పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..కమిషనర్ శ్వేత పిలుపు
సిద్దిపేట జిల్లా :జులై 20
జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ శ్వేత కోరారు.
పోలీస్ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండేలా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వాగుల, చెరులు, నిండుకుండలా నిండి ప్రవహిస్తున్నాయి మరియు ప్రాజెక్టుల దగ్గరికి ఎవరు వెళ్ళవదనీ ప్రజలకు సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను గురువారం సమావేశపరిచి సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆమె కోరారు..
జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించేనా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, రోడ్స్ టాపర్స్ , తాడు మరే ఇతర పరికరాలు అడ్డంపెట్టి సంబంధిత గ్రామల సర్పంచులకు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల సర్పంచులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు సిబ్బంది హెడ్క్వార్టర్ వదిలి వెళ్లవద్దని తెలిపారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు...










Jul 20 2023, 16:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.6k