/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణ సర్కార్‌కు పెండింగ్’’ గండం : కేసీఆర్‌కు కొత్త టెన్షన్.? Yadagiri Goud
తెలంగాణ సర్కార్‌కు పెండింగ్’’ గండం : కేసీఆర్‌కు కొత్త టెన్షన్.?

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వాటిని బీఆర్ఎస్ ఇప్పటికీ అమలు చేయడం లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం ఇప్పటి వరకు కాలం వెళ్లదీసింది. తీరా అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం ఆ పార్టీకి టెన్షన్ పట్టుకున్నది. షెడ్యూలు వచ్చేలోపు ప్రధాన హామీలను అమలు చేయకపోతే ఇబ్బంది వస్తుందని ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది.

దీంతో ఏ హామీలను పూర్తి చేయాలి? ఏ హామీలను పెండింగ్‌లో పెట్టాలి? అనే విషయంపై సీఎం కేసీఆర్‌ క్లారిటీకి రావడం లేదని టాక్. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న పథకాలను ముందు పూర్తి చేసి, మిగతా వాటిని పెండింగ్‌లో పెడితే ఎలా ఉంటుందని ఆయన ఆరా తీస్తున్నట్టు సమాచారం. కొన్ని స్కీమ్స్‌ను పెండింగ్‌లో పెడితే కేసీఆర్ క్రెడిబులిటీకి సమస్య వస్తుందనే అనుమానాలు గులాబీ లీడర్లను వెంటాడుతున్నాయి.

ఖజానా ఖాళీ?

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అన్ని హామీలను పూర్తి చేయడం సాధ్యం కాని పని. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల చెల్లింపులు, తీసుకున్న అప్పులకు కిస్తీలు కట్టడం కూడా ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. వాటికి తోడు ప్రస్తుతం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను పెండింగ్‌లో పెట్టలేని పరిస్థితి.

ఆర్థిక పరిస్థితులు కారణంగా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయడం కూడా డౌటే. దీంతో ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుత పథకాలు తమ వల్ల మాత్రమే అమలవుతాయని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సాధ్యం కాదని మంత్రులు పదే పదే చెపుతున్నారు. పథకాలు అమలు కాకుంటే ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా? అనే అనుమానం గులాబీ లీడర్లను వెంటాడుతున్నది.

అటకెక్కిన నిరుద్యోగ భృతి

నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అనంతరం అధికారం చేపట్టాక తొలి ఏడాది దీని కోసం బడ్జెట్‌లో సుమారు రూ.1800 కోట్లను ప్రభుత్వం కేటాయించారు. వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏవిధంగా అమలవుతుందో స్టడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించింది. కాస్త హడావుడి చేసి ఆతర్వాత నుంచి బడ్జెట్‌లో నిధులు కేటాయించడమే మానేసింది. చివరికి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామనే పేరుతో నిరుద్యోగ భృతి హామీని అటకెక్కించారు.

ఊసేలేని రైతు రుణమాఫీ

అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రకటించారు. అధికారం చేపట్టాక ఇందుకోసం బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.25 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. వచ్చే ఎన్నికల లోపు ఈ హామీని పూర్తి చేస్తారా? లేదా? అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. రైతు‌బంధు డబ్బులు అకౌంట్‌లో పడిన వెంటనే బ్యాంకులు వాటిని పాత అప్పుకింద జమ చేసుకుంటున్నాయి.

గృహలక్ష్మి నిబంధనలకే పరిమితం

సొంత జాగా ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి స్కీమ్ కింద ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3 వేల మందికి రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఆ స్కీమ్ అమలు కోసం కేవలం నిబంధనలు మాత్రమే రూపొందించింది. కానీ ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించలేదు. డబుల్ బెడ్ రూం స్కీమ్‌ను సైతం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లను సైతం పంపిణీ చేయలేదు.

నత్తనడకన దళితబంధు

దళితబంధు స్కీమ్ అమలు కేవలం ప్రకటనకే పరిమితమైంది. ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 11 వందల మందికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది. కానీ ఇంతవరకూ లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. తమ పేరును లిస్టులు నమోదు చేయించాలని అర్హులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని చోట్ల దళారులు దందా మొదలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు సైతం వస్తున్నాయి.....

ఒక్కొక్కరికి ఓ టెంపుల్.. బోనాల పండుగ వేళ సర్కార్ కీలక నిర్ణయం..!

హైదరాబాద్ :జులై 16

రాష్ట్రంలో ఎపుడైనా ఎన్నికలొచ్చే పరిస్థితులున్నందున ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉన్న అన్నిమార్గాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది.

ఆదివారం నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆషాడమాసపు బోనాలు జరుగుతున్నందున ఆయా ఆలయాల్లో అమ్మవారికి పట్టువస్త్రాలకు సమర్పించేందుకు ప్రజాప్రతినిధులకు అధికారికంగా ఆలయాలను కేటాయిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు తరపున పట్టువస్త్రాలు సమర్పించే ప్రతినిధిలా హాజరుకావాలని సూచించింది.

ఇందులో భాగంగా ఎమ్మెల్సీ, ప్రభుత్వవిప్ ఎంఎస్.ప్రభాకర్‌రావుకు కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి పాతబస్తీ గౌలీపురాలోని మహంకాళీ ఆలయం, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డికి ఉప్పుగూడలోని మహాంకాళీ ఆలయాన్ని కేటాయిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ మేయర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఆమె పాతబస్తీ గౌలీపురాలోని మహంకాళీ ఆలయానికి వచ్చి, పట్టువస్త్రాలు సమర్పించేందుకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది...

జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌ సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు

అమరావతి :జూలై 16

జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌ సోమవారం ఉదయం తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నేత కొట్టే సాయి పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. సాయిపై దాడి చేసిన సీఐ అంజు యాదవ్‌పై చర్య తీసుకోవాలని జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పిస్తారు.

జనసేనలోకి ఆమంచి సోదరుడు

ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు(స్వాములు) జనసేనలో చేరారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. రాజ్యాధికారం ఎవరి సొత్తూ కాదని, దాన్ని జన్మహక్కులా భావించి, నియంత పాలన చేస్తానంటే కుదరదని అన్నారు. వైసీపీ దాష్టీకాలపై తెగించి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ పోరాటంలో ఎవరిపై దెబ్బపడినా తనపై దెబ్బ పడినట్లే భావిస్తానన్నారు. ఆమంచి స్వాములు లాంటి నాయకుల బలమే జనసేనకు కావాలన్నారు. స్వాములు జనసేనలో చేరడం వల్ల ప్రకాశం జిల్లాలోనే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా పార్టీకి బలం చేకూరిందన్నారు...

ఆదిలాబాద్‌లో టమాటా లారీ బోల్తా, ఎగ‌బ‌డ్డ జ‌నం.. పోలీసుల‌ భారీ బందోబస్తు

ఆదిలాబాద్ :జులై 16

దేశ వ్యాప్తంగా టమాటా రేటు ఆకాశాన్నంటుతున్న పరిస్థితుల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో నేషనల్‌ హైవే 44 పై టమాటాలను తరలిస్తున్న లారీ ఆదివారం తెల్లవారుజామున బోల్తా పడింది.

దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన టమాటాలను తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. అందినకాడికి టమాటాలను తీసుకెళ్లారు.

సమాచారం అందుకున్న రైతులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో లారీ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బోల్తాపడిన లారీ కర్నాటకలోని కోలార్‌ నుంచి టమాటాల లోడ్‌తో ఢిల్లి వెళుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ లారీలో 18 ట‌న్నుల ట‌మాటాలు ఉండ‌గా.. మార్కెట్ రేట్ ప్ర‌కారం దాదాపు 30 ల‌క్ష‌లు విలువ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం అందుతోంది.......

43 మంది డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీ.. ఆర్డర్స్ జారీ చేసిన డీజీపీ

తెలంగాణలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఇవ్వాల శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో డీఎస్పీ లు ఉన్నారు. కొంతమందిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఇక.. సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరగడం గమనార్హం....

రంగ రంగ వైభవంగా బోనాల జాతర

హైదరాబాద్‌:జులై 16

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

అమ్మవారిని దర్శించుకోడానికి ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు పెట్టారు. కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న బోనాల జాతరకు పోలీసులు 15 వందల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి బోనాలు ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు...

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుపతి:జులై 16

తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 87,171 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 38,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు...,.

మందు బాబులకు షాక్..ఇవాళ, రేపు వైన్ షాపులు బంద్..

తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఇవాళ మద్యం షాపులను క్లోజ్ చేయనుంది సర్కార్. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు అంటే 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు..

హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం ప్రకారం… హైదరాబాద్ మహానగరం లోని కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్, సౌత్ వేస్ట్, మల్కాజ్గిరి మరియు మహేశ్వరం జోన్లలో ఒకరోజు పాటు వైన్ షాపులను బంద్ చేయనున్నారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్ మరియు ఎల్బీనగర్ డివిజన్ లలో.. ఇవాల్టి నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు అంటే రెండు రోజులపాటు మద్యం దుకాణాలను మూసివేస్తారు. ఈ విషయం తెలియడంతోనే నిన్న అర్ధరాత్రి వరకు మద్యం కొనుగోలు జరిగాయి..

Tirupati: శ్రీవారి ఆశీస్సులతో దేశవాళీ గోజాతుల అభివృద్ధి.. పుట్టిన దూడలను పరామర్శించిన జవహార్ రెడ్డి

tirupati: తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవాళీ గోజాతుల అభివృద్ధి ప్రయత్నం సత్ఫలితాలిస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యార్శి జవహార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.గతంలో తాను తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన సమయంలో దేశవాళీ గోజాతుల అభివృద్ధి ప్రాజెక్టుకు రూపకల్పచేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

శ్రీ వెంకటేశ్వరస్వామి గోసంరక్షణశాలలో ఆరు ఆవులు దూడలకు జన్మనిచ్చిన విషయాన్ని తెలుసుకున్న జవహార్ రెడ్డి... ఆవుదూడలను పరామర్శించారు. దేశవాళీ గోజాతులను అభివృద్ధి ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తుండటం ఆనందంగా ఉందని జవహార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.

దేశీయ గోజాతి పశువులను అభివృద్ధి చేయడంతో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి నిత్యసేవల్లో వినియోగించేందుకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఆరు ఆవులు మేలు జాతి దూడలకు జన్మనిచ్చాయి. మరి కొన్ని రోజుల్లో 13 ఆవులు దూడలకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు..

మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం : తీన్మార్ మల్లన్న

మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు.

గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తి తానేనని అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద పెట్టని కేసులు తనపై పెట్టారని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంతకన్నా అర్హత ఏముంటదని మల్లన్న ప్రశ్నించారు.

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిపాజిట్లు కూడా రావని చేసిన వ్యాఖ్యలకు తీన్మార్ మల్లన్న స్పందిస్తూ డిపాజిట్ల స్పెల్లింగ్ చెప్పిన తర్వాత మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యల పై స్పందిస్తానన్నారు. శనివారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు తీన్మార్ మల్లన్న నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్న టీం సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు......