/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz జనసేన బిజెపి పొత్తు ఉంటుందా❓️ Yadagiri Goud
జనసేన బిజెపి పొత్తు ఉంటుందా❓️

•ఢిల్లీలో జనసేనాని వరుస భేటీలు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవార మిక్కడ బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయన నార్త్‌ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో షాను కలుసుకున్నారు.

ఇద్దరూ 25 నిమిషాలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, జగన్‌ వ్యవహారంపై మంతనాలు సాగించినట్లు తెలిసింది.

మంగళవారం ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే వచ్చిన పవన్‌.. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి అన్ని శక్తులు ఏకం కావాలన్నదే తమ లక్ష్యమని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పొత్తులు, జగన్‌ ప్రభుత్వం తీరుపై అమిత్‌ షాతో ఆయన చర్చించినట్లు సమాచారం. నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్న భవిష్యత్‌ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పవన్‌ ఆ తర్వాత ఆశాభావం వ్యక్తం చేశారు.

పవన్‌ను కలిశానని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై అభిపాయ్రాలను పంచుకున్నామని షా ట్విటర్‌లో తెలిపారు. బుధవారం ఉదయం పవన్‌.. బీజేపీ ఏపీ ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ఇంట్లో అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, జనసేనతో పొత్తులపై చర్చించినట్లు మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు...

సాయిచంద్‌ భార్య రజినీకి కీలక బాధ్యతలు.. కేటీఆర్‌, మంత్రులు హాజరు..

హైదరాబాద్‌: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్మన్‌గా రజనీ సాయిచంద్‌ గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు..

సాయిచంద్‌ స్థానంలో ఆయన సతీమణి రజనిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరవుతారు.

SB NEWS

SB NEWS

తిరుమలలో భక్తుల రద్దీ.. కొనసాగుతుంది

తిరుపతి :జులై 20

తిరుమలలో నేడు గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అయితే ముందే బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కాస్త త్వరగా అవుతోంది.

బుధవారం 74,024 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 32688 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు....

INDIA: 'ఇండియా' కూటమి తొలి భేటీకి ముహూర్తం ఖరారు

దిల్లీ: కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA)పై ఉమ్మడి పోరుకు జట్టు కట్టిన ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (INDIA- ఇండియా) అనే పేరును ప్రకటించాయి..

ఈ క్రమంలో ఇండియా కూటమి తొలి సమావేశం గురువారం జరగనుందని తెలుస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఛాంబర్‌లో ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశం కానున్నారు.

గురువారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజు నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు.

ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై సమన్వయంతో వ్యవహరించాలని రెండు రోజులపాటు బెంగళూరులో జరిగిన భేటీలో ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ క్రమంలో మరోసారి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. 26 పార్టీల ఇండియా కూటమికి లోక్‌సభలో 150 మంది సభ్యులు ఉండగా, ఎన్డీయేకు 330 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనుండటంతో ఈ విడత పార్లమెంటు సమావేశాలు ఆసక్తిగా కొనసాగే అవకాశముంది..

అధికారుల‌తో కెటిఆర్ స‌మీక్ష‌

ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కే. తారక రామారావు పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు నానక్రామ్ గూడా లోని హెచ్ జిసిఎల్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జిహెచ్ఎంసి, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు.

ఇప్పటికే జిహెచ్ఎంసి వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని సంసిద్ధంగా ఉన్నట్లు జిహెచ్ఎంసి అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. ఈ మేరకు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డి వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు.

జిహెచ్ఎంసి చేపట్టిన ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వలన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పుతాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా అధికారులు వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్షాల వలన ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పని చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ నగర పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఈ సమీక్ష సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తుందని అయితే దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాల వలన నగరంలో చెత్త ఉత్పత్తి పెరుగుతున్నదని, ఈ మేరకు పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు తమ తక్షణ, స్వల్పకాలిక పారిశుధ్య ప్రణాళికలను మంత్రి కేటీఆర్ కి వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, ఆ దిశగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు....

Purandeswari: త్వరలో పవన్‌కల్యాణ్‌తో భేటీ: పురందేశ్వరి

అమరావతి: ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలోనూ లేవని భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఎద్దేవా చేశారు.

ఆర్థిక వ్యవహారాల్లో ఏపీని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

త్వరలో జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)తో భేటీ అవుతానని పురందేశ్వరి చెప్పారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.

క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలో తాను జోన్ల వారీగా పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు..

''ఏపీలోని ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం రూ.7.14లక్షల కోట్ల మేర అప్పు చేసింది. అనధికార అప్పులే రూ.4లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని పురందేశ్వరి డిమాండ్‌ చేశారు..

చంద్రబాబు వారసుడే రేవంత్ రెడ్డి.. మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా :జులై 19

కాలం కాక‌పోయినా.. రెండు పంట‌లు పండే నీళ్లు మ‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని రైతుల‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు భ‌రోసానిచ్చారు. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సిద్దిపేట రూర‌ల్ మండ‌లం లోని రాఘ‌వాపూర్ రైతు వేదిక‌లో ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా బుధవారం నిర్వ‌హించిన స‌మావేశంలో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

ఒక గంట క‌రెంట్‌తో ఒక గుంట భూమి కూడా త‌డ‌వ‌ద‌ని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తెలివి లేని మాట‌లు మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడో దొంగ రాత్రి క‌రెంట్ ఇచ్చేవార‌ని తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రైతులు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. దొంగ రాత్రి క‌రెంట్ ఇస్తే.. ఆ స‌మ‌యంలో బావుల వ‌ద్ద‌కు వెళ్లి పాము కాట్ల‌కు రైతులు ఎంద‌రో బ‌ల‌య్యారు. క‌రెంట్ షాక్‌ల‌తో కూడా రైతులు చ‌నిపోయార‌ని మంత్రి గుర్తు చేశారు.

ఒక విద్యుత్ క‌నెక్ష‌న్ మీద ప్ర‌భుత్వం రూ. 25 వేలు ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఏడాదికి రూ. 12 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. రైతుబంధు కింద రూ. 14 వేల కోట్లు ఇస్తున్నామ‌ని తెలిపారు. గోడౌన్లు ఇంకా మిగ‌తా వాటికి రూ. 6 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

చంద్ర‌బాబు వార‌సుడే రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. వ్య‌వ‌సాయం దండ‌గ అని.. ఐటీ కంపెనీలు పెంచండి అని బాబు అన్నారు. క‌రెంట్ బిల్లులు త‌గ్గించ‌మ‌న్న రైతుల‌ను బ‌షీర్‌బాగ్‌లో కాల్చి చంపించాడ‌ని గుర్తు చేశారు. ఈ విష‌యాల‌పై రైతులు చ‌ర్చ చేయాలి. గ‌తంలో మ‌న‌కు క‌రువొచ్చి బ‌త‌క‌డానికి వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు మ‌న వ‌ద్ద‌కు బ‌తికేందుకు వ‌స్తున్నారు. కాంగ్రెస్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టాల‌ని రైతులను కోరుతున్నాన‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు........

'వందేమాతరం' నినాదాన్ని నా మతం అనుమతించదు SP ఎమ్మెల్యే అబూ అజ్మీ

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ వందేమాతరం చెప్పడానికి నిరాకరించడంతో ఈరోజు మహారాష్ట్ర శాసనసభలో గందరగోళం చెలరేగింది.వందేమాతరం గురించి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.కొద్దీ తర్వాత సభ వాయిదా పడింది.

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అజ్మీ.. ఎవరి ముందు తలవంచేందుకు తన మతం అనుమతించదని ప్రకటన ఇచ్చారు. అందుకే వందేమాతరం అని చెప్పలేం. మా అమ్మ ముందు మనం కూడా తల వంచుకోము. మేము అల్లా ముందు మాత్రమే తల వంచుకుంటాము. అఫ్తాబ్ పూనావాలా పేరుతో ముస్లింల పరువు తీశారని అజ్మీ అన్నారు.

నా హృదయంలో నా దేశం పట్ల గౌరవం తగ్గదు - అజ్మీ

ఇది కాకుండా, అబూ అజ్మీ మాట్లాడుతూ, 'ఈ దేశం కోసం వారి పూర్వీకులు తమ ప్రాణాలను అర్పించిన వారిమే, మేము భారతదేశాన్ని తమ దేశంగా భావించాము మరియు పాకిస్తాన్ కాదు. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించిన వాని ముందు తలవంచాలని ఇస్లాం బోధిస్తుంది.

నా మతం ప్రకారం, నేను వందేమాతరం మాట్లాడలేకపోతే, అది నా దేశం పట్ల నాకున్న గౌరవాన్ని మరియు నా హృదయంలో నా దేశభక్తిని తగ్గించదు మరియు అది ఎవరికీ ఎటువంటి అభ్యంతరం కలిగించకూడదు, మీరు ఈ దేశానికి చెందిన వారైతే, మేము కూడా !

ఒక మతాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు

అఫ్తాబ్ పూనావాలా పేరుతో ముస్లింల పరువు తీశారని అజ్మీ అన్నారు. దీని తర్వాత, అజ్మీ, ఔరంగాబాద్‌లోని రామాలయం వెలుపల జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ, మీరు భారతదేశంలో జీవించాలనుకుంటే వందేమాతరం అంటే ఏమిటని అక్కడ నినాదం చేశారు. దీంతో వాతావరణం అస్తవ్యస్తం కావడంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి తరలించారు. మళ్లీ రాత్రికి పదిహేను ఇరవై మంది అక్కడికి వచ్చారు. దీంతో ఇరువర్గాల వారు అక్కడికి రావడంతో నినాదాలు, వాగ్వాదం మొదలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం ఇరువైపులా 250-250 మంది ఉన్నారని అజ్మీ తెలిపారు. అందుకే ఒకే మతానికి చెందిన వారిని ఎందుకు అరెస్టు చేశారన్నది నా ప్రశ్న.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే లేదు?

బీసీ నేతలపై కాంగ్రెస్ పార్టీ బరితెగించి మాట్లాడుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవటానికి బీసీ నేతలు సిద్దమవుతున్నామన్నారు.

బీసీ నేతలను అవమానించే వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొంటామన్నారు. బీసీలకు జరుగుతోన్న అవమానంపై కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు స్పందించాలని కోరారు.

ఇందిరా, రాజీవ్‌గాంధీ, సోనియాదగాంధీలను తిట్టినవారు కాంగ్రెస్‌ కు నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రతి బీసీ కులాన్ని కించపరిచేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకత్వాన్ని బలహీనపరిచే కుట్ర కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు..

సచ్చేది లేదంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా బీఆర్ఎస్‌లో ఉన్న బీసీ నేతల‌ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు....

మోడీ ఫాసిస్టు విధానాలపై ఉద్యమించడమే కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డికి నివాళి

మోడీ ఫాసిస్టు విధానాలపై ఉద్యమించడమే కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డికి నివాళి

-- CPI (M-L) న్యూడెమోక్రసీ

గోడవరిలోయ ప్రతిఘటనోద్యమ నాయకుడు,అజ్ఞాత దళ కమాండర్,సరసనపల్లిలో బూటకపు ఎన్ కౌంటర్లో అమరుడైన కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని శ్రామిక భవన్ కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్,ఇఫ్టూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి బొంగరాల నర్సింహ, బొమ్మిడి నగేష్ లు మాట్లాడుతూ పీడిత,తాడిత అణగారిన వర్గాలకోసం కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి రూపొందించిన ప్రతిఘటన పోరాట వెలుగులో కృష్ణారెడ్డి ఉద్యమిచాడని అన్నారు.గ్రామంలో పెత్తందార్లు,భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాడని అన్నారు.తీవ్ర నిర్బందాలను ఎదుర్కొని అశేష ప్రజల విముక్తికోసం కామ్రేడ్ కృష్ణారెడ్డి పోరుబాట పట్టాడని అన్నారు.

ఖమ్మం,వరంగల్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు,గిరిజనులకు,దళిత,బహునులకు ఆత్మబందువుగా విజయ్ అన్నగా పరిచయమై అజ్ఞాత దళ నాయకుడుగా పొడు భూముల రక్షణకై ఉద్యమించాడని కొనియాడారు.

కామ్రేడ్ విజయన్న ను నరహంతక చంద్రబాబు ప్రభుత్వం 2000 సంవత్సరం జూలై 19 సరసనపల్లి అడవులను చుట్టుమట్టి కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డి (విజయ్)తోపాటు భరత్,రాజులను బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేసిందని అన్నారు.వారి ఆశయాల సాధనకోసం బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని అన్నారు.

మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అనుసరిస్తుందని ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రావుల వీరేశ్,జానపాటి శంకర్,కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహ, మామిడాల ప్రవీణ్, చింతల వెంకటరమణ, యం.డి సర్వాన్,జెర్రిపోతుల రాము తదితరులు పాల్గొన్నారు.