/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం.. Miryala Kiran Kumar
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం..

తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి తొలి హామీ ఇచ్చారు. ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రిగా రజినీకి తొలి ఉద్యోగం ఇస్తూ.. రేవంత్ సంతకం చేయబోతున్నారు. కాంగ్రెస్ పై తనకున్న నమ్మకంతోనే రేవంత్ రెడ్డిని కలిసి తన సమస్యను చెప్పుకున్నానని రజినీ తెలిపింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందని.. తనకు ఉద్యోగం రాబోతుందని అంటోంది. అయితే తొలి ఉద్యోగం తనదే కావడంపై రజినీ సంతోషం వ్యక్తం చేసింది.

మీ చాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాలను ఆదుకోవాలని న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ డిమాండ్

మీ చాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాలను ఆదుకోవాలని న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ డిమాండ్

గత రెండు రోజులుగా కురుస్తున్న మీసాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన పంటలను రైతులను ఆదుకోవాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.

రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకొని సాగు చేసుకుంటున్న పంటలు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ తుఫాను వల్ల నేలమట్టం అయిపోయి పనికిరాకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను తాకిడికి దెబ్బతిన్న పంటలు చూసి రైతన్నలు బోరున విలవిల ఏడుస్తున్నారని ఆరుకాలం కష్టపడ్డ శ్రమంత వృధా అయిపోయిందని దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉందని వారు అన్నారు. మిరప వరి పత్తి మొత్తం నేలమట్టం అయిపోయాయని దేనికి పనికిరాకుండా అయిపోయాయని ఎకరానికి మిరప పత్తికి 50,000 వరికి 25000 చెల్లించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పంటకు తగునష్టపరిహారం చెల్లించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల్ నాయకులు కనితి భాను ప్రకాష్

 పి వై ఎల్ మండల నాయకులు చిరిగిడి నరేష్ రమేష్ రాజు ప్రతాప్ విజయ్ తదితరులు పాల్గొన్నారు

కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో సచివాలయం దగ్గర ఉద్యోగుల సంబరాలు..

హైదరాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో సచివాలయం దగ్గర ఉద్యోగుల సంబరాలు.. సెలబ్రేషన్స్ లో పాల్గొన్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్.. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది.. ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటాను.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం- కోదండరామ్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా..

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా.. నంబర్ వన్ బౌలర్‌గా ఇండియన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, రీసెంట్‌గా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో 9 వికెట్లు తీసిన రవి బిష్ణోయ్.. టీ20 నెంబర్ వన్ బ్యాట్సమెన్ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్

ఉప చట్టాన్ని రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్

ఉప చట్టాన్ని రద్దు చేయాలని

 సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు

ముసలి సతీష్

 దేశంలో ఉపా లాంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై ప్రయోగించటం దుర్మార్గపు చర్యఅని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు

ముసలి సతీష్ అన్నారు ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది పోడు భూముల గురించి వరద బాధితులకు ఇళ్ల స్థలాల గురించి పోరాటం చేసిన ప్రశ్నించిన వారిపై ఉపా కేసులు పెట్టండి ఇది చాలా దుర్మార్గం అని వాటిని వెంటనే ఎత్తివేయాలని సతీష్ అన్నారు భారతరాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు జీవించే హక్కు భావప్రకటన స్వేచ్ఛను కలిగి ఉంటారని పాలకుల తప్పిదాలను బయటపెట్టే ప్రశ్నించే గొంతులను నులిమేయాలని చూస్తున్నారని కమ్యూనిస్టు నాయకులపై కార్యకర్తలపై చట్టాన్ని ప్రయోగిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు సామాజిక ఉద్యమకారులపై తప్పుడుకేసులు బనాయించాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమించాలసి వస్తుంది ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేసే వారిపై ఇటువంటి కేసులు పెట్టడం అనేది అప్రజాస్వామీక చర్యలు అని వారు అన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాభీష్టం కొరకు పనులు చేయాలని ఆరు గ్యారెంటీ పథకాలు ఇంప్లిటేషన్ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాము

 ప్రజలు తరఫున పోరాటం చేసే నాయకులు లేకపోతే దొంగలు తయారవుతారు పోరాటం చేసే వారిపై కేసు లెత్తు వేయాలి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

రేవంత్ తో పాటు ప్రమాణస్వీకారం చేసేది ఆరుగురు మంత్రులే..

ఢిల్లీ: మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో మల్లగుల్లాలు.. వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. రేవంత్ తో పాటు ప్రమాణస్వీకారం చేసేంది ఆరుగురు మంత్రులే.. ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. స్పీకర్ ఎవరనేది తేలిన తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ..

ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పరామర్శించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పరామర్శించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి

 

హృదయ సంబంధిత అనారోగ్యం తొ గచ్చిబౌలిలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ను సూర్యాపేట శాసనసభ్యులు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగదీష్ రెడ్డి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అదే ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆత్మకూర్ ఎస్ మండలం నసీంపేట గ్రామానికి చెందిన గుండపునేని హనుమంతరావు పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.

రేపు అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి కి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి: కేటీఆర్

రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి కి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి - పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు

జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పార్ధివదేహానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్‌రెడ్డి కుటుబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు!!

ఏపీ వైపు దూసుకొస్తున్న మీచౌంగ్ తుఫాన్...

మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది..ఇప్పటికే రెండు రోజులుగా నెల్లూరు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలుపడుతున్నాయి..అనంతపురం, కడప ప్రకాశం, జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది..నిజాంపట్నం హార్బర్‌లో ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..తుఫాన్ దృష్ట్యా అధికారులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా సాయంత్రానికి తుఫానుగా బలపడి.. దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తోంది.రేపు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, పడే అవకాశం ఉంది. రానున్న రెండు, మూడు రోజులపాటు, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. మిచౌంగ్‌ తుఫాన్‌ ముప్పు భయం వెంటాడు తోంది.

గాంధీభవన్‌ టూ ఢిల్లీ వయా గచ్చిబౌలి... మీటింగ్‌ల మీద మీటింగ్‌లు..

గాంధీభవన్‌ టూ ఢిల్లీ వయా గచ్చిబౌలి... మీటింగ్‌ల మీద మీటింగ్‌లు.. మంతనాలే మంతనాలు సాగుతూనే వున్నాయి. సీఎల్పీపై సింగిల్‌ లైన్‌ స్టేట్‌మెంట్‌ వచ్చేసింది.. రేవంత్‌ రెడ్డికే సీఎం కుర్సీ అని హైకమాండ్‌ లైన్‌ క్లియర్‌ చేసిందనే టాక్‌ రానే వచ్చింది. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో రంగం సిద్ధమైంది. ఇక రేవంత్‌ అనే నేను....అంటూ ఆవాజ్‌ రావడమే తరువాయి అనుకునేంతలోపు సీన్‌ ఛేంజ్‌.. సీఎం ఎవరినే మ్యాటర్‌ ఓవర్‌ టు ఢిల్లీ..