/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: విద్యార్థులకు ముఖ్య గమనిక.. గురుకులాల లో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానం Mane Praveen
TS: విద్యార్థులకు ముఖ్య గమనిక.. గురుకులాల లో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ద్వారా 2023 - 24 విద్యా సంవత్సరానికి TSWREIS, TTWREIS, MJPTBCWREIS,TREIS గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాల కొరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఇంగ్లీష్ మీడియం లో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలో ప్రవేశం కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని గురుకులాల సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు తమ స్టడీ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుందని, 6 జనవరి 2024 లోపు http://tswreis.ac.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు ఫీజు రూ

100/- ఉన్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష 11.02.2024 నాడు ఉదయం 11.00 - 1.00 వరకు ఉంటుందని చెప్పారు.

ఈ సదవకాశాన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంత 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు వినియోగించుకోవాలని, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు గురుకుల పాఠశాలలో చేర్పించడానికి, ప్రవేశ పరీక్ష కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం PPL తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి.. విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.

TS: కఠోర శ్రమ చేస్తే విజయం తథ్యం.. విద్యార్థులకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం

జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని కఠోర శ్రమ చేస్తే విజయం తథ్యమని విద్యార్థులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. నిన్న బిఆర్ అంబేద్కర్ కాలేజీ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా కుటుంబంలో నాకంటే ముందు ఎవరూ రాజకీయాల్లో లేరు, 2006లో ఇండిపెండెంట్ గా నిలబడి ప్రజలచే జెడ్పిటిసి గా ఎన్నికయ్యాను. ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాబడే అన్ని వేదికలలో పనిచేశాను. ఇప్పుడు ప్రజలు ఆదరించడంతో సీఎంగా మీ ముందు నిల్చున్నాను అని అన్నారు.

TS: రేపు తెలంగాణ కాంగ్రెస్‌ కీలక భేటీ

టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 23న గాంధీభవన్‌ లో జరగనుంది.

సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.

ఈనెల 28న జరగనున్న కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం, నాగ్‌పూర్‌ సభకు జన సమీకరణ, తదితర అంశాలపై చర్చిస్తారు. 

పార్లమెంట్‌ ఎన్నికలపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

NLG: ఎన్జీ కళాశాలలో నేషనల్ మ్యాథమేటిక్స్ డే సెలబ్రేషన్స్

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ 136వ జయంతి వేడుక ను కళాశాల గణిత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఉపేందర్ తెలిపారు. 

ఈ సందర్భంగా గణిత శాస్త్ర విభాగాధిపతి నక్క నరసింహ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రామానుజన్ తమిళనాడులో పుట్టి, అతి పేద స్థాయి నుంచి వారు భారతదేశం గర్వపడేలా గణిత మేధావిగా ఎంతో కృషి చేశారని, తన జయంతి ని భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 రోజున నిర్వహించుకుంటున్నామని, వారు గణితశాస్త్రంలో ముఖ్యంగా సంఖ్యా శాస్త్రము, గణిత విశ్లేషణ, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేష కృషి చేశారని, ముఖ్యంగా రామానుజన్ నంబర్ 1729 ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, ప్రస్తుతం మానవ సమాజంలో గణితం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందని అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా వీటి పైన ప్రత్యేకంగా ప్రశ్నలు వస్తాయని వారు చేసినటువంటి గణిత శాస్త్ర అభివృద్ధికి చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని, కంపిటేషనల్ మ్యాథమెటిక్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంకా ఎన్నో పరిశోధనలు కొనసాగించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ మునీర్, అధ్యాపకులు యాదగిరి రెడ్డి, దీపిక , జ్యోత్స్న, దుర్గాప్రసాద్, మధుకర్, కనకయ్య, రజిని, బాల, సిద్దేశ్ ,వెంకటేష్, కృష్ణ, సరిత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: ఢిల్లీ లో జరిగే ఎన్ఎస్ఎస్ రిపబ్లిక్ డే పరేడ్ కు ఎన్నికైన నల్లగొండ విద్యార్థిని

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎన్ఎస్ఎస్ యూనిట్- 3 వాలంటీర్ అయిన షేక్ షేన్ను రిపబ్లిక్ డే పరేడ్ కు ఎంపికైంది. జనవరి 1 నుండి 31 వరకు ఢిల్లీ లో జరిగే ఎన్ఎస్ఎస్ రిపబ్లిక్ డే పరేడ్ లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా విద్యార్థిని షేన్ను ను ప్రిన్సిపాల్ ఘన శ్యామ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జ్యోతి, లైబ్రేరియన్ రాజారాం, సిబ్బంది నరేష్, శైలజ, వనజ, సరిత అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Mane Praveen

నల్లగొండ జిల్లా : మునుగోడు మండలం, చీకటి మామిడి గ్రామంలో స్వచ్చందంగా బెల్టుషాపులు మూసి వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్థులు. గ్రామాల్లో బెల్టుషాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారన

NLG: చీకటి మామిడి గ్రామంలో బెల్ట్ షాపులు మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్తులు
నల్లగొండ జిల్లా : మునుగోడు మండలం, చీకటి మామిడి గ్రామంలో స్వచ్చందంగా బెల్టుషాపులు మూసి వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్థులు. గ్రామాల్లో బెల్టుషాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని మహిళల ఆవేదన. •:బెల్టుషాపుల నియంత్రణపై ప్రభుత్వ నిర్ణయానికి ముందే కృషి చేసిన *మునుగోడు శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు. • గ్రామంలో బెల్ట్ షాపులు స్వచ్ఛందగా నిలిపివేత పై హర్షం వ్యక్తం చేస్తూ మహిళల ర్యాలీ.
NLG: మృత కుటుంబానికి పగడాల ముత్తు అండ.. పదివేలు ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా,మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన తుప్పరి మహాలక్ష్మి (అమ్ములు) (14) తీవ్రమైన డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచింది. ఆ చిన్నారి మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎదిగిన కూతురి మరణం గ్రామ ప్రజల చేత కూడా కంటతడి పెట్టించింది. తండ్రి తుప్పరి సత్తయ్య వికలాంగుడు కావడంతో ఆర్థిక సమస్యలు ఉన్నట్లు సహచరుల ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు.. బాధిత కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించుటకు గాను రూ. 10,000/- పదివేలు మృతురాలి తండ్రికి అందించారు. భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉన్నా తనను సంప్రదించాలని కోరారు. దిక్కు తోచని వారి కుటుంబానికి బాసటగా నిలిచిన పగడాల ముత్తు కు ఆ గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. ఫౌండేషన్ వైస్ ఛైర్మెన్ మాడ్గుల శిరీష, ట్రెజరీ పగడాల కళ్యాణ్, మొగిలి కిషన్, ఉప సర్పంచ్ శ్రీను, పాపయ్య, జాల గణేష్, తదితరులు ఉన్నారు.

TS: ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి తో పాల్గొన్న గున్న రాజేందర్ రెడ్డి

ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి తో పాల్గొన్న గున్న రాజేందర్ రెడ్డి

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ  

సంస్థలకు దక్కిన గొప్ప గౌరవం అని తెలిపిన

 సంస్థల రాష్ట్ర క్రీడల ప్రధాన కార్యదర్శి

బొమ్మపాల గిరిబాబు

తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము తో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి సతి సమేతంగా ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని రాష్ట్రపతితో పంచుకునే అరుదైన గౌరవం లభించడం ఎంతో గొప్ప విషయమని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల

గిరిబాబు తెలిపారు. 

గత కొన్ని దశాబ్దాలుగా గాంధీ గ్లోబల్ సంస్థలు స్వచ్ఛందంగా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నాయని వారు తెలిపారు.

TS: సంద శ్రీదేవికి బిజినెస్ మేనేజ్మెంట్ లో డాక్టరేట్

నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం, ఇనుపాముల గ్రామానికి చెందిన సంద శ్రీదేవి పీహెచ్డీ పట్టా పొందారు. పీజీ లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొ. సంపత్ కుమార్ పర్యవేక్షణలో బిజినెస్ మేనేజ్మెంట్ లో "Barriers to career Advancement for women in IT industres" అనే అంశంలో పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకు సంద శ్రీదేవికి పీహెచ్డీ అవార్డును ప్రధానం చేశారు.

అంతేకాకుండా సంద శ్రీదేవి తన పీహెచ్డీ పరిశోధనలో భాగంగా.. దుబాయ్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు సంద శ్రీదేవిని అభినందిస్తున్నారు.

ఈ సందర్భంగా సంద శ్రీదేవి మాట్లాడుతూ.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి, ఉన్నత ఆశయాలను ఏర్పరచుకొని.. లక్ష్యం కోసం అనునిత్యం కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని అన్నారు. తాను రాసిన పరిశోధన గ్రంథాన్ని యుక్త వయసులోనే ప్రమాదంలో చనిపోయిన తన అన్న జ్ఞాపకార్ధంగా సంద నాగార్జున కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.

ఒకే కుటుంబంలో ఇద్దరికీ పిహెచ్డి

పేదరికంలో పుట్టి పెరిగిన ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు పిహెచ్డి పట్టా పొందడం విశేషం. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల మారుమూల గ్రామంలోని సంద బాలయ్య, తేరోజమ్మ దంపతుల 5వ కూతురు సంద శ్రీదేవి.. ఆమె అక్క సంద రజిత ను ఆదర్శంగా తీసుకొని పిహెచ్డి పొందారు.

సంద బాలయ్య, తేరోజమ్మ దంపతుల రెండవ కూతురు సంద రజిత 11 సంవత్సరాల క్రితమే ఎర్త్ సైన్స్ లో పిహెచ్డి పట్టా, అదేవిధంగా 6 సంవత్సరాల క్రితం పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ పొందారు. అంతేకాకుండా ఈమె తన పోస్ట్ పిహెచ్డి పరిశోధనలో భాగంగా జపాన్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో ఉపన్యాసించారు.

మారుమూల గ్రామంలో పేదరికంలో పుట్టి పెరిగి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో చదివిన వారు.. ఉన్నతమైన ఆశయం కోసం, అత్యున్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో, కష్టపడి చదివి పీహెచ్డీ డాక్టరేట్ పురస్కారాన్ని పొందారు. ఈ సందర్భంగా వారు ఉన్నత లక్ష్యాలను చేరాలనుకునే ఎందరో పేదింటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

YBD: ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన నిందితుడు


యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదాద్రి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల తో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మోసం.. వివరాలకు వెళితే...

యాదాద్రి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన వినయ్ కృష్ణ రెడ్డి పేరిట ఆర్డర్ కాపీలను తయారుచేసిన ఆలేటి నవీన్.

నకిలీ ఆర్డర్ కాపీలను కొంతమందికి ఇచ్చిన మోసగాడు.

మోట కొండూరు మండలం వర్టూర్ గ్రామానికి చెందిన నిందితుడు ఆలేటి నవీన్.

తండ్రి ఆలేటి స్వామి వృత్తి రీత్యా అడ్డగుడూర్ ఎంపిడివో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు కొనసాగిస్తున్నాడు.

నిందితుడు పదిమంది భాదితుల నుండి దాదాపు 15 లక్షల నుండి 20లక్షలు వరకు వసూలు చేశాడు.

కలెక్టర్ ఆఫీసులలో అసిస్టెంట్ ఉద్యోగం, విద్యా శాఖలో మూడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన నిందితుడు నవీన్.

గతంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన టీ.వినయ్ కృష్ణ రెడ్డి మరియు గతంలో పనిచేసిన జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని.. సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఆర్డర్ కాపీని సైతం బాధితులకు ఇచ్చాడు.

తీరా అవి నకిలీవని తెలియడంతో బాధితులు లబోదిబోమంటూ భువనగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుడు పుల్లెల ప్రవీణ్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్న పోలీసులు.