/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో కీలక నిర్ణయం Yadagiri Goud
ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో కీలక నిర్ణయం

ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలోనే కొన్ని జిల్లాల కలెక్టర్‌లతో సమావేశం కావాలని నిర్ణయించామని, త్వరలోనే ప్రభుత్వాని కి నివేదిక అందచేస్తామని ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు.

సోమవారం సాయంత్రం సిసిఎల్ కార్యాలయంలో ధరణి కమిటీ సభ్యులు మూడోసారి ధరణి సమస్యలపై సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధరణి కమటీ సభ్యులు మాట్లాడారు.

ఈ సందర్భగా ముందుగా రేమండ్ పీటర్ మాట్లాడుతూ ‘ధరణి’ లొసుగులపై చర్చిస్తున్నా మని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటు న్నట్లు ఆయన పేర్కొన్నారు.

మీ సేవలో ఉన్న సమస్యలు, అగ్రికల్చర్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కూడా సమావేశం అవుతా మన్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సమయం పడుతుందన్నారు.

నివేదిక వచ్చాక ప్రభుత్వం ‘ధరణి’పై స్పందిస్తుందని రేమండ్ పీటర్ తెలిపారు. ధరణి పోర్టల్‌తో పాటు మెరుగైన భూ పరిపాలన అందించేందుకు అవసర మైన మార్పులను కూడా తాము అందిస్తామన్నారు.

అలాగే ఆర్‌ఓఆర్ 2020కి సవరణలు అనివార్యమని గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లోని భూముల డేటాను క్రోఢీకరించనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ మూడింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ద్వారా అనేక సమస్యలకు చెక్ పడనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఒకేసారి నివేదికను అందించకుండా తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వేర్వేరుగా మార్గాలను అందించనున్నట్టు ఆయన తెలిపారు.

ధరణి లేదా ఇతర ఏ సాఫ్ట్‌వేర్ అమలు చేసినా ఏదైనా అప్లికేషన్ చేస్తే ఆమోదించినా, తిరస్కరించినా సమాచారం రావాలి. ఎందుకు తిరస్కరించారో కూడా దరఖాస్తుదారుడికి సమాచారం అందాలి. ప్రతిదీ సర్వర్‌లో నిక్షిప్తం కావాలి. ధరణి పోర్టల్లో అలాంటి వ్యవస్థ ఉందా? లేదా? అన్నది పరిశీలిస్తున్నామన్నారు.

పార్లమెంటు ఎన్నికల లో పోటీ చేయనున్న బర్రెలక్క?

తెలంగాణలో నిర్వహించిన శాసన సభ ఎన్నికల్లో బర్రెలక్క కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది.బర్రెలక్క కు చాలా మంది మద్దతుగా నిలిచారు.

ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి. ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది. కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయింది. ఆమెకు దాదాపు 6000వేల ఓట్లు పడ్డాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది.

ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మారు మ్రోగింది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని మెచ్చు కున్నారు.ఆర్థికంగానూ కొందరు సాయం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయిన బర్రెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతుంది.

ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచి తూచి అడుగులేస్తానని తెలిపింది బర్రెలక్క. మరి బర్రెలక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి మరి...

త్వరలో 20 మందికి నామినేటెడ్ పోస్టులు: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషిచేసిన నేతలకు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియను సిఎం రేవంత్ మొదలు పెట్టారు.

దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజక వర్గం నుంచి సుమారుగా నా లుగు నుంచి ఐదు పేర్లను తెప్పించుకున్నట్టుగా తెలిసింది.అందులో భాగంగా ముందస్తుగా 18 నుంచి 20 మందికి నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం.

త్వరలోనే వీటికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిఎం కూడా వారి పేర్లకు ఆమోదముద్ర వేయడంతో పాటు ఆ జాబితాను ఢిల్లీ అధిష్టానానికి పంపించి నట్టుగా సమాచారం.

ఇప్పటికే ముఖ్య నేతలు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్కర వేణుగోపాల్ రెడ్డిలకు క్యాబినెట్ ర్యాంక్‌ను కల్పి స్తూ అడ్వైయిజర్ పోస్టులు ఇవ్వగా, త్వరలో మరో 18 నుంచి 20 మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది.

టిపిసిసి, ఏఐసిసిల సమన్వయంతో పోస్టుల భర్తీ

మిగిలిన 30 నుంచి 40 పోస్టులను ఈనెలాఖరు లోగా మిగతా వారికి కేటాయించాలని సిఎం రేవంత్‌కు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే సిఎం రేవంత్ పంపించిన జాబితాకు ఢిల్లీ నుంచి ఆమోదం ముద్రపడగానే ఆ జాబితాలోని పేర్లను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి....

నేటి నుంచి సామాన్యులకు బాల రాముడి దర్శనం

ఇవాళ్టి నుంచి అయోధ్య లోని బాలరాముని దర్శనం కలగనుంది. 24 అడుగుల దూరం నుంచి సాధారణ భక్తులు బాలరాముని దర్శనం చేసుకోనే అవకాశం. సమయాలను రెండు స్లాట్లుగా విభజన చేశారు.

ఉదయం 7గంటల నుంచి ఉదయం 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు భక్తులు బాలరాముని దర్శనం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ మూడు హారతులు ఉంటాయి. ఉదయం 6.30 గంటలకు శృంగారం హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ

ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం

ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి

ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడని ఉద్ఘాటన

త్యాగధనుల ఆత్మలు ఇవాళ శాంతిస్తాయని వివరణ

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతదేశంతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని తెలిపారు. ఇప్పుడు వారి ఆత్మలన్నీ శాంతిస్తాయని అన్నారు.

ఈ క్షణాన రామభక్తులంతా ఆనంద పారవశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ఇప్పుడే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని, ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదని అన్నారు. రామ్ లల్లా ఒక నుంచి మందిరంలో ఉంటాడని పేర్కొన్నారు

వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. కానీ కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రాముడే భారత్ కు ఆధారం... రాముడే భారత్ విధానం... నేడు జరిగింది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే కాదు... భారతీయ విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ఠ" అంటూ ప్రధాని మోదీ వివరించారు.

Ayodhya Ram Mandir: నేడే అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామమందిరం

అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో.. ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది..

మహా ఘట్టానికి అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ రోజు అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరనున్నాడు. కోట్లాది మంది చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మంగళ ధ్వనితో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మంగళ ధ్వని స్టార్ట్ అవుతుంది.

దాదాపు రెండుగంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికిపైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు. ఇప్పటికే 18 రాష్ట్రాలకు చెందిన వాయిద్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారతీయ సంప్రదాయంలో ఉపయోగించే అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తారు.

ఇక ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12.29కి అభిజిత్‌ లగ్నంలో క్రతువు ప్రారంభం అవుతుంది. 84 సెకన్లపాటు సాగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న 14మంది దంపతులు పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10:25కి అయోధ్య చేరుకోనున్నారు.

ఈ క్రమంలో అయోధ్య రామాలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రామ్‌లలా ప్రాణప్రతిష్ఠకు 7వేల మందికి ఆహ్వానాలు అందించారు. అతిథుల్లో 4వేల మంది స్వామీజీలు, 50 మంది విదేశీయులు ఉన్నారు. వీఐపీల తాకిడితో అయోధ్యకి వందకి పైగా ఛార్టెర్డ్‌ విమానాలు, 12 వేల మంది పోలీసులు, 10వేల సీసీ కెమెరాలు, ఏఐతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. సాధువులు, ప్రముఖులు అయోధ్య చేరుకుంటున్నారు..

PM Modi: సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ..

రామేశ్వరం: అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు..

అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్ని తీర్థం (Agni Teertham)లో సముద్ర స్నానమాచరించారు. అంతేకాక ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భజనల్లో పాల్గొన్నారు.

రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం రామేశ్వరం. రావణాసురుడిని వధించిన తర్వాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడి సముద్ర తీరంలో శివలింగాన్ని తయారుచేసి పూజించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏడాది పొడవునా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి అగ్నితీర్థం సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకెళ్తున్నారు..

ప్రధాని మోదీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మహారాష్ట్ర నాసిక్‌లోని రామ్‌కుండ్‌ కాలారామ్‌ దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళ గురువాయుర్‌ ఆలయం, త్రిప్రయార్‌ రామస్వామి దేవాలయాలను ఇప్పటికే దర్శించుకున్నారు. శనివారం తిరుచిరాపల్లి రంగనాథస్వామి, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు..

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రమాద బీమా పెంపు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

తమ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ప్రమాద బీమా పెంచింది. రూ.40 లక్షలు ఉన్న ప్రమాద బీమాను రూ.1.12 కోట్లకు పెంచుతూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావు శనివారం ఒప్పందం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది.

ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడు తూ.. ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామమని అన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడు తుందని చెప్పారు. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధి కారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు.

గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి రూ.ఒక కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుందని వివరించారు.

సిబ్బంది, ఉద్యోగుల శాల‌రీ అకౌంట్స్‌ను రెండేళ్ల క్రితం యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చిందని సజ్జనార్‌ తెలిపారు. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌక‌ర్యం ఉందని చెప్పారు.

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ ఈ స్కీమ్‌ అండ‌గా నిలుస్తోందని, వారు ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందన్నారు.

యూబీఐ ఉచిత ప్రమాద బీమాపై సిబ్బందికి అవగాహన కల్పించాలని అధికారులకు సజ్జనార్‌ సూచించారు.

ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని ఈరోజు శుభ్రం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె హనుమాన్ ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. అయోధ్యలో శ్రీరామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు.

జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాల యాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రాంగణాన్ని శుభ్రం చేసి లక్ష్మణ సమేత సీతారాములను దర్శించు కున్నారు.

నవగ్రహ ప్రదక్షిణ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గవర్నర్ తమిళిసై తన ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.

అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు మనోడే

అయోధ్య రామ మందిరం లో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవోపే తంగా నిర్వహిం చేందుకు చకాచకా ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పూజలు ప్రారంభమయ్యాయి.

ఈ స‌మ‌యంలో మ‌రో సంచ‌ల‌న విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది.. 22 ఏళ్ల యువ‌కుడికి ఆయోధ్య‌ రామాల‌యం ప్ర‌ధాన అర్చ‌క పీఠం అప్ప‌గించ‌డం అది కూడా తిరుమ‌ల వేద విద్యాల‌యంలో విద్యా బుద్ధులు నేర్చుకున్న వ్య‌క్తి కావ‌డం ప్ర‌ధాన చ‌ర్చ‌గా సాగుతోంది.

1992 నుంచి అర్చ‌క బాధ్య‌తలు చూస్తున్న ఆచార్య సత్యేంద్ర దాస్ కు 85 ఏళ్లు రావ‌డంతో కొత్త ప్ర‌ధాన అర్చ‌కుడిని ఎంపిక చేసే బాధ్య‌త‌ను ఆల‌య ట్ర‌స్ట్ ఆయ‌న‌కే అప్ప‌గిం చింది. ఈ మేరకు 2023లోనే యూపీ ప్రభుత్వం రామ మందిర పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది.

దాదాపు 3 వేల మంది పూజారులు ప్రధానార్చకుడి పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, దరఖాస్తుల స్వీకరణలో కొన్ని షరతులు కూడా పెట్టారు. దరఖాస్తుదారుడి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. గురుకుల విద్యను అభ్యసించి ఉండాలని, శ్రీరాముడి దీక్షకు అర్హతను కలిగి ఉండాలని నిబంధనలు పెట్టారు.

దరఖాస్తులను వడబోసి అందులో రెండు వందల మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా.. అందులో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియా బాద్‌కు చెందిన 22ఏళ్ల మోహిత్ పాండే కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చాడు.

ఇంట‌ర్వ్యూ ప్యాన‌ల్‌లో మ‌హామ‌హులు..

ఇంటర్వ్యూ చేసే ప్యానెల్‌లో హిందూ ప్రవక్త జైకాంత్ మిశ్రా, అయోధ్యలోని మహంత్ మిథిలేష్, నంది శరణ్, సత్యనారాయణ్ దాస్ ఉన్నారు. వారంతా వేదాల నుంచి ఆరాధనా పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు.

అయోధ్యలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఆరంభించారు. ఈ సందర్భంగా వారు దరఖాస్తుదారులను శ్రీరాముడి పూజలకు సంబంధించిన ప్రశ్నలు, సంధ్యా వందనం అంటే ఏంటి, పూజ పద్ధతులు, కర్మకాండ అంటే ఏంటి, రాముడి పూజకు ఎలాంటి మంత్రాలు పఠిస్తారనే ప్రశ్నలు సంధించారు.

ఇంటర్వ్యూకి వచ్చిన 200 మందిలో చివరకు 21 మందిని అర్చ‌కులను ఎంచుకున్నారు. అందులో ఒక ప్రధాన అర్చక పదవితో పాటు 20 మంది సహాయ అర్చకులను ఎంచు కున్నారు.

ఎంతోమంది అనుభ‌వ‌జ్ఞులున్నా..

వారందిరిలోనూ చర్చకు వస్తున్న పేరు మోహిత్ పాండే. కేవలం 22 ఏళ్ల వయసు గల మోహిత్ రామ మందిర ప్రధానా ర్చకుడిగా నియమించ బడ్డాడనే వార్త సంచలనంగా మారింది. ఇంటర్వ్యూలో మోహిత్ తన కంటే ఎంతో పెద్ద పండితులను, అను భవం ఉన్న పూజారులను ఓడించాడు.

ప్యానెల్ మెంబర్లను సైతం మెప్పించాడు. ప్రస్తుత ఆలయ అర్చకుడు సత్యేంద్ర దాస్ మన్ననలు పొందాడు. మోహిత్ తాను పదేళ్ల వయసులోనే రామాయణం, మహాభారతం లాంటి వేదాలను పఠించడం ప్రారంభించాడు. 2020-2021 విద్యా సంవత్సరంలో ఘజియాబాద్‌లోని దుదేశ్వర్ వేద్ విద్యా పీఠ్‌లో తన పదో తరగతి విద్యను పూర్తి చేశాడు.

ఎస్.వీ.వీ.యూ బీఏ ప్రోగ్రాంలో చేరాడు. అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యా లయం ఎంఏ డిగ్రీ చదివి పీహెచ్‌డీకి సిద్ధం అవుతు న్నాడు.

ఇక ప్రస్తుతం ఆలయ ప్రధానార్చకుడిగా సత్యేంద్ర దాస్ కొనసాగుతుండగా, శిక్షణ అనంతరం మోహిత్ పాండే అయోధ్య రామ మందిర ప్రధానార్చకుడిగా బాధ్యతలను స్వీకరించను న్నాడు. మార్చిలో ప్ర‌ధాన అర్చ‌క భాద్య‌త‌లు చేప‌ట్ల‌నున్న‌ట్లు స‌మాచారం..