/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడే ఖమ్మం గుమ్మం లో జన గర్జన సభ Yadagiri Goud
నేడే ఖమ్మం గుమ్మం లో జన గర్జన సభ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణకు రానున్నారు. ఈ సాయంత్రం ఖమ్మంలో జరగనున్న తెలంగాణ జన గర్జన సభకు ఆయన హాజరవుతారు. ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం రానున్నారు. ఖమ్మం సభ తర్వాత రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు.

కాగా సీఎల్పీ నేత భట్టి విక్రమాక్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభ ఏర్పాటు చేశారు. అలాగే రాహుల్‌ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. సుమారు వంద ఎకరాల్లో బహిరంగ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా రాహుల్‌గాంధీ రెండోసారి ఖమ్మం రాబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ టీడీపీ, సీపీఐ కూటమి విజయం కోసం ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచారం సాగించారు. ఈ బహిరంగసభకు హాజరైన రాహుల్‌గాంధీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ జన గర్జన పేరుతో జరిగే సభకు ఖమ్మం పర్యటనకు రానున్నారు........

సాయిచంద్ మృతి తరువాత అ స్థానం ఎవ్వరిది ❓️

తెలంగాణా ఉద్యమ కళాకారుడు సాయిచంద్ మృతితో కళాకారుడి కోసం కేసీఆర్ వెతుకులాట స్టార్ట్ చేశారు. స్టేజ్ మేనేజ్ మెంట్ చేసే వ్యక్తి కావాలని నేతలకు సూచించారు. పలువురి పేర్లను సైతం అధినేత పరిశీలించినట్లు సమాచారం. కొంతమంది కళాకారులకు ఇతర పార్టీలకు మద్దతుగా ఉండటంతో వారిని తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కళాకారులే కీలకమని గులాబీ బాస్ భావిస్తున్నారు.

సాయిచంద్ తర్వాత ఎవరు..?

సాయిచంద్ అకాల మృతితో మరో కళాకారుడి కోసం చూస్తున్నారు. గిద్దె రాంనర్సయ్య, ఏపూరి సోమన్న, మద్దెల రామ్మూర్తి, కిషోర్, వంగపల్లి ఉష, సందీప్, మధుప్రియతో పాటు పలువురి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. పోడుపట్టాల పంపిణీని పురస్కరించుకొని ఆసిఫాబాద్‌లో నిర్వహించిన సభలో సాయిచంద్ లేనిలోటు స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మధుప్రియతో పాటలు పాడించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేదని స్టేజ్ మేనేజ్ మెంట్ సైతం చేయలేకపోయిందని నేతలు పేర్కొంటున్నారు.

రసమయి, గోరటి ఉన్నా?

పార్టీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీగా గోరటి వెంకన్న ఉన్నప్పటికీ వీరు పదవుల్లో ఉండటంతో వీరిసేవలను వినియోగించుకుంటే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక మెసేజ్ పోతుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పట్టున్న కళాకారులకు పార్టీ భారీ నజరానా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర అవతరణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కళాకారుల్లో ఎక్కువమంది బీఆర్ఎస్‌లో కళాకారుడి నుంచి ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి వ్యవహారశైలి నచ్చకపోవడంతో దూరమయ్యారు. వారు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? అనే చర్చ పార్టీలోనే మొదలైంది....

9మంది సీఐల బదిలీలు.. ఉత్తర్వులు జారీ!!

హైదరాబాద్ :జులై 02

9మంది సీఐలను బదిలీ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసారు. చేవెళ్ల సీఐగా ఉన్న వెంకటేశ్వర్లును ఆమన్ గల్‌కు ట్రాన్స్‌ఫర్ చేసారు. శంకర్ పల్లి డీఐని చేవెళ్ల సీఐగా నియమించారు.

సైబర్ క్రైమ్స్‌లో ఉన్న నాగేశ్వర్ రావును ఆల్వాల్ ట్రాఫిక్ సీఐగా బదిలీ చేసారు. మొయినాబాద్ సీఐగా ఉన్న లక్ష్మి రెడ్డిని షాద్ నగర్ రూరల్ సీఐగా ట్రాన్స్‌ఫర్ చేసారు. అక్కడ ఉన్న సత్యనారాయణను క్రైమ్స్ వింగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసారు.

షాబాద్ సీఐ గురువయ్యను క్రైమ్స్ వింగ్‌కు బదిలీ చేసారు. ఇక, సైబర్ క్రైమ్స్‌లో ఉన్న భూపాల్ శ్రీధర్‌ను శంషాబాద్ ఎస్బీకి ట్రాన్స్‌ఫర్ చేసారు. అక్కడ ఉన్న విజయ్ కుమార్‌ను రాజేంద్రనగర్ ఎస్బీకి బదిలీ చేసారు. సీఏటీలో ఉన్న యాదయ్య గౌడ్‌ను షాబాద్ సీఐగా నియమించారు..........

నేడు వరంగల్ జిల్లా లో బీజేపీ నేతల పర్యవేక్షణ

హైదరాబాద్:జులై 02

తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి జితేందర్ రెడ్డి తదితరులు ఆదివారం వరంగల్‌కు వెళ్లనున్నారు. ఉప్పు నిప్పుగా ఉన్న ఈటల, బండి ఒకే వేదిక పంచుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు సన్నాహక సమావేశం ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు మోదీ రానున్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. వరంగల్ సభతో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. ఖమ్మంలో నేటి కాంగ్రెస్ సభకు దీటుగా వరంగల్‌లో మోదీ సభను నిర్వహించాలని కమలం నేతలు నిర్ణయించారు.

కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు 8న‌ హైదరాబాద్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.

కాగా ఆదివారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే కాబినెట్ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ప్రచారం నేపథ్యంలో.. రేపటి కాబినెట్ కౌన్సిల్ మీటింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది...

తిరుపతిలో కొనసాగుతున్న భక్తులు రద్దీ

తిరుపతి:జులై 02

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం నాడు భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 82,999 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 4.27 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 38,875 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.....

తెలంగాణ గ్రూప్‌-4 ఎగ్జామ్ పై ‘బలగం’ ఎఫెక్ట్.. కొంప ముంచిన గూగుల్ మ్యాప్

రాష్ట్ర వ్యాప్తంగా 8వేల 180 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నిర్వహించే గ్రూప్-4 పరీక్ష శనివారం జరిగింది. గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టీఎస్​పీఎస్సీ ఈ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎగ్జామ్స్ కి 9 లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభ్యర్థులు జనరల్ స్టడీస్ పరీక్ష రాయగా అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్రటేరియల్ ఎబిలిటీస్ పరీక్షలకు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా టీఎస్​పీఎస్సీ జాగ్రత్త పడింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్​పీఎస్సీ ప్రకటించడంతో.. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లను నిర్వాహకులు మూసివేశారు.

అనంతరం వచ్చిన వారినెవరిని కూడా పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించలేదు. మరోవైపు కొన్ని చోట్ల వివిధ రకాల కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోయారు. దీంతో వారు ఏం చేయలేని పరిస్థితుల్లో నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. హైదరాబాద్​ కూకట్‌పల్లి వివేకానంద డిగ్రీ కాలేజీ సెంటర్‌కి కాస్త ఆలస్యంగా ఏడుగురు అభ్యర్థులు వచ్చారు. అధికారులు వారిని అనుమతించకపోవడంతో నిరాశతో తిరిగి వెనుతిరిగారు.

అలాగే నాచారంలో గ్రూప్ 4 పరీక్షా కేంద్రానికి ఇద్దరు అభ్యర్థులు లేటుగా వచ్చారు. నాచారం ప్రతిభ పాఠశాలకు నలుగురు అభ్యర్థులు పలు రకాల కారణాలతో లేట్​గా వెళ్లారు. బాలనగర్‌లోని ఓ సెంటర్ వద్దకు ఇద్దరు, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీకళాశాలకు ముగ్గురు, సంగారెడ్డి సెయింట్ ఆంటోని పాఠశాలకు ఆరుగురు అభ్యర్థులు, జోగిపేట ప్రభుత్వ కాలేజీలో ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షకు హాజరుకాలేకపోయారు. ఆదిలాబాద్‌లో లేటుగా వచ్చిన 8 మంది అభ్యర్థుల్ని పరీక్ష హాల్​లోకి విడిచి పెట్టకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.

గూగుల్ మ్యాప్ తో బోల్తా

చౌటుప్పల్​లోని కృష్ణవేణి పాఠశాల సెంటర్ కోసం గూగుల్​లో లొకేషన్ సెర్చ్​ చేసుకొని పరీక్ష రాసేందుకు వచ్చిన గ్రూప్ 4 అభ్యర్థికి చివరికి నిరాశే మిగిలింది. మ్యాప్ చూపించిన లొకేషన్​కు చేరుకోగా అది సరైన అడ్రస్ కాదని, తప్పు అడ్రస్​ అని తేలింది. ఆఖరి నిముషంలో ఎట్టకేలకు ఆగమేఘాల మీద సరైన చిరునామాకు వెళ్లగా.. నిమిషం ఆలస్యమై పరీక్షను జస్ట్ మిస్ అయ్యారు.

ట్రైన్​ ఆలస్యం.. ఆందోళన చెందిన అభ్యర్థులు…

ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్​లో సాంకేతిక లోపంతో సికింద్రాబాద్ మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ఇందులో ఉన్నటువంటి గ్రూప్​-4 పరీక్ష రాసే అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి కొందరు.. అదే ట్రైన్​లో టెన్షన్​ టెన్షన్​ వాతావరణంలో మరికొందరు సమీప పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.

సెల్​ఫోన్​తో ఎగ్జామ్ హాల్​లోకి

టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఓ అభ్యర్థి సెల్​ఫోన్​తో అడ్డంగా బుక్కయ్యాడు. అధికారులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్​నగర్ మండలం మారుతినగర్​లోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్​ఫోన్​తో పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష స్టార్ట్ అయిన అరగంట తర్వాత గమనించిన ఇన్విజిలేటర్ పై అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. అతని సెల్​ఫోన్ ని సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కింద ఆ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్​ హరీశ్​ వెల్లడించారు. ఈ ఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్​లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష అంతా కూడా ప్రశాంతంగా జరిగిందన్నారు.

ఇకపోతే డైరెక్టర్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎఫెక్ట్ టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-4 పరీక్షపై పడింది. పేపర్ -1లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రశ్నలు రాగా.. ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభించిన ‘బలగం’ చిత్రం నుంచి ఒక ప్రశ్న అడిగారు. ‘బలగం సినిమాకి సంబంధించి కింది జతలలో ఏవి సరైనవి అంటూ.. మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, సంగీత దర్శకుడు, కొమరయ్య పాత్ర పేర్లను ప్రస్తావించారు.

ఈ విధంగా టీఎస్​పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్షలో బలగం మూవీపై ప్రశ్న రాగా.. కొందరు అభ్యర్థులు వివిధ కారణాలతో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో.. వారిని నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుతిరిగారు. ఇంకొందరు రకరకాల కారణాలతో ఎగ్జామ్ హాల్ కి లేటుగా రావడంతో వారిని కూడా పరీక్ష రాయనివ్వలేదు. అలాగే పరీక్ష హాల్ కి ఫోన్ తెచ్చిన ఓ అభ్యర్థిని అధికారులు పట్టుకుని.. అతని సెల్​ఫోన్ ని సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కింద ఆ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది............

పొంగులేటికీ బెదిరింపు లేఖా ❓️

ఖమ్మం జిల్లా :జులై 01

ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ సభ, హస్తం పార్టీలోకి కీలక నేతలు చేరుతున్న సందర్బంగా పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. పొంగులేటితో పాటు ఆయన అనుచరులను టార్గెట్‌ చేస్తూ పోస్టర్లు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది.

పొంగులేటి ఖబడ్దార్‌ అంటూ పోస్టర్లలో రాసి ఉండటం సంచలనంగా మారింది.

మరోవైపు.. పొంగులేటి అనుచరుడు డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ మువ్వ విజయబాబుకు వార్నింగ్‌ లేఖ కూడా వచ్చింది.

ఇక, ఆ లేఖలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలంటూ హెచ్చరించారు. చీకటి కార్తిక్‌కు పట్టిన గతి పడుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. ఇదే క్రమంలో వారి శవాలు కూడా దొరకవు అంటూ రాసుకొచ్చారు.....,...

ఖమ్మం సభకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాహుల్‌గాంధీ

రేపు ఖమ్మంలో నిర్వహించే భారీ భహిరంగ సభకు రాహుల్ గాంధీ రానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన ఖమ్మం సభకు చేరుకోనున్నారు. సభ అనంతరం రోడ్డు మార్గాన తిరిగి గన్నవరానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు.

ఖమ్మంలో నిర్వహించనున్న జనగర్జన బహిరంగ సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఆదివారం రోజున జరగనున్న ఈ సభకు రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారు.

ఈ క్రమంలో ఈ సభకు.. భారీగా జనసమీకరణ లక్ష్యంగా హస్తం పార్టీ చర్యలు చేపట్టింది. మరో నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు ఉన్నందున ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేసి సత్తా చాటుకోవాలని ప్రయత్రిస్తోంది. వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించేలా కార్యాచరణ రూపొందిస్తోంది...

కేటీఆర్ సార్ కు కోపం వచ్చింది దా?

మహబూబాబాద్:జులై 01

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు కోపమొచ్చింది.. దీన్ని కోపం అనడం కంటే అసహ్యించుకున్నారంటే కరెక్టుగా సరిపోతుందేమో! . మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ విచ్చేశారు. అయితే.. మంత్రి-ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. ఒక్కసారిగా కేటీఆర్ కోపంతో రగిలిపోయారు. ఇప్పుడీ వీడియో ట్రెండింగ్ లో దూసుకు పోతుంది.

వివరాలలోకి వెళితే

మహబూబాబాద్‌లో గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయడానికి కేటీఆర్ హాజరయ్యారు. కాన్వాయ్ దిగి కేటీఆర్ సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెనుక నుంచి పరుగున వచ్చి మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కచూపు చూసిన కేటీఆర్.. చీదరించుకుంటూ ఎమ్మెల్యే చేతిని తోసేశారు. సార్.. కాస్త శాంతించండి’ అన్నట్లుగా ఎమ్మెల్యే చేతులు జోడించి నమస్కరించినా కేటీఆర్‌కు కోపం తగ్గలేదు. దీంతో చేసేదేమీ లేక చేతులు జోడించి నమస్కరిస్తూనే శంకర్ నాయక్ ముందుకు సాగారు. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం క్లారిటీగా తెలియట్లేదు కానీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

శంకర్ నాయక్ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రతిపక్షాలు, సొంత పార్టీ నేతలే చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఎంపీ మాలోత్ కవిత-ఎమ్మెల్యే మధ్య గత కొన్ని రోజులుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. మరోవైపు.. మంత్రి సత్యవతి రాథోడ్‌తోనూ విబేధాలున్నాయి. ఎంపీ, మంత్రితోనే కాదు స్థానికంగా ఉన్న ద్వితియ శ్రేణి నేతలతోనే ఇదే పరిస్థితి.

రెండ్రోజులకోసారి శంకర్ నాయక్ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఎమ్మెల్యే తీరుతో పార్టీకి డ్యామేజ్ అవుతోందని పెద్ద ఎత్తున అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో సుమారు 18 నుంచి 30 మందికి టికెట్లు ఇచ్చే పరిస్థితులు లేవని వార్తలు వస్తున్నాయి. ఆ జాబితాలో శంకర్ నాయక్ కూడా ఉన్నారట. అందుకే ఇప్పట్నుంచే ఎమ్మెల్యేను పక్కనెడుతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఇలా కేటీఆర్ ప్రవర్తించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

ఇదంతా జరిగినప్పుడు మంత్రి సత్యవతి రాథోడ్ కూడా కేటీఆర్ వెంటే ఉన్నారు.మొత్తానికి చూస్తే.. కేటీఆర్-శంకర్ మధ్య ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా.. లేకుంటే ఇప్పట్నుంచే పక్కనెడుతున్నట్లు అన్నారనేదానికి ఇది సంకేతమా..? అనేది తెలియట్లేదు. కేటీఆర్ తీరుపై శంకర్ నాయక్ సామాజిక వర్గం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. సోషల్ మీడియాలో అయితే చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వస్తున్నాయి. . ఇద్దరి మధ్య అసలేం జరిగింది..? కేటీఆర్ ఎందుకిలా ప్రవర్తించారు..? అనేది తెలియాలంటే ఎమ్మెల్యేగానీ.. మంత్రిగానీ రియాక్ట్ అయితే తప్ప తెలిసేలా లేదు....

ప్రారంభమైన బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న బండి సంజయ్ భవితవ్యం

న్యూ ఢిల్లీ :జులై 01

బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులు, మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇన్చార్జులు హాజరయ్యారు.

సమావేశంలో బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ బిఎల్ సంతోష్ పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. మోదీ ప్రభుత్వ పాలన తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన మహాజన సంపర్క్ అభియాన్, ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను అధిష్టానానికి నేతలు సమర్పించున్నున్నారు.

ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు ధఫాలుగా సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. మొదటగా జాతీయ ప్రధాన కార్యదర్శులతో తర్వాత మోర్చాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితులపై అధిష్టానం చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం పూర్తైతే కానీ తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్‌ను కొనసాగిస్తారా? లేదా? అనేది తేలే అవకాశం ఉంది....