/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz వ్యూహం సినిమా రిలీజ్ పై నేడు విచారణ Yadagiri Goud
వ్యూహం సినిమా రిలీజ్ పై నేడు విచారణ

వ్యూహం సినిమాపై నేడు హైకోర్టులో విచారణ జర గనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ దాఖలైంది.

దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. నేడు సినిమా రికార్డ్స్ అన్నిటిని న్యాయ స్థానం పరిశీలిం చునుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో సినిమా యూనిట్ అప్పీల్ చేసింది.

సినిమా విడుదల ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందని చిత్ర యూనిట్ వాదిస్తోంది. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని అంటోంది.

ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11 కు బదులు 8వ తేదీన విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సినిమా యూనిట్ కోరింది.

మెరిట్స్ ఆధారంగా ఈనెల 8న సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్‌కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

తిరుపతిలో సర్వసాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు.

స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, ఆదివారం శ్రీవారి 76,058మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరు మలలో నిన్న 22,543 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు...

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు.

9న రాజకీయ పార్టీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది.అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష చేయనుంది. 10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ఏపీలో ఓట్ల గల్లంతు, జాబితాలో అవకతవకలపై సీఇసీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయనున్నారు.

నేడే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం

ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 26 నుంచి జనవరి 6 వకు నిర్వహిం చిన ప్రజాపాలన కార్యక్ర మంపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించ నున్నారు.

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, సీఎస్ శాంతి కుమారితో పాటు వివిధశాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్, నోడల్ అధికా రులు సహా ఉన్నతాధికా రులు సమావేశానికి హాజరుకానున్నారు.

మట్టి గాజులు ఆడవారికి అందమే కాదు ఆరోగ్యం

తెలంగాణలో ఈ సంస్కృతి, అసాధారణం. అపూర్వం. వర్ణనాతీతం. తన కడుపున పుట్టిన బిడ్డ శ్రేయస్సు, క్షేమం ప్రతీ తల్లికి ముఖ్యం. తన బిడ్డ చక్కగా ఎదగాలి. ఎల్లవేళలా చల్లగా ఉండాలి. ఎలాంటి కీడు దాపురించ కూడదు. మారాజు యోగ్య తతో మనుగడ సాధించాలి. ఇందుకు మంచి మట్టి గాజులు ధరించాలి.

అదీ సొంత డబ్బుతో కాదు. ఇద్దరు మగ బిడ్డల తల్లి నుంచి ఒకే ఒక కొడుకు, లేదా కూతురున్న తల్లి, నజరానా తీసుకోవాలి. ఆ డబ్బులతో గాజులు కొనాలి. తాను ధరించాలి. ఇలా గాజులు కొనుక్కోవటానికి డబ్బులు అడిగే తల్లికి తప్పని సరిగా.. ఆమె వారసత్వం కోసమే కాదు.. తన వారసత్వ క్షేమం కోసమూ మహిళా మూర్తులు గాజుల మామూళ్లు ఇస్తారు.

అంతే కాదు, ఉత్తరాయణ సంక్రమణ దశలో,, మకర సంక్రాంతి సందర్భంగా ఆ సూర్యభగవానుడిని ఆరాధిస్తారు. కృతజ్ఙతలు తెలుపుతారు. ఇక మహావిష్ణువు, శ్రీ లక్ష్మీని పూజిస్తారు.

అందరూ క్షేమంగా ఉండాలి. అందరిలో మేమూ ఉండా లనే నానుడి.. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ మహిళల్లో విస్పష్టం.

తెలంగాణ సంస్కృతిలో,, మహిళలు ప్రాణ సమానం గా గాజులను ఆరాధిస్తారు. డబ్బున్న మారాణులైతే వజ్రాల గాజలతో ఫోజి స్తారు. ఎన్నో రంగుల రంగుల గాజులు ధరిం చటానికే ఇష్టపడ తారు.

ధనవంతులు బంగారు గాజులు ధరించవచ్చు. కానీ ఎల్లవేళలా రంగు రంగుల గాజులకు ఇచ్చే విలువ, గౌరవం బంగారు గాజులకు దక్కదంటే ఆశ్చర్యపోనక్క రలేదు. మట్టి గాజులంటే ఆడబిడ్డలు అల్లాడి పోతుంటారు. .

బీరువాలో ఎన్ని డిజైన్లలో గాజులు ఉన్నా.. మళ్లీ ఇంకో డజన్‍ గాజులు తీసుకుం మని మధ్యతరగతి మహిళ భావిస్తుంది. ప్రతి చీరకు కూడా మ్యాచింగ్‍ గాజులు కొంటుంది. కానీ మట్టి గాజులకే అపూర్వ గౌరవం లభిస్తుంది.

Chandrababu: హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలబోతోంది: చంద్రబాబు

తిరువూరు: వైకాపా ప్రభుత్వ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి పోయిందని.. మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్‌ (YS Jagan) దెబ్బతీశారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు..

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో నిర్వహించిన 'రా.. కదలి రా' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

''ఓ పక్క హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. మరో పక్క అమరావతి వెలవెలబోతోంది. దీనికి కారణం జగన్‌ రివర్స్‌ పాలన. ఓ వ్యక్తి వల్ల ఒక రాష్ట్రం.. ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు నష్టం కలుగుతుంది. దుర్మార్గుడి పాలనలో రాష్ట్రంలో తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఈ రాష్ట్రంలో నాతో సహా అందరూ బాధితులే. అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరుతున్నా..

మూడు నెలల్లో రైతు రాజ్యం

ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌ వన్‌గా ఉండాలనేది నా ఆకాంక్ష. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుంది. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు తెదేపా ఉపయోగపడింది. వైకాపాకు ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్లవుతుంది. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు.. ధాన్యం రైతులు దగాపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. రైతుల బతుకులు బాగుపడాలంటే తెదేపా-జనసేన ప్రభుత్వం రావాలి. సైతాన్‌ ప్రభుత్వం పోవాలి.. రైతే రాజుగా మారాలి. మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుంది..

మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొంటారు..

ఐదేళ్లు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. రుషికొండను బోడిగుండు చేసి రూ.500కోట్లతో ప్యాలెస్‌ కట్టారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుంది. మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొనే రోజు వస్తుంది. తెదేపా హయాంలో ఉద్యోగాలు వస్తే.. జగన్‌ గంజాయి తెచ్చారు. యువతను మత్తులో ఉంచి ఏమైనా చేయాలనుకుంటున్నారు. మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఇస్తా. రాష్ట్రంలోని యువతను ప్రపంచంలో నంబర్‌ వన్‌గా మారుస్తా.

త్వరలో తెదేపా-జనసేన మేనిఫెస్టో

దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తామని వైకాపా నేతలు అనుకుంటున్నారు. ఆ పార్టీ ఆటలు సాగవని గుర్తుంచుకోవాలి. సంక్షేమ పథకాలకు నాంది పలికింది తెదేపా. జగన్‌ పాలనలో వంద పథకాలను రద్దు చేశారు. ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని ప్రజలు భావిస్తున్నారు. 'బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ' పేరిట సూపర్‌ సిక్స్‌ అందిస్తాం. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి అందిస్తాం. 'అన్నదాత' కింద రైతులకు రూ.20వేలు అందజేస్తాం. 'జయహో బీసీ' కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తాం. తెదేపా-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం.

అంబటి రాయుడును మోసగించారు

సొంత పార్టీ ఎమ్మెల్యేలను జగన్‌ నమ్మడం లేదు.. ప్రజలు ఆయన్ను నమ్మట్లేదు. ఎమ్మెల్యేలను బదిలీ చేసిన సందర్భాలు గతంలో లేవు. గుంటూరు ఎంపీ టికెట్‌ పేరుతో అంబటి రాయుడును మోసగించారు. ఆ టికెట్‌ను మరొకరికి కేటాయించడంతో ఆయన వైకాపా నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రజలకు సేవ చేసిన వారికి వైకాపా సీట్లు ఇవ్వలేదు. నన్ను, పవన్‌, లోకేశ్‌ను దూషిస్తేనే టికెట్లు ఇస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజల్లో చైతన్యం తేవాలి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ సిద్ధం కావాలి'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

కొమురవెల్లి మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి మల్లన్న కల్యాణ వేడుకలుఆదివారం ఉద‌యం అత్యంత ఘనంగా జరిగాయి.

మల్లన్న శరణు శరణు అంటూ జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.

కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివశక్తులు శివాలెత్తి పోయారు.

ఒగ్గు పూజారులు ఆధ్వ ర్యంలో సంప్రదాయ బద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ లను మల్లన్న పెళ్లాడారు. స్వామి, అమ్మవార్లకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆల‌య పాల‌క మండ‌లి, అధికారులు, భ‌క్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు...

ప్రపంచ ఆరోగ్య సలహాదారుగా ఖమ్మం జిల్లా వాసి

ఖమ్మం పట్టణవాసికి అరుదైన గౌరవం దక్కింది. నగరానికి చెందిన ఐఏఎస్‌ అధికారి అడపా కార్తీక్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుగా నియ మితులయ్యారు.

ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన కార్తీక్‌ 2007లో ఐఏఎస్‌ టాపర్‌గా నిలిచారు. అనంతరం పంజాబ్‌ కేడర్‌కు వెళ్లి అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం అక్కడే ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.

ఉద్యోగం చేస్తున్న సమ యంలోనే అమెరికాలోని నార్త్‌ కరోలినా విశ్వవిద్యాల యంలో క్యాన్సర్‌ నిర్మూలన అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం దిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో రెండేళ్ల పాటు సలహాదారుగా బాధ్యతలు తీసుకోను న్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా కార్తీక్ నియామకం పట్ల అతని బంధువులు, ఖమ్మం జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నెలరోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

నెల రోజుల పాలన పై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ట్వీట్‌ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తి నిచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సేవకులమే తప్ప పాల కులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేను న్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అను భూతిని ఇచ్చిందన్నారు.

పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని వివరించారు.

పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని చెప్పారు.

రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

రేపటి నుండి రైతుల ఖాతాలో రైతు బంధు జమ

రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నం దున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు అధికారు లను ఆదేశించారు.

శనివారం మంత్రి అధికారు లతో రైతుబంధు పధకం అమలుపై సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి రైతుబంధు పధకం వివరాలను వెల్లడించారు.

ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని తెలిపారు. 27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.

మిగిలిన రైతులకు కూడా త్వరితగతిన నిధులు జమ చేయాలని మంత్రి ఆదేశిం చారు. సోమవారం నుండి అధికసంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలన్నారు.

ఈ అంశంపై సంక్రాంతి తర్వాత మరో మారు సమీక్ష నిర్వహిస్తామన్నారు. రైతుల సంక్షేమం ,వ్యవసాయం నూతన ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు.

గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతుబంధును సకాలంలో అందజేయ డానికి కట్టుబడి ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రైతాంగం , ప్రజలు రైతుబంధు నిధుల విడుదలపై ఎటువంటి అనుమానాలు పెట్టుకో వాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు....