/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు Yadagiri Goud
నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు

మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు..

ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకు జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి..

పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో.. పూజారులు అడవికి వెళ్లి మండలు(చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ జరుపుకొనేవారు.

దీనినే మండమెలిగే పండగగా పేర్కొంటారు. పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పనిచేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు..

చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు బయలుదేరిన ఉరుమడ్ల బిఆర్ఎస్ నాయకులు, రైతులు

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని ఈరోజు నల్లగొండలో నిర్వహించే కెసిఆర్ భారీ బహిరంగ సభకు ఉరుమడ్ల గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లిన పార్టీ శ్రేణులు రైతులు కార్యకర్తలు.

టిఆర్ఎస్ ఉద్యమ సీనియర్ నేత జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు కృష్ణా నదిపై ప్రాజెక్టుల పెత్తనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం చేతుల్లో పెట్టిందని,

తెలంగాణను మళ్లీ ఎడారిగా మారొద్దంటే మన నీళ్లు, హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని,

నల్లగొండ కెసిఆర్ సభకి పోటెత్తుదాం.. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొడదాం అంటూ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించిన బీఆర్ఎస్ నాయకులు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రూపాని యాదయ్య, రూపని లక్ష్మయ్య, మర్రి భద్రయ్య, బోయ స్వామి, రూపని నరసింహ, ఈదుల ప్రవీణ్, నరసింహ, యాదయ్య ,R.యాదయ్య, శ్రీను, రాంబాబు, రామకృష్ణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో గ్రూపు-1 ఎగ్జామ్ కు కొత్త నోటిఫికేషన్‌?

తెలంగాణలో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్‌కు క్లియర్ అయింది. గత నోటిఫికే షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది

అయితే రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసును ఉపసహించరిం చుకున్నది. దీంతో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్‌ వేసుకో వడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరోవైపు రాష్ట్రంలో గ్రూపు-1 పోస్టులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. గతం లోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచు తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563 వరకూ ఉండే అవకాశం ఉంది. రాబోయే కొత్త నోటిఫికేషన్ పెంచిన పోస్టులతో కలిపి రానుంది.

పేపర్‌ లీకేజీ, ప్రశ్నల తప్పి దాల కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ను విడు దల చేయాలని నిర్ణయిం చారు. ఇదే అంశాన్ని తాజాగా అసెంబ్లీలో సైతం ప్రకటించారు

నీటి వివాదంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్

కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టు లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించ బోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

చేసిన తప్పును సరిదిద్దు కోవాలని రాష్ట్ర ప్రభుత్వా నికి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.

అసెంబ్లీలో ఆవరణలో సోమవారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలున్నారు.

జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని, కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పారు.

కృష్ణానదిపై ఉన్న ప్రాజె క్టులను కేంద్రానికి అప్పగిం చడానికి జరిగిన సమావే శాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాజెక్టులను ధారాదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల‌ను అప్పచెప్పే నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకుంటూ శాస‌న స‌భ‌, మండ‌లిలో తీర్మానం తీసుక‌రావాలని, తమ పాపాల‌ను ప్రక్షాళ‌న చేసు కోవాలని చెప్పారు. తెలం గాణ హ‌క్కుల విష‌ యంలో బీఆర్ఎస్ సంపూర్ణ మద్దత్తు ఉంటుందని స్పష్టం చేశారు...

జన సందోహంలో వేములవాడ దేవస్థానం

రాజ‌న్న‌క్షేత్రం భ‌క్త‌జ‌న‌సందోహంతో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం నుంచే రాజ‌న్న‌ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా చేరుకు న్నారు.

స్వామి వారిని ద‌ర్శించుకు నేందుకు ఆదివార‌మే రాత్రికి భ‌క్తులు క్షేత్రానికి చేరుకొని సోమ‌వారం ఉద‌యం స్నానాలు ఆచ‌రించి ఆల‌యానికి చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

వేములవాడ రాజన్నభక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు అధికారులు రద్దు చేశారు. భక్తులకు లఘు దర్శనానికి అనుమతి ఇచ్చారు.

సమ్మక్క-సారలమ్మ జాతర ఇదే నెలలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళ్లే ముందు… మొదటగా వేములవాడ రాజన్న క్షేత్రానికి రావడం ఆనవాయితీ.

వేములవాడ రాజన్న క్షేత్రం వచ్చిన తర్వాతే…సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళతారు జనాలు. ఈ తరుణంలోనే.. జనవరి మాసం నుంచే వేములవాడ రాజన్న క్షేత్రాని కి భక్తులు విపరీతంగా వస్తున్నారు.

Rebel MLAs Disqualification: రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ.. వేటు వేస్తారా..?

రెబల్‌ ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగతోంది.. ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు..

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించనున్నారు.. ఈ రోజు ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. అయితే, అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది..

అయితే, ఈనెల 9వ తేదీన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు స్పీకర్.. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తూ.. 9వ తేదీన నోటీసులు జారీ చేశారు స్పీకర్‌.. ఆ నోటీసుల ప్రకారం.. ఈ నెల 12వ తేదీన అంటే ఈ రోజు వారి అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు స్పీకర్‌..

Farmers movement: రేపు రైతు సంఘాల 'ఢిల్లీ చలో'

•భారీ భద్రతతో దుర్భేద్యంగా ఢిల్లీ, హరియాణా సరిహద్దులు

ఢిల్లీ/చండీగఢ్‌: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన 'ఢిల్లీ చలో'మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు..

నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్‌ దిమ్మెలు, స్పైక్‌ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్‌ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్‌ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు..

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్‌ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్‌ ట్రాలీ మార్చ్‌ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్‌ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సరీ్వసులను, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లను మంగళవారం దాకా నిషేధించింది..

Telangana Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ..

నేడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు..

ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం..

అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి్.. రాయలసీమ ప్రాజెక్టుకు అనుమతిపై కేసీఆర్ ను ఉద్దేశించి ఓ వీడియోను కూడా అసెంబ్లీ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. కృష్ణా జలాలపై అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామ అధికార కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు.

అసెంబ్లీలో మా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఇవాళ కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు తెలంగాణ ప్రజలకు అసలు నిజాలు చెప్తామన్నాంటున్నారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెప్తారు.. ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సహాయం చేశారని జగన్ అసెంబ్లీలోనే చెప్పారనే విషయాన్ని ప్రజలకు అధికార కాంగ్రెస్ పార్టీలు తెలిపారు..

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 స్ధానాల‌కు పైగా గెలుస్తాం : మోదీ

ఎన్నిక‌లొస్తేనే కాంగ్రెస్ కు పేద‌లు, రైతులు గుర్తుకొస్తారా?, దేశాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ స‌ర్కార్ ముందుకు సాగుతుంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆదివారం లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. గిరిజ‌న ప్రాబ‌ల్య జ‌బువలో జ‌రిగిన ర్యాలీలో ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పేద‌లు, రైతులు గుర్తుకొస్తార‌ని అన్నారు. బీజేపీ రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 స్ధానాల‌కు పైగా గెలుపొందుతుంద‌న్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు, మీ సేవ‌కుడిగా తాను ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని మోదీ చ‌ప్పారు. తాను లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చార శంఖారావం పూరించేందుకే వ‌చ్చాన‌ని కొంద‌రు మాట్లాడుకుంటున్నార‌ని.. కానీ తాను ఓట్ల కోసం రాలేద‌ని మోదీ చెప్పారు.

Nagoba Jatara: వైభవంగా సాగుతున్న నాగోబా జాతర.. బారులు తీరిన భక్తులు

ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. దర్శ నానికి భక్తులు బారులు తీరారు..

ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.

కాగా నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే మెస్రం వంశీయులు తాము బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశ పెద్దలు 22 కితల వారీగా కొత్త కుండలను ఇవ్వగా.. మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొత్తకుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా... ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్తపుట్టను తయారుచేశారు. తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకున్నారు. అనంతరం ఏడు వరుసలతో తయారు చేసిన మట్టి ఉండలతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో సతిదేవతల బౌలను తయారుచేసి సంప్రదాయ పూజలు చేశారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 నుంచి 12గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు.

అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు బేటింగ్‌ (పరిచయం) పూజలకు ఏర్పాటు చేశారు. బేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్‌తో పాటు మెస్రం పెద్దలు పాల్గొన్నారు..