/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై Yadagiri Goud
ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని ఈరోజు శుభ్రం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె హనుమాన్ ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. అయోధ్యలో శ్రీరామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు.

జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాల యాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రాంగణాన్ని శుభ్రం చేసి లక్ష్మణ సమేత సీతారాములను దర్శించు కున్నారు.

నవగ్రహ ప్రదక్షిణ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గవర్నర్ తమిళిసై తన ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.

అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు మనోడే

అయోధ్య రామ మందిరం లో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవోపే తంగా నిర్వహిం చేందుకు చకాచకా ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పూజలు ప్రారంభమయ్యాయి.

ఈ స‌మ‌యంలో మ‌రో సంచ‌ల‌న విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది.. 22 ఏళ్ల యువ‌కుడికి ఆయోధ్య‌ రామాల‌యం ప్ర‌ధాన అర్చ‌క పీఠం అప్ప‌గించ‌డం అది కూడా తిరుమ‌ల వేద విద్యాల‌యంలో విద్యా బుద్ధులు నేర్చుకున్న వ్య‌క్తి కావ‌డం ప్ర‌ధాన చ‌ర్చ‌గా సాగుతోంది.

1992 నుంచి అర్చ‌క బాధ్య‌తలు చూస్తున్న ఆచార్య సత్యేంద్ర దాస్ కు 85 ఏళ్లు రావ‌డంతో కొత్త ప్ర‌ధాన అర్చ‌కుడిని ఎంపిక చేసే బాధ్య‌త‌ను ఆల‌య ట్ర‌స్ట్ ఆయ‌న‌కే అప్ప‌గిం చింది. ఈ మేరకు 2023లోనే యూపీ ప్రభుత్వం రామ మందిర పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది.

దాదాపు 3 వేల మంది పూజారులు ప్రధానార్చకుడి పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, దరఖాస్తుల స్వీకరణలో కొన్ని షరతులు కూడా పెట్టారు. దరఖాస్తుదారుడి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. గురుకుల విద్యను అభ్యసించి ఉండాలని, శ్రీరాముడి దీక్షకు అర్హతను కలిగి ఉండాలని నిబంధనలు పెట్టారు.

దరఖాస్తులను వడబోసి అందులో రెండు వందల మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా.. అందులో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియా బాద్‌కు చెందిన 22ఏళ్ల మోహిత్ పాండే కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చాడు.

ఇంట‌ర్వ్యూ ప్యాన‌ల్‌లో మ‌హామ‌హులు..

ఇంటర్వ్యూ చేసే ప్యానెల్‌లో హిందూ ప్రవక్త జైకాంత్ మిశ్రా, అయోధ్యలోని మహంత్ మిథిలేష్, నంది శరణ్, సత్యనారాయణ్ దాస్ ఉన్నారు. వారంతా వేదాల నుంచి ఆరాధనా పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు.

అయోధ్యలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఆరంభించారు. ఈ సందర్భంగా వారు దరఖాస్తుదారులను శ్రీరాముడి పూజలకు సంబంధించిన ప్రశ్నలు, సంధ్యా వందనం అంటే ఏంటి, పూజ పద్ధతులు, కర్మకాండ అంటే ఏంటి, రాముడి పూజకు ఎలాంటి మంత్రాలు పఠిస్తారనే ప్రశ్నలు సంధించారు.

ఇంటర్వ్యూకి వచ్చిన 200 మందిలో చివరకు 21 మందిని అర్చ‌కులను ఎంచుకున్నారు. అందులో ఒక ప్రధాన అర్చక పదవితో పాటు 20 మంది సహాయ అర్చకులను ఎంచు కున్నారు.

ఎంతోమంది అనుభ‌వ‌జ్ఞులున్నా..

వారందిరిలోనూ చర్చకు వస్తున్న పేరు మోహిత్ పాండే. కేవలం 22 ఏళ్ల వయసు గల మోహిత్ రామ మందిర ప్రధానా ర్చకుడిగా నియమించ బడ్డాడనే వార్త సంచలనంగా మారింది. ఇంటర్వ్యూలో మోహిత్ తన కంటే ఎంతో పెద్ద పండితులను, అను భవం ఉన్న పూజారులను ఓడించాడు.

ప్యానెల్ మెంబర్లను సైతం మెప్పించాడు. ప్రస్తుత ఆలయ అర్చకుడు సత్యేంద్ర దాస్ మన్ననలు పొందాడు. మోహిత్ తాను పదేళ్ల వయసులోనే రామాయణం, మహాభారతం లాంటి వేదాలను పఠించడం ప్రారంభించాడు. 2020-2021 విద్యా సంవత్సరంలో ఘజియాబాద్‌లోని దుదేశ్వర్ వేద్ విద్యా పీఠ్‌లో తన పదో తరగతి విద్యను పూర్తి చేశాడు.

ఎస్.వీ.వీ.యూ బీఏ ప్రోగ్రాంలో చేరాడు. అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యా లయం ఎంఏ డిగ్రీ చదివి పీహెచ్‌డీకి సిద్ధం అవుతు న్నాడు.

ఇక ప్రస్తుతం ఆలయ ప్రధానార్చకుడిగా సత్యేంద్ర దాస్ కొనసాగుతుండగా, శిక్షణ అనంతరం మోహిత్ పాండే అయోధ్య రామ మందిర ప్రధానార్చకుడిగా బాధ్యతలను స్వీకరించను న్నాడు. మార్చిలో ప్ర‌ధాన అర్చ‌క భాద్య‌త‌లు చేప‌ట్ల‌నున్న‌ట్లు స‌మాచారం..

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు.. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాలు

అయోధ్యలోని శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్టకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాల కానుక రథం శనివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పాటు హిందూ సంఘాల నాయకులు రథానికి ఘన స్వాగతం పలికారు.

ముత్యాల తలంబ్రాల కలశాన్ని ఎమ్మెల్యే తలపై ఎత్తుకొని స్థానిక శ్రీరామ చంద్ర గోపాలకృష్ణ మఠం వరకు తీసుకెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.

మహిళలు హారతులతో స్వాగతం పలికారు. జనవరి 22న అయోధ్యలో శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఉంది, కాబట్టి ఆ రోజున తెలంగాణ రాష్ట్రం మొత్తం అధికారి కంగా సెలవు ప్రకటించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Encounter: ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి

ఛత్తీస్‌ఘడ్ : మరోసారి ఎదురుకాల్పులతో ఛత్తీస్‌ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి..

అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులకు తెగబడ్డారు.

ఇరువురి మధ్య జరిగిన భీకరపోరులో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు పోలీసుల నుంచి తప్పించుకుని అటవీప్రాంతంలోకి పారిపోయారు. ఘటనాస్థలంలో మావోయిస్టులకు సంబంధించి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

Chandrababu: మరోసారి వైకాపా ప్రభుత్వం వస్తే రాష్ట్రం అంధకారమే: చంద్రబాబు

మండపేట: వైకాపా ప్రభుత్వం మరోసారి వస్తే రాష్ట్రం అంధకారమేనని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. శనివారం కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన 'రా..కదలిరా' బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఆక్వారంగాన్ని ఆదుకుంటాం, రాయితీపై విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

వైకాపా పాలనలో రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనరు, గిట్టు బాటు ధర ఇవ్వరని ధ్వజమెత్తారు..

''కోనసీమ జిల్లా పచ్చని అందాలకు, అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. మంచినీరు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే ప్రాంతం ఇది. పంటలకు సాగునీరు ఇచ్చిన కాటన్‌ దొరను ఇప్పటికీ పూజిస్తారు.

ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇక్కడి వారే. కాలువలు బాగు చేయకుండా పంటలను ముంచేశారు. పోలవరం పూర్తి చేసి ఉంటే జిల్లాకు సాగునీరు అందేది. తెదేపా పాలనలో ఆక్వారంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు మునిగిపోయారు. అనేక హామీలు ఇచ్చి ఆక్వా రైతులను జగన్‌ మోసం చేశారు'' అని చంద్రబాబు విమర్శించారు..

500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య చాలా రేగిన చిన్నపాటి వివాదం ఆ ఇరువురి ప్రాణాలను బలి తీసుకుంది......

కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్ లో నివసిస్తున్న కొలుసు రాంబాబు, కనకదుర్గ మధ్య 500 రూపాయల విషయమై చిన్నపాటి గొడవ మొదలైంది.. భార్య 500 అడిగితే ఇవ్వలేదని తాగిన మైకంలో భార్య మీద కోపంతో రాంబాబు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా. అది గమనించిన భార్య కనకదుర్గ వెంటనే ఆ విషయాన్ని కుమారుడు కు వివరించడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన కొడుకు.

విషయం తెలుసుకున్న కుమారుడు హుటాహుటిన తండ్రిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ కారులో హాస్పటల్కు తీసుకువెళ్లగా అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.. తండ్రి మరణ వార్తను కుమారుడు తల్లికి ఫోన్ ద్వారా తెలియజేయగా. , భర్త మరణ వార్త విన్న కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

తండ్రి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి తల్లి ఉరివేసుకొని వేలాడటాన్ని చూసిన కొడుకు తన తల్లినైన కాపాడుకోవాలని ఉద్దేశంతో వేలాడుతున్న తల్లిని కిందకు దింపి పరిశీలించగా అప్పటికే ఆమె చనిపోయింది. తల్లిదండ్రుల మరణ వార్తను సోదరికి మరియు బంధువులకు తెలియజేయగా బంధువుల పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ భార్యాభర్తల మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకేరోజు భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరుగు పొరుగువారు ఈ ఘటనతో శోకసముద్రంలో మునిగారు.

Minister Ponguleti: గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తా

హనుమకొండ: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) హెచ్చరించారు..

శనివారం నాడు వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఇరిగేషన్‌పై మేజర్‌గా, డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితిపై కూడా చర్చించామన్నారు..

మేడారం మహాజాతరకు 105కోట్లు ఇస్తున్నామన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వానిది ఆర్భటాలు మాత్రమేనని.. వ్యక్తిగత లాభం కోసమే పనులు చేశారని మండిపడ్డారు. నాడు మంత్రులకు కూడా గౌరవం లేదన్నారు. భూ కబ్జాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం కాకుండా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు..

Ram Mandir: అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా..

అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది..

వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. అయోధ్యలో ఉగ్రదాడి జరగొచ్చనే నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

నిఘా నీడలో..

అయోధ్య రాములోరి ఆలయం (Ram Mandir) వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), సీఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టబ్యూలరీ (పీఏసీ), ఉత్తరప్రదేశ్ సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సోమవారం 100 మంది ఎస్ఎస్ఎఫ్ కమాండోలు విధుల్లో ఉంటారు. వీరికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) శిక్షణ అందించారు. ఎస్ఎస్ఎఫ్ గార్డులు ఉగ్రవాద వ్యతిరేక వ్యుహాలను తిప్పికొట్టడంలో నిష్ణాతులు. 1990 నుంచి రామజన్మభూమి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది భద్రత కల్పించారు. ఇప్పుడు ప్రధాన ఆలయం వెలుపల విధులు నిర్వహించనుంది. రెడ్ జోన్‌లో పీఎసీ, యూపీ పోలీసులు, ఎస్ఎస్ఎఫ్ మొత్తంగా 1400 మందిని మోహరించామని ఎస్ఎస్ఎఫ్ మీడియా సెల్ ఇంచార్జీ వివేక్ శ్రీ వాస్తవ తెలిపారు.

రెడ్, ఎల్లో జోన్స్

ఎల్లో జోన్‌లో పీఏసీ, యూపీ సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. ఆలయ పరిసరాల్లో కొందరు ఎస్ఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారు. అదనపు బలగాల సాయం కూడా తీసుకుంటారు. డ్రోన్లు, సీసీటీవీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు. భద్రతా విధుల్లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కూడా పాల్గొంటుందని వివేక్ శ్రీ వాత్సవ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రధాని భద్రత ఏర్పాట్లను ఎస్పీజీ పర్యవేక్షిస్తోంది. రామాలయ భద్రత విధుల్లో ఎస్పీజీ సిబ్బంది పాల్గొంటారు.

Revanth reddy: పులి బయటికి వస్తే బోన్ వైసి చెట్టుకు వేళాడదీస్తాం.. కేటీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటిఆర్‌కు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు..

పులి బయటికి వస్తే బోన్ వేసి చెట్టుకు వేళాడదీస్తామని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో రేవంత్ భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చుద్దామన్నా కూడా కనిపించదని వ్యాఖ్యానించారు..

అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తే ఉండదని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి లండన్ వేదికగా స్పందించారు. ఒక్క ఎన్నిక విషయంలోనే బీఆర్ఎస్ నేతలు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదన్నారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత వారికి భయం పట్టుకుని ఇలా మాట్లుడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి..

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం..

బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు..

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. అయితే సరైన ఆధారాలు లేని కారణంగా నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎలాంటి పత్రాలు లేకుండా నగదును తరలించొద్దని, తనిఖీల సమయంలో వివరణ సరిగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు..