/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: టీబి అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తారు: డాక్టర్ చైతన్య Mane Praveen
NLG: టీబి అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తారు: డాక్టర్ చైతన్య

మర్రిగూడెం: టీబి అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఉచిత మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేస్తారని డాక్టర్ చైతన్య తెలిపారు. శనివారం మండలంలోని తమ్మడపల్లి గ్రామపంచాయతీ వద్ద టీబి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులుగా ఉంటూ గ్రామాన్ని, మండలాన్ని టీబి రహిత మండలంగా చేయుటకు సహకారాన్ని అందించాలని కోరారు. తదుపరి లక్షణాలున్న వారి నుండి తెమడ శాంపిల్స్ సేకరించి ఆసుపత్రికి పంపారు. గ్రామ సెక్రెటరీ శిరీష, డాక్టర్ చైతన్య, ఎస్ టి ఎస్ సైదులు, ల్యాబ్ టెక్నీషియన్ చారి, ఏఎన్ఎం ఫైమీన్ ,ఆశ కలమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం, అన్నారం గ్రామపంచాయితీ సర్పంచ్ కట్టా సత్యనారాయణ రెడ్డి మరియు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సింగారం మారయ్య ఆధ్వర్యంలో.. మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ బైరు వెంకటేశం, బిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు గోన సత్యనారాయణ, యూత్ అధ్యక్షుడు కేసాని శ్రీనివాసరెడ్డి, కట్టా చల్లారెడ్డి లు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అనుముల మండలపార్టీ అధ్యక్షులు కుందూరు వెంకట్ రెడ్డి, అనుముల మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు వద్దరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముక్కాముల సర్పంచ్ నరేందర్, చింతగూడెం సర్పంచ్ రాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చల్ల మట్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

తిమ్మారెడ్డి గూడెంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

మునుగోడు నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా తిమ్మారెడ్డి గూడెం లోని యాదవ్స్ కాలనీలో బిఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

బూత్ కమిటీ జక్కల శీను, గ్రామ శాఖ అధ్యక్షులు ఉట్కూర్ రవీందర్ రెడ్డి, గుణ యాదయ్య శిరసావాడ అచ్చాలు, రాసాల రమేష్, టేకులపల్లి వెంకటయ్య, జక్క లింగయ్య, గుండెబోయిన నాగయ్య, గుండెబోయిన వెంకటయ్య, గుండబోయిన కొమురయ్య, జక్కల వెంకటయ్య, జక్కల శీను, జక్కల యాదయ్య, గుండెబోయిన యాదయ్య, ఎడ్ల సత్తయ్య, జక్కల శివ, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్: ప్రజా ఏజండా పై అభ్యర్థులను నిలదీయండి: CPI (M-L) న్యూడెమోక్రసీ

ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే పాలకవర్గ పార్టీల అభ్యర్థులను ప్రజా సమస్యలపై,విద్య,వైద్యం, ఉపాధి అంశాలపై నిలదీయాలని CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు.

నకిరేకల్ పట్టణంలోని కామ్రేడ్ యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో శనివారం ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మద్యం, డబ్బు, కులం, మతం పేరుతో తప్పుడు మార్గంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత పథకాలు అంటూ ప్రలోభాలకు గురిచేసి గెలవలనుకునే పార్టీల అభ్యర్థులను ప్రశ్నించాలని అన్నారు. నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి, దారిద్ర్యం, దోపిడీ, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు, మద్యం, డ్రగ్స్, గంజాయి లాంటివి తెలంగాణలో ఎక్కువగా రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. వీటి నివారణకు ఏమి చర్యలు తీసుకున్నారో అడగండని అన్నారు. గతంలో రాని మార్పు ఈ సారి గెలిపిస్తే ఎలా సాధ్యం అవుతుందో ప్రశ్నించాలన్నారు.

ఈ కార్యక్రమంలో CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జ్వాల వెంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, పి.ఓ.డబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జూరి ఉపేంద్ర, పి.వై.ఎల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మామిడోజు వెంకటేశ్వర్లు, బి.వి చారి,ఇఫ్టూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, పి.డి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి పోలె పవన్, ఏ. ఐ.కె.ఎం.ఎస్ జిల్లా నాయకులు సిలువేరు జానయ్య, అంబటి వెంకటేశం,కుంభం వెంకటేశం,బీరెడ్డి సత్తిరెడ్డి, అయోధ్య, చెరుకు సైదులు,పసుపులేటి సోమయ్య,బండారు వెంకన్న,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

గుడ్డిగా ఓటు వేయొద్దు, పోటీ చేస్తున్న వ్యక్తి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ, దాని చరిత్రను ప్రజలు చూడాలి: కేసీఆర్

భైంసా: ఎన్నికలు రాగానే ఎవరెవరో వస్తారు.. ఏవేవో చెప్తారు. ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మి మోసపోవద్దు..గుడ్డిగా ఓటు వేయొద్దు.. పోటీ చేస్తున్న వ్యక్తి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ.. దాని చరిత్రను ప్రజలు చూడాలి.

ప్రజల పట్ల పార్టీల దృక్పథం చూసి.. వివేకంతో ఓటు వేయాలి అని కెసిఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్‌ జిల్లాలోని భైంసా లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని కేసీఆర్‌ ప్రసంగించారు.

తెలంగాణలో వైఎస్ఆర్ టిపి పోటి చేయడం లేదు: వైయస్ షర్మిల

తెలంగాణలో వైఎస్ఆర్ టిపి పార్టీ పోటీ చేయట్లేదని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు . లోటస్ పాండ్ లో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.తెలంగాణలో తాము పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని, కాంగ్రెస్ కు నష్టం చేకూరుతుందని అందువల్ల తెలంగాణలో తాము పోటీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

TS: జూనియర్ కళాశాలలో చేరేందుకు చివరి అవకాశం

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. కళాశాలలో చేరేందుకు నవంబరు 10 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రైవేటు కళాశాలల్లో చేరేవారు రెండు వేల రూపాయలు ఆలస్య రుసుం చెల్లించాలని, ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ఎలాంటి రుసుము ఉండదని బోర్డు కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

అమరవీరుల పోరాట స్పూర్తితో.. సమసమాజం కోసం పోరాడుదాం: CPI (M-L) న్యూడెమోక్రసీ

నల్లగొండ: భూమి, భుక్తి, విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్) అమరవీరుల స్పూర్తితో దేశంలో దోపిడీ, పీడన, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుదాం అని, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ పార్టీ ఇచ్చిన పిలుపుతో భాగంగా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ లో పార్టీ పట్టణ కార్యదర్శి బొమ్మిడి నగేష్,రైతు-కూలీ సంఘం జిల్లా నాయకులు సత్తిరెడ్డి లు ఎర్రజెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా ఇందూరు సాగర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కొరకు,ఆదివాసి,గిరిజన,దళిత, బహుజన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన విప్లవ అమరవీరులకు నివాళులు అర్పించాలని, భారత విప్లవ పోరాటాలలో ఎంతోమంది అమరవీరులు తమ ఉన్నతమైన చదువులని, ఉద్యోగాలని, కుటుంబాలని వదిలేసి పేద ప్రజల కోసం ప్రాణాలను గడ్డిపోచ వలె వదిలారని వారి త్యాగాల ఆశయాల సాధనలో మనందరం పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరవీరుల స్పూర్తితో దోపిడీ,అవినీతి,పాలకుల విధానాలపై పోరాడాలని, ఎన్నికల్లో అవినీతి అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దాసరి నర్సింహా, జానపాటి శంకర్, బి.వి చారి, బొమ్మపాల అశోక్, మామిడాల ప్రవీణ్,,అంజి,లింగయ్య,అశోక్, రాజు,ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: 38 వ వార్డులో బోయినపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల పర్వం కొనసాగుతుంది. నల్లగొండ పట్టణంలో 38వ వార్డ్ లో కౌన్సిలర్ బోయనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందుతుందని, ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ.. చెయ్యి గుర్తుకు ఓటు వేసి, నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.

కార్యక్రమంలో ఐతరాజు పవన్ కళ్యాణ్, లక్ష్మణ్, మునగాల పవన్, ఉమేష్, సాయి, గిరి, నాగరాజు, మరియు పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఎన్నికైన కలకొండ కిరణ్

నాంపల్లి మండలం, సుంకిశాల గ్రామానికి చెందిన కలకొండ కిరణ్ ను స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడుగా గురువారం ఎన్నుకొని, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ యడవల్లి సురేష్ మరియు జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేష్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, యాదగిరి, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.