Apr 24 2024, 07:45
జగనన్న చెప్పాడంటే..అమలు చేస్తాడంతే.. జగనన్నను సీఎం చేసుకుంటే మరింత సంక్షేమం.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
జగనన్న చెప్పాడంటే..అమలు చేస్తాడంతే.. జగనన్నను సీఎం చేసుకుంటే మరింత సంక్షేమం.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు గల్లంతు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పాడంటే తప్పని సరిగా అమలు చేస్తాడని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
గార్లదిన్నె మండలం జంబులదిన్నె, జంబులదిన్నె కొట్టాల, తలగాసిపల్లి, గార్లదిన్నె గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి, ఎం. శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డిలతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు.
పార్టీ శ్రేణులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
వారు మాట్లాడుతూ..జగనన్న పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు గతంలో 600 హామీలు
ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ విషయం ప్రజలు ఎప్పటికీ మరువరన్నారు.ఇప్పుడు 6 హామీలతో ప్రజల్లోకి వస్తున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని చెప్పారు.
నియోజకవర్గంలోని టిడిపి వాళ్ళు పగటి కలలు కంటూ వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు. ప్రజలకు ఏం చేయలేని టిడిపి ఓట్ల కోసం నానా తంటాలుపడుతూ అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు నిలదీస్తున్నారన్నారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులైన అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. అబద్ధపు హామీలతో వస్తున్న చంద్రబాబు కావాలా మాట నిలబెట్టుకున్న జగనన్న కావాలా అని ప్రజలు బేరీజు చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులమైన తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
2 hours and 7 min ago