/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz 500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య చాలా రేగిన చిన్నపాటి వివాదం ఆ ఇరువురి ప్రాణాలను బలి తీసుకుంది...... Yadagiri Goud
500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య చాలా రేగిన చిన్నపాటి వివాదం ఆ ఇరువురి ప్రాణాలను బలి తీసుకుంది......

కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్ లో నివసిస్తున్న కొలుసు రాంబాబు, కనకదుర్గ మధ్య 500 రూపాయల విషయమై చిన్నపాటి గొడవ మొదలైంది.. భార్య 500 అడిగితే ఇవ్వలేదని తాగిన మైకంలో భార్య మీద కోపంతో రాంబాబు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా. అది గమనించిన భార్య కనకదుర్గ వెంటనే ఆ విషయాన్ని కుమారుడు కు వివరించడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన కొడుకు.

విషయం తెలుసుకున్న కుమారుడు హుటాహుటిన తండ్రిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ కారులో హాస్పటల్కు తీసుకువెళ్లగా అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.. తండ్రి మరణ వార్తను కుమారుడు తల్లికి ఫోన్ ద్వారా తెలియజేయగా. , భర్త మరణ వార్త విన్న కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

తండ్రి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి తల్లి ఉరివేసుకొని వేలాడటాన్ని చూసిన కొడుకు తన తల్లినైన కాపాడుకోవాలని ఉద్దేశంతో వేలాడుతున్న తల్లిని కిందకు దింపి పరిశీలించగా అప్పటికే ఆమె చనిపోయింది. తల్లిదండ్రుల మరణ వార్తను సోదరికి మరియు బంధువులకు తెలియజేయగా బంధువుల పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ భార్యాభర్తల మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకేరోజు భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరుగు పొరుగువారు ఈ ఘటనతో శోకసముద్రంలో మునిగారు.

Minister Ponguleti: గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తా

హనుమకొండ: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) హెచ్చరించారు..

శనివారం నాడు వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఇరిగేషన్‌పై మేజర్‌గా, డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితిపై కూడా చర్చించామన్నారు..

మేడారం మహాజాతరకు 105కోట్లు ఇస్తున్నామన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వానిది ఆర్భటాలు మాత్రమేనని.. వ్యక్తిగత లాభం కోసమే పనులు చేశారని మండిపడ్డారు. నాడు మంత్రులకు కూడా గౌరవం లేదన్నారు. భూ కబ్జాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం కాకుండా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు..

Ram Mandir: అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా..

అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది..

వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. అయోధ్యలో ఉగ్రదాడి జరగొచ్చనే నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

నిఘా నీడలో..

అయోధ్య రాములోరి ఆలయం (Ram Mandir) వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), సీఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టబ్యూలరీ (పీఏసీ), ఉత్తరప్రదేశ్ సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సోమవారం 100 మంది ఎస్ఎస్ఎఫ్ కమాండోలు విధుల్లో ఉంటారు. వీరికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) శిక్షణ అందించారు. ఎస్ఎస్ఎఫ్ గార్డులు ఉగ్రవాద వ్యతిరేక వ్యుహాలను తిప్పికొట్టడంలో నిష్ణాతులు. 1990 నుంచి రామజన్మభూమి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది భద్రత కల్పించారు. ఇప్పుడు ప్రధాన ఆలయం వెలుపల విధులు నిర్వహించనుంది. రెడ్ జోన్‌లో పీఎసీ, యూపీ పోలీసులు, ఎస్ఎస్ఎఫ్ మొత్తంగా 1400 మందిని మోహరించామని ఎస్ఎస్ఎఫ్ మీడియా సెల్ ఇంచార్జీ వివేక్ శ్రీ వాస్తవ తెలిపారు.

రెడ్, ఎల్లో జోన్స్

ఎల్లో జోన్‌లో పీఏసీ, యూపీ సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. ఆలయ పరిసరాల్లో కొందరు ఎస్ఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారు. అదనపు బలగాల సాయం కూడా తీసుకుంటారు. డ్రోన్లు, సీసీటీవీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు. భద్రతా విధుల్లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కూడా పాల్గొంటుందని వివేక్ శ్రీ వాత్సవ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రధాని భద్రత ఏర్పాట్లను ఎస్పీజీ పర్యవేక్షిస్తోంది. రామాలయ భద్రత విధుల్లో ఎస్పీజీ సిబ్బంది పాల్గొంటారు.

Revanth reddy: పులి బయటికి వస్తే బోన్ వైసి చెట్టుకు వేళాడదీస్తాం.. కేటీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటిఆర్‌కు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు..

పులి బయటికి వస్తే బోన్ వేసి చెట్టుకు వేళాడదీస్తామని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో రేవంత్ భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చుద్దామన్నా కూడా కనిపించదని వ్యాఖ్యానించారు..

అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తే ఉండదని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి లండన్ వేదికగా స్పందించారు. ఒక్క ఎన్నిక విషయంలోనే బీఆర్ఎస్ నేతలు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదన్నారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత వారికి భయం పట్టుకుని ఇలా మాట్లుడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి..

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం..

బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు..

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. అయితే సరైన ఆధారాలు లేని కారణంగా నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎలాంటి పత్రాలు లేకుండా నగదును తరలించొద్దని, తనిఖీల సమయంలో వివరణ సరిగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు..

CM Revanth Reddy: రేవంత్‌ కు ఫ్లయింగ్‌ కిస్‌

గత వారం రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసేందుకు తెలుగు ప్రజలు, అభిమానులు ఎగబడుతున్నారు. కాగా, ఓ కార్యక్రమంలో స్టేజ్ పై సీఎం మాట్లాడుతుండగా ఓ యువతి ఆయనకు ఫ్లవర్ బొకే ఇచ్చింది..

సీఎం షేక్ హ్యాండ్ ఇవ్వగా మురిసిపోయింది. ఆపై రేవంత్ కు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఖండాలు దాటిన రేవంత్ అభిమానులు ఉంటారంటూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు..

ఇది ఇలా ఉండగా, దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్ లలో మాట్లాడారు. చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలను కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలనీ అన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు యూరప్,అమెరికా దేశాలు పని చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు..

ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్

ఓటరు నమోదుకు నేడు, రేపు స్పెషల్ డ్రైవ్

తెలంగాణలో ఓటరు నమోదు, జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఇవాళ, రేపు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఈమేరకు 20, 21 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఈ రెండు రోజులు ప్రత్యేక ఓటర్ నమోదు, సవరణ శిబిరాలు నిర్వహిస్తారు.

ఓటరు నమోదు, సవరణకు అవసరమైన 6, 7, 8 ఫామ్స్ బూత్ స్థాయి అధికారుల వద్ద లభిస్తాయని పేర్కొంది...

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఫార్చ్యూన్ హోటల్‌లో ఈరోజు వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు.

ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బల వంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పట్టుబడ్డ ముఠా నుంచి 22 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది యువతులు, నలుగురు విటులు, ఇద్దరు నిర్వా హకులను అరెస్ట్ చేశారు

పోలీసులు. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు...

ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు

కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్‌ ఉంటుంది.. అయితే, ఇప్పుడు ఆ లడ్డు అయోధ్యకు చేరుకున్నాయి.

శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలు.. దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ.. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్.. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది.

అయోధ్యకు పంపించడానికి ప్రత్యేకంగా లక్ష లడ్డూలను తయారు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం నేటి ఉదయం తిరుమల నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తరలించింది.

ఇక, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా అయోధ్యకు తరలించారు. కాగా, అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండల నిర్ణయం తీసుకుంది..

దాని అనుగుణంగా లడ్డూలను తయారు చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేయించారు.. ఈ రోజు తిరుపతి విమానాశ్రయాము నుండి ఉదయం ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు చేర్చారు టీటీడీ అధికారులు.. త‌ర్వాత రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ అధికారులకు అందజేశారు.

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్.

ఈనెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్స వం సందర్బంగా ఈ కళాఖండం తయారీకి తాను సంకల్పించినట్లుగా ఆయన తెలిపారు.

60 గంటలకు పైగా శ్రమించి 16వేల పైగా బియ్యపు గింజలతో మందిర నిర్మాణం తయారు చేసానని త్వరలోనే ఈ మందిరాన్ని ప్రధాని మోడీకి అందజే స్తానని దయాకర్ తెలిపారు.

బియ్యపు గింజలతో ఇలాంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ తయారు చేయలేదని అటువంటి రామ మందిర నిర్మాణ కళాఖండం తయారు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని దయాకర్ అన్నారు.

బియ్యపు గింజలతో అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసిన డాక్టర్ దయాకర్‌ను పలువురు అభినందించారు. అయితే దయాకర్ గతంలో కూడా అనేక సూక్ష్మ రూప కళా ఖండాలను తయారు చేసి పలు అవార్డులతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు.