TS: తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర గ్రంధాలయ సంఘం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గురుకుల పాఠశాల, కళాశాలలో లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయడానికి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ జారీ చేయగా, ఈ ప్రభుత్వంలో త్వరితగతిన రిజల్ట్స్ ఇచ్చినందుకు గురుకుల విద్యా సంస్థకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు, తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంకా గురుకుల విద్యా సంస్థలలో మిగిలి ఉన్న లైబ్రరీ పోస్టులను భర్తీ చేసి పాఠశాలల్లో, కళాశాలలో గ్రంథాలయాల ప్రాధాన్యతను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు తెలిపారు.
అదేవిధంగా 434 పాఠశాల, 150 జూనియర్ కళాశాల గ్రంథాలయ పోస్టులు భర్తీ చేయడానికి ఫలితాలు విడుదల చేసినందుకు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సుంకరి రాజారాం, డాక్టర్ దుర్గాప్రసాద్ లు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.







నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్. మహమ్మద్ హసేన రచించిన" తదేక" సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తకాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు చేతిలో మీదుగా, హైదరాబాదులో ఆచార్య రవ్వ శ్రీహరి వేదిక పై మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన ఇరవై ఒక్క వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించారని తెలిపారు.
















Feb 15 2024, 01:28
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.2k