/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి: జిల్లా లో బైక్ తో సహా పూర్తిగా కాలిన మృతదేహం Vijay.S
భువనగిరి: జిల్లా లో బైక్ తో సహా పూర్తిగా కాలిన మృతదేహం


యాదాద్రి భువనగిరి జిల్లాలో బైక్ తో సహా కాలిన మృతదేహం  కలకలం రేపింది .భువనగిరి మండలంలోని అనంతారం గ్రామ శివారులో ఫ్లై ఓవర్ దగ్గర బైక్ తో సహా పూర్తిగా కాలిన మృతదేహాన్ని , స్థానికులు సోమవారం గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు బైక్ నెంబర్ ఆధారంగా మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా నిర్ధారించారు . క్లూస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వలిగొండ: నర్సింగ్ ఆఫీసర్ గా సీలోజు సంధ్య నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని సీలోజు కలమ్మ శ్రీరాములు ల ద్వితీయ కుమార్తె సీలోజు సంధ్య కు గత నెలలో విడుదల చేసిన ఫలితాలలో నర్సింగ్ ఆఫీసర్ గా ఎంపిక కావడం జరిగినది. ఈ ఎంపిక పత్రాలను జనవరి 31 2024 మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో ఎల్బీ స్టేడియంలో 7000 మంది నర్సింగ్ ఉద్యోగాలకు, ఎంపిక అయిన వారికి ఎంపిక పత్రాలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో ...నియామక పత్రాలను అందజేశారు. ఈ నియామకంలో వలిగొండ మండల కేంద్రానికి చెందిన సీలోజు కలమ్మ శ్రీరాములు ల రెండో కూతురైన సీలోజు సంధ్య నర్సింగ్ ఆఫీసర్ గా ఎంపిక కావడం వల్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వలిగొండ మండల కేంద్రంలోని ఉజ్వల విద్యాసంస్థలలో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు చదివి చదువులో మొదటి స్థానంలోనే నిలిచేది గ్రామీణ ప్రాంతమైన వలిగొండలో చదివిన అనంతరం బిఎస్సి నర్సింగ్ చదువు కోసం హైదరాబాదులోని జయ నర్సింగ్ కళాశాలలో చదివి ,ఉత్తీర్ణులై 2012 నుండి 2015 వరకు యశోద హాస్పిటల్ హైదరాబాదులో స్టాఫ్ నర్స్ గా పని చేసినది. అనంతరం 2015 -18 వరకు అపోలో హాస్పిటల్ లో పనిచేసి అనంతరం నర్సింగ్ ఆఫీసర్ గా ఎన్ ఎచ్ఎం కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం పొంది రామన్నపేట ఆసుపత్రిలో ఇప్పటివరకు పనిచేస్తూ ఉన్నది. నర్సింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం పొందిన సీలోజు సంధ్య మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్యశాఖ ఉద్యోగం పొందిన సీలోజు సంధ్య గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అదేవిధంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు ధన్యవాదములు తెలిపారు. సీలోజు శ్రీరాములు కళమ్మ లకు ముగ్గురు సంతానం ముగ్గురు అమ్మాయిలే మొదటి అమ్మాయి డిగ్రీ చదివినది రెండో అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చదివి ఇప్పటివరకు కాంట్రాక్టు నర్సింగ్ ఆఫీసర్ గా పని చేసినది గత జనవరిలో ప్రకటించిన నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలలో నర్సింగ్ ఆఫీసర్ పొందినది. మూడో అమ్మాయి డిగ్రీ చదివి ఎండోమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నది. మీరు ముగ్గురు అక్కచెల్లెళ్లు వీరు ముగ్గురు అమ్మాయిలు అయినా తల్లిదండ్రులకు ఇద్దరమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావడం వారికి ఆనందానికి అవధులు లేవు. సీలోజు కలమ్మ శ్రీరాములు గతంలో కలమ్మ వలిగొండ గ్రామపంచాయతీ ఉపసర్పంచిగా సేవలందించినది. అదేవిధంగా సీలోజు శ్రీరాములు గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులుగా మండల పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. అమ్మాయిలు అయినా అబ్బాయిల తో సమానమై వారు గ్రామీణ ప్రాంతంలో విద్యను అభ్యసించి వారి తల్లిదండ్రులకు గ్రామానికి మండలానికి ఆదర్శంగా నిలిచారు. మంచిగా చదివి ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు పుట్టిన ఊరు పేరు చదివిన చదువుకు సార్ధకత ఉంటుందని వారు అన్నారు. మా అమ్మాయిల లాగే అందరూ మంచిగా చదివి ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందని వారు అన్నారు

భువనగిరి లో ఇద్దరు విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి:.ఆలిండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్


 శనివారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో భువనగిరి బాలికల గురుకుల పాఠశాలలో చనిపోయిన ఇద్దరు విద్యార్థుల మరణాల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పోలీసులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు ధైర్యవంతులని, ఆత్మహత్య చేసుకునే పిరికివారు కాదని, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారని ఆయన అన్నారు. విద్యార్థులపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని, ఆ తర్వాత హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సూసైడ్ నోట్ కూడా ఫేక్ నోట్ అని, చాలా కాలంగా రాత్రి వేళల్లో వసతిగృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని ...ఆయన అన్నారు. వెంటనే పోలీసులు వసతి గృహం వార్డెన్ ను, వంట మనుషులను , నైట్ వాచ్ ఉమెన్ ను మరియు ఆటోడ్రైవర్ చింతల ఆంజనేయులను అరెస్టు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వసతిగృహాల విద్యార్థులకు రక్షణతో పాటు మనోధైర్యం కల్పించాలని ఆయన కోరారు. ఇద్దరు విద్యార్థుల మృతి విషయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా, దోషులకు శిక్ష పడేలా చూస్తామని ఆయన అన్నారు.

పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి: పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్


పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి

వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అనాధా శ్రమంలో అన్నదానం 

 పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి లోని కీ! శే! జెల్లా శంకర్ స్థాపించిన అమ్మఒడి అనాదాశ్రమం లో ఎం సీ కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ ....పండ్లు, కూరగాయలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పును అధిగమించవచ్చని ఆయన అన్నారు. క్యాన్సర్ కు కారణమయ్యే ధూమపానం, మద్యపానం, గుట్కా, జర్ధాకిల్లీ లాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. క్యాన్సర్ నివారణ కోసం మహ్మద్ చాంద్ ఖాన్ (ఎం సి కే) ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమం లో ఆయన ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎం సి కే ఫౌండేషన్ అధ్యక్షులు బండారి బాబూరావు, కార్యదర్శి తొర్రి సురేష్, ఆర్గనైజర్ ఖాజాభాయి , మహ్మద్ ఆదిల్ కైఫ్, రమేష్ యాదవ్,హరిదీఫ్, మహ్మద్ షమీ,స్మరణ్ , ఆశ్రమ నిర్వాహకులు సుమిత్ర, మహ్మద్ అలీ, అంజి,

తదితరులు పాల్గొన్నారు.

ఎల్ . కే అద్వాని కి భారతరత్న ప్రకటించడం హర్షనీయం: జిల్లా టెలికం బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య గౌడ్


మాజీ ఉప ప్రధాని భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా టెలికం బోర్డు అడ్వైజరీ మెంబర్ దంతూరి సత్తయ్య గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం రోజున ఆయన మాట్లాడుతూ ప్రజా జీవితంలో పారదర్శకత జవాబుదారి తనం రాజకీయ విలువలకు కట్టుబడి దశాబ్దాలుగా దేశ పౌరసత్వం సంస్కృతికి బాధ్యతతో నిర్వర్తించిన కృషివలుడు అలుపెరుగని రాజకీయ యోధుడు లాల్ కృష్ణ అద్వానీ అని ఆయన అన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో కోట్లాదిమంది భారత దేశ ప్రజలలో తాను కూడా ఒకడిని కావడం తనకెంతో గర్వముగా ఉన్నదని దేశానికి ఆయన చేసిన సేవలు గురించి దంతూరి సత్తయ్య గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి లో నూతన కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, జస్టిస్ శరత్


హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ శరత్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం అందే విధంగా న్యాయవాదులు పనిచేయాలని.. చట్టం అందరికీ ఒకటేనని అన్నారు. జిల్లా న్యాయస్థానంలో, న్యాయవాదులతో సమావేశంలో ..తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి కే శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కేసుల పరిష్కార పరిధిలో పరిశీలన ,మొదలు అంశాలపై సమీక్షించి, తగు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తుల పై ఉంటుందని అన్నారు. కోర్టు భవనం కోసం నూతనంగా కేటాయించిన స్థలంలో కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ,జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పులిగిల్ల లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో శనివారం రోజున స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థులచే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా ఆ పాత్రలో ఒదిగిపోయారు.... ఒక విద్యార్థిని ఉపాధ్యాయులుగా ఏ విధంగా నియంత్రణలో ఉంచాలో, ఈ విధంగా వారికి తెలిసింది. విద్యార్థులు వివిధ అధికారుల పాత్రలో ,విద్యాశాఖ అధికారిగా ,ఎమ్మెల్యేగా ,హెడ్మాస్టర్ గా పలు పాఠ్యాంశాలను వివరిస్తూ ...ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా వ్యవహరించిన కంచి రాంచరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ...పాఠశాలకు అవసరమైన నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వడంతో అందరూ నవ్వులతో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల సిపిఎం కార్యదర్శి సిర్పంగి స్వామిని పరామర్శించిన భువనగిరి మ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల సిపిఎం పార్టీ ,మండల కార్యదర్శి సిర్పంగి స్వామిని పరామర్శించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇటీవల యాక్సిడెంట్ లో కాలుకు ప్యాక్చర్ కావడంతో ఇంటివద్ద స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వారి యోగక్షేమాలు తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని అన్నారు. సిర్పంగి స్వామికి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎఫ్ ఎస్ సి ఎ సభ్యులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో క్రీడాకారుల సౌకర్యం కోసం మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ...ఫ్రెండ్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ..ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో స్టేడియంకు కావాల్సిన స్థలాన్ని గుర్తించి ,మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. లోతుకుంట గ్రామంలో స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ సి ఏ అధ్యక్షుడు కొండూరు బాలరాజు, గంజి చండీ ప్రసాద్, కొండూరు భాస్కర్, కాసుల వెంకటేశం, కూర శ్రీనివాస్, యానాల సత్యనారాయణ రెడ్డి, స్వామి రాజ్, పిట్టల రాజు, ఐటిపాముల ప్రభాకర్, కాటేపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ పాఠశాల పదవ వార్షికోత్సవంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోనీ లోతుకుంట గ్రామం లో ఆదర్శ పాఠశాలలో శనివారం రోజున పదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ....ఆయన మాట్లాడుతూ ,విద్యాసంస్థల కార్యక్రమాలకు మొదటిసారిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని ,కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఆదర్శ పాఠశాలన్ని ప్రారంభించారు. ఈ పది సంవత్సరాల కాలంలో ఆదర్శ పాఠశాలలు చదివిన విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నత స్థాయిలో ఉండడం చాలా ఆనందకరమైన ...విషయమని ఆయన అన్నారు. పాఠశాలకి 500 మీటర్ల సిసి రోడ్డు అయిందని ఇంకా 300 మీటర్ల సిసి రోడ్ గురించి మన ఏ ఈ తో మాట్లాడుతున్నానని ,చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని ఆటల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన అన్నారు. వలిగొండ లో మినీ స్టేడియం ఏర్పాటు చేయిస్తా నని ఆయన అన్నారు. పాఠశాలకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రాము, ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పిటిసి వాకిటి పద్మానంతరెడ్డి, ఎంపీటీసీ పల్లెర్ల భాగ్యమ్మ రాజు, శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాజాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్, లోతుకుంట మాజీ సర్పంచ్ రాచకొండ బచ్చయ్య, ఆధ్యాపక బృందం ,విద్యార్థిని విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు