/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న తెలంగాణ మహిళ Miryala Kiran Kumar
చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న తెలంగాణ మహిళ

చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న తెలంగాణ మహిళ

చంద్రుడిపై మానవ నివాసానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. చంద్రుడిపై స్థలం విక్రయానికి యూఎస్ ఎంబసీ 'లూనార్ రిజిస్ట్రీ' అనే వెబ్సైట్ తీసుకురాగా... తెలంగాణ పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయివిజ్ఞాత తన తల్లి, కూతుర్ల పేరుతో చంద్రుడుపై ఎకరం స్థలాన్ని 2022లో కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఆమెకు ఈనెల 23న అందాయి. చంద్రమండలంలో ఎకరం స్థలం రూ.35 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.

తుమ్మలకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి తీవ్ర నష్టం: కోలేటి భవాని శంకర్

తుమ్మలకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి తీవ్ర నష్టం

- పాలేరు టికెట్ తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించాలి

- ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచన చేయాలి

- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారాస పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అభ్యర్థన

పినపాక : 2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. శనివారం భవాని శంకర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే గెలిచిందని, పినపాక నియోజకవర్గం లో 28 వేల ఓట్లు వచ్చాయని, మిగతా నియోజకవర్గాల్లో 5000 వరకు మాత్రమే ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు.

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావుని, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలిచి, మంత్రి పదవి ఇచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల ద్వారా టిఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేశారన్నారు. 2018 ఎన్నికల్లో కూడా ఒక్క ఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే టిఆర్ఎస్ పార్టీ గెలవగా, మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయింది అన్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి ఇతర అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడమేనన్నారు. కాంగ్రెస్ టిడిపి కమ్యూనిస్టులు అందరూ కలిసినా కేవలం 3 నుండి 5000 ఓట్ల మెజారితో మాత్రమే వారు గెలుపొందారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికి పది సీట్లు గెలిపించాలని తప్పనతో పనిచేస్తున్నప్పటికీ, పార్టీలో ఉన్న కొన్ని వ్యతిరేక శక్తులు ఆయనకు వెన్నుపోటు పొడిచి ఓడిపోయే విధంగా చేశారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో కూడా ఐదువేల ఓట్లు లేవని, అలాంటి పార్టీకి తుమ్మల అన్ని నియోజకవర్గాల్లో 90000 ఓట్లకు పైగా ఓటు బ్యాంకు ను సృష్టించారన్నారు. జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావుకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని, రాష్ట్రములో ఆయన శిలాఫలకం వేయని గ్రామం లేదని అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి పునరాలోచన చేసుకొని తుమ్మలకు పాలేరు టికెట్ కేటాయిస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలు భారీ మెజార్టీతో గెలిపించే సత్తా తుమ్మల తీసుకుంటారన్నారు. కందల ఉపేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీని కాపాడాలని కోరారు.

తుమ్మల నాయకత్వాన్ని తుమ్మల బలగాన్ని అంత తేలికగా తీసుకోవద్దన్నారు. ప్రస్తుత రాజకీయాలు చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని తుమ్మలకు పాలేరు టికెట్ కేటాయించే విధంగా కేసీఆర్ కు విన్నవించాలని కోరారు. తుమ్మలను వదులుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు టికెట్ కేటాయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Ts: కోటి వృక్షార్చన లో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు

మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించి, కోటి వృక్షార్చన లో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవులలో రూ. 7.38 కోట్ల వ్య‌యంతో  256 ఎక‌రాల వీస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను

అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూగర్భ గనుల, సమాచార శాఖ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. 

అనంతరం సఫారీ వాహనంలో పార్కు అంతా కలియ తిరిగారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీఎస్ శాంతికుమారి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అర్బ‌న్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్ లో అదనపు ఆకర్షణగా నిలువ‌నుంది. ఈ పార్కులో గ‌జీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్, త‌దిత‌ర‌ స‌దుపాయాలు క‌ల్పించారు.

పార్క్ ప్రత్యేకతలు

విస్తీర్ణం: 256 ఎకరాలు

వ్యయం: రూ. 7.38 కొట్లు

పొడవు: 5.6 కి. మీ.

మొక్కలు: 50 వేల రకాలు

ట్రెక్కింగ్ ట్రాక్: 2 కి. మీ.

వాకింగ్ ట్రాక్: 4 కి. మీ.

109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను ఇప్పటివరకు 73 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. 74 వ పార్కును ఇవాళ ప్రారంభించుకున్నాం.

సెప్టెంబర్ మొదటి వారంలో నల్లగొండ ఐటీ హబ్ ప్రారంభం..స్థానిక లక్ష్మీ గార్డెన్స్ లో సెప్టెంబర్ 1న మెగా జాబ్ మేళా...

ప్రెస్ నోట్....

 సెప్టెంబర్ మొదటి వారంలో నల్లగొండ ఐటీ హబ్ ప్రారంభం.

 జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఐ టి హబ్ బ్రోచర్ విడుదల.

 స్థానిక లక్ష్మీ గార్డెన్స్ లో సెప్టెంబర్ 1న మెగా జాబ్ మేళా... నల్గొండ ఐటీ హబ్ కొరకు

 ఆర్గనైజ్ చేస్తున్నవారు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్

(TASK)

లోకల్ యూత్ కొరకు లోకల్ ప్లేస్ మెంట్లు.,

 ఎలిజిబిలిటీ... బి ఈ/ బీటెక్ /ఎనీ గ్రాడ్యుయేట్ /పోస్ట్ గ్రాడ్యుయేట్.

 సెప్టెంబర్ ఒకటో తేదీన లక్ష్మీ గార్డెన్స్ లో జరిగే ప్లేస్మెంట్లను స్థానిక యువత ఉపయోగించుకోవాలి...కంచర్ల

 నేడు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో... జరిగిన కార్యక్రమంలో... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఐటిఎఫ్ బ్రోచర్ ను విడుదల చేశారు... ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ... గతంలో ప్రజాప్రతినిధులు నల్లగొండ యువతను నల్లగొండలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని... చెప్పి ఐటీ మినిస్టర్ అయ్యుండి కూడా మోసం చేశారని... కానీ... కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం... నల్లగొండ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ... వారి ఆదేశాలతో... పురపాలక ఐటి శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు... నల్లగొండలో శంకుస్థాపన చేశారని... కేవలం 18 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకొని సెప్టెంబర్ 10 తారీకు లోపు ప్రారంభించుకో పోతున్నామని.... తెలియజేశారు.

ఇందుకు సెప్టెంబర్ ఒకటో తారీకు నాడు... స్థానిక లక్ష్మీ గార్డెన్స్ లో... వివిధ సంస్థలకు చెందిన వారు ప్లేస్మెంట్లు కొరకు ఇంటర్వ్యూ చేయనున్నారని... స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన లింకును QR కోడ్ ను ప్రెస్ కు విడుదల చేస్తున్నామని.. కంచర్ల తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో... జిల్లా కలెక్టర్ కర్ణన్.. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఐటీ హబ్ సీఈవో విజయ్ రంగీనేని.. TASK డైరెక్టర్ శ్రీకాంత్ సిన్హ... ప్రదీప్ రెడ్డి, హై కోర్ట్ అడ్వకేట్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని రేణుక ఎల్లమ్మ గుళ్లో పూజలు నిర్వహించిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని రేణుక ఎల్లమ్మ గుళ్లో పూజలు నిర్వహించిన 17వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని నల్గొండ 17వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్థానిక రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించి తమ నాయకుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు వచ్చే ఎలక్షన్లో మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించాలని, నల్గొండలో అభివృద్ధిని కొనసాగించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వనం చంద్రశేఖర్, మూడ వేణు, కట్ట హనుమంతు, జెల్ల మధు, రేకల వంశీ, కాశయ్య, షేక్ అన్వర్ పాషా, నాగేంద్ర, దొంత రవి, మిర్యాల కిరణ్, కైరం కొండ శివ శంకర్, పోషమ్ గిరి,మూడో శేఖర్, పున్న వెంకటేశ్వర్లు, వంశీ, రాపోలు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా 35వ వార్డు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆధ్వర్యంలో హనుమాన్ నగర్ రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా 35వ వార్డు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆధ్వర్యంలో హనుమాన్ నగర్ రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు..

నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నల్గొండ 35 వార్డు బి ఆర్ ఎస్ కార్యకర్తలు స్థానిక హనుమాన్ నగర్ రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు భూపాల్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరిఎన్నో జరుపుకోవాలని, ఎల్లవేళలా ఆ దేవుని ఆశీస్సులు తమ నాయకుని వెంటే ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో 35 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలారి యాదగిరి, జయప్రకాష్, శ్రీనివాస చక్రవర్తి, జెల్ల శ్రీను, కత్తుల నరసింహ, చింతల ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్పార్టీ అభ్యర్థిగా కంచర్లను ప్రకటించిన నాటి నుండి.. వెల్లువలా ప్రజల నుండి మద్దతు...

 నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్పార్టీ అభ్యర్థిగా కంచర్లను ప్రకటించిన వాటి నుండి.. వెల్లువలా ప్రజల నుండి మద్దతు...

 పలు ప్రజాసంఘాలవారు... మేధావులు యువకులు యువకుల నుండి విశేష స్పందన. 

నల్లగొండ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరి మద్దతు తనకు ఉంటుంది...

 నిన్న....ఈరోజు పలు వార్డులు గ్రామాల నుండి భారీ సంఖ్యలో చేరికలు....

 ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల కరస్పాండెంట్స్ కంచర్లను కలిసి తమ మద్దతు ప్రకటన..

 బిఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా.. ముఖ్యమంత్రి ప్రకటించిన నాటి నుండి... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి... పలు ప్రజా సంఘాలు, యాజమాన్యాలు, మేధావులు యువకులు, తమ మద్దతు తెలియజేస్తూన్నారు... గత మూడు రోజుల నుండి కూడా కంచర్ల నివాసం... కోలాహలంగా మారింది... ప్రైవేట్ పాఠశాలలు కళాశాల యాజమాన్యం తరఫున....పలువురు కరస్పాండెంట్లు విచ్చేసి తమ మద్దతు తెలియజేశారు...

నిన్న ఈరోజు పార్టీలో పలు గ్రామాల నుండి వార్డుల నుండి... వందల సంఖ్యలో వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతూన్నారు...

 

ఈరోజు.. నల్గొండ పట్టణం 9వ వార్డు నుండి... జిట్టా నగేష్, కూతటి రాములు ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ నుండి 50 కుటుంబాలు... జంగాల కాలనీహనుమంతు పర్వతం,ఆధ్వర్యంలో 25 కుటుంబాలు నడ్డివారిగూడెం వింజమూరు నరసింహ మొండి కత్తి అశోక్ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు.... మొత్తం 100 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. అదేవిధంగా పట్టణం 32 వార్డుకు సంబంధించి.. శ్రీ సాయి కాలనీ నుండి అక్కినేపల్లి గణేష్ నిమ్మల చందు ఆధ్వర్యంలో.. 50 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి.. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో

 బిఆర్ఎస్ పార్టీ చేరారు....

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.... గత ఎన్నికల్లో నల్లగొండ మార్పుకు సంబంధించి ప్రధానంగా ప్రజలకు చెప్పామని.. ప్రజలు ఏ మార్పు ఆశించి తనను గెలిపించారో.., కెసిఆర్ ఆశీర్వాదంతో ఆ మార్పును చేసి చూపిస్తున్నామని... అన్నమాట ప్రకారం నల్లగొండను దత్తత తీసుకున్న కెసిఆర్ నల్లగొండ నల్లవైపులా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని 1200 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయని... ఇప్పటికి 25% పనులు మాత్రమే పూర్తయ్యాయని... నల్లగొండ పట్టణం భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నదని ఎన్నో మౌలిక వసతులు కల్పించవలసినదని...కెసిఆర్ నాయకత్వంలో మాత్రమే అది సాధ్యమవుతుందని... అది అర్థం చేసుకున్న చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు... తమకు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరినవారందరికి తాము స్వాగతం పలుకుతున్నామని తన కుటుంబ సభ్యులవలె వారిని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని... పాత కొత్త వాళ్ళంతా కలిసి పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు.. కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్... 9వ వార్డు ఇంచార్జ్.. వజ్జే శ్రీనివాస్,రాం రెడ్డి,మల్లయ్య, అలుగుబెల్లి కిరణ్ కుమార్ రెడ్డి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత

సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత

సూర్యాపేట

 

భావితరాలకు మన సనాతన ధర్మాన్ని తెలియపరచడం తో పాటు ఆర్ధికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే సదాచార్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్త అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సదాచార్ ట్రస్ట్ సేవా మందిరంలో ఆర్ధికంగా వెనుకబడిన  కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన ముస్కు వెంకన్న,రేణుక కుమార్తె త్రిష వివాహము నిమిత్తం సూర్యాపేటకు చెందిన మిర్యాల శివకుమార్,కవిత దంపతుల సహకారంతో మంగళసూత్రం. ,మట్టెలు, నూతన వస్త్రములు అందజేసి మాట్లాడారు.

 

శ్రీ వామనాశ్రమ మహస్వామిజి ఆశీర్వచనంతో సదాచార్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ సాయి ఈశ్వర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ లో దాతల సహకారం తో ఆర్ధికంగా వెనుకబడిన పెండ్లి కుమార్తెలకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది వదువులకు ఇచ్చామని అందులో ఒక్క సూర్యాపేట జిల్లా లోనే 50 మంది వదువులకు మంగళసూత్రాలు, మట్టెలతో పాటు నూతన వస్త్రములు అందించినట్లు తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన హిందూ మతం లోని కుటుంబాలకు చెందిన వారు వివాహం చేసుకునే వధువు పెండ్లి పత్రిక ,ఆధార్ కార్డ్ , తెల్ల రేషన్ కార్డ్ తో మా కార్యాలయంలో ముందుగా సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  సదా చార్ ట్రస్ట్ సభ్యులు ఈగా విజయలక్ష్మి ,,బచ్చు పురుషోత్తం, వై.ఎల్.ఎన్.గౌడ్, దార జ్యోతి తదితరులు పాల్గొన్నారు..

జయప్రదంగా ఏఐఎస్ఎఫ్ ములకలపల్లి మండల మహాసభలు

జయప్రదంగా ఏఐఎస్ఎఫ్ ములకలపల్లి మండల మహాసభలు

స్థానిక ములకలపల్లి మండలం నందు ఏఐఎస్ఎఫ్ మండల మహాసభ ఏఎస్ఎఫ్ మండలం నాయకులు రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం, తెలంగాణ సాయుధ పోరాటం లోనూ, విద్యారంగ సమస్యల పట్ల పోరాటంలోనూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ కు ఒక చరిత్ర ఉందని చదువుతూ పోరాడు చదువుకై పోరాడు నినాదంతో విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ శాస్త్రీయ విద్య విధానం కోసం మొట్టమొదటిగా కొట్లాడింది అఖిలభారత విద్యార్థి సమైక్యానని,వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సూచించింది ఏఐఎస్ఎఫ్ అని, విద్యా విధానంలో విద్యార్థులకు అవసరమయ్యే సంస్కరణలు ఏఐఎస్ఎఫ్ సంఘంలో పనిచేయడం కోసం విద్యా రంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క విద్యార్థి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఈరోజు ఈ యొక్క మహాసభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సమితిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క మండల సమితిలో మండల కార్యదర్శిగా లలిత్ అధ్యక్షుడిగా పవన్ సహాయ కార్యదర్శి* నిఖిలేష్ వందన ప్రసాద్ శివ సందీప్ లను ఏకగ్రీవంగా తీసుకోవడం జరిగిందని వారు తెలియజేశారు,

ఈ కార్యక్రమంలో  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున రావు గారు ఏఐటీయూసీ జిల్లా నాయకులు యూసుఫ్ గారు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వరక అజిత్ తదితరులు పాల్గొన్నరు...

ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలి.. ఆగ‌మాగం కావొద్దు : సీఎం కేసీఆర్

ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలి.. ఆగ‌మాగం కావొద్దు : సీఎం కేసీఆర్

ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చేశాయి.. ఎన్నిక‌లు రాగానే వ‌డ్ల క‌ల్ల‌ల వ‌ద్ద‌కు అడుక్కుతినే వారు వ‌చ్చిన‌ట్లు చాలా మంది బ‌య‌ల్దేరుతారు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎద్దెవా చేశారు. ఎన్నిక‌లు వ‌స్తే ఆగ‌మాగం కావొద్దు. ఎల‌క్ష‌న్లు వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలి. నిజ‌మేంది.. వాస్త‌వ‌మేంది.. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారు. నిజ‌మైన ప్ర‌జా సేవ‌కుల‌ను గుర్తించిన‌ట్లు అయితే బ్ర‌హ్మాండ‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. అభివృద్ధి కూడా బాగా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. మెద‌క్ జిల్లాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఒక్క‌ట మాట మ‌నవి చేస్తున్నా.. ఘ‌న‌పురం ఆయ‌క‌ట్టు గ‌తంలో ఎప్పుడూ నీళ్లు రాలేద‌ని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ ఇవ్వండిని అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్ కాదు.. 50 ఏండ్లు కాంగ్రెస్ పాలించింది. కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నా ఘ‌న‌పురంకు నీళ్లు కావాలంటే మెద‌క్‌లో ఆర్డీవో ఆఫీసు వ‌ద్ద ధ‌ర్నా చేయాలి. ప్ర‌తి సంవ‌త్స‌రం ధ‌ర్నా చేస్తే త‌ప్ప నీళ్లు వ‌చ్చే ప‌రిస్థితి కాదు. ఘ‌న‌పురం కాల్వ‌ల‌లో తుమ్మ చెట్లు మెలిచాయి. కానీ నేను సీఎం అయ్యాక ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి స‌ర్వే చేసి.. ఘ‌న‌పురం ఎత్తు పెంచుకున్నాం. కాల్వ‌లు బాగు చేసుకున్నాం. 30 నుంచి 40 వేల ఎక‌రాల‌కు నీళ్లు అందిస్తున్నాం. గ‌త కాంగ్రెస్ నాయ‌కులు సింగూరు ప్రాజెక్టుకు హైద‌రాబాద్‌కు ద‌త్త‌త ఇచ్చి ఇక్క‌డ మ‌న పొలాలు ఎండ‌బెట్టారు. కానీ ఈ రోజు సింగూర్‌ను మెద‌క్‌కే డెడికేట్ చేసుకోవ‌డం కార‌ణంగా బ్ర‌హ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయి. ఘ‌న‌పురం ఆయ‌క‌ట్టు కింద ఒక గుంట ఎండిపోకుండా పంట‌లు పండించుకుంటున్నాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

రైతును బాగు చేయాల‌నే సంక‌ల్పంతో అనేక కార్య‌క్ర‌మాలు..

తెలంగాణ రాక‌ముందు చెట్టు ఒక‌రు, గుట్ట ఒక‌రు అయిపోయారని కేసీఆర్ గుర్తు చేశారు. భూమి ఉన్నా కూడా హైద‌రాబాద్ వ‌చ్చి ఆటో రిక్షా న‌డిపే స్థాయికి దిగ‌జారిపోయారు. దీంతో తెలంగాణ ఏర్ప‌డ‌గానే.. రైతును ఏ విధంగానైనా స‌రే బాగు చేయాల‌ని సంక‌ల్పంతో కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టాం. కాళేశ్వ‌రం నీళ్లు వ‌స్తున్నాయి. అదే ర‌కంగా ఇంకా అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రం చేసుకున్నాం. రైతుబంధు, రైతుబీమా అమ‌లు చేస్తున్నాం. నీళ్లు మాత్ర‌మే కాకుండా.. 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నాం. ఇవాళ రెండు పార్టీలో మ‌న‌తో బ‌రిలో ఉన్నాయి.. ఒక‌టి బీజేపీ.. మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌ని చెబుతున్నారు. క‌రెంట్ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్ట‌క‌పోవ‌డంతో దాదాపు ఇవాళ మ‌న‌కు రూ. 25 వేల కోట్ల న‌ష్టం క‌లిగించింది కేంద్రం. కానీ ఆ బాధ‌ను అనుభ‌వించుకుంటూ ప్రాణం పోయినా మీట‌ర్లు పెట్ట‌మ‌ని చెప్పాను. మ‌రో పార్టీ.. నిన్న కాక మొన్న‌ క‌ర్ణాట‌క‌లో గెలిచింది. ఇష్ట‌మొచ్చిన వాగ్దానాలు చేశారు. గెలిచిన తెల్లారే అక్క‌డ 7 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నారు. మ‌ళ్లీ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. తెలంగాణ‌లో 24 గంట‌లు క‌రెంట్ ఇచ్చుకుంటున్నాం. వాగులో, ప్రాజెక్టులో నుంచి మోటార్లు పెట్టి నీళ్లు తీసుకుంటున్నావా అని అడిగే వారు లేరు. కాబ‌ట్టే రైతులు బ్ర‌హ్మాండంగా పంట‌లు పండించుకుంటున్నారు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

స‌జీవంగా న‌దులు..

మెద‌క్‌లో పారే హ‌ల్దీ వాగు, మంజీరా వాగుల‌పై దాదాపు 30, 40 చెక్‌డ్యాంలు క‌ట్టుకుని ఆ న‌దులు 365 రోజులు స‌జీవంగా ఉండేలా చేసుకుంటున్నాం. కాళేశ్వ‌రంలో భాగంగా మ‌ల్ల‌న్న సాగ‌ర్ ద్వారా అక్క‌డ్నుంచి అవ‌స‌ర‌మున్న‌ప్పుడ‌ల్లా వాగుల్లో నీళ్లు విడుద‌ల చేస్తున్నాం. చెక్ డ్యాంలు మ‌త్త‌ళ్లు దుంకుతున్నాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.