/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: చిక్కులు లేని భూమి హ‌క్కులు ద‌క్కాలి: భూమి చట్టాల నిపుణులు ఎం.సునీల్‌కుమార్‌ Mane Praveen
TS: చిక్కులు లేని భూమి హ‌క్కులు ద‌క్కాలి: భూమి చట్టాల నిపుణులు ఎం.సునీల్‌కుమార్‌

హైదరాబాద్: తెలంగాణా రెవెన్యూ అధికారుల సమావేశం లో భూమి సమస్యల పరిష్కార మార్గాలపై, ఆదివారం భూ చట్టాల నిపుణులు ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్ కుమార్) పాల్గొని మాట్లాడుతూ.. చిక్కులు లేని భూమి హ‌క్కులు ద‌క్కాలి అని అన్నారు.

భూమి అంటే తెలంగాణ‌.. తెలంగాణ అంటే భూమి అని ప్ర‌ధాన‌మైన భూ స‌మ‌స్య‌ను తీర్చ‌కుండా ఏది కూడా ప‌రిష్కారం కాద‌ని భూమి సునీల్ కుమార్ పేర్కొన్నారు.

ప్ర‌పంచ దేశాల‌లో భూ స‌మ‌స్య‌లు లేని దేశాలు మాత్ర‌మే అభివృద్ధి చెందుతున్న‌ట్టుగా తెలిపారు. భూ ప‌రిపాల‌న గ్రామ స్థాయిలో ఉండాల‌న్నారు. భూమి హ‌క్కుల‌కు గ్యారంటీ కూడా గ్రామ‌స్థాయి లోనే ఇవ్వాల‌న్నారు.

భూమి హ‌ద్దుల స్ప‌ష్టంగా, హ‌క్కుల క‌ల్పించే ప‌త్రాలు ప‌క్కాగా, హ‌క్కుల మార్పిడి వెంట‌నే జ‌రిగే వ్య‌వ‌స్థ ఉండాల‌న్నారు. చిక్కులు వ‌స్తే గ్రామ స్థాయిలోనే ప‌రిష్కారం కావాల‌న్నారు. 

భూమి హ‌క్కుల‌కు ప్ర‌భుత్వ‌మే గ్యారంటీ ఇవ్వాల‌న్నారు.

ద‌స్తావేజుల రిజిస్ట్రేష‌న్ కాదు.. హ‌క్కుల‌కు రిజ‌స్ట్రేష‌న్ కావాల‌న్నారు. ప‌క్క‌నే ఉన్న ఏపీలో ఈ దిశ‌గా చ‌ట్టం కూడా చేసుకున్నార‌ని భూమి సునీల్ కుమార్ గుర్తు చేశారు.

NLG: మ్యాన్ ఆఫ్ ద మిలియనియం పద్మశ్రీ కళ్యాణ సుందరం ను కలిసిన గ్రంథ పాలకుడు దుర్గాప్రసాద్

నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథపాలకుడు డాక్టర్ దుర్గాప్రసాద్.. నేడు చెన్నైలో పద్మశ్రీ అవార్డు అందుకున్న పలని కళ్యాణ సుందరం (మ్యాన్ ఆఫ్ మిలియనియం) ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. కళ్యాణ సుందరం 36 సంవత్సరాలు గ్రంథ పాలకులుగా గ్రంధాలయ సమాజ సేవ చేసి పదవి విరమణ పొందారు. వారు పదవీ విరమణ తరువాత వచ్చిన 18 లక్షల రూపాయలను అనాధాశ్రమాలకు, పేదల విద్య కోసం దానం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇతను చేసిన సేవకు గాను మ్యాన్ ఆఫ్ మిలీనియం అవార్డును కళ్యాణ సుందరం కు బహుకరించింది. అప్పటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ తను చేసిన సేవకు మన దేశానికి వచ్చి క్యాష్ 30 కోట్ల రూపాయలను బహూకరించారు. కళ్యాణ సుందరం గారి అమ్మ చెప్పినట్లుగా ఎప్పుడు సహాయం చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సమాచార మరియు విద్యకు సేవలో పాటుపడాలని చెప్పిన నినాదంతో వారు సర్వీస్ లో ఉన్నప్పుడు మరియు రిటైర్ అయిన తర్వాత కూడా శాలరీని పేదలకు అనాధాశ్రమాలకు దానం చేశారు.

అమెరికా ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం కూడా దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అనాధాశ్రమాలయాలకు వారు దానం చేశారు. ఇతని గ్రంథాలయ సేవలను చూసి భారత ప్రభుత్వం జనవరి 2023 లో పద్మశ్రీ అవార్డును బహుకరించింది. అవార్డును ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది. ఇప్పుడు కళ్యాణ సుందరం వయస్సు 85, యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా అవుట్ స్టాండింగ్ పర్సన్స్ ని 17 మందిని ఎంపిక చేయగా ఆసియా ఖండం నుంచి ఎంపికైన ఏకైక సమాజ సేవ సమాచార సేవకుడు కల్యాణ సుందరం అని తెలిపారు.

కళ్యాణ సుందరం జీవిత చరిత్రను తెలుగులో రాస్తున్నానని కళ్యాణ సుందరంను వ్యక్తిగతంగా కలిసి.. బాల్యం, తన విద్య, గ్రంథాలయ సేవ, సమాజ సేవ లను తెలుసుకున్నానని, వారిని కలవడం ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందానని, వారి యొక్క జీవితం భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక సందేశం. ఒక సందేశాత్మకంగా సమాజంలో ఒకరికొకరికి సహాయంలో తోడ్పడటంలో విద్యాభివృద్ధిలో వారి సేవ ఎంతగానో ఉపయోగపడిందని డాక్టర్ ఆనంద్ దుర్గాప్రసాద్ తెలిపారు.

TS: ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం!

100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం, మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఓ ఆర్టీసీ కండక్టర్..

మహబూబ్ నగర్ నుండి తాండూరు వెళ్తున్న టీఎస్34టీఏ5189 బస్సులో కండక్టర్ గండీడ్, జానంపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టిక్కెట్లు ప్రింట్ చేస్తున్నట్లుగా పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

TS: జేఎన్‌1తో ఆందోళన అక్కర్లేదు: డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ లోని కొత్త వేరియంట్ జేఎన్‌.1 అంత ప్రమాదకరమేమీ కాదని, ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) హాస్పిటల్స్‌ ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్‌ డి. నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.

2020లో ప్రపంచాన్నే స్తంభింపజేసి, 2021లో డెల్టా రూపంలో పెద్దసంఖ్యలో ప్రాణాలు హరించిన కొవిడ్‌.. 2022 తొలినాళ్లలో ఒమిక్రాన్‌గా విరుచుకుపడింది. దాదాపు 18 నెలలుగా మహమ్మారి జాడ కనిపించలేదు. మాస్కులు వదిలేసి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఉన్నట్టుండి ‘జేఎన్‌1’ రూపంలో కరోనా మళ్లీ ప్రజా జీవితంలోకి వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజల్లో కోవిడ్‌ కొత్త వేరియంట్ పై ఎన్నో భయాలు, ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘జేఎన్‌.1’ స్వభావం, దాని వ్యాప్తి, తీవ్రత, ప్రమాదమా? తదితర అంశాలపై డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి పలు అంశాలు వెల్లడించారు.

జే ఎన్ 1 కొత్త వైరస్‌ కాదు, కానీ కొత్త వేరియంట్‌. కరోనా చైనాలో పుట్టినప్పటి నుంచి అనేక రూపాలు మార్చింది. అందులో ఒకటి ‘ఎక్స్‌బీబీ’. దాని ఉత్పరివర్తనమే ‘జేఎన్‌1’. జన్యు క్రమ విశ్లేషణ చేయగా.. స్పైక్‌ ప్రొటీన్‌లో వృద్ధి చెందినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరప్‌లోని లక్సంబర్గ్‌ అనే చిన్న దేశంలో మొదట బయటపడింది. ఆ తర్వాత యూరప్‌లోని ఇతర దేశాల్లోనూ అక్కడక్కడా కనిపించింది. కానీ అంత ఉద్ధృతంగా వ్యాప్తి చెందలేదు. ఒకవేళ అంటువ్యాధి అయి ఉంటే.. ఈపాటికి అంతటా వ్యాప్తి చెందేది. డెల్టా, ఒమిక్రాన్‌లు నెలరోజుల్లోనే అంటువ్యాధులు గా మారాయి.

ప్రపంచ దేశాల్లో ఎక్కడా జేఎన్‌1ను ఉపద్రవంగా ప్రకటించలేదు. ప్రస్తుతం సింగపూర్‌లో 56వేల కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్‌ కేసులు హాంగ్‌కాంగ్‌, చైనా వంటి దేశాల్లో కొంచం ఎక్కువగా ఉన్నాయి. దీని వ్యాప్తి, లక్షణాలు, పర్యవసనాలను వైద్యనిపుణులు సునిశితంగా గమనిస్తున్నారు. కేరళలో నమోదైన కేసుల నమూనాలను విశ్లేషిస్తే స్వల్ప సమస్యలు మాత్రమే ఉత్పన్నమవుతున్నాయని తెలుస్తోంది.

TS: సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించిన ఉస్మానియా యూనివర్సిటీ మలిదశ ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ మలిదశ ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్ తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో 2010లో రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో బుల్లెట్ గాయాలపాలైన రేష్మ హుస్సేన్ (బుల్లెట్ రాణి) ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినారు. ఆ నిర్ణయాన్ని ఉస్మానియా మలిదశ ఉద్యమకారినిగా ఆమె స్వాగతిస్తున్నట్లు, యువత పెడదారి పడకుండా పాఠశాల, కళాశాల మరియు సమాజంలో డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని.. యాంటీ డ్రగ్స్ టీం గా కొంతమంది యువకులు స్వచ్ఛందంగా పనిచేసి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని, యూత్ నిర్దిష్ట లక్ష్యం ఏర్పరచుకొని సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

TS: ప్రజాపాలన పేరుతో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబర్‌ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశమయ్యారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన కార్యక్రమాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. ప్రజాపాలన పేరుతో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు.

TS: కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు.. 1,322 శాంపిల్స్‌లో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ.. రాష్ట్రంలో 38కి చేరిన కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య.

TS: తెలంగాణ ఏసీబీ డీజీ గా సివి ఆనంద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ గా ఐపీఎస్ అధికారి సీవి ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీ గా పని చేసిన ఆయన ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీ గా నియమించింది.

ఈ రోజు ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఏసీబీ కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు. రెండేళ్ల పాటు హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా తాను కొనసాగానని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలను పటిష్ఠంగా ఉంచానని పేర్కొన్నారు. అది తనకు వృత్తిపరంగా చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చినప్పటికీ, ఎక్కడా మత సామరస్యం దెబ్బ తినకుండా ప్రశాంతంగా పండుగలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

TS: విద్యార్థులకు ముఖ్య గమనిక.. గురుకులాల లో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ద్వారా 2023 - 24 విద్యా సంవత్సరానికి TSWREIS, TTWREIS, MJPTBCWREIS,TREIS గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాల కొరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఇంగ్లీష్ మీడియం లో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో ప్రవేశం కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని గురుకులాల సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు తమ స్టడీ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుందని, 6 జనవరి 2024 లోపు http://tswreis.ac.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు ఫీజు రూ

100/- ఉన్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష 11.02.2024 నాడు ఉదయం 11.00 - 1.00 వరకు ఉంటుందని చెప్పారు.

ఈ సదవకాశాన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంత 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు వినియోగించుకోవాలని, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు గురుకుల పాఠశాలలో చేర్పించడానికి, ప్రవేశ పరీక్ష కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం PPL తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి.. విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.

TS: కఠోర శ్రమ చేస్తే విజయం తథ్యం.. విద్యార్థులకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం

జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని కఠోర శ్రమ చేస్తే విజయం తథ్యమని విద్యార్థులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. నిన్న బిఆర్ అంబేద్కర్ కాలేజీ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా కుటుంబంలో నాకంటే ముందు ఎవరూ రాజకీయాల్లో లేరు, 2006లో ఇండిపెండెంట్ గా నిలబడి ప్రజలచే జెడ్పిటిసి గా ఎన్నికయ్యాను. ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాబడే అన్ని వేదికలలో పనిచేశాను. ఇప్పుడు ప్రజలు ఆదరించడంతో సీఎంగా మీ ముందు నిల్చున్నాను అని అన్నారు.