/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Chandrayaan-3: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3.. Yadagiri Goud
Chandrayaan-3: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3..

Chandrayaan-3: LVM-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. శ్రీహరికోట నుంచి చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. జాబిల్లి దక్షిణ ధృవం దగ్గర దిగడమే టార్గెట్ ఈ ప్రయోగం సాగుతోంది..

24 రోజుల పాటు రాకెట్ భూమి చుట్టూ తిరగనుంది. 613 కోట్లు బడ్జెట్‌తో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. 3 వేల 900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 .. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో ప్రకటించింది. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రయాన్‌పై దిగి ప్రయోగాలు చేయనుంది. చంద్రుడి ఉపరితలాన్ని రోవర్ అధ్యాయనం చేయనుంది.

వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధృవం దగ్గర దిగితే- జాబిల్లిపై ప్రయోగాల్లో ప్రపంచ దేశాలకు ఇప్పటిదాకా అందని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనుంది ఇస్రో. దక్షిణ ధృవం దగ్గర ఉపగ్రహాన్ని ల్యాండ్ చేసిన తొలి దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది..

Supreme Court: సుప్రీం కోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..

దిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌. వెంకటనారాయణ భట్‌ నేడు బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు కొత్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

2011లో గువాహటి హైకోర్టులో భూయాన్‌ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత 2022 జూన్‌ 28 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. తాజాగా సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ట్యాక్సేషన్‌ లాలో ప్రత్యేక నైపుణ్యం పొందారు. ఆయన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగానూ సేవలందించి ట్యాక్సేషన్‌తో పాటు విభిన్న రంగాలకు సంబంధించిన కేసులను విచారించారు. ఆయన తీర్పుల్లో చట్టం, న్యాయానికి సంబంధించి విస్తృత కోణాలను స్పృశించారు.

మరోవైపు జస్టిస్‌ వెంకట నారాయణ భట్‌ 2013లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో తొలిసారి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2019లో ఆయన్ను కేరళ హైకోర్టుకు బదిలీ చేశారు. అక్కడ ఆయన 2023 జూన్‌ నుంచి ప్రధాన న్యాయమూర్తిగా అదే కోర్టులో బాధ్యతలను స్వీకరించారు. వీరిద్దరి రాకతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32 నుంచి 34కు చేరింది..

Cheetah: మరో చీతా మృతి.. నాలుగు నెలల్లో 8వ ఘటన..

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో చీతాల మరణాలు ఆగడం లేదు! రెండు రోజుల క్రితమే మగ చీతా (Cheetah) 'తేజస్‌' మృత్యువాతపడగా..

నేడు 'సూరజ్‌' అనే మరో మగ చీతా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు నెలల వ్యవధిలో ఈ పార్కులో మృతి చెందిన చీతాల్లో ఇది ఎనిమిదో చీతా కావడం గమనార్హం.

దీన్ని నమీబియా నుంచి తీసుకొచ్చారు. అయితే, సూరజ్‌ మృతికిగల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు..

హరీష్ రావు‌ను కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ!

తెలంగాణలో రాజకీయాలు రసవతరంగా మారాయి. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మంత్రి హరీష్ రావుతో భేటి అయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ ఏది చేసినా ఓ సంచలనమే. గత కొంతకాలంగా రాజాసింగ్ సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడప్పుడు తనదైన శైలితో చేస్తున్న కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయ్. ఈ తరుణంలోనే బిజెపి నేతలు కొంతమంది ఇతర పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం ఉపందుకుంది. ఆ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా తరుణంలోనే మంత్రి హరీష్ రావును బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరుతారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా... అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ మీటింగ్‌గా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటి కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం లేనిది ఎన్నికల ముందు ఒక్కసారిగా కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడుతున్నారని ప్రచారం ఊపు అందుకున్న తరుణంలో రాజాసింగ్ బీఆర్ఎస్ మంత్రితో భేటీ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది......

సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము నీకుందా రేవంత్ ❓️: గుత్తా సూటి ప్రశ్న

నల్గొండ జిల్లా :జులై 14

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు. శుక్రవారం గుత్తా మీడియాతో మాట్లాడుతూ.. బషీర్‌బాగ్ కాల్పులకు కారణం కేసీఆర్ అనడం అవగాహన లేకనే అని అన్నారు.

తొమ్మిదేళ్లలో ఎకరం పంట ఎక్కడైనా ఎండిందా, సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలు జరిగాయా... అని ప్రశ్నించారు. కరెంటు నిరంతరాయంగా వస్తున్నందునే అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదన్నారు. కరెంటు కొనుగోళ్లు జరిగేది ఎన్ఎల్‌డీసీ నుంచే అని అవినీతి జరిగిందనడం అవివేకమే అని అన్నారు. రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదన్నారు.

ఆవారా నంబర్ 1, స్థిమితం లేని వెంకట్ రెడ్డి వ్యవసాయం పేరుతో బావుల దగ్గరికి పోయేది సురా పానకం కోసమే అంటూ వ్యాఖ్యలు చేశారు. 82 ఏళ్ల ఖర్గే ఏఐసీసీగా ఉండొచ్చు కానీ రిటైర్డ్ అయినా సమర్థత ఉన్న అధికారులు ఉద్యోగంలో కొనసాగకూడదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ గుత్తాసుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు...

Konaseema: భర్తను చెంబుతో కొట్టి చంపిన భార్య..

అయినవిల్లి: భర్త రోజూ తాగి వచ్చి చిత్రహింసలు పెడుతుండటంతో విసిగిపోయిన భార్య చెంబుతో కొట్టి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ఇసుకపట్ల రామకృష్ణ (34) రోజూ మద్యం సేవించి భార్య సత్యనారాయణమ్మతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ.. చెంబుతో భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Chandrababu: 'కియా' మిలియన్‌ కార్ల ఉత్పత్తిపై చంద్రబాబు హర్షం..

అమరావతి: అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు..

ఈ మేరకు కియా యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్‌లో కియా పెట్టుబడులు ఓ బలమైన సంకల్పమన్న చంద్రబాబు.. ఈ సమర్థ విధానం ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చి సంపద సృష్టి, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దిందని చెప్పారు.

ప్రపంచ వేదికపై ఇది ఓ ప్రత్యేకతను చాటుకుందన్నారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం కలిగినందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. వేలాది మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందుతున్నారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు..

Japan: జపాన్‌ అంతరిక్ష కార్యక్రమానికి ఎదురు దెబ్బ

జపాన్‌(Japan) అంతరిక్షకార్యక్రమానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న రాకెట్‌ ఇంజిన్‌ పరీక్షల సమయంలో పేలిపోయింది..

ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని ఆ దేశ స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో ఉపయోగించిన ఎప్సిలాన్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసి ది ఎప్సిలాన్‌-ఎస్‌( Epsilon S) పేరిట సిద్ధం చేసింది. తాజాగా అదే ప్రమాదానికి గురైంది.

గత అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్‌ను ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. తాజా మార్పులతో పరీక్షించగా.. ప్రయోగం మొదలైన 50 సెకన్లలో విఫలమైంది. ఈ పరీక్షా కేంద్రం ఉత్తర అకితా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భారీ ఎత్తున మంటలు, పొగలతో నిండిపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలను జాతీయ మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టంపై సమాచారం అందలేదని జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ (జేఏఎక్స్‌ఏ) అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామన్నారు.

Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఫ్రాన్స్‌ అత్యున్నత అవార్డుతో సత్కారం..

పారిస్‌: ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆతిథ్య దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌.. మోదీని 'గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆన్‌ర్‌' పురస్కారంతో సత్కరించారు..

ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర, సైనిక పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.

గురువారం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మేక్రాన్‌.. మోదీకి ఈ పురస్కారం అందజేశారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా, బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌, జర్మనీ మాజీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్‌ బుట్రోస్‌ బుట్రోస్‌ ఘలి వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు వారి సరసన మోదీ చేరారు..

వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం

వరంగల్ జిల్లా :జులై 14

జిల్లాలోని రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్‌లోని ఓ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫామ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రయాణికులు ఉన్న సమయంలో ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌‌ వద్ద రేకుల షెడ్డుపై ఉన్న వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వాటర్ ట్యాంక్ పడిపోడానికి గల కారణాలపై రైల్వే సిబ్బంది ఆరా తీస్తున్నారు...