/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz పది రోజుల పాటు ‘వైకుంఠ ద్వార దర్శనం' Mane Praveen
పది రోజుల పాటు ‘వైకుంఠ ద్వార దర్శనం'

తిరుమల: శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు ‘వైకుంఠ ద్వార దర్శనం’ ప్రారంభమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం ప్రకటించింది. ఈ సమయంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం టికెట్లు విడుదుల చేసింది.

గత కొన్నేళ్ల మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ఆన్‌లైన్ బుకింగ్ కోసం ప్రోటోకాల్ అమలులో ఉంటుంది. పరిమిత స్థాయిలో మాత్రమే దర్శనం అందించబడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది.

TS: కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి

కరీంనగర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

జిల్లాలోని శంకరపట్నం మండలంలోని తాడికల్లు సమీపంలో శని వారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్ప్రత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

TS: కేటీఆర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్

తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి దీటుగా ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 55 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రం వద్దనే తెలంగాణ వచ్చిందన్నారు. సంపదతో కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే.. టిఆర్ఎస్ నేతలు అప్పుల పాలు చేశారని ఆరోపించారు.

TS: వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వర రావు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు, శుక్రవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు.

TS: మాజీ డి.ఎస్.పి నళిని ఉద్యోగం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగం లోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

మాజీ డిఎస్పి నళిని

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

TS: వంటగ్యాస్ e-KYC పై కీలక ప్రకటన

హైదరాబాద్: వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే e- kyc కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ స్పష్టం చేసింది. డెలివరీ బాయ్స్ తమ వద్ద ఉన్న యాప్ ద్వారా e- కేవైసి పూర్తి చేయొచ్చని తెలిపింది. గ్యాస్ e-kyc కి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేసింది.

ఇకపై భారత్ పర్యాటకులు వీసా లేకుండానే ఇరాన్ లో పర్యటించవచ్చు!

భారతీయ పర్యాటకులు ఇకపై వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

భారత్ నుండి వచ్చే పర్యాటకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ క్యాబినెట్ నిర్ణయించింది.

TS: సీఎం కాన్వాయ్ తో ప్రజలకు ఇబ్బంది రానివ్వొద్దు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్: సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు.

సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించి, తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బంది కలవకుండా ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ పోలీస్ అధికారులకు సూచించారు.

ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదని సీఎం రేవంత్ అన్నారు.

TS: ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియామకం

తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ లుగా నియమించింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ లను ప్రభుత్వ విప్ లుగా నియమించింది.

TS: కొత్తగా ఇల్లు నిర్మించుకునే పేదలకు ఐదు లక్షలు, ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు: గవర్నర్

తెలంగాణలో కొత్త ఇల్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని గవర్నర్ తమిళసై తెలిపారు. అదేవిధంగా కొత్తగా ఇల్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. అసైన్డు, పోడు భూములకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని గవర్నర్ తెలిపారు.

కాలేశ్వరం, మేడిగడ్డ, అన్నారం మ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని గవర్నర్ తమిళసై అన్నారు.

కృష్ణా జలాలలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా సాధనకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం, గౌరవభృతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.