/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Mancherial: ఎడ్లబండి, ఆటో, అంబులెన్స్‌.. గర్భిణి ఆస్పత్రి తరలింపునకు అష్టకష్టాలు Yadagiri Goud
Mancherial: ఎడ్లబండి, ఆటో, అంబులెన్స్‌.. గర్భిణి ఆస్పత్రి తరలింపునకు అష్టకష్టాలు

నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించడానికి కుటుంబసభ్యులు, స్థానికులు అష్టకష్టాలు పడ్డారు. కోనంపేట పంచాయతీలోని పాటి గ్రామానికి చెందిన రెడ్డి మల్లక్క నాలుగు నెలల గర్భిణి..

మూడు రోజుల నుంచి తీవ్రమైన జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది.

అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతోపాటు రక్త స్రావం కావడంతో ఆమెను బెల్లంపల్లిలోని ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.

పాటి గ్రామం నుంచి కోనంపేట వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎడ్ల బండిలో పంచాయతీ కార్యాలయం వరకు అతి కష్టం మీద తీసుకెళ్లారు.

అక్కడి నుంచి ఆటోలో ఎర్ర వాగును దాటించారు. అప్పటికే 108 అంబులెన్స్ ఎర్ర వాగు అవతల వైపు బురదలో చిక్కుకుంది. దీంతో స్థానికుల సాయంతో బురద నుంచి అంబులెన్స్‌ను వెలికి తీశారు. అనంతరం ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..

Lokesh: బాహుబలిలో కుంతల రాజ్యం.. జగనన్న పాలనలో గుంతల రాజ్యం: లోకేశ్‌

ఒంగోలు: బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశాం.. జగనన్న పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

యువగళం పాదయాత్రలో భాగంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో లోకేశ్‌ మాట్లాడుతూ.. జగనన్న ఒక్క గుంత కూడా పూడ్చలేకపోతున్నారని విమర్శించారు.

''జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదు. ఆయనొక అద్భుతమైన కటింగ్‌, ఫిటింగ్‌ మాస్టర్‌. జగన్‌ దగ్గర రెండు బటన్లు ఉంటాయి.. బల్లపైన బ్లూ బటన్‌, బల్లకింద రెడ్‌ బటన్‌. భారత దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌. మహిళలకు జగన్‌ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు.

మహిళల కన్నీరుతుడిచే బాధ్యత తెదేపా తీసుకుంటుంది. చంద్రబాబు హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.650 ఉంటే.. ఇప్పుడు రెట్టింపయ్యింది. తెదేపా ప్రభుత్వం రాగానే యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం..

రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది. నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బడుగు, బలహీన వర్గాలంటే సీఎం జగన్‌కు చిన్నచూపు. జగన్‌ పేదల పక్షపాతి కాదు. రైతులకు రుణమాఫీ చేసింది తెదేపానే. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసింది తెదేపా. పేదలకు సీఎం జగన్‌ చేసిందేమీ లేదు. పేదలకిచ్చిన 3లక్షల ఇళ్ల పట్టాలను వెనక్కి లాక్కున్నారు. నాలుగేళ్లలో జగన్‌ పూర్తి చేసిన ఇళ్లు 9,500 మాత్రమే. చంద్రబాబు హయాంలో 3లక్షల ఇళ్లు పూర్తి చేశాం. 3లక్షల ఇళ్లు కట్టాలంటే జగన్‌ వంద జన్మలు ఎత్తాలి'' అని లోకేశ్‌ అన్నారు..

Machilipatnam: ఇది చెరువు కాదు.. జగనన్న కాలనీ లేఅవుట్‌..

మచిలీపట్నం: రాజకీయ లబ్ధి కోసం జగన్‌ ప్రభుత్వం నివాస యోగ్యం కాని స్థలాల్లో పట్టాలు ఇచ్చి వారి ఉసురు పోసుకుంటోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు..

రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్‌గా పాలకులు చెబుతున్న కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కరగ్రహారం పరిధిలోని 360 ఎకరాల లేఅవుట్‌ రెండు రోజుల వర్షానికే చెరువును తలపిస్తోందన్నారు.

తెదేపా కార్పొరేటర్‌లతో కలిసి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బాబా ప్రసాద్‌ లేఅవుట్‌ను పరిశీలించారు.

అనంతరం తెదేపా నాయకులు మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటోందన్నారు.

నగరంలో నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ఇచ్చేందుకు మనసురాని ప్రభుత్వం.. పనికిరాని స్థలాల్లో పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టుకోకుంటే రద్దు చేస్తామనడం దుర్మార్గమన్నారు..

కరెంట్‌ కోతలపై నిరసన ఉద్రిక్తం.. ఆందోళనకారులపై పోలీసుల కాల్పులు..

పట్నా: బిహార్‌ (Bihar)లోని కటిహార్‌ జిల్లాలో కరెంట్‌ కోతలకు (power outage) వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన (Protest) హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా..

మరికొందరు గాయపడ్డారు.

కటిహార్‌లోని బార్సోయి ప్రాంతంలో కరెంట్‌ కోతలు, విద్యుత్ టారిఫ్‌ (Power Tariff)లను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. స్థానిక విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఆఫీసుపైకి రాళ్లు విసిరి అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు..

ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు పోలీసులు తొలుత లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్‌, ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు..

JOB Notification: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌: తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ (job notification in telangana) విడుదలైంది. కమిషనర్‌ ఆఫ్ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో 1,520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకానికి బుధవారం సాయంత్రం నోటిఫికేషన్‌ వెలువడింది..

ఈ పోస్టులకు ఆగస్టు 25 ఉదయం 10.30గంటల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 19 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

కౌన్సిల్‌ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (మహిళ) ట్రైనింగ్‌ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్‌ ఒకేషనల్‌ మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) ట్రైనింగ్‌ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్‌ ట్రైనింగ్‌ చేసి ఉండాలి.

అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలింపు కల్పించారు.

హెల్త్‌ అసెస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050గా నిర్ణయించారు..

దరఖాస్తు రుసుం: ఆన్‌లైన్ దరఖాస్తు రుసుం రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఓఎంఆర్‌ లేదా కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడించనున్నారు. పరీక్ష ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు..

High Courts: హైకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారంలో.. ఇప్పటికే 7 చోట్ల అందుబాటులో!

దిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు హైకోర్టుల్లో (High Court) కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ వ్యవహారాలు సంబంధిత హైకోర్టు పాలనా పరమైన అంశాల్లోకే వస్తాయని..

అందులో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర ఏమీ ఉండదని తెలిపింది. కోర్టు వ్యవహారాలు ఆన్‌లైన్‌లో (Live Streaming) కొనసాగడం ఎంత అవసరమో కరోనా మహమ్మారి సమయంలో అర్థమయ్యిందని ప్రభుత్వం అభిప్రాయపడింది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేష్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ ఈ సమాధానమిచ్చింది. '2023 జులై 17 నాటికి గుజరాత్‌, గువాహటి, ఒడిశా, కర్ణాటక, ఝార్ఖండ్‌, పట్నా, మధ్యప్రదేశ్‌ హైకోర్టుల్లో ఇప్పటికే లైవ్‌ స్ట్రీమింగ్‌ మొదలైంది. మీడియాతోపాటు ఇతర ఔత్సాహిక వ్యక్తులు వీటిని వీక్షించవచ్చు' అని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది..

న్యాయస్థానాల్లో మరింత పారదర్శకత తీసుకురావడంలో భాగంగా కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని 'స్వప్నిల్‌ త్రిపాఠీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా' కేసు సందర్భంగా భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) సూచించింది.

ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన కోసం సుప్రీం కోర్టు ఈ-కమిటీ ఛైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో ఓ సబ్‌ కమిటీ ఏర్పాటయ్యింది. అనంతరం కమిటీ రూపొందించిన నిబంధనలను అమలు చేయాలని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు సుప్రీం కోర్టులోనూ గత సెప్టెంబరు 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే..

Ts BJP: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు..

హైదరాబాద్: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీకి చెందిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీరుపై ఆ జిల్లా కార్యకర్తలు ఆందోళనకు దిగారు..

పార్టీ కార్యాలయంలో బైఠాయించి ఎంపీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అర్వింద్‌ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌ మండలాలకు చెందిన కార్యకర్తలు నిరసన తెలిపారు.

సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపీ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిన మండలాల అధ్యక్షులను తిరిగి నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.

అక్కడున్న పార్టీ నేతలు చెప్పినా వినిపించుకోని కార్యకర్తలు.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డే తమకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. చివరకు కిషన్‌రెడ్డితో సమావేశం ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు..

Bhadrachalam: గోదావరికి పోటెత్తిన వరద.. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. గంటగంటకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు..

దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటిమట్టం మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

భద్రాచలం వద్ద గోదావరి నుంచి 9,92,794 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

SB NEWS

SB NEWS

Manipur : మణిపుర్‌లో మళ్లీ అల్లరిమూకల విధ్వంసం.. ఇళ్లు, బస్సులకు నిప్పు

ఇంఫాల్‌ : మణిపుర్‌లో (Manipur) అల్లరి మూకల విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మోరే జిల్లాలోని మోరే బజార్‌ ప్రాంతంలో కొందరు దుండగులు పలు ఇళ్లకు ఇవాళ నిప్పు పెట్టారు..

అయితే ఆ ఇళ్లలో ఎవరూ నివాసం ఉండట్లేదని తెలిసింది. ఈ ప్రదేశం మయన్మార్‌ (Myanmar) సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు రవాణా కోసం వినియోగించే రెండు బస్సులను సైతం ఇలాగే ముష్కరులు తగులబెట్టారు. సపోర్మీనా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

మణిపుర్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ బస్సులు దిమాపుర్‌ వైపు నుంచి వస్తుండగా.. స్థానికులు వాటిని అడ్డుకున్నారు. బస్సుల్లోకి ఎక్కి ఇతర తెగ ప్రజలెవరైనా అందులో ఉన్నారా అని సోదాలు చేశారు. ఆ తరువాత వాటిని దహనం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు..

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో దాదాపు మూడు నెలల క్రితం మైతేయ్‌, కుకీ జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఆ రాష్ట్రం రావణకాష్ఠంలా రగులుతోంది. వివిధ అల్లర్లలో సుమారు 160 మంది చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మొబైల్ రీఛార్జ్, ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర ఆన్‌లైన్ సేవలతోపాటు ఆఫీసులు, వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నవారిపై ఇంటర్నెట్‌ నిషేధం ప్రభావం చూపుతోన్న కారణంగా కొన్ని షరతులతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను హోంశాఖ మంగళవారం నుంచి పునరుద్ధరించింది..

నాడు మోదీ చెప్పిన జోస్యమే ; నిజమైందా ❓️

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై బుధవారంనాడు ఒకేసారి రెండు అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇవ్వడం విశేషమైతే, 2019లో మోదీ చెప్పిన జోస్యమే నిజమైందని అధికార బీజేపీ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించింది.

దీంతో మోదీ ఐదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యల వీడియో ఒక్కసారిగా వైరల్ అవుతోంది...

అది 2019 ఫిబ్రవరి 7వ తేదీ. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, విపక్ష పార్టీలు 2023లో మరో అవిశ్వాస తీర్మానానికి సిద్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఏడాది క్రితమే విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తమ ప్రభుత్వం ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

''2023లో మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చే అవకాశం మీకు వస్తుంది. మీకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను'' అని మోదీ లోక్‌సభలో అనగానే, అధికార సభ్యులు నవ్వులు చిందిస్తూ గట్టిగా బల్లలు చరిచారు. సమర్పణ భావం సేవాభావం తో ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు ఈ స్థాయికి అధికార హోదా వచ్చామని, అహంకార భావంతో 400 మంది ఎంపీలున్న వారు 40

మంది సభ్యులకు కుదించుకుపోయారని పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి చురకలు వేశారు. మోదీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ నేతలతో సహా సోనియాగాంధీ కూడా సభలోనే ఉన్నారు.

2018లో అవిశ్వాస తీర్మానం...

మోదీ సర్కార్‌పై 2018లో ఎన్.చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పలు విపక్ష పార్టీలు ఈ తీర్మానాన్ని బలపరచాయి.

కాగా, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. 26 పార్టీల కూటమి ఇండియా లోని బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2019లోనే మోదీ ఈ అవిశ్వాస తీర్మానంపై జోస్యం చెప్పారంటూ ప్రభుత్వ వర్గాలు అలనాటి వీడియోను షేర్ చేశాయి....