/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఉచిత విద్యుత్‌పై ఆగని మంటలు Yadagiri Goud
ఉచిత విద్యుత్‌పై ఆగని మంటలు

కరీంనగర్ జిల్లా :జులై 13

జిల్లాలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఉచిత కరెంట్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు కూడా చేసింది. తాజాగా గురువారం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

దీనిపై కోపంతో ఊగిపోయిన కాంగ్రెస్‌ నేత రోహిత్ రావు.. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. అసలు ఆ ఫ్లెక్సీలో ఏముందంటే... ‘‘మూడు గంటలు కరెంట్ చాలన్న కాంగ్రెస్‌కు మా గ్రామంలో ప్రవేశం లేదు. కబర్దార్ కాంగ్రెస్ నేతల్లారా’’ అంటూ బీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను చూసిన కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రోహిత్ రావు... ఆ ఫ్లెక్సీలను వాటిని చించివేశారు.

హైదరాబాద్‌‌కు రేవంత్..

మరోవైపు... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తానా సభల్లో ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో పాలిటిక్స్‌ హీటెక్కాయి. తాజా పరిణామాలతో రేవంత్ ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. బీఆర్ఎస్ ఆందోళనపై ఇప్పటికే ట్విట్టర్ వేదికగా రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంత దుష్ప్రచారం చేసినా వచ్చేది కాంగ్రెస్ అని... ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ అంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు గురువారం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేవంత్ మీడియా సమావేశం అనంతరం ఉచిత్ విద్యుత్‌పై చెలరేగుతున్న మాటలు మంటలకు పుల్‌స్టాప్‌ పడుతుందో లేదో చూడాలి....

Manchu Mohanbabu : మీడియాపై మోహన్‌బాబు ఆగ్రహం.. లోగోలు లాక్కోండంటూ బౌన్సర్లకు ఆదేశం

హైదరాబాద్ : ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు షాద్ నగర్‌లో మీడియాపై కాసేపు చిందులు తొక్కారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు..

అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్‌కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

'ఆ లోగోలు లాక్కొండయ్యా' అంటూ తన బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? అంటూ తన నోటికి పని చెప్పారు. సీనియర్ నటుడైన మోహన్ బాబు తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే ఈ వ్యవహారం మీడియా దృష్టి పడకుండా ఆయన వ్యవహరించడంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు. మీడియాపై చిందులు తొక్కిన వ్యవహారం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు రాద్ధాంతం అయింది..

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు ఉరి

•బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు..

•నల్లగొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్యర్యంలో

•నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల సబ్ స్టేషన్ ముందు...

బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు..

నల్లగొండ నియోజకవర్గంలోని అన్ని సబ్ స్టేషన్ల ముందు... బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.. పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలు నిర్వహించి.. దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు....

ఈ నిరసన కార్యక్రమాలకు రైతుల నుండి అనూహ్య స్పందన లభించింది... ఎక్కడికక్కడ స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ... రైతులు ఉచిత కరెంటు పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.

నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల సబ్ స్టేషన్ ముందు... బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి....

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీశారు...

కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల తమ నిజస్వరూపాన్ని... బయట పెట్టుకుందని... అందుకనే ఈ రోజు రైతు లోకం యావత్తు తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారని..

రైతుల పట్ల కాంగ్రెస్ బిజెపిల... వైఖరి అర్థమైందని... వచ్చే ఎన్నికల్లో రైతులు ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని అన్నారు.

రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి.,. చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్, మాలే శరణ్య రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, జిల్లా శంకర్,కత్తుల సంజీవ ... పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్.. కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు, కౌన్సిలర్లు ఊట్కూరి వెంకటరెడ్డి, ఆలకుంట్ల మోహన్ బాబు.. మారగోని గణేష్ జేరిపోతుల భాస్కర్ గౌడ్..

గోగుల శ్రీనివాస్, ఇబ్రహీం. ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ వట్టిపల్లి శ్రీనివాస్, యామా దయాకర్ నాయకులు.. పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి హసన్ సలీం, దొడ్డి రమేష్, సైదులు గౌడ్ కాసం శేఖర్, పి జనార్దన్ రావు,రాజేందర్,వీరమల్ల భాస్కర్ అంజి బాబు, కంకణాల వెంకటరెడ్డి, సింగిరికొండ శివకుమార్, దోనాల నాగార్జున రెడ్డి... పట్టణ మహిళా అధ్యక్షురాలు దుబ్బరూప, మామిడి పద్మ, యాట జయప్రద రెడ్డి కత్తుల సంధ్య గాలి రాధిక... తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో ఆలయాలకు పూర్వవైభవం: మంత్రి ఎర్రబెల్లి

యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్‌నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. తెలంగాణలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు.

గురువారం ఉదయం కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని మంత్రి ఎర్రబెల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో నభూతో న భవిష్యత్తు అన్న చందంగా సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించారని చెప్పారు.

దేవాలయం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుతంగా ఉందని, నిర్మాణ కౌశలం భక్తి పారవశ్యం పొంగిపొరలే విధంగా జరిగిందన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే దేవాలయాలకు పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు...

ఈ నెల 17, 18న ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం

ఈ నెల 17, 18 తేదీల్లో

ప్రతి పక్షాల ఉమ్మడి మీటింగ్ జరగనుంది. కేంద్రలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా బెంగళూరులో ప్రతిపక్షాల రెండో సమావేశం జరగనుంది.

బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి సోనియాగాంధీ హాజరుకానున్నారు. 24 పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆహ్వాన లేఖలు పంపింది.

గత నెల పాట్నాలో జరిగిన సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. కాగా ఈ సారి బీఆర్ఎస్‌కు ఆహ్వానం ఉంటుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది....

తిరుమ‌ల‌లో మ‌ళ్లీ క‌నిపించిన చిరుత‌

తిరుపతి :జులై 13

తిరుమలలో మ‌ళ్లీ చిరుత క‌నిపించి క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో భక్తులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఘాట్ రోడ్డులోని 56 వ మలుపు వద్ద బుధ‌వారం సాయంత్రం చిరుత కనిపించింది.

అప్రమత్తమైన అటవీ అధికారులు వాహనదారులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మ‌ధ్య‌నే అలిపిరి నడక దాడిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన నాలుగేళ్ల కౌశిక్ ను చిరుత నోట కరిచి తీసుకెళ్లింది. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. ఈ ఘటనలో బాలుడి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి. ఈ ఘటన మరవకముందే మ‌ళ్లీ తిరుమ‌ల దారిలో చిరుత క‌నిపించ‌డంతో అంద‌రిలో భ‌యం నెల‌కొంది....

మా ఊర్లో కాంగ్రెస్‌కు ప్రవేశం లేదు.. 7 గ్రామాల్లో వెలసిన హెచ్చరిక బోర్డులు

కరీంనగర్‌ : జూలై 13

ఉచిత విద్యుత్తుపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమంటున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి మా గ్రామంలో ప్రవేశం లేదు’ అంటూ ఆయా గ్రామాల్లో రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామా ల్లో బుధవారం పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి. రైతులే స్వయంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సాగుకు 3 గంటల విద్యుత్తు సరిపోతుందన్న రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నాయకులు తమ గ్రామాల్లోకి రావొద్దని స్పష్టం చేస్తున్నారు.

ఈ ఫ్ల్లెక్సీలు మొదట కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కరీంనగర్‌-సిరిసిల్ల ప్రధాన రహదారిపై స్థానిక రైతులు ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తితో బద్దిపల్లి, బావుపేట, ఖాజీపూర్‌ గ్రామాల్లో, ఇటు కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌, ఎలగందుల తదితర గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఫ్లెక్సీలు రాష్ట్రమంతటా ఏర్పాటయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి....

Tirumala: ప్రజాసేవ చేసే శక్తిని ఇవ్వాలని.. ఆ దేవదేవుడిని ప్రార్థించా: గడ్కరీ

తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు..

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు గడ్కరీ దంపతులకు వేదాశీర్వచనం పలికారు.

కేంద్రమంత్రికి ఛైర్మన్ సుబ్బారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో గడ్కరీ మాట్లాడారు. దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించామని ప్రార్థించినట్లు గడ్కరీ తెలిపారు..

తిరుపతి లో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :జులై 13

తిరుమలలో నేడు గురువారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 72,664 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 32,336 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

•షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి

సూళ్లూరుపేట చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది..

ఈరోజు మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌.. వాహకనౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి భవనానికి చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరముత్తువేల్‌, ఎల్‌వీఎం-3పీ4 మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, అసోసియేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ నారాయణన్‌, వెహికల్‌ డైరెక్టర్‌ బిజూస్‌ థామస్‌ ఉన్నారు.