/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: పుల్లెంల గ్రామంలో "వికసిత్ భారత్ సంకల్ప యాత్ర" కార్యక్రమం Mane Praveen
NLG: పుల్లెంల గ్రామంలో "వికసిత్ భారత్ సంకల్ప యాత్ర" కార్యక్రమం

నల్లగొండ జిల్లా:

చండూర్ మండలం పుల్లెంల  గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన "వికసిత్ భారత్ సంకల్ప యాత్ర" కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది . ఈ సందర్బంగా అధికారులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి గ్రామస్థులకు తెలియజేసి, ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉన్నచో సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

NLG: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

నల్లగొండ: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కంచి మధు, కత్తుల కోటి, చింతపల్లి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

TS: తెలంగాణ అప్పులు రూ. 6,71,757 కోట్లు...

శ్వేత పత్రం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రస్తుతం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నట్టు పేర్కొంది. తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 72,658 కోట్లు ఉండగా, పదేళ్లలో సగటున 24.5 శాతం పెరిగినట్లు శ్వేత పత్రం ద్వారా తెలిపింది. రెవిన్యూ రాబడి ద్వారా రుణాల చెల్లింపు భారం 34 శాతం, ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కొరకు 35 శాతం కేటాయించినట్లు పేర్కొంది.

TS: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశ్రుతి

యాదాద్రి భువనగిరి జిల్లా:

• రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశ్రుతి

• హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాలికి ఎగిరిపడ్డ పోలీసులు.

• ఈ ఘటనలో ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరగగా, ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలు

యాదాద్రి జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

యాదాద్రి: ఐదు రోజుల పర్యటనలో భాగంగా నేడు రాష్ట్రపతి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి లో పర్యటించనున్నారు. అక్కడి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత, స్పిన్నింగ్ యూనిట్‌ను సందర్శించనున్నారు. దీనితోపాటు అక్కడే ఏర్పాటుచేసిన థీమ్ పెవిలియన్ పార్క్ ను సందర్శించనున్నారు.

రాష్ట్రపతితో కలిసి కేవలం ఆరుగురికి మాత్రమే సభావేదికపై ఆహ్వానం ఉంటుంది. గవర్నర్ తమిళి సై, రాష్ట్ర మంత్రులు సీతక్క ,తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరు అధికారులకు అవకాశం ఉండనుంది.

భూ దానోద్యమకారులైన ఆచార్య వినోభాభవే, భూదాత వెదిరే రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేయనున్నారు. చేనేత కార్మికులతో రాష్ట్రపతి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోనున్నారు. చేనేత మాస్టర్ వీవర్ శివ కుమార్‌ తోను ప్రత్యేక సమావేశం కానున్నారు. తర్వాత మగ్గాలు పరిశీలించి 350 ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మొత్తంగా సుమారు 45 నిమిషాలపాటు పోచంపల్లిలో పర్యటించనున్నారు..

TS: 20 మంది ఐ.పీ.ఎస్‌ ల బదిలీ

తెలంగాణ డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు.. రోడ్‌సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా అంజనీకుమార్.. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. రైల్వే డీజీగా మహేష్ భగవత్‌.. సీఐడీ చీఫ్‌గా శిఖాగోయల్.. జైళ్లశాఖ డీజీగా సౌమ్యామిశ్రా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి.. సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు.. సెంట్రల్‌జోన్‌ డీసీపీగా శరత్‌చంద్ర.. కార్‌ హెడ్‌క్వార్టర్స్‌ జాయింట్‌ సీపీగా సత్యనారాయణ.. అప్పా డైరెక్టర్‌గా అభిలాష్.. మల్టీ జోన్‌ ఐజీగా తరుణ్‌జోషి.. ప్రొబేషన్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి.. హోంగార్డ్స్‌ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర.. పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్ ఎండీగా రాజీవ్‌ రతన్.. టీఎస్‌పీఎస్సీ డీజీగా అనిల్‌ కుమార్.. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్.. ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్‌ రెడ్డి.. పోలీస్ హౌసింగ్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్‌గా ఎం.రమేష్.. ఎం.శ్రీనివాసులును డీజీపీ ఆఫీస్‌కి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

TS: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఓయూ ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. మైనారిటీ మహిళా నాయకురాలు, ఓయూ మలిదశ ఉద్యమ నాయకురాలు డా.రేష్మా హుస్సేన్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓయూ ఉద్యమ నాయకులు శంకర్, ఈశ్వర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం లో విఫలమైందని విమర్శించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ కారులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలపడం చాలా ఆనందదాయకమన్నారు. తగిన అర్హత కలిగిన ఉద్యమ కారులకు జాబ్ లలో రిజర్వేషన్, నామినేటెడ్ పదవులు కూడా కల్పించాలి అని వారు కోరారు.

TS: న్యూ ఇయర్‌ వేడుకలు రాత్రి ఒంటి గంట వరకే !

న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు.

రాత్రి ఒంటి గంటలోపే ముగించాలని కోరారు. 

ఈవెంట్‌ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్‌ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు. 

TS: 15 లక్షల ‘గృహ లక్ష్మి’ దరఖాస్తులు రద్దు

HYD: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 లక్షల ‘గృహ లక్ష్మి’ దరఖాస్తులను ప్రభుత్వం రద్దు చేసింది.

గృహ నిర్మాణాల కోసం రూ .3 ల‌క్ష‌లు ఇచ్చేందుకు ఈ ప‌థ‌కాన్ని ఎన్నిక‌ల ముందు అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తులు వెల్లువెత్తాయి.

తాజాగా గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాం లో సేకరించిన 15లక్షల పైచిలుకు దరఖాస్తులను పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది.వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని భావిస్తోంది. ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో 12 లక్షలు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు.

ప్ర‌తి గ్రామంలోనూ గ్రామ స‌భ‌లు నిర్వ‌హించి అక్క‌డే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. త్వ‌ర‌లోనే గ్రామ స‌భ‌ల తేదీల‌ను ప్ర‌క‌టించేందుకు కసరత్తు చేయనుంది.

NLG: గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ: ఎన్జీ కళాశాల నందు తెలుగు -01, బిబిఎ (ఈ-కామర్స్)- 01 ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల కొరకు.. పీజీ లో 55 % మార్కులు ఉన్నవారు, ఎస్సీ ఎస్టీ 50% మార్కులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు. నెట్/సెట్/పిహెచ్డి, బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. అభ్యర్ధులు తమ దరఖాస్తు ఫారాలను కళాశాలలో అందజేయడానికి చివరి తేది ఈ నెల 22. ఇంటర్వ్యూ ఈనెల 23న ఉంటుందని చెప్పారు. దరఖాస్తుకు సంబంధిత విద్యార్హత ల సర్టిఫికెట్ చేయాలని తెలిపారు.