/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఎన్నికల బరిలో కిషన్‌రెడ్డి సతీమణి? Yadagiri Goud
ఎన్నికల బరిలో కిషన్‌రెడ్డి సతీమణి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ , రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది.

అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

నార్మల్‌గా ఈసారి ఎన్నికల బరిలోకి వెళితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్టం. అందుకే ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

మొత్తం 119 అసెంబ్లీ స్థానాలను ఏ, బి, సి అనే మూడు కేటగిరీలుగా విభజించనుంది. మొదటి కేటగిరీలో ఇప్పటి వరకూ గెలిచిన స్థానాలు, రెండో కేటగిరీలో గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన స్థానాలు, మూడో కేటగిరిలో ఇప్పటివరకూ గెలవని స్థానాలను ఉంచబోతున్నారు.

గత ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చిన స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని.. ఈ స్థానాల్లోనే ప్రధాని మోదీ, అమిత్ షా వంటి దిగ్గజాల పర్యటనలు ఉండేలా చూసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన జాబితా ఇవ్వాలని రాష్ట్ర బీజేపీని అధిష్టానం అడిగినట్లు సమాచారం. అది అందిన వెంటనే బీజేపీ సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.........

మూడ్రోజులకే ఎమ్మెల్యే టికెట్ !

- భద్రచాలం బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం

- పార్టీలో చేరిన మూడ్రోజులకే టికెట్

- ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం

అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండగానే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మెుత్తం 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులతో జంబో లిస్ట్ విడుదల చేశారు. పార్టీ అంతర్గతంగా నిర్వహించిన వివిధ సర్వేల నివేదికల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించారు.

ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో వైరా, ఇల్లందు ఇద్దరు అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరిగినా.. ఇల్లెందులో బానోత్‌ హరిప్రియ నాయక్‌కు మరోసారి అవకాశం కల్పించారు. వైరాలో మాత్రం రాములు నాయక్‌కు మెుండిచెయ్యి చూపించారు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మె్ల్యే మదన్ లాల్‌కు అవకాశం కల్పించారు.భద్రాచలం నియోజవర్గానికి చెందిన తెల్లం వెంకట్రావుకు పార్టీలో చేరిన మూడ్రోజుల్లోనే టికెట్ సాధించారు.

మాజీ ఎంపీ పొంగులేటి ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకట్రావు.. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడి రాహుల్‌ గాంధీ సమక్షంలో ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నెల రోజుల్లోనే మళ్లీ సొంత గూటికి చేరిన తెల్లం వెంకట్రావును భద్రాచలం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వైఎస్సాఆర్‌సీపీలో పనిచేశారు.

పొంగులేటి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలుపొందగా.. తెల్లం వెంకట్రావు మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత పొంగులేటితో కలిసి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు .2018 ఎన్నికల్లో భద్రాచలం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తెల్లం.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత కూడా ఆయన భద్రాచలం బీ‌ఆర్‌ఎస్ ఇంఛార్జ్‌గా కొనసాగారు. అయితే పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేక గళం వినిపించి పార్టీకి దూరమవ్వగా... తెల్లంగా కూడా గూలాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత నెలలో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటితో కలిసి హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల రోజులకే ఈనెల 17న మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన దాదాపు మూడ్రోజులకే ఆయన బీఆర్ఎస్ పార్టీ తిరిగి టికెట్ ఇచ్చింది.

ఈ నెల 28న ఢిల్లీకి చంద్ర‌బాబు :ఈసికి ఫిర్యాదు చేయ‌నున్న‌టిడిపి అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.

ఓట్ల తొలగింపులో ఉరవకొండ తరహా ఘటనలు ఉన్నాయని ఆయన సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైసీపీ సానుభూతిపరులకు సంబంధించిన దొంగ ఓట్లను చేర్చడం, టీడీపీ అనుకూల ఓట్లను తొలగించడం తదితర అంశాలను ప్ర‌స్తావించ‌నున్నారు..

వాలంటీర్లతో టీడీపీ, వైసీపీ అనుకూల ఓట్ల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోందని.. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి చంద్రబాబు తెలియజేయనున్నారు.

ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ, విశాఖ తదితర ఘటలకు సంబంధించిన సాక్ష్యాలను అందజేయనున్నారు.

ఉర‌వ‌కొండ అవ‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డ ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేసిన విష‌యాన్ని ఈసికి తెలుప‌నున్నారు

చంద్ర‌బాబు.. ఇదే సమయంలో టీడీపీ నేతల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. అక్రమాలు నివారించాలని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు...

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ఎక్కడ:కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ టికెట్ల పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమం ఎక్స్‌ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం ఉంది కాబట్టే దేశంలో 14 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.

చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురానిదే పరిస్థితుల్లో మార్పు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూద్దామన్నారు.

బీఆర్ఎస్ పార్టీ టికెట్ల పంపిణీపై వెళ్లగకుతున్న అక్కసును తాము అర్థం చేసుకుంటున్నామని, టికెట్లు రాని అభ్యర్థులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మీ రాజకీయ అభద్రతాభావాన్ని మహిళ ప్రాతినిధ్యానికి ముడి పెట్టవద్దని హితవు పలికారు. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచి మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని,దీనిపై yకేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

మహిళా హక్కులపై ఆయన ఆందోళన ఆశ్చర్యపరిచినప్పటికీ స్వాగతిస్తున్నానని, చివరికి బీజేపీ నుంచి ఎవరోఒకరు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను ధ్రువీకరించారని పేర్కొన్నారు...

ఘరానా మోసం: హెయిర్ క్లిప్పుల రూపంలో బంగారం రవాణా..

హైదరాబద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు..

బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు.

హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. గాజులు ఇతర నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా గుర్తించారు.

ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదెరాబాద్ తరలించిన ఈ బంగారాన్ని పాక్స్ ప్రొఫైలింగ్, నిఘా విభాగం సమర్ధవంతంగా వ్యవహరించి పట్టుకున్నామని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ జోన్ అనే ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బంగారం మొత్తం 397 గ్రాములు ఉంటుందని దాని ఖరీదు సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు..

SB NEWS

Rekha Naik : బీఆర్ఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ రేఖానాయక్ సంచలనం..

ఆదిలాబాద్ : బీఆర్ఎస్ పై ప్రతి కారం తీర్చుకుంటామంటుని ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు అంటున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలపై గురి పెట్టనుబోనన్నారు..

ఖానాపూర్ పై రేఖా నాయక్, ఆసిఫాబాద్ నుంచి ఆమె భర్త శ్యాం నాయక్ దృష్టి పెట్టారు.

అవకాశం ఇస్తే రెండు చోట్లా పోటీ చేస్తామని వెల్లడించారు. ఏదో ఒక టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇటీవల రేఖా భర్త శ్యామ్ నాయక్ వీఆర్ఎస్ తీసుకున్నారు.

అసలు ఎస్టీయే కాని జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చారని రేఖా నాయక్ ఆరోపించారు.

జాన్సన్ నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన ఎస్టీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏమిటో చూపిస్తానని రేఖా నాయక్ అన్నారు.

Chandrababu: మీరు నిండు నేరుళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. చిరుకు చంద్రబాబు బర్త్‌డే విషెస్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలియజేశారు..

నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకున్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు చిరుకు బర్త్‌డే విషెస్ తెలిపారు. 

"స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి సీనీ అభిమానుల హృదయాలలో చిరంజీవిగా చిరస్థానాన్ని పదిలపరుచుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

సినీ పరిశ్రమ భవిష్యత్తును, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు.. నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

SB NEWS

SB NEWS

Chandrayaan-3: లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు.. 60 సెకన్లలో చంద్రయాన్‌-3 ప్రయాణం

కోట్లాది మంది భారతీయులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో మన వ్యోమనౌక జాబిల్లి (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది..

జులై 14న శ్రీహరికోటలోని షార్‌ ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3).. బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.

ఈ క్రమంలోనే 40 రోజుల చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని 60 సెకన్లలో చూపిస్తూ PIB (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) ఓ వీడియో రూపొందించింది..

ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3 (Chandrayaan-3)ను రూపొందించినప్పటి నుంచి షార్‌ వేదిక వద్ద ప్రయోగం, రోదసిలోకి దూసుకెళ్లడం, భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి మారడం వంటివి ఇందులో చూపించారు. చివరగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ అడుగుపెట్టినట్లు ఆ వీడియోలో ఉంది.

విక్రమ్‌ ల్యాండర్‌ కిందకు దిగగానే అందులోని ప్రజ్ఞాన్‌ రోవడ్‌ జారుకుంటూ బయటకు వచ్చినట్లు ఊహాజనితంగా యానిమేషన్‌ రూపంలో వీడియోలో చూపించారు.

అన్ని అనుకూలిస్తే రేపు సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ కాలుమోపనుంది. ఆ తర్వాత రెండు వారాల పాటు ల్యాండర్‌, రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. ఇక, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను లిఖించనుంది..

PM Modi: బ్రిక్స్‌లో బలమైన సహకారంపై చర్చిస్తాం: మోదీ

బ్రిక్స్‌(BRICS) సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అభిప్రాయపడ్డారు.

ఆయన మంగళవారం ఉదయం దిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు.

ఈ సారి బ్రిక్స్‌ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని వెల్లడించారు.

''పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, బహుళపక్ష వ్యవస్థల సంస్కరణలను చర్చంచడానికి బ్రిక్స్‌ విలువైన వేదికగా మారిందని భావిస్తున్నాను'' అని ప్రధాని మోదీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతరం ప్రధాని ఎక్స్‌ (ట్విటర్)లో ఓ పోస్టు చేశారు.

''జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళుతున్నాను. బ్రిక్స్‌-ఆఫ్రికా, బ్రిక్స్‌ప్లస్‌ సమావేశాలు కూడా జరగనున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా మారింది'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు..

నేడు వామపక్షాల కీలక సమావేశం

పొత్తు అంశం ప్రస్తావన లేకుండానే సీఎం కేసీఆర్ 115 అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

మునుగోడు ఎన్నికల సందర్భంగా వామపక్షాలు గులాబీ పార్టీకి మద్దతు తెలిపాయి.

ఇక, వామపక్ష పార్టీలతో పొత్తు లేదని సీఎం కేసీఆర్ తేల్చేసిన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు నేడు కీలక సమావేశం జరగనుంది.

భవిష్యత్ కార్యచరణపై సీపీఐ, సీపీఎం చర్చించనున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచనలో సీపీఐ, సీపీఎం ఉన్నట్లు తెలిసింది.

ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్ కార్యచరణపై భేటీలో చర్చించనున్నారు.పొత్తులో భాగంగా కొత్తగూడెం, పాలేరు టికెట్లను వామపక్షాలు కోరాయి...