నేడు రాజ్యాంగ దినోత్సవం
నేడు దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం, గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు అంటే 1949 నవంబర్ 26న, ఈ రోజు న ప్రతీ ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగం గొప్పదనాన్ని తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అలా 2015 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ను ఘనంగా నిర్వహిస్తున్నారు.

















Nov 26 2023, 16:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.9k