/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం Raghu ram reddy
తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పెను దుమారం రేపుతోంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగనుంది. అయితే రాజీవ్ విగ్రహావిష్కరణను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

తెలంగాణ(Telangana) రాజకీయాల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పెను దుమారం రేపుతోంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగనుంది. అయితే రాజీవ్ విగ్రహావిష్కరణను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని గతంలోనే నిర్ణయించామని.. ఇప్పుడెలా రాజీవ్ విగ్రహాన్ని పెడతారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

(BRS Working President KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రాజీవ్ విగ్రహ ఆవిష్కరణపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణ తల్లిని అవమానిస్తారా 

తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా 

తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా 

తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా 

తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా 

తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా 

తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా 

నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట

రాహుల్ గాంధీ తండ్రివిగ్రహం పెడతారా.

తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు

కాగా.. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది. ఈలోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించి చకచకా ఏర్పాట్లు చేసి విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని తొలగిస్తామని, గత పదేళ్లు అధికారంలో ఉన్నా రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈసారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని గతంలోనే కేటీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈరోజు రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 3:45 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెష్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

విజయవాడలో గణేష్‌ లడ్డూ వేలంలో రికార్డ్ బ్రేక్.. బాలాపూర్‌కు పోటీ, ఎన్ని లక్షలో తెలుసా?

వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరికి గుర్తొకొచ్చేది హైదరాబాద్.. అందులోనూ ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణపతి లడ్డూ. ముఖ్యంగా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు మంచి క్రేజ్ ఉంది.. ప్రతి ఏటా అక్కడ రికార్డులు బ్రేక్ అవుతాయి. లడ్డూ వేలంపాట ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది.. అయితే కాలం మారింది.. బాలపూర్‌ను మించి కూడా గణపతి లడ్డూలు వేలంపాటలో రికార్డు ధర పలుకుతోంది. గతేడాది హైదరాబాద్‌లో బాలాపూర్‌ను మించి బండ్లగూడ రిచ్‌మండ్ విల్లాస్‌లో లడ్డూ ధర రూ.కోటి 26 లక్షలు పలికింది.. ఈ ఏడాది హైదరాబాద్‌ మాదాపూర్ మై హో భుజాలో వినాయుకుడి లడ్డూ.. రికార్డు స్థాయిలో రూ.29 లక్షలు పలికింది.

హైదరాబాద్, తెలంగాణలో మాత్రమే కాదు ఏపీలో కూడా గణపతి లడ్డూ వేలంపాటకు జనాల్లో క్రేజ్ పెరిగింది. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో బాలపూర్ లడ్డూ ధరతో పోటీపడుతూ.. భారీ ధర పలికింది. విజయవాడ రూరల్ మండలం నున్నలోని శ్రీసాయి బాలాజీ ఎన్‌క్లేవ్‌ అపార్టుమెంట్‌లో వినాయకుడ్ని ఏర్పాటు చేశారు.. విగ్రహం దగ్గర ఆదివారం నిర్వహించిన స్వామి వారి లడ్డూ ప్రసాదం వేలంలో.. విపోదా ఫిన్‌స్పైర్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఎండీలు సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నక్కా రామ్‌ బాలాజీలు రూ.26 లక్షలకు లడ్డూని సొంతం చేసుకున్నారు.

లడ్డూను వేలంపాటలో దక్కుించుకున్న ప్రదీప్‌రెడ్డి, రామ్ బాలాజీలను ఉత్సవ కమిటీ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. గణపతి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి. తాను రాబోయే రోజుల్లో అపార్టుమెంట్‌ అభివృద్ధి కార్యక్రమాలకు, వచ్చే ఏడాది చవితి వేడుకలు మరింత వైభవంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే రూ.26 లక్షల పెద్ద మొత్తానికి వినాయక లడ్డూ పాట పాడామని తెలిపారు. బాలాపూర్ లడ్డూకు పోటీగా ఈ లడ్డు ఏకంగా రూ.26 లక్షలు పలికింది.

మరోవైపు వినాయకుని విగ్రహాల నిమజ్జనం చేసే ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగినపూడి బీచ్, పెడన, కాలేఖాన్‌పేట మంచినీళ్ల కాలువ, గూడూరు అడ్డరోడ్డు దగ్గర నిమజ్జనం చేసే ప్రాంతాలను జిల్లా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. ఎలాంటి గొడవలకు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలన్నారు. నిమజ్జనాలు చేసే మంగినపూడి, తాళ్లపాలెం, సత్రవపాలెం, పెదపట్నం, ఘంటసాల మండలం శ్రీకాకుళం తదితర ప్రాంతాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులుజప్రమాదవశాత్తూ ఎవరూ నీళ్లలో మునిగిపోకుండా ఈతగాళ్లు, పడవలను సిద్ధంగా ఉంచారు. రద్దీ ప్రాంతాల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఈ వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగనున్నాయి.

ప్రమాదం కలచివేసింది.. తీవ్ర విషాదం బాధించింది!

చిత్తూరు జిల్లా పరిధిలోని మొగిలి ఘాట్ రోడ్డులో పలమనేరు రోడ్డులో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది.. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో 8 మంది మరణించారు

మరో 30 మంది గాయపడ్డారు.. ప్రమాదం కారణంగా బస్సు ముందుభాగం చాలా వరకు లారీ కింది భాగంలోకి వెళ్ళిపోయి, ఆ భాగం మొత్తం నుజ్జయింది..

ఈ ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది.. ఈ విషాదం బాధించింది.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి..

ఆర్టీసీ బస్సులను నడిపే డ్రైవర్లు అప్రమత్తత ముఖ్యం, పేద కుటుంబాల ఆశలన్నీ మీపై ఉంటాయని మర్చిపోవద్దు..!

హిందువులు ఆజాన్ మరియు నమాజ్ సమయంలో పూజలు చేయడం మానేయాలి... హిందువులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్త ఆదేశం.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత హిందువుల పరిస్థితి మరింత దిగజారింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం నిష్క్రమించిన తర్వాత, మొదట హిందువులపై దాడి జరిగింది మరియు ఇప్పుడు వారు మతపరమైన స్థాయిలో కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మహ్మద్ యూనస్ ప్రభుత్వం హిందువులపై నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి. అజాన్ మరియు నమాజ్ సమయంలో లౌడ్ స్పీకర్లను ప్లే చేయకూడదని స్థానిక పూజా కమిటీలను కోరినట్లు బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు తెలిపారు.

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కొత్త తాత్కాలిక ప్రభుత్వం నమాజ్ మరియు ఆజాన్ సమయంలో దుర్గా పూజ వేడుకలలో లౌడ్ స్పీకర్లను ప్లే చేయవద్దని హిందూ సమాజాన్ని కోరినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) MD జహంగీర్ ఆలం చౌదరి మంగళవారం మాట్లాడుతూ పూజా కమిటీలు లౌడ్ స్పీకర్లను స్విచ్ ఆఫ్ చేయాలని మరియు అజాన్ మరియు నమాజ్ సమయంలో సంగీత వాయిద్యాలను వాయించవద్దని కోరినట్లు తెలిపారు. నిర్వాహకుల అభ్యర్థనకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

చౌదరి మీడియాతో మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో ఈ సంవత్సరం మొత్తం 32 వేల 666 పూజా పండాలను ఏర్పాటు చేయనున్నట్లు, ఇది గత సంవత్సరం సంఖ్య 33 వేల 431 కంటే తక్కువ. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు విద్య మరియు ఉద్యోగాలలో కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు మరియు మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశంలోని మైనారిటీ హిందూ సమాజంపై తదుపరి దాడుల తర్వాత ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

అప్పటి నుండి, బంగ్లాదేశ్‌లో మతపరమైన మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రత గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షా పోరాన్ దర్గాలో జరిగిన సంఘటనతో సహా మత స్థలాలపై ఇటీవల జరిగిన దాడుల గురించి అడిగినప్పుడు, షా పోరాన్ దర్గాపై దాడి గురించి నాకు ఏమీ తెలియదని లెఫ్టినెంట్ జనరల్ చౌదరి అన్నారు. అయితే, ఎలాంటి దాడి జరగకుండా భద్రత కల్పించడం నా బాధ్యత. ఈ మేరకు న్యాయాధికారులకు సూచనలు చేశారు.

విగ్రహాల నిర్మాణం జరిగినప్పటి నుంచి పూజల నిర్వాహకులకు భద్రత కల్పిస్తామని చౌదరి హామీ ఇచ్చారు. పూజా మండపాలలో 24 గంటల భద్రత ఎలా ఉండాలనే దానిపై చర్చించామని ఆయన మీడియాకు తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, దుశ్చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే, మహమ్మద్ యూనస్ పాలనలో కొన్ని చర్యలు భారతదేశంలో కనుబొమ్మలను పెంచాయి.

కొన్ని రోజుల క్రితం, యూనస్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం భారతదేశానికి హిల్సా ఎగుమతిని నిషేధించింది, ఇది బంగ్లాదేశ్ ఇలిష్ (చేపను బెంగాలీలో పిలుస్తారు) మరియు దుర్గాపూజకు ముందు ధరలు పెరగడానికి దారితీసింది. పండుగల సీజన్‌లో భారతదేశానికి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు పద్మ ఇలిష్ యొక్క పెద్ద సరుకులను పంపే స్థిరమైన అభ్యాసం. ఇది అవామీ లీగ్ నాయకురాలు మరియు మాజీ ప్రధాని షేక్ హసీనా అనుసరించిన సద్భావన పద్ధతి.

జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో!

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేసిన కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను జగన్ మొన్న పరామర్శించారు. 

అనంతరం బయటకు వచ్చిన జగన్‌ను అదే జైలులో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను కుమార్తెతో కలిసి వచ్చి జగ‌న్‌తో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విధుల్లో ఉన్న సంగతిని మర్చిపోయి ఇలా సెల్ఫీలు దిగడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు పేర్కొన్నారు.

హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హైదరాబాద్‌లో హైటెన్షన్..!

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీ ఆఫీసు వద్ద ఆందోళన నిర్వహిస్తున్న.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లదరినీ.. కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. మరోవైపు.. అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో.. అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులపై బీఎన్ఎస్ చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కిపోయింది. హైదరాబాద్‌లో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు నేతలను తరలించారు. అయితే.. ఉదయం సమయంలో హుజూరాబాద్ ‌ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడి ఘటనపై జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌కు ఫిర్యాదు చేశారు.

అరెస్ట్ చేయాలని డిమాండ్..

అయితే.. కౌశిక్ రెడ్డిపై దాడిని సుమోటుగా తీసుకున్న పోలీసులు.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు 30 మందిపై కేసు నమోదు చేశారు. అయితే.. అరికెపూడి గాంధీని ఏ1గా పేర్కొంటూ మొత్తం 30 మందిపై పలు సెక్షన్ల కింద (సెక్షన్లు 189, 191(2), 191(3), 61 , 132, 329, 333 324(4), 324(5) , 351(2) Red with 190 BNS) కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎఫ్ఐఆర్‌ కాపీని బీఆర్ఎస్ నేతలకు అందించారు. అయితే.. అందులో ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు పెట్టకపోవటంతో.. హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ హత్యాయత్నం చేసినట్టుగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంత వరకు వెనక్కి తగ్గేదిలేదంటూ బీష్మించుకుని కూర్చుకున్నారు. అరికెపూడితో పాటు దాడికి యత్నించిన ఆయన అనుచరులను, అందుకు సహకరించిన పోలీసులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్చేయకపోతే.. కోర్టుకు వెళ్తామని హరీష్ రావు డిమాండ్ చేశారు.

హరీష్ రావు సహా అందరినీ అదుపులోకి..

ఆందోళన విరమించి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎంత చెప్పినా వెనక్కి తగ్గకపోవటంతో.. బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా.. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు బలవతంగా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు బస్సుల్లో బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్నారు.

అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డి రాత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. మాజీ ఐఏఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహాయంతో కౌశిక్ రెడ్డి కంఫ్లైంట్ ఇవ్వగా.. పోలీసులు అరికెపూడి గాంధీపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇదే కాకుండా.. బీఎస్‌ఎస్ చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్సై మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. అంతకుముందు అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు.. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా.. 41 నోటీసులు ఇచ్చి వ్యక్తిగత పూచికత్తు మీద అరికెపూడి గాంధీని పోలీసులు వదిలిపెట్టారు. విడుదలైన అనంతరం.. కౌశిక్ రెడ్డిపై కూడా తాను ఫిర్యాదు చేసినట్టు గాంధీ తెలిపారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినట్టుగా ఫిర్యాదు చేసినట్టు వివరించారు.

స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తండ్రి చింతకాయల వరహాలదొర 51వ వర్ధంతి గురువారం బీసీ కాలనీలో లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

బీసీ కాలనీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరహాలదొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా లాలం మురళీకృష్ణ మాట్లాడుతూ, రాజకీయ పదవులు చేపట్టకపోయినా ప్రజాసేవలో ఆయనకు సాటివారే లేరని కొనియాడారు. వరహాలదొర అడుగుజాడల్లోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు , విజయ్, రాజేష్‌లు ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు.

వరహాలదొర విగ్రహం శిథిలావస్థలో ఉండడం వలన పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్టించనున్నట్లు గతంలోనే తెలిపారని, ప్రస్తుతం విగ్రహం పూర్తయిందని, త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు పేర్కొన్నారు. విగ్రహం చుట్టూ పూల మొక్కలతో అందంగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ లాలం మురళీకృష్ణ, బీసీ కాలనీ యూత్, పినారిపాలెం యూత్, అయ్యన్నపాత్రుడు అభిమాన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇంకెంతమంది రైతుల ప్రాణాలు బలిపెట్టాలి?

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్. రుణమాఫీ అందలేదని అనేక మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ట్విట్టర్ వేదిక ప్రభుత్వాన్ని ఏకపారేశారు మాజీ మంత్రి. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్ (Former Minister KTR) . రుణమాఫీ అందలేదని అనేక మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ట్విట్టర్ వేదిక ప్రభుత్వాన్ని ఏకిపారేశారు మాజీ మంత్రి. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. రుణమాఫీ కాలేదని కొందరు-పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ అంత బోగస్, రైతు భరోసా కూడా బోగస్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

నిన్న... రైతు సురేందర్ రెడ్డి అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్‌లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తన తల్లికి, తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయాడన్నారు. నేడు... రైతు సాగర్ రెడ్డి భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. తన పేరిట ఉన్న లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న లక్షా 60 వేల రుణంలో ఏ ఒక్కరి రుణం మాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయాడని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డది చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలని ప్రశ్నించారు. ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలన్నారు. డిసెంబర్లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలుకాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. 49,500 వేల కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయి? ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. రైతులు ఆత్మ హత్యలు చేసుకోవద్దని.. దైర్యంగా ఉండాలని కోరుతున్నాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

భక్తులకు ఇబ్బంది కలగొద్దు..!

గణపతి నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) అధికారులను ఆదేశించారు.

గణపతి నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర జరిగే మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) అధికారులను ఆదేశించారు.

అదనపు, జోనల్‌ కమిషనర్లతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మండపాలు, శోభాయాత్ర సాగే రహదారులపై చెత్త వెంటనే తొలగించేలా పారిశుధ్య కార్మికులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.

శోభాయాత్ర(Shobhayatra) జరిగే మార్గాల్లో 15,500 అదనపు వీధిదీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు రూ.2.98 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. నేడు జరిగే స్టాండింగ్‌ కమిటీ ఎజెండాలో ఈ ప్రతిపాదనపై చర్చించనున్నారు.

రెచ్చిపోయిన అరెకపూడి గాంధీ

ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కౌశిక్ రెడ్డి సవాల్‌కు గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ తన ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేయకుంటే తానే.. ఆయన ఇంటికి వెళ్తానని సవాల్ చేసాడు. తన యుద్ధం బీఆర్ఎస్ పార్టీతో కాదని.. కౌశిక్ రెడ్డితోనేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంతో ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు పంపుతున్నాను తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి సంచనల కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి.. తిరిగి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు

పీఏసీ ఛైర్మన్‌గా శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించటంపై కూడా మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేను ఛైర్మన్‌గా నియమించారని ఫైరయ్యారు. 'ఎమ్మెల్యేల ఫిరాయింపుపై హైకోర్టు తీర్పుతో గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని మాటలు మారుస్తున్నాడు. ఆయన నకిలీ గాంధీగా మారిపోయాడు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్ కు రావాలి. నేను గురువారం ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తా.. ఆయన మెడలో కండువా కప్పుతా. ఇద్దరం కలిసి మీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దాం. అనంతరం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెడదాం.' అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

ఈ సవాల్‌పై తాజాగా గాంధీ స్పదించారు. కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఈరోజు 11 గంటలకల్లా తన ఇంటిపై జెండా ఎగరవేయకపోతే.. 12 గంటలకల్లా తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పారు. తన యుద్ధం బీఆర్ఎస్‌తో కాదని.. కౌశిక్ రెడ్డితోనేని అన్నారు. దమ్ముంటే రారా నా కొ అంటూ రెచ్చిపోయారు. కౌశిక్ రెడ్డి పెద్ద చీటర్ అని.. బీఆర్ఎస్ పార్టీని భ్రష్ఠు పట్టించాడని పైరయ్యారు. మాజీ సీఎం కేసీఆర్‌ను నాశనం చేశాడని మండిపడ్డారు. మేం చేతులు కట్టుకొని కూర్చొలేం. దమ్ముంటే రా తేల్చుకుందాం.. కౌశిక్ రెడ్డికి నాకు యుద్ధం. ఎవరి దమ్మేందో తేల్చుకుందాం రా.' అని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇద్దరు ఎమ్మెల్యేలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కాగా, పోలీసుల గృహనిర్బంధంతో కాసేపట్లో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.