/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బేగంపేట పీజీ ఉమెన్స్‌ హాస్టల్‌లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు.. Yadagiri Goud
బేగంపేట పీజీ ఉమెన్స్‌ హాస్టల్‌లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు..

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బేగంపేటలోని మహిళా పీజీ కాలేజీ హాస్టల్‌లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాగర్ల్స్‌ హాస్టల్‌ బాత్రూమ్‌లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు..

గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు..

ఈ ఘటనపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది.

ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది.

ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వాడుకోవాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా చేసిన అనుభవం ఉన్న నేతలతో ఏపీలో ప్రచారం చేయించనున్నది.

ఆంధ్రప్రదేశ్‌లోని పాతతరం నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో వారికి ఉన్న గుర్తింపు ఉపయోగప డుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.నోటిఫికేషన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి వస్తే మొదటి వారంలోనే తెలంగాణ నేతల సేవలను వినియోగించుకోవాలని, వేర్వేరు దశల్లో వస్తే పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నది.

సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్‌ క్యాంపెనర్‌గా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌లో రేవంత్‌రెడ్డితో ప్రచారం చేయించే అవకాశాలు ఉన్నాయి

రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ త్వరలో ఏపీలో పర్యటిస్తా రని సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో ఆమె భేటీ అవుతారని తెలిసింది.

తెలంగాణ ప్రభుత్వానికి, టీటీడీకి మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టినట్టు తెలిసింది.

మేడారం జాతరలోనే మంత్రి సీతక్క మకాం

మేడారం మహాజాతరకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జాతరకు నెల రోజుల ముందు నుండే భక్తులు బారులు తీరుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లలో మరింత స్పీడు పెంచింది. ఈ నెల 31వ తేదీ లోపు అభివృద్ది పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించారు.

ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీవరకు మేడారం మహాజాతర నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తోంది.

ఈసారి జాతరకు ఆరు రాష్ట్రాల నుండి కోటి 50 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క – కొండా సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాల పై వేసుకున్నారు.

ఇదే ములుగు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క మేడారంలోనే తిష్ట వేశారు.. అన్నీ తానై జాతర అభివృద్ది పనులను చక్కదిద్దుతున్నారు.

గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తు తను కూడా తల్లుల సేవలో తరిస్తున్నారు..

SB NEWS

Streetbuzz News

బీహార్‌లో రాజకీయ గందరగోళం మధ్య, తేజస్వి నితీష్‌కి సవాలు

•'తిరుగుబాటును సులభంగా జరగనివ్వను'

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ఎన్డీయే పక్షాన చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత బీహార్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది.ఢిల్లీ నుంచి పాట్నా వరకు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.. మరోవైపు తేజస్వీ యాదవ్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు సవాల్‌ విసిరారు. నితీష్‌ కుమార్‌కు ఈసారి తిరుగుబాటు అంత సులభం కాదని తేజస్వీ యాదవ్‌ అన్నారు.

నితీష్ వైపు మారుతుందనే ఊహాగానాల మధ్య, తేజస్వి శుక్రవారం రోజంతా తన కోర్ కమిటీ సభ్యులతో దీనిపై చర్చించారు. మూలాల ప్రకారం, తేజస్వి యాదవ్ తన సభ్యులలో తాను మళ్లీ అంత సులభంగా పట్టాభిషేకం చేయడానికి అనుమతించబోనని చెప్పాడు.

అదే సమయంలో, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ తనకే మెజారిటీ ఫిగర్ అని ప్రకటించారు. నితీష్ కుమార్ కూటమిని విచ్ఛిన్నం చేస్తే, అతను తన కార్డులను బయటపెడతాడు. ఇవాళ జరగనున్న ఆర్జేడీ శాసనసభా పక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. బీహార్‌లో అతిపెద్ద పార్టీ ఆర్జేడీ.

బీహార్‌లో రాజకీయ గందరగోళం మధ్య, RJD శిబిరం పూర్తిగా యాక్టివ్‌గా మారింది మరియు కూటమి విచ్ఛిన్నమైతే, తేజస్వి యాదవ్ నాయకత్వంలో RJD ఈ రోజు 1 గంటకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి క్లెయిమ్ చేయగలదని మూలాల నుండి చెప్పబడింది.

ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలకు చెందిన 114 మంది ఎమ్మెల్యేలతో పాటు జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తమ వైపునకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

జితన్‌రామ్‌ మాంఝీ తనయుడు సంతోష్‌ సుమన్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్‌ చేసినట్లు సమాచారం. మరోవైపు, AIMIM నుండి ఒక ఎమ్మెల్యే మరియు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సహాయంతో, RJD మెజారిటీ సంఖ్య 122 కంటే రెండు సీట్లు తక్కువగా చేరుకుంటుంది, అంటే 120 సీట్లు. అదే సమయంలో కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలు విడిపోయారని ఆర్జేడీ కూడా వాదిస్తోంది.

CM Jagan: నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది..

ఈ సభకు దాదాపు 34 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, గృహసారథులు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ చేరుకోనున్న సీఎం జగన్ భీమిలీ సంగివలసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. పార్టీ శ్రేణులతో ఆయన మాటమంతి నిర్వహిస్తారు..

దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు..

ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన..

మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం..

డెమోక్రసి ఎట్ గ్రాస్ రూట్స్ పేరుతో తెలంగాణ శకటం..

తెలంగాణ శకటంపై చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలు..

డిజిటల్ క్లాసుల థీమ్ తో ఏపీ శకటం..

ఏపీ విద్యావ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులపై శకటం..

16 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల శకటాల ప్రదర్శన..

గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భారీగా బందోబస్తు..

2024 ఎన్నికల ట్యాగ్‌లైన్‌ లోగోను విడుదల చేసిన ఈసి

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెండు-మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది..

ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ని గురువారం ఆవిష్కరించింది.

ఎన్నికల ట్యాగ్ లైన్ ‘చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్'( ఎన్నికల పండగ దేశానికి గర్వకారణం) అని పేర్కొంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించాల్సి ఉంది.

ఎంసెట్ ను టీఎస్‌ ఈఏపీసెట్‌ గా మార్పు

తెలంగాణ ఎంసెట్‌ పేరును ఉన్నత విద్యా మండలి మార్చింది. టీఎస్‌ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ గా మారుస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.

మే 6న టీఎస్‌ ఈసెట్‌, జూన్‌ 4 , 5 న ఐసెట్‌, జూన్‌ 6 నుంచి 8 వరకు టీఎస్‌ పీజీఈసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ తేదీలకు ఆమోద ముద్ర వేయడంతో నేడు అధికారికంగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

విద్యార్థులందరూ ఈ మేరకు అర్హత పరీక్షలకు రాసేందుకు సిద్ధమవ్వాలని కోరింది...

ఈనెల 27 నుంచి జగన్ ఎన్నికల శంఖారావం

ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తార‌ని గురువారం వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్ల‌డించారు.

27వ తేదీన భీమిలి వేదిక‌గా క్యాడర్‌తో సీఎం మహాసభ నిర్వహిస్తార‌ని తెలిపారు. రాష్ట్రంలో మ‌రోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామ‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లో డీఎస్సీ నోటిఫికేషన్ రానుంద‌ని చెప్పారు..

త్వరలోనే పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.

అభ్యర్థుల ఎంపికను వచ్చేవారం పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణ లో పర్యటిస్తారని తెలిపారు.

హైదరాబాద్ లో పార్లమెంట్ పై బీజేపీ సన్నాహాక సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్‌లో పోటీ చేయడం కోసం కాదు.. అసదుద్దీన్‌ను ఓడించడం కోసమే పని చేయాలన్నారు.

మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.