/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz ఆధార్ సేవలకు అధికంగా వసూలు చేస్తే రూ.50,000/- జరిమానా Mane Praveen
ఆధార్ సేవలకు అధికంగా వసూలు చేస్తే రూ.50,000/- జరిమానా

ఆధార్ సేవలకు సంబంధించి కేంద్రం మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ సేవల కోసం అధిక రుసుము వసూలు చేస్తే.. ఆపరేటర్ ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్టార్ కు 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో వెల్లడించారు. ఈ అంశంపై UIDAI కు మెయిల్ లేదా 1947 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

NLG: అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా మండల పూజ మహోత్సవం

నల్గొండ: కలెక్టర్ కార్యాలయం సమీపంలోని శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం మండల పూజా మహోత్సవ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు ఘనంగా నిర్వహించారు. మండల పూజలో  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, డి సి సి బీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పూజ మహోత్సవానికి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారి భక్తిని సాటుకున్నారు. కంజర శ్రీను ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించి ఆటపాటలతో స్వాములను  భక్తి గేయాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించడంతో దేవాలయం తో పాటు పరిసర ప్రాంతమంతా మార్మోగింది. స్వాములకు భక్తులకు కందుల బాలరాజు, రమణ లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా స్వామివారి దండలు భక్తుల స్వాముల మధ్య వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో 20 రూపాయల కాగితాలతో తయారుచేసిన స్వామి వారి మాల కు పలువురు భక్తులు పోటీ పడగా స్థానిక దినపత్రిక ఫోటోగ్రాఫర్ కారింగు వెంకన్న గౌడ్ 15వేల రూపాయల వేలం పాటతో మాలను దక్కించుకున్నారు. మండల పూజ కార్యక్రమాన్ని కోమటిరెడ్డి పృథ్వీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలే జయకుమార్, నాగేశ్వరరావు, ఆలయ గురుస్వామి రాంపాటి శ్రీనివాస్, ఆలయ అర్చకులు శ్రవణ్ కుమార్ శర్మ, సురేష్ శర్మ, బచ్చు మదన్ మోహన్, అయ్యప్ప స్వాములు, భక్తులు  తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 రీ-షెడ్యూలు

హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ తొలుత 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని భావించింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది.

నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్‌ అయ్యాయి. అయితే, కొత్త బోర్డు ఏర్పాటు తరువాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సినవి మరోసారి రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరకు రీషెడ్యూల్‌ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తదుపరి ఖాళీ తేదీలు, పరీక్ష కేంద్రాల అందుబాటు తదితర సమాచారం మేరకు కమిషన్‌ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది.

NLG: కార్మికులకు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం అమలు చేయాలి: పల్లా దేవేందర్ రెడ్డి


నల్లగొండ: గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో జరిగిన ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బెరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో చేర్చిన విధంగా అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, కనీస వేతన చట్టాలు సక్రమంగా అమలు చేయాలని, శ్రమ దోపిడీని అరికట్టాలని రాష్ట్ర నూతన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని PF, ESI సక్రమంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అధ్యక్షత వహించగా జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎండి సయ్యద్, కె ఎస్ రెడ్డి, నూనె వెంకటేశ్వర్లు , దోటి వెంకన్న, పానేమ్ వెంకటరావు, దోనకొండ వెంకటేశ్వర్లు బరిగల వెంకటేష్, విశ్వనాధుల లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

NLG: చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలిశాల రవి ప్రసాద్ జన్మదిన వేడుకలు

నల్లగొండ: ఈరోజు ఉదయం 7 గంటలకు స్థానిక మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో వై ఆర్ పి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిషాల రవి ప్రసాద్ జన్మదిన వేడుకల్ని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుల మధ్యన క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఆర్పి ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ యామా దయాకర్ పాల్గొని క్రీడాకారులకు T.షర్ట్స్, ఫ్రూట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అందించడం జరిగింది.

అనంతరం క్రీడాకారుల మధ్యన కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వై ఆర్ పి ఫౌండేషన్ అధిపతి ఎలిశాల రవి ప్రసాద్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, బీద విద్యార్థులకు కొన్ని లక్షల ఆర్థిక సహాయ సహకారాలు నిరంతరం అందిస్తూ వారి ఉన్నతికి సమాజ శ్రేయస్సు కు ఎంతో పాటు పడుతున్నారని వారి సేవలను కొనియాడారు.

బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. వై ఆర్ పి ఫౌండేషన్ ద్వారా రవి ప్రసాద్ పర్యావరణ పరిరక్షణకు, క్రీడాకారుల అభ్యున్నతికి, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ తెలంగాణ అధ్యక్షునిగా దేవాలయాల అభివృద్ధికి దైవ కార్యక్రమాల నిర్వహణకు ఎంతో చేయూత నివ్వడమే కాకుండా,విద్యావేత్తగా విద్యా దాతగా ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు తన ఆపన్న హస్తాన్ని, ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నతమైన విద్యావంతులను తయారు చేస్తూ సమాజానికి అందిస్తున్నాడని వారి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని

కొనియాడుతూ, నిజమైన శ్రీమంతుడు ఎలిషాల రవి ప్రసాద్ అని విద్యార్థులకు తెలియజేశారు.

ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ మాట్లాడుతూ వై ఆర్ పి ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఉమ్మడినల్లగొండ జిల్లాలో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కత్తుల హరి, బాగిడి అర్జున్, జాకటి బాలరాజు, అప్పలలింగయ్య, బొమ్మ పాల శంకర్ , మరియు సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాచూరి వెంకట సాయి, బెల్లి రాజు, కొక్కు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

TS: ధరణి పోర్టల్ పై నేడు సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రెండో ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సిఎం రేవంత్ రెడ్డి.. బాధ్యతలు తీసు కున్న మొదటి రోజు నుండి వరుసగా అధికారులతో సమీక్షలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్, టీఎస్పీఎస్సీ, రైతు బంధు అంశాల పై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి..తాజాగా సమస్యల నిలయంగా మారిన ధరణి పోర్టల్‌పై ఫోకస్ పెట్టారు.

కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహ్మతా జ్యోతి బా పూలే భవన్ లో నిర్వహిస్తోన్న ప్రజా దర్బార్‌ (ప్రజావాణి) లో సైతం ఎక్కువగా ధరణి పోర్టల్‌పైనే ఫిర్యాదులు రావడంతో రేవంత్ దీనిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ రోజు మధ్నాహ్నం సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్‌ పై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రెవిన్యూ మంత్రి పొంగులేటి, సంబంధిత శాఖ అధికారులు హాజరుకానున్నారు. అయితే, భూముల డిజిటలైజేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ సమస్యల నిలయంగా మారిన విషయం తెలిసిందే.

ధరణి పోర్టల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ధరణి పోర్టల్‌తో కొంత మంది బీఆర్ఎస్ నేతలు అధికారులతో కుమ్మక్కై అసైన్డ్ ల్యాండ్స్‌ ను, ఇతర ప్రభుత్వ భూములను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కబ్జా చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి దాని స్థానంలో కొత్త విధానం తీసుకువస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో రావడంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమస్యల కుప్పగా మారిన ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీ వేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌పై తదుపరి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక, అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించడంతో..ఇవాళ్టి సమీక్షపై ఉత్కంఠ నెలకొంది. ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈరోజు ఉదయం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏలాంటి టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని 63,023 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 19,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హిండి ఆదాయం 3.15 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టీజేఎస్ నాయకులు

నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం ను తెలంగాణ జన సమితి నల్గొండ జిల్లా శాఖ కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, కార్యదర్శి పులి పాపయ్య విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీర నాయక్ టీజేఎస్ జిల్లా నాయకులు ఎన్ బచ్చిరెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

TS: ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేత

TS: ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా, ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, డీజీపీ హోదాలో ఉన్న అంజనీ కుమార్ కలుసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆయనతో చర్చ జరపడంతో ఈసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా ఈసీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేసింది. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆయన ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని, మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది. అయితే ఆయన ఏ హోదాలో ప్రభుత్వంలో కొనసాగుతారో వేచి చూడాల్సిందే.

NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా అన్వరుద్దీన్

నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ,ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న లు మంగళవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ ఐఎన్టియుసి అధ్యక్షుడిగా హాలియా పట్టణానికి చెందిన షేక్ అన్వరుద్దీన్ కు నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అన్వరుద్దిన్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షులు జి.సంజీవరెడ్డి, ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు రఘువీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి మరియు నియోజకవర్గ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు అని తెలిపారు. ఐఎన్టీయూసీ, కాంగ్రస్ పార్టీ బలోపేతానికి, కృషి చేస్తానని మరియు సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మోయుద్దిన్, నియోజకవర్గ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు సాజిద్, మైనార్టీ నాయకులు షకీల్ బాబా, శర్ఫుద్దిన్, అబ్దుల్ బిన్ సోహెల్ పాషా తదితరులు పాల్గొన్నారు.