/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ర‌వాణా శాఖ ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల విధుల నుంచి మిన‌హాయింపు Miryala Kiran Kumar
ర‌వాణా శాఖ ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల విధుల నుంచి మిన‌హాయింపు

[11/1, 10:25 PM] miryalakirankumar89: Telangana | ర‌వాణా శాఖ ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల విధుల నుంచి మిన‌హాయింపు

రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్ర‌భుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్ర‌భుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే శాఖ కూడా అవడంతో రిలాక్సేషన్ ఇచ్చినట్లు తెలిపారు.

ఎలక్షన్స్ నామినేషన్ దాఖలుకు ఎంత చెల్లించాలంటే?

ఎలక్షన్స్ నామినేషన్ దాఖలుకు ఎంత చెల్లించాలంటే?

TS: నామినేషన్ దాఖలుకు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.10వేలు, SC, ST అభ్యర్థులు రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా 4సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపింది. అఫిడవిట్ను అసంపూర్తిగా నింపి ఇస్తే, దానిని సవరించాలని అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసులిస్తారు. ఒకవేళ అభ్యర్థి నోటీసులకు స్పందించకపోతే నామినేషన్ తిరస్కరించే అధికారం ఆ అధికారికి ఉంటుంది.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన&విద్యార్థి నాయకులను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

*బిఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన&విద్యార్థి నాయకులను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

తిప్పర్తి మండలం గడ్డి కొండారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన నాయకుడు ఆలకుంట్ల శేఖర్ గారికి బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన శాస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఈరోజు వారి నివాసంలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరియు నల్గొండ పట్టణంలో విద్యార్థి విభాగం నాయకుడు ఎండి షోయాబ్ గారి తండ్రి ఇటీవలి కాలంలో మరణించగా పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి తండ్రి గారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నారు. 

ఈ కార్యక్రమంలో

సర్పంచ్ భాస్కర్ రెడ్డి,మాజీ సర్పంచ్ యాదగిరి రెడ్డి,సుంకుషాల రవి,మైనం యుగేందర్,బొంత అంజిబాబు,కంచర్ల రఘురాం రెడ్డి,ఆలకుంట్ల సైదులు,మైనం మధు కట్టా శ్రీనివాస్,కొండాపురం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

వివిధ పార్టీల నుండి నల్గొండ బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు..

వివిధ పార్టీల నుండి నల్గొండ బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు

నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కంచర్ల భూపాల్, గారు రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గారు ఆస్ట్రేలియా NRI వినయ్ సన్నీ గౌడ్ గారు కోండురు సత్యనారాయణ గారుఆధ్వర్యంలో 24 వ వార్డు కు చెందిన 100 మంది కార్యకర్తలు బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది..

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కంచర్ల భూపాల్ మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు

చేరిన వారు కత్తుల యశ్వంత్, చంటి, సిద్దూ, సాయి, బబ్లు, గణేష్, మహేష్, నితిన్, మని, సాయి గిరి వార్డు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "టెక్నాలజీ మరియు ఆధునిక విద్య" పైన అవగాహన సదస్సు

నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "టెక్నాలజీ మరియు ఆధునిక విద్య" పైన అవగాహన సదస్సు:

ఈరోజు బీరంగూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వృత్తి విద్య నైపుణ్యతలపై అవగాహన కల్పించడంలో భాగంగా "టెక్నాలజీ మరియు ఆధునిక విద్య" పైన అవగాహన సదస్సు నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ అధ్యక్షులు ఏలే వెంకటనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ యొక్క పాఠ్యాంశాలలో ఉన్న అంశాలతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ విద్య లో తప్పక నైపుణ్యత కలిగి ఉండేటట్లుగా కృషి చేయాలని తెలియజేశారు. అదేవిధంగా కమ్యూనికేషన్ మరియు కంప్యూటర్ విద్య కు సంబంధించిన ప్రాథమిక అవగాహన కొరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తప్పకుండా తరగతుల నిర్వహణ త్వరలోనే జరుపుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంత గారు, ఉపాధ్యాయురాలు స్రవంతి  తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల ఆశయాలపై పోరాడుదాం:న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్

అమరవీరుల ఆశయాల కై పోరాడుదాం.అమరవీరుల ఫొటోలకు స్థూపలకు పూల మాలలతో చర్ల మండలంలో నివాళులర్పించిన న్యూడెమోక్రసీ శ్రేణులు.

 CPI (M-L) న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

భూమి, భుక్తి,విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ అమరవీరులకు

పూల మాలలతో విప్లవ జోహార్లు చర్ల మండలం ప్రజలతో నాయకులతో అర్పిండం జరిగింది  న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్* మాట్లాడుతూ 

 భూమి, భుక్తి, విముక్తి కొరకు,ఆదివాసి,గిరిజన,దళిత, బహుజన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తమ అమూల్యమైన ప్రాణాలను నులివెచనైనా రక్తాన్ని అర్పించిన విప్లవ అమరవీరులకు నివాళులు అర్పించాలని, భారత విప్లవ పోరాటాలలో ఎంతోమంది అమరవీరులు తమ ఉన్నతమైన చదువులని,ఉద్యోగాలని,కుటుంబాలని వదిలేసి పేద ప్రజల కోసం ప్రాణాలను గడ్డి పోచ వలె వదిలారని వారి త్యాగాల ఆశయాల సాధనలో మనందరం పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తెల్ల బట్టల వాళ్ళను చూస్తే భయపడే ఆదివాసి,గిరిజన,దళితులకు హక్కులను తెలియజేసి లక్షలాది ఎకరాల భూములను పంచి వెనకబడిన గ్రామాలకు విద్య, వైద్యం, విద్యుత్తు, రోడ్డు, రవాణా, కనీస సౌకర్యాల కోసమే పోరాటాలు నిర్వహించి గోదావరి లోయ పరిహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూములను ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర ఈ నక్సల్ల్బారి ,

ప్రతిఘటన ఉద్యమానిదేనని వారన్నారు.కామ్రేడ్ వెంపటాపు సత్యం,ఆదిభట్ల కైలాసం,భత్తుల వెంకటేశ్వరరావు,

నీలం రామచంద్రయ్య,

పొట్ల రామనర్సయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నుండి మొదలుకొని గుండాలలో జరిగిన కామ్రేడ్ పూనెం లింగన్న ఎన్ కౌంటర్ వరకు ఎందరో వీరులు ప్రాణాలు ఇచ్చారని వారన్నారు. నల్లగొండ జిల్లాలో కామ్రేడ్ యానాల మల్లారెడ్డి,విక్రమన్న,వీరారెడ్డి, బూరుగు అంజన్న,పలస బిక్షం,జెన్ను సార్,తోట సోమన్న లాంటి ఎందరో అమరులయ్యారని, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పోరాట చరిత్ర ఉందని అది నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత కర్తవ్యం మన మీద ఉందని వారన్నారు అమరవీరుల సంస్మరణ సభలను జిల్లా వ్యాప్తంగా జరపాలని ఆయన ఈ సమావేశంలో తెలియజేశారు. విప్లవకారుల పోరాటాలను చరిత్రను,నక్సల్ భరీ పోరాటాలను చరిత్రను,అమరవీరుల త్యాగాలను ప్రజలకు వివరించాలని విద్యార్థి,యువకులు అమరుల ఆశయాలతో రాబోయే తరానికి కాబోయే వారసులుగా నిలబడాలని ఉద్యమాలకు ఊపిరిగా నిలబడాలని పిలుపునిచ్చారు.అమరవీరుల స్పూర్తితో BRS మతోన్మాద BJP దోపిడీ,అవినీతి,పాలకుల విధానాలపై పోరాడాలని, ఎన్నికల్లో అవినీతి అభ్యర్థులను ఓడించాలని సతీష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ కణితి బానుప్రకాష్ బొర్ర సమ్మక్క సప్కా నాగలక్ష్మి ఇర్ప సమ్మక్క కనకమ్మ నాగలక్ష్మి సీతమ్మ రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

గుడిలో విగ్రహం కోసం సర్పంచ్ పదవికి వేలం... మేటర్ సీరియస్!

గుడిలో విగ్రహం కోసం సర్పంచ్ పదవికి వేలం... మేటర్ సీరియస్!

ఈ సమయంలో గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయా కుల సంఘాల పెద్దలు నవంబర్ 22ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా ఒకపక్క తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. అధికార విపక్షాలు ఎవరికి వారు పోటాపొటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పదవులు పొందాలని అభ్యర్థులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు.. ఓటర్ల మెప్పుకోసం తలకిందులుగా తపస్సులు చేస్తున్నారు! ఈ సమయంలో గుడిలో విగ్రహం కోసం ఉన్న పదవిని వేళానికి పెట్టాడు ఒక సర్పంచ్.. ఆ వెలంలో వచ్చిన సొమ్ముతో ఆ గ్రామంలోని గుడిలో విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాడు.

అవును... గ్రామంలో కొత్తగా కట్టిన పోచమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏకంగా తన పదవిని వేలానికి పెట్టారు ఒక సర్పంచ్. విగ్రహ ప్రతిష్ఠకు సుమారు రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని లెక్క కట్టి మరీ వేలం పాట నిర్వహించడం మరొకెత్తు. దీంతో ఈ విషయం చర్చనీయాశం అయ్యింది. ఎన్నికల సీజన్, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అధికారులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది!


వివరాళ్లోకి వెళ్తే... ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా త్వరలో ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం అంకుషాపురంగ్రామంలో కొత్తగా పోచమ్మ గుడి కట్టారు. అయితే ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. చందాలు వేసుకొని పోచమ్మ గుడి అయితే నిర్మించుకున్నాం కానీ.. మళ్లీ అంతపెద్దమొత్తంలో విగ్రహానికంటే కష్టం అనే మాటలు వినిపించాయి!

ఈ సమయంలో గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయా కుల సంఘాల పెద్దలు నవంబర్ 22ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకూ సేకరించిన చందాల ద్వారా వచ్చిన మొత్తం గుడి నిర్మాణానికే సరిపోవడంతో విగ్రహ ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ సమయంలో సర్పంచ్ పదవిని వేలం వేయాలని నిర్ణయించారు.

దీంతో... గ్రామంలోని పెద్దలంతా స్థానిక హనుమాన్ టెంపుల్ సమీపంలో కూర్చుని వేలం పాట మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. రూ.3 లక్షలతో మొదలైన వేలంపాట రూ.9 లక్షల 35 వేల దగ్గర ముగిసింది. పాటలో ఆరుగురు పాల్గొనగా.. ఓ కుల సంఘం పెద్ద ఈ పదవి దక్కించుకున్నాడని అంటున్నారు! దీంతో విషయం అధికారులకు చేరింది.. మేటర్ సీరియస్ అయ్యిందని సమాచారం.

ముందుగా ఈ వేలంపాట విషయాలు పంచాయతీ సెక్రటరీకి తెలిసాయని, న్నికల కోడ్ అమల్లో ఉన్నందున విషయాన్ని మండల నోడల్ ఆఫీసర్ (ఎంపీడీవో)కి సమాచారం అందించారని సమాచారం. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఎస్ఐ సిబ్బందిని పంపించగా.. అప్పటికే అందరూ ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారని అంటున్నారు. దీంతో... ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో చెబుతున్నారు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి..

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి

  AITUC ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించిన నాయకులు

   సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 2021 ఏప్రిల్ నుంచి చెల్లించాల్సిన పెండింగ్ ఏరియర్స్ ను తక్షణమే చెల్లించాలని అందుకు సింగరేణి సివిల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్-AITUC ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేట్ సివిల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మంగళవారం నాడు కార్పొరేట్ సివిల్ డివైజియం శ్రీ పి రాజశేఖర్ గారికి ఏఐటీయుసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య లు కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం పెరిగిన డిఏ బాపతు ఏరియర్స్ డబ్బులను కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్ల ద్వారా మరియు సింగరేణి కంపెనీ డైరెక్టుగా చెల్లించాల్సి ఉన్నది.వాటిని కొందరికి చెల్లించి ఇంకా అనేక మందికి చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర అసహనంతో ఉన్నారని, ఆందోళన చెందుతున్నారని తక్షణమే పెండింగ్ ఏరియర్స్ చెల్లింపుకు సింగరేణి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి శ్రీను,కిరణ్, అజయ్,పెద్దబాబు,సూర్య, బి,సైదుబాబు,నీలకంఠం,శంకర్,సవీన్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి..

కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలి

ఉమ్మడి జిల్లాలో రెడ్ల కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ

బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే రెబల్ గానైన పోటీ చేస్తా

మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంగ్రెస్స్ ఓబీసీ సెల్ అధ్వర్యంలో రోగులకు,పండ్లు బ్రేడ్లు పంపిణీ

కాంగ్రెస్ పార్టీలో బీసీ లకు సముచిత స్థానం కల్పించడంలేదని ఆ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర సీనియర్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 శాతానికి పైగా ఉన్న బీసీలను కాదని, జనాభాలో తక్కువ శాతం ఉన్న అగ్రకులాల వారికే పార్టీ స్థానం కల్పిస్తుందని, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారికి ఆ స్థాయిలో అవకాశాలు కల్పించడంలేదని అన్నారు. ఇతర పార్టీలు బీసీలను గుర్తించి ఎమ్మెల్యే , ఎంపిల సీట్లను ఇస్తుంటే కాంగ్రెస్ లో కేవలం రెడ్డిలు రాజ్యమేలుతున్నారని, దీనిని గమనించి మూడవ విడత అభ్యర్థుల ఎంపికలో బీసీ సీనియర్ నాయకులకు టిక్కెట్ లను కేటాయించాలన్నారు.సుధీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకులకు గుర్తింపు లేదని అన్నారు .బిసిలకు సముచిత స్థానం కల్పించక పోతే కాంగ్రెస్స్ పార్టీ రెబల్ గా అభ్యర్థి గా హుజుర్ నగర్ లేదా కోదాడ నుండి పోటీ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు.ఉక్కు మనిషి ఇందిరమ్మ ఆశయ సాధనలో,తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పని చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యన్ని స్థాపించుటకు ప్రతి కార్య కర్త సైనికులు గా పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్, ఓబిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటి సైదులు, నాయకులు పేర్ల గిరి యాదవ్, సిద్ధి పరుశురాములు, రమేష్ యాదవ్, గుద్దేటి శ్యామ్, మాల బంటి, మట్టపల్లి శంభయ్య, తదితరులు పాల్గొన్నారు.

గత గ్రామపంచాయతీ ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తగుళ్ల శ్రీను 200 కుటుంబాలతో కలిసి మూకుమ్మడిగా బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక

బ్రేకింగ్ న్యూస్...

తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు... గత గ్రామపంచాయతీ ఎన్నికల లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన తగుళ్ల శ్రీను.... 200 కుటుంబాలతో కలిసి నేడు మూకుమ్మడిగా... ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు గారు, నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు... ఈ సందర్భంగా కంచర్ల,వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధర పూర్వకంగా ఆహ్వానించారు.... ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు గారు మాట్లాడుతూ... కన్న తల్లి లాంటి పార్టీని.. ఎన్నికలు  మరోనెల రోజులు ఉందనగా... పార్టీ నుంచి వెళ్లిపోవటం అంటే... అది ఏ రకమైన నీతో అర్థం చేసుకోవాలని కేవలం డబ్బులు ఆశించి... ప్రజల కొరకు పనిచేస్తున్న నాయకుడిని పార్టీని వదలటం న్యాయం కాదని... అలాంటివారికి పదిలే సరైన బుద్ధి చెప్తారని అన్నారు. కంచర్ల మాట్లాడుతూ... సర్వారం గ్రామాన్ని తాను ఎప్పుడు ప్రత్యేకంగా చూశానని... సర్వారం సర్పంచ్ ఏ పని అడిగిన వెంటనే అమలు చేశామని కోటి 25 లక్షల రూపాయలతో గ్రామం ల్లో సిసి రోడ్లు ఏర్పాటు చేశామని, ఇంటింటికి మంచినీరు ఇచ్చామని... విద్యుత్ లైన్ లు ఏర్పాటు చేశామని 63 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించామని అన్నారు.. ఇలా గ్రామానికి అన్ని విధాలుగా సహాయం చేస్తుంటే... నమ్మించి గొంతు కోశాడని... అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా... ఇంతమంది పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరమైన విషయం అని... సర్వారం ప్రజలు అలాంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్తారని.. నేను నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ప్రజలను నమ్ముకున్నాను కానీ కోమటిరెడ్డి నోట్ల కట్టలతో ... నాయకులను కొని వారి నమ్ముకున్నారని... ప్రజలుఈ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని తెలియజేశారు...

ఈ కార్యక్రమంలో... ఇంకా.. మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి.. లొడంగి గోవర్ధన్ వనపర్తి నాగేశ్వరరావు.. జీడిపల్లి వెంకటరెడ్డి , ఎంపీటీసీ సందీప్ రెడ్డి,కందుల లక్ష్మయ్య... తదితరులు పాల్గొన్నారు పార్టీలో చేరిన వారిలో... తగుల శీను తో పాటు.. గంట వెంకన్న, (పెద్ద గొల్ల ) గంట పద్మ వార్డ్ మెంబర్, రాస మల్ల నాగయ్య గంట సైదులు మరి శేఖర్ చిరుబోయిన కోటయ్య దారమళ్ళ మస్తాన్, బొల్లం వెంకన్న... లతోపాటు 200 కుటుంబాలకు చెందిన వారు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.