/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: అధ్యాపకుడు మామిడి లింగస్వామికి 'విద్యా సేవా రత్న అవార్డు' Mane Praveen
TS: అధ్యాపకుడు మామిడి లింగస్వామికి 'విద్యా సేవా రత్న అవార్డు'

హైదరాబాద్: జగతిఆర్ట్స్ వారు ప్రతి సవత్సరం విద్యాసేవారత్నా , నృత్యసేవారత్న అవార్డులను ప్రకటిస్తారు. ఇందులో భాగంగా చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్ట్-2023 ను పురస్కరించుకొని, పిల్లలకు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

అదేవిధంగా ఈ సంవత్సరముకు గానూ వివిధ రంగాలల్లో సేవలందించిన మహోన్నతమైన వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా విద్యారంగంలో సేవకు గాను నల్లగొండ జిల్లా కు చెందిన అధ్యాపకుడు మామిడి లింగస్వామి ని విద్యాసేవారత్న అవార్డు కు ఎంపిక చేసి త్యాగరాయ గానసభ లో అవార్డును ప్రదానం చేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గీత రచయిత డాక్టరు సుద్దాల అశోక్ తేజ హాజరయ్యారు. ప్రముఖ న్యూమరాలజిస్టు దైవజ్ఞశర్మ మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమా చేతుల మీదుగా విద్యా సేవారత్న అవార్డును అందచేశారు. అవార్డు గ్రహీత మామిడి లింగస్వామి మాట్లాడుతూ.. ముందుగా నాకు విద్యా నేర్పి, నన్ను తీర్చిదిద్దిన గురువులందరికి నా నమస్కారాలు పాదాబివందానాలు. 'విద్యాసేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, నన్ను చదివించిన తల్లిదండ్రులకు ఎప్పటికి ఋణపడి ఉంటానని, పేదరికంలో అణగారిన వర్గంలో ఉన్న నన్ను గుర్తించి అవార్డును ప్రదానం చేసిన జగతి ఆర్ట్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని తెలిపారు 

SGF రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు చత్రపతి శివాజీ FC క్రీడాకారులు

సూర్యాపేట జిల్లా నడిగూడలో నిన్న జరిగినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ SGF అండర్ 14,17 బాలబాలికల సెలక్షన్స్ లో చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కి చెందిన క్రీడాకారులు 12 మంది పాల్గొన్నారు. వారిలో 8 మంది ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకి సెలెక్ట్ కావడం జరిగింది.

వారిలో అండర్ 17 బాలుర విభాగంలో రాచూరి వెంకట సాయి, అప్పల మణిరామ్

అండర్ 14 బాలుర విభాగంలో కుర్మిళ హర్ష వేదార్య, కురిమిల్ల ఆదిత్య వేదార్య

అండర్ 14 బాలికల 

మద్ది కీర్తన, కురిమిళ్ళ అరుణ జ్యోతి, అప్పల సోనీ, ధృవిక

వీరందరూ ఉమ్మడి నల్గొండ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మబాల గిరిబాబు మరియు కోచ్ మద్ది కరుణాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

మునుగోడు: ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు పట్టణంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రతి గడప గడప కు వెళ్లి, కేసీఆర్  ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మునుగోడు లో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.

570 కోట్ల రూపాయలతో మునుగోడు ప్రగతికి పునాదులు వేశామని, ప్రతి ఇంటికి సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీలు ఏర్పాటు చేశామని, నూతనంగా హాస్పిటల్ లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నానని, మీలో ఒక కుటుంబ సభ్యుడీగా సేవ చేస్తున్నానని, మరొక్క సారి అవకాశం ఇస్తే మునుగోడును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.

కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

TS: బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ..

తెలంగాణ బీజేపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బిజెపి పార్టీకి సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి (రాములమ్మ) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గత కొంతకాలంగా బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా రాజీనామా చేశారు. 

ఇక విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న విజయశాంతి.. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక గత రెండు సంవత్సరాల కిందట బీజేపీ పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు బీజేపీ కి కూడా రాజీనామా చేశారు.

NLG: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఎన్జీ కళాశాలలో పుస్తక సమీక్ష - రీడతన్

నల్లగొండ: పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో.. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, గ్రంథాలయ సమాచార శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పుస్తక సమీక్ష మరియు రీడతన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎన్ దీపిక మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు పుస్తకం చదివే విధానాన్ని మరియు సమీక్షించే విధానాన్ని పుస్తకం మొత్తం చదివినప్పుడు మాత్రమే తెలుస్తుందని, విషయం మొత్తం అర్థం చేసుకున్నాక సబ్జెక్టు కవరేజ్, రచన శైలి, ఉపయోగించిన భాష ఆధారంగా సమీక్షించవచ్చని తెలిపారు. 

డాక్టర్ వెల్దండి శ్రీధర్ వక్తగా మాట్లాడుతూ.. రచన శైలి ఒక కళని, గొప్ప పాఠకుడికి రచించే తత్వం అలవడుతుందని, ఏదైనా విషయం ఎంచుకొని రచన చేసేటప్పుడు ఆ విషయం పైన పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే.. ఒక పుస్తకాన్ని రచించవచ్చని, ఆ రచనలు విషయానికి తగ్గట్లుగా సమాచారాన్ని రచించవచ్చని తెలిపారు. 

ఆ తదుపరి విద్యార్థులకు రీడతాన్ మరియు స్వీట్ రీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థిని, విద్యార్థులు చాలా ఆసక్తిగా వేగవంతంగా చదవడం పోటీలో పాల్గొన్నారని కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు , మరియు మణెమ్మ అసిస్టెంట్ లైబ్రేరియన్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: పి ఆర్ టి యు తెలంగాణ..నల్లగొండ జిల్లా కోశాధికారిగా అద్దంకి సునీల్ కుమార్..

నల్లగొండ: పి ఆర్ టి యు తెలంగాణ సర్వసభ్య సమావేశం జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మల్టీజోన్ వన్ లో టీచర్ల ట్రాన్స్ఫర్లు జరిగాయని, మల్టీజోన్ రెండు లో కోర్టు కారణాలు వలన ట్రాన్స్ఫర్లు ఆగిపోయాయని.. పి ఆర్ టి యు తెలంగాణ.. మల్టీజోన్ రెండు లో ట్రాన్స్ఫర్ ల కొరకు పనిచేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల కొరకు నిరంతరం పనిచేస్తుందని వారన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో సుంకరి భిక్షంగౌడ్ ను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటామని అన్నారు.

తదుపరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షులు గా రామచంద్రారెడ్డి,

ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బిక్షపతి, కోశాధికారిగా అద్దంకి సునీల్ కుమార్.. ను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, కోర్ కమిటీ సభ్యులు మా రెడ్డి వెంకట్ రెడ్డి, జనగాం వెంకట్ గౌడ్, , మాజీ ప్రధాన కార్యదర్శి శంకర్, వనం లక్ష్మి పతి, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, చింతల వెంకటేశ్వర్లు, యోగానంద్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు

NLG: మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి


నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాలిందిని మండల కార్యాలయంలో ఎంపీడీవో, ఏపీవో, టిఏ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం రాజపేట తండాలో నర్సరీ నిర్వహణ మీద ఎఫ్. ఏ లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కూలీల వేతన చెల్లింపులు, కూలీలకు మొబైల్ అటెండెన్స్ నిర్వహణ మీద ఉపాధి హామీ పనుల మీద సమీక్ష సమావేశ నిర్వహించారు.

కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఏపీఓ వెంకటేశం టిఏ లు, ఈసి, పంచాయతీ సెక్రటరీ ప్రణీత, తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్: గడప గడపకు ప్రచారం చేస్తున్న మేడి ప్రియదర్శిని


బహుజన రాజ్యం బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ తోనే సాధ్యమని, నకిరేకల్ బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్ధి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నకిరేకల్ మండలం మొడుగు గూడెం, గోరింకలపల్లి, గ్రామాలల్లో ఇంటింటికి తిరుగుతూ ఏనుగు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ..  నకిరేకల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం లు నిర్మించినా.. పేదలకు ఎందుకు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు.

జనాభాలో 90 శాతం ఎస్సీ, ఎసీబీసీ, మైనార్టీలు ఏకమైనప్పుడే బహుజనుల రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విద్యావంతురాలైన తనకు ఎన్నికల్లో ఒక అవకాశం ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేస్తానాని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, జోగు శేఖర్, యశ్వంత్, శ్రీరామ్, మహేష్, కృష్ణ, మహేష్, సురేష్, మల్లేష్, బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

TS: నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు..

నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి అవకాశం కావడంతో ప్రధాన పార్టీల రెబల్ అభ్యర్థుల నామినేషన్లు విరమించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు మొత్తం 13 చోట్ల రెబల్స్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ 13 నియోజకవర్గాల్లో ప్రధాన నేతలే ఎన్నికల బరిలో ఉండటంతో.. రెబల్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అగ్రనాయకత్వం బుజ్జగింపులు చేపట్టింది. అధికారంలోకి రాగానే పదవులు ఇస్తామని చెబుతుంది.

అదేవిధంగా బీఆర్ఎస్ కు రెబల్స్ అభ్యర్థులు పెద్దగా లేరు కానీ, సిఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధిక నామినేషన్లు వేయడంతో వారిని ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు రంగంలోకి దిగి నామినేషన్లను ఉపసంహరించుకుంటే డిమాండ్లను పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే 28 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇంకా 80 మంది వరకూ బరిలో ఉన్నారు. దీంతో ఆఖరి ప్రయత్నాలను అధికార పార్టీ చేస్తుంది. ఎన్ని నామినేషన్లు ఉపసంహరించుకున్నది అనేది రేపటికి తెలుస్తుంది.

NLG: దర్వేశిపురంలో జాతరలా కాంగ్రెస్ ప్రచారం

నల్గొండ: కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం లోని దర్వేశిపురం గ్రామం వచ్చారు. 

ఈ గ్రామం రేణుక ఎల్లమ్మ తల్లి కొలువుదీరిన ప్రాంతం. ఆదివారం, మంగళవారం ఈ ప్రాంతమంతా భక్తుల సందడితో జాతర లాగా ఉంటుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు, కార్యకర్తలు జాతరలా తరలివచ్చారు. చూసేవారికి ఎల్లమ్మ జాతరే జరుగుతోందా అన్నట్లుగా ఈ ప్రాంతమంతా జన సందడి నెలకొని ఉంది. 

ప్రచారంలో భాగంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నిరుపేదలకు సొంత ఇళ్ళు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తాను మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా తొలుత ఈ ఊరికే వచ్చి అమ్మ వారిని మొక్కుకుంటాను అని చెప్పారు.