/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం... Miryala Kiran Kumar
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం...

హైదరాబాద్‌: మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం.. ఎయిర్‌పోర్ట్‌కు దూరాన్ని తగ్గిస్తాం.. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు.. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మెట్రోలైన్‌కు లింక్‌ చేస్తాం.. మియాపూర్‌ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో.. అవసరమైతే హైటెక్‌ సిటీ వరకున్న మెట్రోను ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తాం.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం దానికంటే మా ప్రతిపాదనకే తక్కువ ఖర్చు అవుతుంది. -సీఎం రేవంత్‌ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్సార్ పెన్షన్ పధకం కింద సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని దశలవారీగా అమల్లోకి తెచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా పెన్షన్లను పెంచుతూ వస్తోంది సర్కార్. ఎనిమిది రోజుల పాటు పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కొత్త లబ్ధిదారులకు పెన్షన్ కార్డులనూ పంపిణీ చేయనుంది ప్రభుత్వం.

మార్నింగ్ ముచ్చట్లు...

మార్నింగ్ ముచ్చట్లు...

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత,పడిపోయిన ఉష్ణోగ్రతలు

రైతు-మహిళ-యువత నామ సంవత్సరంగా 2024-రేవంత్‌రెడ్డి

APలో నేటినుంచి ఈ నెల 8వరకు పెన్షన్ల పెంపు ఉత్సవాలు

నేటి నుంచి నాంపల్లిలో నుమాయిష్‌ ఎగ్జిబిషన్

దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు, ముగ్గురు మృతి

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు కొనొద్దు-హిమాచల్‌ సీఎం

ఆర్థిక సంఘం చైర్మన్‌గా అరవింద్‌ పనగరియా నియామకం

దాడుల నేపథ్యంలో అరేబియాసముద్రంలో నిఘా పెంచిన భారత్

అమెరికాలో ఓ ఇంట్లో భారీ పేలుడు, నలుగురు మృతి

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్..

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్

ఆక్లాండ్‌లో ఘనంగా న్యూఇయర్ వేడుకలు

ఆకట్టుకున్న లేజర్, ఫైర్‌వర్క్స్‌ షో

అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్‌లో వేడుకలు

న్యూ ఇయర్‌కు న్యూజిలాండ్ ప్రజల గ్రాండ్ వెల్‌కమ్.

వీరికి రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం..

CM Revanth Reddy: వీరికి రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. పూర్తి వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే తాము హామీ ఇచ్చిన పథకాలను అమలు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజే రెండు గ్యారెంటీల అమలుపై సంతకాలు చేశారు. మరిన్ని పథకాలు ప్రజలకు అందించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈక్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకం అమలు చేసింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఓలా, ఉబర్‌, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్‌ డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలషెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల..

తెలంగాణలో పదో తరగతి పరీక్షలషెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీవరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకలను ఉద్దేశించి నలగొండ పోలీస్ శాఖ తరపున ప్రజలకు విజ్ఞప్తి..

 నల్గొండ పోలీసు శాఖ తరపున ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని, ప్రజల రక్షణ కొరకు, నల్గొండ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది.

నూతన సంవత్సర వేడుకల గురించి ఎవరికి ప్రత్యేకమైన కార్యక్రమాలకు లేదా ఈవెంట్లకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదు. ఎవరైనా చట్ట నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏదైనా మ్యూజికల్ లేదా ఎంటర్టైన్మెంట్ లేదా ఈవెంట్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అంతే కాకుండా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాల పేరుతో, టికెట్లు/ ఎంట్రీ ఫీజుల రూపంలో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

నూతన సంవత్సర వేడుకల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.

 ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యుక్త వయసు పిల్లలకు, మరీ ముఖ్యంగా మైనర్ పిల్లలకు, బైక్స్/ కార్లను ఇచ్చినచో, వారు అట్టి వాహనాలను నిర్లక్ష్యంగా లేక మద్యం, మత్తు పదార్థాలు సేవించి నడపడం వలన ప్రమాదాలు జరిగి, దాని వలన వారికి గానీ లేక వారివల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయంలో తల్లితండ్రులు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి. ఈ సందర్బంగా "డ్రంకెన్ డ్రైవింగ్ " కేసులు నమోదు చేసేందుకు, అతివేగం/ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు మరియు త్రిబుల్ రైడింగ్ నడిపే వారి కొరకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

కావున 31వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట తరువాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ ఉండే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయి. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ తమ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంటలోపు  పూర్తిచేసుకుని తమతమ ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి. 

అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, లేక ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది

పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పోలీసు వారితో సహకరించి పూర్తి శాంతియుత మరియు ఆహ్లాదకరమైన వాతావరణం లో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి. 

   ఈ నూతన సంవత్సర వేడుకలు ఎవరింట్లో కూడా విషాదాన్ని నింపకూడదని కోరుకుంటూ, అందుకొరకు ప్రజలందరూ మా సూచనలు పాటించి అన్ని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను: డి ఎస్ పి నల్లగొండ.

    

పవర్లూమ్ కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి ,ఇండ్లు నిర్మించి ఇవ్వాలి,వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి..

పవర్లూమ్ కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి ,ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి

   రాష్ట్రంలో పవర్లూమ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక కోటా ద్వారా 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య లు తెలిపారు

   శనివారం తెలంగాణ పవర్ లుం వర్కర్స్ యూనియన్ (సిఐటియు ) పద్మనగర్ ఏరియా కమిటీ సమావేశం పద్మనగర్ మార్కండేయ గుడి దగ్గర జరిగింది.ఈ సందర్భంగా సత్తయ్య రాష్ట్రవ్యాప్తంగా పవర్లూమ్ కార్మికులు లక్ష మంది పైగా ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది యజమానులు వేసిన షెడ్లలో నివాసం ఉంటూ రోజుకు 14 గంటలు పని చేస్తున్నారు. చేసిన కష్టానికి తగిన ఫలితం రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. అప్పుల బాధలతో అనేక ఇబ్బందులు పడుతున్న పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం కార్మికుడిని యజమాని చేయాలని వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రకటించి సిరిసిల్లకే పరిమితం చేసిందని, ఆ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖలకు ఉపయోగపడే వస్త్రాలన్నింటిని రాష్ట్రంలో కార్మికుల చేత చేయించి ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రయత్నం చేయాలని కోరారు. టెక్స్టైల్ అఫరల్ పార్క్ నిర్మాణం వెంటనే పూర్తిచేసి ఉపాధి కల్పించాలని, పవర్లూమ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ ఎస్ ఐ పి ఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. త్రిఫ్ట్ పథకాన్ని చేనేత కార్మికుల తరహాలో పవర్లూమ్ కార్మికులకు కూడా డబుల్ డబ్బులు ఇవ్వాలని కోరారు.

   పద్మనగర్ ఏరియా అధ్యక్షుడు గంజి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి పసునూరి యోగానందం పద్మనగర్ ఏరియా కార్యదర్శి సూరపల్లి భద్రయ్య కోశాధికారి వై ఆంజనేయులు, షేక్ జానీ సురేష్ ,గంజి చంద్రయ్య, వెంకన్న, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ

HCAలో జరిగిన రూ.20 కోట్ల నిధుల గోల్ మాల్ పై ఈడీ దర్యాప్తు

మాజీ క్రికెటర్లు అయూబ్, శివలాల్ యాదవ్ ను విచారించిన ఈడీ

HCA మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జి. వినోద్ కు ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: నేడు టీఎస్ఆర్టీసీకి చెందిన 80 కొత్త బస్సులు ప్రారంభం...

హైదరాబాద్‌: నేడు టీఎస్ఆర్టీసీకి చెందిన 80 కొత్త బస్సులను ప్రారంభించనున్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ ప్రయాణికులకు నేటి నుంచి అందుబాటులోకి రానున్న 80 కొత్త బస్సులు