/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమ‌ల‌లో మ‌ళ్లీ క‌నిపించిన చిరుత‌ Yadagiri Goud
తిరుమ‌ల‌లో మ‌ళ్లీ క‌నిపించిన చిరుత‌

తిరుపతి :జులై 13

తిరుమలలో మ‌ళ్లీ చిరుత క‌నిపించి క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో భక్తులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఘాట్ రోడ్డులోని 56 వ మలుపు వద్ద బుధ‌వారం సాయంత్రం చిరుత కనిపించింది.

అప్రమత్తమైన అటవీ అధికారులు వాహనదారులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మ‌ధ్య‌నే అలిపిరి నడక దాడిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన నాలుగేళ్ల కౌశిక్ ను చిరుత నోట కరిచి తీసుకెళ్లింది. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. ఈ ఘటనలో బాలుడి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి. ఈ ఘటన మరవకముందే మ‌ళ్లీ తిరుమ‌ల దారిలో చిరుత క‌నిపించ‌డంతో అంద‌రిలో భ‌యం నెల‌కొంది....

మా ఊర్లో కాంగ్రెస్‌కు ప్రవేశం లేదు.. 7 గ్రామాల్లో వెలసిన హెచ్చరిక బోర్డులు

కరీంనగర్‌ : జూలై 13

ఉచిత విద్యుత్తుపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమంటున్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి మా గ్రామంలో ప్రవేశం లేదు’ అంటూ ఆయా గ్రామాల్లో రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామా ల్లో బుధవారం పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి. రైతులే స్వయంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సాగుకు 3 గంటల విద్యుత్తు సరిపోతుందన్న రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నాయకులు తమ గ్రామాల్లోకి రావొద్దని స్పష్టం చేస్తున్నారు.

ఈ ఫ్ల్లెక్సీలు మొదట కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కరీంనగర్‌-సిరిసిల్ల ప్రధాన రహదారిపై స్థానిక రైతులు ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తితో బద్దిపల్లి, బావుపేట, ఖాజీపూర్‌ గ్రామాల్లో, ఇటు కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌, ఎలగందుల తదితర గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఫ్లెక్సీలు రాష్ట్రమంతటా ఏర్పాటయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి....

Tirumala: ప్రజాసేవ చేసే శక్తిని ఇవ్వాలని.. ఆ దేవదేవుడిని ప్రార్థించా: గడ్కరీ

తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు..

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు గడ్కరీ దంపతులకు వేదాశీర్వచనం పలికారు.

కేంద్రమంత్రికి ఛైర్మన్ సుబ్బారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో గడ్కరీ మాట్లాడారు. దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించామని ప్రార్థించినట్లు గడ్కరీ తెలిపారు..

తిరుపతి లో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :జులై 13

తిరుమలలో నేడు గురువారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 72,664 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 32,336 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

చంద్రయాన్‌కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

•షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి

సూళ్లూరుపేట చంద్రయాన్‌-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) సిద్ధమైంది..

ఈరోజు మధ్యాహ్నం 2:35:13 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమై 24 గంటలు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

షార్‌కు చేరుకున్న ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌.. వాహకనౌకను పరిశీలించారు. అనంతరం భాస్కరా అతిథి భవనానికి చేరుకుని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరముత్తువేల్‌, ఎల్‌వీఎం-3పీ4 మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.మోహన్‌కుమార్‌, అసోసియేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ నారాయణన్‌, వెహికల్‌ డైరెక్టర్‌ బిజూస్‌ థామస్‌ ఉన్నారు.

ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెసోళ్లకు కళ్ల మంట ఎందుకు? : కవిత

పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతు విధానాలు అమలు అవుతున్నాయన్నారు. రైతుబంధు పధకం దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతుకు వ్యవసాయం మంచిగా ఉండాలంటే నీళ్లు, కరెంటు ఉండాలని అన్నారు.

కేసీఆర్ పెట్టిన రైతుబంధు పధకాన్ని ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పధకాలతో తెలంగాణలో కేసీఆర్ నీళ్లు పారించారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఓ బోగస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే తప్పు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ పాలనలో రైతులకు మేలు జరగలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే తమకు కళ్ళ మంట ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశఢారు. కాంగ్రెస్ పాలనలో అర్ధరాత్రి కరెంటు వస్తే అనేక మంది రైతులు చనిపోలేదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌పై తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి పోవాలి... దళారీలు రావాలి ఇది కాంగ్రెస్ పార్టీ విధానమని ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడ్డారు...

రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, తెలుగు రాష్ట్రాల వారికి దక్కని చోటు

న్యూఢిల్లీ: ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం బుధవారం ప్రకటించింది. గుజరాత్‌ నుంచి బాబు బాయి జేసంగ్‌ బాయ్‌, కే శ్రీదేవన్స్‌ జాలా, బెంగాల్‌ నుంచి అనంత్‌ మహారాజ్‌కు అవకాశం ఇచ్చింది..

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి చోటు దక్కలేదు. కాగా ఇప్పటికే గుజరాత్‌ నుంచి కేంద్రమంత్రి జైశంకర్‌ పేరును నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే..

జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ జులై 6న విడుదలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది..

Emergency Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం ప్రమాదానికి గుర్తింది. హెచ్‌ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది..

నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్‌ అయిన కాసేపటికే వెనక్కి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ప్రమాదానికి గురైంది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది..

రన్ వేపై నీరు నిలవడంతో.. ఆ నీటిలో అలాగే ముందుకు వెళ్లింది. అప్పటికే విమానం నోస్ గేర్ సరిగా లేకపోవడంతో విమానం ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. హాల్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు..

మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై బుధవారం కేసు నమోదు అయ్యింది. శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఆ సంస్థ ప్లాట్స్ పేరుతో డబ్బులు కట్టించుకుని ఎగ్గొట్టింది. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకటనలు చూసి మోసపోయామని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

సాయి సూర్య డెవలపర్‌ సంస్థ అధినేత సతీష్ చంద్ర గుప్తాపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 30 మంది బాధితులు సాయి సూర్య డెవలపర్స్‌పై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు సాయి సూర్య డెవలపర్స్‌పై సెక్షన్‌ 406, 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు...

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నది.

మరో 103 స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు అనుమతి మంజూరైందని తెలిపింది.

సీసీ కెమెరాలు లేక కొన్ని పీఎస్‌లలో ప్రజల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ అందిన లేఖను

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సుమోటో పిల్‌గా స్వీకరించి మంగళవారం విచారణ జరుపగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదన వినిపించారు. సదరు పిల్‌పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది....