/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ Yadagiri Goud
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ

వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచారు.

అదానీకి అనుకూలంగా సుప్రీం తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు పెరిగాయి.

ఇవాళ ఉ.9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

ఇదే సమయంలో ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉంది.

అటు ప్రపంచ సంపన్నుల లిస్టులో అదానీ 12, అంబానీ 13వ స్థానాల్లో ఉన్నారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం ను కలిసిన చిరంజీవి దంపతులు

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ అయ్యారు.

గురువారం రాత్రి సతీమణి సురేఖతో కలిసి ప్రజాభ వన్‌కు వచ్చిన చిరంజీవి.. అక్కడ డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

చిరంజీవి దంపతులకు డిప్యూటీ సీఎం పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని చిరంజీవి శాలువాతో సత్కరించారు. అనంతరం చిరంజీవి దంపతులకు సైతం భట్టి సత్కారం చేశారు.

చిరుతో భేటీకి సంబంధిం చిన ఫొటోలను డిప్యూటీ సీఎం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రులను ఒక్కొక్కరిని మెగాస్టార్ కలుస్తున్నారు.

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియ జేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ

ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక‌పై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోన్నది. పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన నేతల వివరాలను ఏఐసీసీ సేకరిస్తున్నది. దాదాపు 15 మంది కీలక నేతలు ఎమ్మె ల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.

అయితే అసెంబ్లీ టిక్కెట్‌ను త్యాగం చేసినోళ్లకు అవకా శం ఇస్తారా? పోటీ చేసి ఓడిన ప్రముఖులకు కేటాయిస్తారా? అనేది త్వరలోనే తేలనున్నది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవగా, ఇప్పుడు ఆ రెండింటికీ ఆశావహులు పోటీపడు తున్నారు.

దీంతో కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్ధులను నిలబెడు తుందా? ఒక్కరినే పోటీ లో ఉంచుతుందా? అని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొన్న ది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని సులువుగా గెలుస్తుంది.

తమకూ ఒక ఎమ్మెల్సీ వస్తుందని బీఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేస్తున్నది. అయితే రెండింటినీ తామే గెలవాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పట్టుపడు తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో రెండింటినీ గెల వడం కష్టమే. కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు కూడగడితే రెండు ఎమ్మెల్సీ లను సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గానూ పలువురి ఎమ్మెల్యేలతో సంప్రదింపు లు చేస్తున్నట్లు తెలిసింది.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదే హాట్ టాఫిక్ గా మా రింది. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపికపై క్లారిటీ రానున్నదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ పెట్టుబడుల నిమిత్తం దావోస్‌కు వెళ్ల నున్నారు. ఆ లోపే ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించి, తర్వాతి ప్రాసెస్ బాధ్య తలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించను న్నట్లు తెలుస్తుంది....

తెలంగాణకు రావలసిన నిధులు ఇప్పించండి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారు ల‌ను మాత్రమే కేటాయిం చార‌ని.. జిల్లాల విభ‌జ‌న‌, వివిధ శాఖ‌ల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అద‌నంగా 29 అద‌న‌పు ఐపీఎస్ పోస్టులు కేటా యించాల‌ని కోరారు.

ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం గురవారం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు,అభివృద్ధి పనులపై చర్చించారు.

రేవంత్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి అమిత్ షా,సాను కూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికా రుల‌ను అద‌నంగా కేటాయిస్తామ‌ని హామి ఇచ్చారు...

ఖమ్మం జిల్లా పార్లమెంటు ఎన్నికల బరిలో సోనియా గాంధీ

కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేసే విషయమై స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి, అధిష్ఠానానికి పంపగా, ఆమె సూత్రప్రా యంగా అంగీకరించారు.

ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్దత కొనసాగింది. తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సోనియాగాంధీ నాయక త్వంలోని యూపీఏ ప్రభు త్వం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేత లు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకట నకు ముందు సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొన్నా రు. సోనియా హాజరైన తుక్కుగూడ సభ తర్వాతే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు బలంగా తీసుకువెళ్ల గలిగారు.

ఈ నేపథ్యంలోనే సోనియా బ్రాండ్‌ను లోక్‌సభ ఎన్నిక ల్లోనూ గట్టిగా ఉపయోగిం చాలన్న చర్చ రాష్ట్ర పార్టీలో వచ్చింది. అందులో భాగం గానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి అధిష్ఠానానికి పంపారు.

తాజాగా బుధవారం జరిగిన టీపీసీసీ సమావేశంలోనూ ఈ అంశంపై మరోసారి చర్చ జరిగింది. అందులో భాగం గానే సోనియాగాంధీ తెలం గాణ నుంచి పోటీ చేయాల ని మరోసారి తీర్మానం చేశారు. రెండోసారి తీర్మానం తర్వాత సోనియా కార్యాల యం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అంది నట్లు తెలిసింది.

రాష్ట్రం నుంచి పోటీ చేయ డానికి ఆమె అంగీకరించా రని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొం దించాలని సూచించారని సమాచారం. ఢిల్లీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో సోనియా పోటీకి సంబం ధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు.

అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

-ఐద్వా -రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

అన్ని గ్రామాలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈరోజు ఐద్వా జిల్లా విస్తృతస్థాయి సమావేశం పొలే బోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం డ్వాక్రా మహిళల కోసం ఒకటి నవంబర్ 2001 అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత వచ్చిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరించాలని. లేకపోతే వారికి బకాయి పడ్డ 600 కోట్ల రూపాయలు అభయ హస్తం డబ్బులను మహిళల బ్యాంక్ అకౌంట్ల లో జమ చేసి వారిని ఆదుకోవాలని అన్నారు. బెల్టు షాపులను ఎత్తివేయాలని ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అర్హులైన వారందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ

సభ్యత్వ క్యాంపెయిన్ సందర్భంగా

ఉపాధి హామీ సమస్యలు, రేషన్ సమస్యలు, పొదుపు గ్రూపుల సమస్యలపై సర్వేలు చేసి మెమోరాండం ఇస్తాము. ఆ సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా సరోజ, కొండ అనురాధ, ఐద్వా ఆఫీస్ బేరర్స్ చనబోయిన నాగమణి, తుమ్మల పద్మ, భూతం అరుణకుమారి, కారంపూడి ధనలక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు చనగాని సైదమ్మ,సుల్తానా, వసంత, శశికళ, జంజిరాల ఉమా, బోల్లపెల్లి మంజుల, వర్ణ, వరంగంటి సంధ్యారాణి, సుజాత, భాగ్య,భారతి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల

తెలుగు రాష్ట్రాల రాజ కీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల గురు వారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ మేరకు షర్మిల, మరికొందరు నేతలు బుధవారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. కాగా.. ముందుగా షర్మిల.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు.

ఆ తర్వాత వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవలు ఉపయోగించు కునేలా బాధ్యతలు ఇవ్వనున్నారు....

తెలంగాణలో 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు

రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జను నియమించింది. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పని చేసిన స్మిత సబర్వాల్‌ను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ స‌భ్యురాలిగా పోస్టింగ్ ఇచ్చారు.

అధికారుల కొత్త పోస్టింగ్:

ఇరిగేషన్ కార్యదర్శి: రాహుల్ బొజ్జా

స్విత అబర్వాల్: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్

దాసరి హరిచందన: నల్లగొండ కలెక్టర్

డి. దివ్య: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్

భారతి హోళికేరి: పురావస్తు శాఖ డైరెక్టర్

సంగీతా: సీఎంవో సంయుక్త కార్యదర్శి

మహేశ్ దత్ ఎక్కా: గనుల శాఖ ముఖ్య కార్యదర్శి

అహ్మద్ నజీర్: ప్రణాళిక ముఖ్య కార్యదర్శి

కాగా, ముఖ్యమంత్రి సెక్రటరీగా సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి జీ. చంద్రశేఖర్ రెడ్డి ని నియ‌మించారు..

ప్రస్తుతం ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వీసీ & ఎండిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు .

సావిత్రి బాయిపూలే మహిళా లోకానికి ఆదర్శం : ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి

సావిత్రి భాయి పూలే మహిళా లోకానికి ఆదర్శమని 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు ఈ రోజు 5వ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 193 వ జయంతి జరిగింది ఈ సందర్భంగా పూలమాలంకరణ చేసి ప్రభావతి మాట్లాడుతూ

19వ శతాబ్దంలో పితృస్వామిక వ్యవస్థకు, పురుషాధిక్య సమాజానికి, వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారన్నారు.

 మహిళలపట్ల. వివక్షతలు రూపుమాపబడాలంటే విద్యయే పదునైనన ఆయుధమని భావించి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు విద్యను అందించడానికి శ్రీకారం చుట్టిన తొలితరం మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మహిళల కోసం సుమారుగా 52 మహిళా పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను బోధిస్తున్న క్రమంలో ఆధిపత్య బ్రాహ్మణీయ శక్తులు అనేక రకాలుగా సావిత్రిబాయి పూలేని వేధించినప్పటికి వాటన్నింటిని ప్రతిఘటించి మహిళలను చైతన్యవంతం చేయడంలో క్రియాశీలక భూమిక పోషించిందన్నారు.

సావిత్రిబాయి పూలే అందించిన స్ఫూర్తితో భారతదేశంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అన్నారు. అణగారిన వర్గాల మహిళలకు సంపూర్ణమైన హక్కులు దక్కాలంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో సబ్ కోటా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసి గిరిజన,గోండు లాంటి మారుమూల తండాలకు విద్యను అందించడానికి విద్యా వ్యవస్థ లో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. సావిత్రిబాయి పూలే అందించిన స్ఫూర్తితో వివక్షతలు లేనటువంటి సమాజం కొరకు పోరాడుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్టా సరోజ జిల్లా సహాయ కార్యదర్శిలు చెనబోయిన నాగమణి భూతం అరుణ కుమారి జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సుల్తానా శశికళ లక్ష్మమ్మ సైదమ్మ భారతమ్మ రాధిక చిలుకూరి వర్ణ బొల్లెపల్లి మంజుల పాల్గొన్నారు.

ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే నేనే..: ఆర్కే

మగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని ఆర్కే పేర్కొన్నారు.

అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను కేవలం బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని వెల్లడించారు.

కాగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవలే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్కే వైఎస్ షర్మిల వెంటే తన రాజకీయ ప్రస్థానం అని ప్రకటించారు.