/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Vijayawada: ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభం.. Yadagiri Goud
Vijayawada: ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభం..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా తొలి రోజు అమ్మవారి మూలవిరాట్‌ సహా ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు..

SB NEWS

SB NEWS

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :జులై :01

నేడు శనివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

నిన్న శుక్రవారం రోజు శ్రీవారిని 73,572 మంది భక్తులు దర్శించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,448 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

బండి సంజయ్ ఓ బిత్తిరి సత్తి? : రేవంత్ రెడ్డి ఫైర్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి ఖమ్మంలో జరుగుతోన్న భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నారు. భట్టి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ నెల 2వ తేదీన జరగనున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భట్టి పాదయాత్ర కాంగ్రెస్‌కే కాదు.. యావత్ తెలంగాణకు మేలు చేస్తుందని అన్నారు. భట్టి పాదయాత్ర నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను మేల్కొలిపిందన్నారు.

పీపుల్స్ మార్చ్ యాత్రలోని ప్రజా సమస్యల అంశాల ఆధారంగా మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భట్టి యాత్ర సాగిందన్నారు. భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నిర్వహిస్తోన్న జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని.. ఖమ్మం జనగర్జన సభ తెలంగాణ ప్రజలకు దశ, దిశ నిర్దేశించబోతుందని అన్నారు.

రాబోయే ఎన్నికల కోసం ఖమ్మం సభ నుండే రాహుల్ సందేశం ఇవ్వబోతున్నారని.. ఖమ్మంలో రాహుల్ గాంధీ ఇచ్చే సందేశం తెలంగాణ ముఖ చిత్రం మార్చబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ మొజంజాహీ మార్కెట్‌లో గులాబీ పూలు అమ్ముకునేవాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ ఓ బిత్తిరి సత్తి అని.. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్, రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ చేసిన దాడుల్లో దొరికిన ఆస్తులు ఎన్నో బయట పెట్టాలని ఈ సందర్భంగా రేవంత్ డిమాండ్ చేశాడు...

బీఆర్ఎస్‌కు మరో సీనియర్ నేత మరో షాక్?

బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల సామేల్.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ రోజు మధ్యాహ్నం అర్వపల్లిలో సామేల్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే రాజీనామా చేస్తానని సామేలు ఏబీఎన్‌కు వెల్లడించారు. సామేల్ త్వరలోనే రాజీనామా ప్రకటన చేయనున్నారు. తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.

నిన్న తిరుమలగిరిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను మూడోసారి గెలిపించాలని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్‌ను స్థానికుడినైన తనకే కేటాయించాలని సామేల్ గత కొంతకాలంగా కోరుతున్నారు. కానీ కేటీఆర్ గాదరి కిషోర్ పేరును ప్రకటించడంతో సామేల్ తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఉద్యమంలో ఏళ్లపాటు పని చేసినా కూడా తనకు గుర్తింపు దక్కడం లేదని సామేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు...

తెలంగాణ నుండి మరొకరికి కేంద్రమంత్రి పదవి.. ఆ నలుగురు ఎంపీల్లో ఒకరికి చాన్స్..?

వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. తెలంగాణ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి దక్కే చాన్స్ ఉన్నది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కేబినెట్‌లోకి తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు బీజేపీ కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం.

ఆ చాన్స్ ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం నుంచి బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ (నిజామాబాద్), సోయం బాపూరావు (ఆదిలాబాద్) లోక్‌సభకు ఎన్నికవగా.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరిలో కేంద్రమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఆ ఒక్కరు ఎవరు..?

తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ సెకండ్ బెర్త్ విషయంపై కొంతకాలంగా ఢిల్లీ బీజేపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. రెండేండ్ల క్రితం జరిగిన కేబినెట్ మార్పులు చేర్పుల్లో పన్నెండు మందిని బయటకు పంపగా.. 17 మందికి కొత్తగా అవకాశం లభించింది. గత నెలలో కిరణ్ రెజిజును న్యాయ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి ఎర్త్ సైన్స్ శాఖకు మాత్రమే పరిమితం చేశారు.

ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున.. ఈ నాలుగు పెద్ద రాష్ట్రాలకు చెందిన వారికి కేంద్ర కేబినెట్‌లో అవకాశం కల్పించాలన్నది ప్రధాని మోడీ ఆలోచిస్తున్నట్టు టాక్.

మరి తెలంగాణ నుంచి ఎవరికి చాన్స్ దొరుకుతుందన్నది అంతుచిక్కడంలేదు. బండి సంజయ్ ఇప్పటికే స్టేట్ చీఫ్‌గా కొనసాగుతున్నందున, ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించే ఆలోచన లేదని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ క్లారిటీ ఇచ్చారు. కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు వచ్చిన వార్తలను ఆయన కూడా ఖండించారు.

ఒకే వ్యక్తికి రెండు కీలక పదవులు ఇవ్వరాదన్నది బీజేపీ నిర్దేశించుకున్న విధానం. దీంతో కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజయ్ చేరిక దాదాపు లేనట్లే. మరి అర్వింద్, సోయం బాపూరావ్, లక్ష్మణ్‌లలో ఎవరికి చాన్స్ లభిస్తుందో వేచి చూడాల్సిందే. పీఎం లాడ్స్ నిధులను తన కుమారుడి పెండ్లికి, ఇల్లు కట్టుకోడానికి వాడుకున్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోయం బాపూరావుకు చాన్స్ ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

అర్వింద్ లేదా లక్ష్మణ్..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించాలనుకుంటున్నందున నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాత్రమే ఉన్నారు. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ప్రస్తుతం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నందున ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జూలై ఫస్ట్ వీక్‌లోనే కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలను, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల నుంచి విశ్లేషించి ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోనున్నారు. ఏకకాలంగా అటు పార్టీకి కలిగే ప్రయోజనాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో బుధవారం రాత్రి ఐదున్నర గంటల పాటు చర్చలు జరిపి కేబినెట్‌లో మార్పులు, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల మార్పు గురించి లోతుగా చర్చించారు..,

Amarnath Yatra 2023: అమర్‌నాథ్‌ యాత్రకు స్పాట్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

: ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్రకు స్పాట్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జులై 2 నుంచి ప్రారంభమయ్యే యాత్ర చేపట్టేందుకు పెద్దఎత్తున సాధువులు సహా 1500 మందికి పైగా యాత్రికులు జమ్ముకు చేరుకున్నారు..

ఈ క్రమంలో నగరంలోని షాలిమార్‌ ప్రాంతంలో అధికారులు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సాధువుల కోసం ప్రత్యేకంగా పురానీ మండీ ప్రాంతంలోని రామాలయం ఆవరణలో మరో కేంద్రాన్ని ఆరంభించారు..

SB NEWS

నేడే పొడు పట్టాల పంపిణీ

ఆసిఫాబాద్ జిల్లా:జూన్ 30

తెలంగాణ పోడు పట్టాల పంపిణీపై నాలుగేళ్ళుగా నడుస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్రం మొత్తంమీద సుమారు 11.5 లక్షల ఎకరాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పంపిణీ చేయడానికి జాబితాను సిద్ధం చేసింది మాత్రం నాలుగు లక్షల ఎకరాలకే. మిగిలినవారికి ఎప్పుడు అందుతాయన్నదానికి అధికారుల నుంచి సమాధానం లేదు. ఈ ఒక్క ఫేజ్‌తోనే ఈ ప్రక్రియ ఆగిపోతుందా?.. లేక మరికొన్ని విడతల్లో మొత్తం అర్హులందరికీ ప్రభుత్వం నుంచి పట్టాలు అందుతాయా అన్నది అంతుచిక్కడంలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం పట్టాల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15,254 మంది లబ్ధిదారులకు 44,750 ఎకరాల మేర పోడు భూములకు పట్టాల పంపిణీ జరగనున్నది.

రాష్ట్రం ఆవిర్భవించే సమయానికి పోడు సాగుపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీ, గిరిజన కుటుంబాలకు పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల నుంచి పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందాయని, మొత్తం 11.5 లక్షల ఎకరాలుగా తేలిందని వివరించారు. ఇకపైన పోడు నరకబోమంటూ గ్రామ సభల్లో తీర్మానం చేయడంతో పాటు ప్రభుత్వానికి లబ్ధిదారులు అండర్‌టేకింగ్ ఇవ్వాలని, ఆ తర్వాతనే పట్టాలను ఇస్తామని, ఒకవేళ ఆ తర్వాత అడవిని నరికితే పట్టాలను రద్దు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మాత్రం 4.05 లక్షల ఎకరాలకే నిర్ణయం జరిగింది. మిగిలిన భూమికి ఎప్పుడు పట్టాలు వస్తాయన్నదానికి అధికారులకూ స్పష్టత లేదు.

చివరి గంటల్లో జాబితాలో మార్పులు

ప్రతీ జిల్లాలో ఎన్ని ఎకరాలకు, ఎంతమంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేయాలో ప్రభుత్వం ముందుగానే జాబితాను సిద్ధం చేసింది. ఆ ప్రకారం అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 1.51 లక్షల ఎకరాలను 50,595 మంది లబ్ధిదారులకు ఇచ్చేలా లిస్టు తయారైంది. ఆ తర్వాతి స్థానాల్లో మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, నిర్మల్, ఖమ్మం తదితర జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు లబ్ధిదారులకు కలిపి కేవలం ఒక్క ఎకరం మాత్రమే మూడు పట్టాల రూపంలో పంపిణీ కానున్నది. ఆ తర్వాతి స్థానంలో నారాయణపేటలో ముగ్గురికి 8 కరాలు, జగిత్యాలలో 15 మందికి 19 ఎకరాలు, మహాబూబ్‌నగర్‌లో 19 మందికి 22 ఎకరాల చొప్పున పంపిణీ కానున్నది.

నాగర్‌కర్నూల్ జిల్లా అచంపేట నియోజకవర్గ పరిధిలోని తండాల్లో బుధవారం రాత్రి వరకూ లిస్టులో ఉన్న పేర్లు గురువారం రాత్రికి మాయమయ్యాయని, దీని గురించి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ దగ్గర కూడా క్లారిటీ లేదని ఆ గ్రామస్తులు మొత్తుకున్నారు. జాబితాలో పేర్లు ఎందుకు మారాయో తమకు కూడా తెలియదని, ఉన్నతాధికారుల నుంచి ఈ లిస్టు వచ్చిందని, చివరి గంటల్లో పేర్లలో ఎందుకు మార్పులు చోటుచేసుకున్నాయో తమకు తెలియదని బదులిచ్చినట్లు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మెట్‌పల్లిలో సైతం గిరిజనులు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి పేర్లు మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను నిలదీయడానికి వెళ్ళినా అక్కడ ఆయన లేకపోవడంతో రోడ్డు మీద నిరసన తెలపాల్సి వచ్చింది. కేసీఆర్ తండా, ఏఎస్ఆర్ తండాలకు చెందిన 200 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నా తొలుత ఎంపిక చేసినట్లు ప్రకటించి చివరకు పరిశీలించే ప్రాసెస్‌లో అర్హత లేదని తేలిందనే సమాధానాన్ని ఇచ్చారని స్థానికులు తెలిపారు.

సాగులో ఉన్న మొత్తం పోడు భూమికి పట్టాలను ఇస్తామని చెప్పినా చివరకు రెండొంతులకు కోత పెట్టి ఒక్క వంతుకు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసిందని, చివరు ఆ జాబితాలోనే స్థానికంగా ఉన్న అధికార పార్టీ లీడర్లు పేర్లను మార్చారన్న ఆరోపణలు వినిపించాయి. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులకు బదులుగా అధికార పార్టీకి చెందిన నేతలే పెత్తనం చేస్తున్నారని ఇంతకాలం ఉన్న సాధారణ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరే విధంగా ఇప్పుడు పోడు భూముల జాబితాలో పేర్లు గల్లంతు కావడం ఆదివాసీ, గిరిజన రైతుల్లో ఆగ్రహానికి కారణమైంది. గొత్త కోయలకు పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి గందరగోళం చోటుచేసుకుంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.....

నేడు ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

•జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

సీఎం కేసీఆర్‌ శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. గిరిజన, ఆదివాసీలకు పోడు పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన అక్కడి నుంచే శ్రీకారం చుడతారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్‌ ఆసిఫాబాద్‌ చేరుకుంటారు.

జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి గోండు వీరుడికి నివాళులర్పిస్తారు. తర్వాత బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కోట్నక్‌ భీమ్‌ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటిస్తారు.

ఆ తర్వాత జిల్లా పోలీసు కార్యాలయాన్ని, ఆసిఫాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులకు పోడు పట్టాలను అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మహబూబాబాద్‌లో నిర్వహించే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు...

నేడు తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతి :జూన్ 30

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం స్వామివారిని 62,005 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 34,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే....

•బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్. బిజెపి మహాజన్ సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల కాలంలో చేసిన సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ఎలికట్టే శక్తి కేంద్రం ఇంచార్జ్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్ అందిస్తూ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రధాన మంత్రికి మద్దతు తెలపండి అని ప్రచారం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో అంత్యోదయ స్ఫూర్తి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6, 000 రూపాయల ఆర్థిక సహాయం, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అపూర్వ వృద్ధి, ఈశాన్య రాష్ట్రాల చారిత్రక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వంలో కొత్త శకం, రైతు సంక్షేమానికి పెద్దపీట,

నారీ నారాయణి: మహిళా సాధికారత, భారతదేశ అమృతకాలం భావితరం సశక్తీకరణ, అందరికీ ఆరోగ్యకరమైన జీవితం, మధ్య తరగతికి సులభతర జీవితం, సశక్త భారతదేశం, నేడు భారతదేశంలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కరోనా కష్టకాలంలో దేశ ప్రజలకు వాక్సినేషన్, వందే భారత్ మిషన్, భారతదేశం భద్రత పటిష్టం, ఆర్టికల్ 370 రద్దు, వసుదైవ కుటుంబం, డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా భారతదేశాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీర్చిదిద్దాడన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల రూరల్ అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్, ఎలికట్టే బూత్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి సందీప్, లింగస్వామి, చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, నకిరేకల్ ఎస్సీ మోర్చా కన్వీనర్ కోరబోయిన లింగస్వామి బూత్ కమిటీ అధ్యక్షులు రావుల వెంకన్న, ఈదుల పవన్, శ్రీనివాస్, నవీన్, రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.