/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రేవంత్ పవర్ కట్ వ్యాఖ్యాల‌ను ప్ర‌తి గ‌డ‌ప గ‌డ‌ప‌కు చేర‌వేయండి… బిఆర్ఎస్ కార్యక‌ర్త‌ల‌కు కెటిఆర్ పిలుపు Yadagiri Goud
రేవంత్ పవర్ కట్ వ్యాఖ్యాల‌ను ప్ర‌తి గ‌డ‌ప గ‌డ‌ప‌కు చేర‌వేయండి… బిఆర్ఎస్ కార్యక‌ర్త‌ల‌కు కెటిఆర్ పిలుపు

కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిస్తే ఉచిత విద్యుత్ ర‌ద్దే అని, రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అని బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు ఇచ్చారు.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ‌నివారం టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు స‌మావేశాలు నిర్వ‌హించాల‌న్నారు. 3 పంట‌లు బీఆర్ఎస్ నినాదం.. 3 గంట‌ల క‌రెంటు కాంగ్రెస్ విధానం పేరిట స‌భ‌లు నిర్వ‌హించాల‌ని సూచించారు. రైతుల‌కు కాంగ్రెస్ నేత‌లు క్ష‌మాప‌ణ చెప్పేలా తీర్మానాలు చేయాల‌న్నారు.

ప్ర‌తీ రైతు వేదిక వ‌ద్ద రైతు స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కోరారు. ఎక‌రానికి గంట విద్యుత్ చాల‌న‌టం రైతుల‌ను వ‌మానించ‌డ‌మే అని అన్నారు. 24 గంట‌ల విద్యుత్ వ‌ద్ద‌న్న కాంగ్రెస్ కుట్ర‌ను రైతుల‌కు వివ‌రించాల‌ని సూచించారు. క‌టిక చీక‌ట్ల కాంగ్రెస్ కావాలా..? వెలుగు జిలుగుల‌ బీఆర్ఎస్ కావాలా..? తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన త‌రుణ‌మిది అని కేటీఆర్ పేర్కొన్నారు...

రేపటి నుండి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్:జులై 15

బోనాల జాతర సంబురంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయంలో జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ రూట్లో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ డైవర్షన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రూట్లో జర్నీ చేసే వారు ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దారి మళ్లించే ప్రదేశాలు..

జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుండి జులై 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ రూట్లలో దారి మళ్లింపు చర్యలు అమలులోకి ఉంటాయి.

ఉప్పల్ నుండి అంబర్‌పేట్ వైపు వచ్చే అన్ని జిల్లాల బస్సులు, సిటీ బస్సులు, భారీ వాహనాలు ఉప్పల్ x రోడ్డులో హబ్సిగూడ – తార్నాక – అడిక్‌మెట్ – విద్యా నగర్ – ఫీవర్ హాస్పిటల్ – T.Y మీదుగా మళ్లిస్తారు. మండలి – టూరిస్ట్ హోటల్ Jn. – నింబోలిఅడ్డ – చాదర్‌ఘాట్ & C.B.S. తిరిగి వచ్చే మార్గం వైస్ వెర్సాగా ఉంటుంది.

కోటి నుండి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు, సిటీ బస్సులు నింబోలిఅడ్డ – టూరిస్ట్ హోటల్ – TY మండలి – ఫీవర్ హాస్పిటల్ అడిక్‌మెట్ – తార్నాక – హబ్సిగూడ – ఉప్పల్ X రోడ్ల మీదుగా తిరుగు మార్గంలో మళ్లిస్తారు.

ఉప్పల్ నుండి అంబర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ – మల్లికార్జున నగర్ – డి డి కాలనీ – సిండికేట్ బ్యాంక్ శివం రోడ్ వద్ద మళ్లిస్తారు. గోల్నాక, మూసారాంబాగ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సీపీఎల్‌ వైపు మళ్లిస్తారు. అంబర్‌పేట్ – సల్దానా గేట్ – అలీ కేఫ్ X రోడ్లు మరియు తిరుగు మార్గంలో వైస్ వెర్సా ఉంటుంది.

ఈ రూట్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలుంటాయని, ఎటువంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సిటీ పోలీసులు కోరారు...

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్:జులై 15

రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర మండంలో శనివారం పర్యటిస్తున్నారు. కీసర మండలం రాంపల్లి దయారా గ్రామంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో కుట్టు మిషన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామానికి చెందిన మహిళలకు మూడునెలల పాటు టైలరింగ్ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది...

SB NEWS

అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న మోడీ ప్రభుత్వం

•బడా కార్పోరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న బీ జే పీ కేంద్ర ప్రభుత్వం..

•ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్...

బడుగు జీవుల, అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న కేంద్ర ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ మోడీ ప్రభుత్వం,బడా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ,దేశ సంపదను దోచిపెడుతున్నదని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ అన్నారు.

శనివారం నాడు నల్గొండ పట్టణం లోని శ్రామిక భవన్ (సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం) లో ఐ ఎఫ్ టి యు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం,

జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ,దేశంలో ముప్ఫై అయిదు కోట్లకు పైగా ఉన్న అసంఘటిత కార్మికుల జీవనోపాధి రోజు రోజుకు కడు దయణీయంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు,నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం,కార్మికుల కూలీ రేట్లు,వేతనాలను పెంచడంలో అశ్రద్దగా, మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.

కార్మికుల శ్రమ మూలంగా అనేక కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతున్న సంపదను,కార్మికుల శ్రమను,వివిధ రంగాలకు చెందిన యాజమాన్యాలు యదేచ్ఛగా దోచుకోవడానికి మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,నాలుగు లేబర్ కోడ్ లుగా ముందుకు తెచ్చిందని ఆరోపించారు.

రాష్ట్రంలో కేసిఆర్ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం,75 షెడ్యూల్డ్ జీ ఓ లకు గెజిట్ లు లేకుండా కాలయాపన చేస్తుందని,75 షెడ్యూల్డ్ పరిశ్రమలలో ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, జీ ఓ లకు గెజిట్ ఇవ్వకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని అన్నారు.

కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన గా,జూలై,ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కేంపైన్ నిర్వహిస్తుందని,అందులో భాగంగానే జూలై 20 న,హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని, క్విట్ ఇండియా కు పిలుపు నిచ్చిన ఆగస్టు 9 నాడు హైదరాబాద్ సిటీలో, అన్ని జిల్లా కలెక్టరేట్ ల ముందు మహా ధర్నాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ సమావేశంలో IFTU జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్,జిల్లా నాయకులు కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహ, రావుల వీరేశ్,జానీ,అశోక్ పాషా,స్వామి,ముత్తు,ఎం.డి జానీ,రవి,తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు

సిద్దిపేట జిల్లా :జులై 15

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలకు నిప్పంటించి రోడ్డుపై ఈడ్చికెళ్లిన ఘటన శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.

ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి సీఎం కేసీఆర్ రెండుసార్లు అధికారం చేపట్టినా అభివృద్ధి ఫలితం శూన్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించి రాజకీయ పబ్బంగడుపుకుంటుందని ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోని దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని తీవ్రంగా విమర్శించారు. పంట నష్ట పరిహారం ఇస్తానని బస్సు ప్రయాణం చేసిన సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి 10000 ఇచ్చి రాష్ట్రమంతా ఎగబెట్టాడని, అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మలకు నిప్పంటించి రోడ్డుపై ఈడ్చుకెళ్ళారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు......

రేపే లాల్ దర్వాజా బోనాల జాతర.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని..

హైదరాబాద్ :జులై 15

రేపే లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

పెద్ద ఎత్తున భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకానున్నారు. జూలై 16, 17వ తేదీల్లో రెండు రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పించుకోవడంతోపాటుఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు, ఇంతగానో తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురుచూసే ఘట్టం రంగం కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన పటిష్ట ఏర్పాటు, ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుండి ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించారు. మహా హారతికి వేల సంఖ్యలో ఆలయం బయట మహిళలు అందరూ నిలబడి అమ్మవారికి హారతి ఇచ్చారు. ఇక ఈ వచ్చే ఆదివారం సోమవారం లాల్ దర్వాజా లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది....

ఇంటి వద్దకే పోలీసు సేవలు..రాచకొండ సీపీ DS చౌహన్

రాచకొండ:జులై 15

నిరాధారణకు గురవుతున్న పిలల్లు, మహిళలు, బాధితులు ఎవరైనా పోలీసు స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉంటే వారు 8712662111 రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నెంబర్ నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసు సేవలు తక్షణమే అందుతాయని కమిషనర్ డీఎస్ చౌహన్ భరోసా ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా కమిషనరేట్ పరిధిలో సీపీ చౌహన్ పలు పీఎస్‌లను సందర్శించినప్పుడు ఈ నెంబర్ ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేస్తున్నారు. దీంతో పాటు పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై సొంత నిర్ణయంతో కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని.. న్యాయం అందేలా అధికారులు పనిచేయాలని సీపీ సూచిస్తున్నారు.

ఈ విధంగా సీపీ చౌహన్ ప్రజల్లో పోలీస్ ప్రతిష్టను పెంచేలా తన మార్క్ వ్యూహలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే నేరాల నియంత్రణలో తనదైన శైలిలో వ్యవహిరిస్తోన్న సీపీ.. వాహనాల నెంబర్ ప్లేట్‌లను ప్రతి వాహనదారుడు పెట్టుకునేలా చేస్తున్నారు. దీంతో నేరాలు జరిగినప్పుడు నేరగాళ్ళు ఉపయోగించిన వాహనాలను వెంటనే గుర్తించి క్రిమినల్స్‌ను కటాకటాలోకి నెడుతున్నారు. ప్రజలు కూడా శాంతి భద్రతలను వారి చేతుల్లోకి తీసుకోవద్దని.. పోలీసులు మీకు న్యాయం జరిగేలా అందుబాటులో ఉంటారనే సీపీ హామీ ఇస్తున్నారు...

నేడు హైదరాబాద్ కు ఇస్రో చైర్మన్ సోమనాథ్ రాక

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ తన 12వ స్నాతకోత్సవ వేడుకను జూలై 15, శనివారం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్వహించబోతోంది. దాదాపు 1,000 మంది విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్ అందించే వివిధ విభాగాల్లో డిగ్రీలు అందుకోనున్నట్లు ఐఐటీ పత్రిక ప్రకటనలో పేర్కొంది.

ఐ ఐ టి హెచ్‌లో ఉన్న సమయంలో పెంపొందించుకున్న జ్ఞానం మరియు నైపుణ్యాలతో వారి వృత్తిపరమైన వృత్తిలోకి అడుగుపెట్టినందున,

ప్రొఫెసర్ బీ యస్ మూర్తి ఐఐటి హైదరాబాద్ కంది డైరెక్టర్ ఒక పత్రికా ప్రకటన పేర్కొంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ మరియు స్పేస్ కమిషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్ హాజరై స్నాత కోత్సవ ప్రసంగాన్ని కూడా చేయనున్నారని ఆయన తెలిపారు...

మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు

హైదరాబాద్ :జులై 15

హైదరాబాద్‌లో పలుచోట్ల మసాజ్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం మెరుపు దాడులు చేపట్టారు. పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లోని పలు మసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 34 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

SB NEWS

హైదరాబాద్ లో యువకుడిపై కాల్పులు కలకలం

హైదరాబాద్:జులై 15

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్ పేట్ లోని సెలబ్రిటీ క్లబ్ లో ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. సిద్దార్ధ్ దాస్ అనే వ్యక్తిపై మరో యువకుడు ఈ కాల్పులు చేసినట్టు తెలుస్తుంది.

దీనితో బాధితుడు శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే కాల్పులు జరిపిన యువకుడు సిద్దార్ధ్ దాస్ కు తెలిసిన వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది. నిన్న రాత్రి సెల బ్రిటీ క్లబ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే ఈ కాల్పులకు సంబంధించి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాత కక్షలతోనే ఈ కాల్పులు జరిగాయా? లేక మరే ఇతర కారణాలున్నాయనేది తేలాల్సి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్పులు జరిపిన యువకుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనాస్థలంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఆచూకీని చూస్తున్నారు........