/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz CM Revanth Reddy: రేవంత్‌ కు ఫ్లయింగ్‌ కిస్‌ Yadagiri Goud
CM Revanth Reddy: రేవంత్‌ కు ఫ్లయింగ్‌ కిస్‌

గత వారం రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసేందుకు తెలుగు ప్రజలు, అభిమానులు ఎగబడుతున్నారు. కాగా, ఓ కార్యక్రమంలో స్టేజ్ పై సీఎం మాట్లాడుతుండగా ఓ యువతి ఆయనకు ఫ్లవర్ బొకే ఇచ్చింది..

సీఎం షేక్ హ్యాండ్ ఇవ్వగా మురిసిపోయింది. ఆపై రేవంత్ కు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఖండాలు దాటిన రేవంత్ అభిమానులు ఉంటారంటూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు..

ఇది ఇలా ఉండగా, దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్ లలో మాట్లాడారు. చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలను కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలనీ అన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు యూరప్,అమెరికా దేశాలు పని చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు..

ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్

ఓటరు నమోదుకు నేడు, రేపు స్పెషల్ డ్రైవ్

తెలంగాణలో ఓటరు నమోదు, జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఇవాళ, రేపు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఈమేరకు 20, 21 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఈ రెండు రోజులు ప్రత్యేక ఓటర్ నమోదు, సవరణ శిబిరాలు నిర్వహిస్తారు.

ఓటరు నమోదు, సవరణకు అవసరమైన 6, 7, 8 ఫామ్స్ బూత్ స్థాయి అధికారుల వద్ద లభిస్తాయని పేర్కొంది...

వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఫార్చ్యూన్ హోటల్‌లో ఈరోజు వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు.

ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో బల వంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పట్టుబడ్డ ముఠా నుంచి 22 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది యువతులు, నలుగురు విటులు, ఇద్దరు నిర్వా హకులను అరెస్ట్ చేశారు

పోలీసులు. రామ్‌నగర్‌కు చెందిన అఖిల్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు...

ప్రత్యేక విమానంలో అయోధ్యకు తిరుపతి లడ్డు

కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్‌ ఉంటుంది.. అయితే, ఇప్పుడు ఆ లడ్డు అయోధ్యకు చేరుకున్నాయి.

శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలు.. దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ.. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్.. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది.

అయోధ్యకు పంపించడానికి ప్రత్యేకంగా లక్ష లడ్డూలను తయారు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం నేటి ఉదయం తిరుమల నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తరలించింది.

ఇక, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా అయోధ్యకు తరలించారు. కాగా, అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండల నిర్ణయం తీసుకుంది..

దాని అనుగుణంగా లడ్డూలను తయారు చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేయించారు.. ఈ రోజు తిరుపతి విమానాశ్రయాము నుండి ఉదయం ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు చేర్చారు టీటీడీ అధికారులు.. త‌ర్వాత రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ అధికారులకు అందజేశారు.

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్.

ఈనెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్స వం సందర్బంగా ఈ కళాఖండం తయారీకి తాను సంకల్పించినట్లుగా ఆయన తెలిపారు.

60 గంటలకు పైగా శ్రమించి 16వేల పైగా బియ్యపు గింజలతో మందిర నిర్మాణం తయారు చేసానని త్వరలోనే ఈ మందిరాన్ని ప్రధాని మోడీకి అందజే స్తానని దయాకర్ తెలిపారు.

బియ్యపు గింజలతో ఇలాంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ తయారు చేయలేదని అటువంటి రామ మందిర నిర్మాణ కళాఖండం తయారు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని దయాకర్ అన్నారు.

బియ్యపు గింజలతో అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసిన డాక్టర్ దయాకర్‌ను పలువురు అభినందించారు. అయితే దయాకర్ గతంలో కూడా అనేక సూక్ష్మ రూప కళా ఖండాలను తయారు చేసి పలు అవార్డులతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు.

పట్టాలు తప్పిన మరో రైలు

కన్నూర్-అలప్పుజా (16308) ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ షంటింగ్ ప్రక్రియలో పట్టాలు తప్పింది.

ఈ ఘటన శనివారం ఉదయం కన్నూర్ యార్డులో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు కన్నూర్ నుంచి బయలుదేరాల్సిన రైలు ఉదయం 6:43 గంటలకు సర్వీసును ప్రారంభించింది. పట్టాలు తప్పిన కోచ్‌లను రైలు నుండి తొలిగించారు.

ఈ ఘటనలో సిగ్నల్ బాక్స్ ధ్వంసమైంది. అధికారులు విచారణ చేపట్టారు.

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

హైదరాబాద్ రామ భక్తులు శ్రీరాముడిపై తన ప్రేమను చాటుకున్నారు. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని ఎన్.నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు శనివారం అయోధ్యకు చేరుకుంది.

సుమారు 1,265 కేజీల బరువునన ఈ లడ్డు కరసేవక్‌పురంకు చేరుకున్నట్లు నాగభూషణం రెడ్డి తెలిపారు.

ఈ లడ్డు నెల రోజుల పాటు ఉంటుందని, 25 మంది కలిసి మూడు రోజులు పాటు శ్రమించి లడ్డు తయారు చేశామన్నారు.

ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇవ్వకపోతే సమరమే

సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరూ అంటూ ఏపీ, తెలంగాణ సర్కార్‌లను నిలదీస్తోంది

కాషాయ పార్టీ. దేశంలో చాలా రాష్ట్రాలు ఎల్లుండి హాలీ డే ఇచ్చాయి. ఆ హోలీ డే గురించి మీకు పట్టదా, రాముడంటే లెక్కలేదా అంటోంది కమలం పార్టీ. 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించకపోతే సమరమే అంటోంది. రాజకీయ పార్టీలన్నాక పోరాటం చేస్తాయి.

అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పోరాటం చేస్తోంది బీజేపీ. సమస్యల గురించి కాకుండా సెలవుల కోసం యుద్ధం ప్రకటించింది. అయితే అది స్టూడెంట్స్‌ కోసం కాదు. రామ భక్తుల కోసం.. ఏపీ, తెలంగాణ సర్కార్‌లపై సమరానికి సై అంటూ సీరియస్‌ అవుతోంది.

ఈ నెల 22న అయోధ్య లోని దివ్య భవ్య నవ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టతో కొలువుదీరను న్నాడు బాల రామయ్య. దీంతో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలను బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

కొన్ని రాష్ట్రాల్లో సెలవు దినం.ప్రకటించింది. ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ రోజును సెలవు దినంగా ప్రకటించారు.

అయితే ఆ హోలీ డే నాడు తెలుగు రాష్ట్రాలు హాలీ డే ప్రకటించవా అంటూ బీజేపీ నేతలు మండిపడుతు న్నారు. తెలుగు రాష్ట్రాల్లో 22వ తేదిని సెలవు దినంగా ప్రకటించాలని ఆయా ప్రభుత్వాలను కోరుతోంది కాషాయ పార్టీ.

సమయం లేదు మిత్రమా సెలవు ఇస్తారా, సమరం ప్రకటించమంటారా అంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తోంది, బిజెపి పార్టీ...

తిరుపతిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

దీంతో శ్రీవారిని దర్శించుకోవాడినికి భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. స్వామివారికి దర్శించు కుంటూ భక్తులు మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, శుక్రవారం శ్రీవారి 69,874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 26,034 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Guntur: కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి..

కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతున్నాయి. కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న అమోనియా సిలండర్లు పేలితే.. మంటలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..