస్వామి, నాగరాజు, వెంకట రెడ్డి, అనిల్ కుమార్, కిరణ్, నగేష్, రమ, సంధ్యారాణి, తులసి, పుష్ప రాణి, పద్మావతి, శశికళ, గోపి, మధుకర్, కనకయ్య, వెంకటేశం, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరి లో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధులు

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరీ, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని బృందావన్ యోజన మైదానంలో ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రెసిడెంట్ గైడ్ రొయ్య విమల, ఎంపిహెచ్ఎ పాల్గొని జాంబోరి డైరెక్టర్ దర్శన పవర్స్కార్ చేతుల మీదుగా జాతీయ ప్రశంసా పత్రాన్ని పొందారు. రొయ్య విమల 1998లోనే ప్రెసిడెంట్ గైడ్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు నల్లగొండలో ఆర్. విమల మాట్లాడుతూ.. నవంబర్ 23–29, 2025 వరకు పెద్ద ఎత్తున కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. భారతదేశంలో సంస్థ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జాతీయ ఐక్యత, నైపుణ్యాభివృద్ధి మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులు సహా 32,000 మందికి పైగా పాల్గొన్నారు. ముఖ్య కార్యకలాపాలలో సాహస సవాళ్లు, సాంకేతికత మరియు సోషల్ మీడియాపై వర్క్‌షాప్‌లు, డ్రోన్ ప్రదర్శన మరియు సాంస్కృతిక మార్పిడి ఉన్నాయని తెలిపారు. ముఖ్య అతిథి గారైన శ్రీమతి ఆనందన్ పాటిల్ గవర్నర్, ప్రెసిడెంట్ భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఉత్తర్ ప్రదేశ్ గారి చేతుల మీదుగా నేషనల్ BSG ప్రెసిడెంట్ Dr అనిల్ కుమార్ జైన్ , కేకే కండాల వాల జాతీయ చీఫ్ కమిషనర్, ఇతర దేశాల ప్రతినిధులు శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్ , ఏరోనాటిక్, నావికాదళం అతిథులుగా పాల్గొని 19వ నేషనల్ జంబూరి 24వ తేదీ సాయంత్రం BSG అన్ని రాష్ట్రాల విద్యార్థుల బ్యాండ్ విన్యాసాలతో విద్యార్థులచే గౌరవ వందనం తీసుకొని నేషనల్ జంబోరీ ని వైభవంగా ప్రారంభించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావడం తో కార్యక్రమం ముగిసింది. నల్లగొండ జిల్లా నుండి ప్రెసిడెంట్ గైడ్ ఇ.కరుణాకర్ ( జిల్లా సెక్రటరీ ), ఆర్. విమల జిల్లా వైస్ ప్రెసిడెంట్, స్కౌట్ మాస్టర్ సయ్యద్ జిలానీ, ఎం.ఆశ్రిత్ సూర్యం, అభిరామ్, యశ్విన్, వరుణ్ సాయి, గోపీనాథ్, పార్ధివ్, జయంత్, రఘు తేజ్, అశ్రిత్ ఆండ్రూ, హరి ప్రసాద్, సహజ్ గౌడ్, నల్లగొండ జిల్లా నుండి సెయింట్ ఆల్ ఫెన్సెస్ స్కూలు స్కౌట్స్, సూర్యాపేట జిల్లా నుండి తెలంగాణ మోడల్ స్కూల్ హిమంపేట స్కౌట్స్, తదితరులు పాల్గొన్నారు.

కార్తీకమాసంలో ఉసిరికాయకు పెరిగిన డిమాండ్

కార్తీక మాసంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది శివుని రూపంగా మరియు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి దీపం వెలిగించడం, వనభోజనం చేయడం వంటి ఆచారాలు శివకేశవుల అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సుఖశాంతులను అందిస్తాయని నమ్మకం. పాలకొల్లులో వ్యాపారాలు ఉసిరికాయలను కిలో రూ.200, విడిగా ఒక్కోటి రూ.10కు విక్రయిస్తున్నారు.
నేడు కార్తిక పౌర్ణమి..! భక్తులతో కిటకిటలాడునున్న శివాలయాలు.


తెలంగాణ/ఆంధ్రప్రదేశ్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు వేముల వాడ, కాలేశ్వరం, ధర్మపురి, వంటి దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ఇక, శివాలయాల్లో అయితే దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తున్నారు. సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అర్చిస్తారు. కానీ.. కార్తీక మాసంలో ప్రతి రోజు లక్ష్మీదేవిని ఆరాధి స్తుంటారు. ఈ తరుణంలో మహిళలందరూ ఎదురు చూస్తున్న కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 05వ తేదీన వచ్చింది. అంటే.. కార్తీక పౌర్ణమి.ఈ రోజు చాలా విశిష్టమైన రోజు కాబట్టి కొన్ని ఆచారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ తరుణంలో దేవాలయంలో కానీ, రావి లేదా తులసి చెట్టు వద్ద గానీ, నదీతీరంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే మంచిదని పురణాలు చెబుతున్నాయి. అంతేకాదు.. పగలంతా ఉపవాసం ఉండి.. సూర్యా స్తమయంలో దీపారాధన చేసి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధన గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కార్తీక పౌర్ణమి తో పాటు గురు నానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.

గ్రామాల్లో అస్తవ్యస్తం..!
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : ఆసిఫాబాద్ జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల్లో దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది.అభివృద్ధి నిధులు రాక,అధికారులు దృష్టి సారించకపోవడంతో పారిశుద్ధ్యం,మంచినీరు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.గ్రామాలు అపరిశుభ్రతతో నిండిపోయి,చీకటిమయంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో శ్రీ కొత్తపల్లి వెంకట లక్ష్మీ - చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలకు 26 మంది హాజరు కాగా వారిలో 9 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ సందర్భంగా డా. కొత్తపల్లి శ్రీనివాస్  మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చిన వృద్దులను అధైర్య పడవద్దని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ లు చేపిస్తామని ఈ ఉచిత కంటి శిబిరం ప్రతి మంగళవారం నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రజాలందురు సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్తమలజిస్ట్ శ్రీనాథ్, ఐ క్యాంప్ ఇన్చార్జి గోపి పాల్గొన్నారు.
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏవో.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : సబ్సిడీ వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగజ్ నగర్ వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు. మంగళవారం కాగజ్నగర్లోని పీఏసీఎస్లో చైర్మన్ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన వరి విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తోందన్నారు. సాగు విషయంలో ఏ సందేహాలున్నా అధికారులను సంప్రదించి, అధిక దిగుబడి పొందాలని సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన నిత్య అన్నదాన కార్యక్రమం.

పాల్వంచ అయ్యప్ప స్వామి దేవస్థానం లో దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మాధవన్ నంభూతిరి ఈ రోజు ఘనంగా పూజలు చేసి ప్రారంభించినారు. ఈ సందర్బంగా దేవస్థాన ట్రస్ట్ సభ్యులు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ పవిత్ర మాసమైన కార్తీకమాసంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో ప్రతి రోజు దాదాపు 400 ల నుండి 600 వందల మందికి పైగా అన్నదాన వితరణ చేస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మరియు కమిటీ సభ్యులు కోత్వాల శ్రీనివాసరావు, మిడిద సంతోష్ గౌడ్, మిరియాల కమలాకర్, కనగాల రాంబాబు, బేతంశెట్టి వెంకట్, బోగిని శ్రీను, గుండు రాజు, చారి, నాగేందర్,విజయ్, రాము, భూషణం, రమేష్, నరేష్ గౌడ్, ప్రసాద్ మరియు అన్నదాన నిర్వాహకులు బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడ: మౌలిక సదుపాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కేజీబీవీ అభివృద్ధికి రూ.1 కోటి 50 లక్షలు ఖర్చు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో రూ.1 కోటి 50 లక్షల సొంత నిధులతో నిర్మించిన మెరుగైన మౌలిక సదుపాయాలను ( 9 నూతన తరగతి గదులు, 36 బాత్రూంలు, రెండు ఎకరాల ప్లే గ్రౌండ్ మొదలుగునవి ) కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఛైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినులు, సిబ్బంది తమ పాఠశాలను సొంత నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు కోలాటాల తో, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు విద్యార్థినులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు. 

18 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం: కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరిదీ, విద్య వైద్యం విషయంలోనే కాదు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. మర్రిగూడ కస్తూరిబా పాఠశాల ఒక్కటే కాదు మనుగోడు నియోజకవర్గం లో ఉన్న 18 రెసిడెన్షియల్ పాఠశాలలలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు పేరు తెస్తూ ఈ ప్రాంతానికి కూడా పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఆమె చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గారు నియోజకవర్గంలో తండ్రులు కోల్పోయిన ఎంతో మంది పిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో లక్ష రూపాయల డిపాజిట్ చేస్తూ సహాయం చేశారని తెలిపారు. కొందరు నన్ను ఎంపీగా పోటీ చేయమని అన్నారు. కానీ సేవ చేయాలంటే పదవులు అవసరం లేదు మంచి మనసుంటే చాలు అని ఆమె తెలిపారు. 

14 మంది పాఠశాల సిబ్బందికి నెలకు రూ. 5 వేలు చొప్పున రూ.70 వేలు ఇస్తాం: రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 18 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, ఈ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు విద్యార్థులు వాళ్ళ బాధలు చెబితే నాకు భాధ వేసింది. ఆరోజే అనుకున్న ఏదో ఒక చోట ప్రారంభించాలని నిర్ణయం చేసుకొని, అన్ని సౌకర్యాలు ఉండేలా పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పదివేల మందికి పరీక్షలు నిర్వహించి 1500 మందికి ఆపరేషన్లు చేయించాం, మునుగోడు ప్రజల తరఫున కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మికి ప్రత్యేక అభినందనలు అని తెలిపారు.

ఇప్పటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు, వీరికి ఎంత చేసిన తక్కువే అన్నారు. చదువు విషయంలో పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురాకూడదు, చదువుతోపాటు మానసిక దృఢత్వం, శారీరక వ్యాయామం చాలా ముఖ్యం అని చెప్పారు. చదువుతోపాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన ను పెంపొందించాల్సిన బాధ్యత టీచర్ల తో పాటు పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటుందని అన్నారు. మద్యం, డ్రగ్స్ తో యూత్ పెడదోవ పడుతున్నారు, అందుకే ఒకవైపు టీచర్లు మరోవైపు పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లల్ని తల్లిదండ్రులు అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలి, ప్రతి విద్యార్థి పై టీచర్లకు సునిశిత పరిశీలన ఉండాలన్నారు.

విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిగతా పాఠశాలలో కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 

కస్తూరిబా బాలిక పాఠశాలలో పనిచేస్తున్న 14 మంది సిబ్బందికి చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని, వారు. సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి, వాళ్ళ వేతనాల పెంపు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ప్రభుత్వం వాళ్ల వేతనాలు పెంచే వరకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతినెల వాళ్ళ అకౌంట్లోకి 5000 రూపాయల చొప్పున 14 మందికి 70 వేల రూపాయలు ఇస్తామని సిబ్బందికి ఆయన భరోసా ఇచ్చారు. అన్ని రంగాలలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కష్టపడదామని అన్నారు. విద్యార్థులను ఉద్దేశిస్తూ ఇక్కడున్న మహాలక్ష్మి లందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

గజ్జెల చెన్నారెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి.
గుర్రంపోడు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు గజ్జెల చెన్నారెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సను పొందిన అనంతరం హైదరాబాదులోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి మంగళవారం హైదరాబాదులోని గజ్జెల చెన్నారెడ్డి స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మునుకుంట్ల రాజేష్ రెడ్డి ఉన్నారు.