/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz నకిరేకల్: ప్రజా ఏజండా పై అభ్యర్థులను నిలదీయండి: CPI (M-L) న్యూడెమోక్రసీ Mane Praveen
నకిరేకల్: ప్రజా ఏజండా పై అభ్యర్థులను నిలదీయండి: CPI (M-L) న్యూడెమోక్రసీ

ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే పాలకవర్గ పార్టీల అభ్యర్థులను ప్రజా సమస్యలపై,విద్య,వైద్యం, ఉపాధి అంశాలపై నిలదీయాలని CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు.

నకిరేకల్ పట్టణంలోని కామ్రేడ్ యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో శనివారం ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మద్యం, డబ్బు, కులం, మతం పేరుతో తప్పుడు మార్గంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత పథకాలు అంటూ ప్రలోభాలకు గురిచేసి గెలవలనుకునే పార్టీల అభ్యర్థులను ప్రశ్నించాలని అన్నారు. నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి, దారిద్ర్యం, దోపిడీ, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు, మద్యం, డ్రగ్స్, గంజాయి లాంటివి తెలంగాణలో ఎక్కువగా రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. వీటి నివారణకు ఏమి చర్యలు తీసుకున్నారో అడగండని అన్నారు. గతంలో రాని మార్పు ఈ సారి గెలిపిస్తే ఎలా సాధ్యం అవుతుందో ప్రశ్నించాలన్నారు.

ఈ కార్యక్రమంలో CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జ్వాల వెంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, పి.ఓ.డబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జూరి ఉపేంద్ర, పి.వై.ఎల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మామిడోజు వెంకటేశ్వర్లు, బి.వి చారి,ఇఫ్టూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, పి.డి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి పోలె పవన్, ఏ. ఐ.కె.ఎం.ఎస్ జిల్లా నాయకులు సిలువేరు జానయ్య, అంబటి వెంకటేశం,కుంభం వెంకటేశం,బీరెడ్డి సత్తిరెడ్డి, అయోధ్య, చెరుకు సైదులు,పసుపులేటి సోమయ్య,బండారు వెంకన్న,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

గుడ్డిగా ఓటు వేయొద్దు, పోటీ చేస్తున్న వ్యక్తి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ, దాని చరిత్రను ప్రజలు చూడాలి: కేసీఆర్

భైంసా: ఎన్నికలు రాగానే ఎవరెవరో వస్తారు.. ఏవేవో చెప్తారు. ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మి మోసపోవద్దు..గుడ్డిగా ఓటు వేయొద్దు.. పోటీ చేస్తున్న వ్యక్తి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ.. దాని చరిత్రను ప్రజలు చూడాలి.

ప్రజల పట్ల పార్టీల దృక్పథం చూసి.. వివేకంతో ఓటు వేయాలి అని కెసిఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్‌ జిల్లాలోని భైంసా లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని కేసీఆర్‌ ప్రసంగించారు.

తెలంగాణలో వైఎస్ఆర్ టిపి పోటి చేయడం లేదు: వైయస్ షర్మిల

తెలంగాణలో వైఎస్ఆర్ టిపి పార్టీ పోటీ చేయట్లేదని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు . లోటస్ పాండ్ లో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.తెలంగాణలో తాము పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని, కాంగ్రెస్ కు నష్టం చేకూరుతుందని అందువల్ల తెలంగాణలో తాము పోటీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

TS: జూనియర్ కళాశాలలో చేరేందుకు చివరి అవకాశం

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. కళాశాలలో చేరేందుకు నవంబరు 10 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రైవేటు కళాశాలల్లో చేరేవారు రెండు వేల రూపాయలు ఆలస్య రుసుం చెల్లించాలని, ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ఎలాంటి రుసుము ఉండదని బోర్డు కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

అమరవీరుల పోరాట స్పూర్తితో.. సమసమాజం కోసం పోరాడుదాం: CPI (M-L) న్యూడెమోక్రసీ

నల్లగొండ: భూమి, భుక్తి, విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్) అమరవీరుల స్పూర్తితో దేశంలో దోపిడీ, పీడన, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుదాం అని, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ పార్టీ ఇచ్చిన పిలుపుతో భాగంగా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ లో పార్టీ పట్టణ కార్యదర్శి బొమ్మిడి నగేష్,రైతు-కూలీ సంఘం జిల్లా నాయకులు సత్తిరెడ్డి లు ఎర్రజెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా ఇందూరు సాగర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కొరకు,ఆదివాసి,గిరిజన,దళిత, బహుజన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన విప్లవ అమరవీరులకు నివాళులు అర్పించాలని, భారత విప్లవ పోరాటాలలో ఎంతోమంది అమరవీరులు తమ ఉన్నతమైన చదువులని, ఉద్యోగాలని, కుటుంబాలని వదిలేసి పేద ప్రజల కోసం ప్రాణాలను గడ్డిపోచ వలె వదిలారని వారి త్యాగాల ఆశయాల సాధనలో మనందరం పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరవీరుల స్పూర్తితో దోపిడీ,అవినీతి,పాలకుల విధానాలపై పోరాడాలని, ఎన్నికల్లో అవినీతి అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దాసరి నర్సింహా, జానపాటి శంకర్, బి.వి చారి, బొమ్మపాల అశోక్, మామిడాల ప్రవీణ్,,అంజి,లింగయ్య,అశోక్, రాజు,ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: 38 వ వార్డులో బోయినపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల పర్వం కొనసాగుతుంది. నల్లగొండ పట్టణంలో 38వ వార్డ్ లో కౌన్సిలర్ బోయనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందుతుందని, ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ.. చెయ్యి గుర్తుకు ఓటు వేసి, నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.

కార్యక్రమంలో ఐతరాజు పవన్ కళ్యాణ్, లక్ష్మణ్, మునగాల పవన్, ఉమేష్, సాయి, గిరి, నాగరాజు, మరియు పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఎన్నికైన కలకొండ కిరణ్

నాంపల్లి మండలం, సుంకిశాల గ్రామానికి చెందిన కలకొండ కిరణ్ ను స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడుగా గురువారం ఎన్నుకొని, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ యడవల్లి సురేష్ మరియు జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేష్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, యాదగిరి, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.

NLG: అభివృద్ధి చేస్తా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి: ప్రియదర్శిని

రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యాలని నకిరేకల్ బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని కోరారు. బహుజన్ సమాజ్ పార్టీ కు ఓట్ వేస్తె మీ ఇంటి దగ్గరికి వచ్చి పనిచేస్తారని ఆమె అన్నారు. యువత మేలుకో రాజకీయాలు తెలుసుకో, నాయకత్వాన్ని నేర్చుకో పవిత్రమైన ఏనుగు గుర్తు పై ఓటు వేయాలిసిందిగా ఓటర్లను కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మండల అధ్యక్షులు మేడి సంతోష్,మండల ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా,కార్యదర్శి బందెల అనిత, మండల మహిళ కన్వినర్ కక్కిరేణి శిరీష, గ్రామ కన్వీనర్ నవీన్, బి ఎస్ పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మునుగోడు నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చందు నాయక్

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడెం మండలం అజిలాపురం గ్రామానికి చెందిన ఎస్టి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి మెగావత్ చందు నాయక్, డిగ్రీ ఉత్తీర్ణుడు.. మునుగోడు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తనను ఆదరించి గెలిపించినట్లయితే విద్యా వైద్య రంగాలను అభివృద్ధి పరుస్తూ, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని, ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతం డబ్బులతో ఫ్రీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని తెలిపారు.

దోపిడి లేని సమాజ స్థాపన కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఏఐటీయూసీ: చాపల శ్రీను

నల్లగొండ జిల్లా:

మునుగోడు: ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం బెల్లం శివయ్య అధ్యక్షత బుధవారం మండల కేంద్రంలో సిపిఐ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను హాజరై మాట్లాడుతూ.. దోపిడీ లేని సమాజ స్థాపన కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఏఐటీయూసీ అని అన్నారు.

పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తూ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు అసలైన కార్మికులకు అందకుండా తన అనుకున్న వారికి ఇవ్వడం సరైనది కాదని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విచారణ చేసి అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు గృహలక్ష్మీ గాని దళిత బంధువు గాని బీసీ బందు గాని ఇవ్వాలని మరియు ప్రతి కార్మికునికి టూ వీలర్ వాహనం ఇవ్వాలని కోరారు.కార్మికునికి ఎలాంటి ప్రమాదం జరిగిన ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయలు చెల్లించాలని, వారి కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

నవంబర్ 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కార్మికులు ఒక్కటై తమ ఓటు ద్వారా అవినీతిపరులకు బుద్ధి చెప్పాలని, నిజమైన నికారసుగా కార్మికుల పక్షాన నిలబడే నాయకున్ని పరిశీలించి గెలిపించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాలాద్రి, భీమనపల్లి స్వామి, ఏర్పు నరసింహ, నగేష్, హుస్సేన్, దొమ్మాటి గిరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.