/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన Yadagiri Goud
నేడు ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

•జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

సీఎం కేసీఆర్‌ శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. గిరిజన, ఆదివాసీలకు పోడు పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన అక్కడి నుంచే శ్రీకారం చుడతారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్‌ ఆసిఫాబాద్‌ చేరుకుంటారు.

జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి గోండు వీరుడికి నివాళులర్పిస్తారు. తర్వాత బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కోట్నక్‌ భీమ్‌ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటిస్తారు.

ఆ తర్వాత జిల్లా పోలీసు కార్యాలయాన్ని, ఆసిఫాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులకు పోడు పట్టాలను అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మహబూబాబాద్‌లో నిర్వహించే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు...

నేడు తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతి :జూన్ 30

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం స్వామివారిని 62,005 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 34,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే....

•బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్. బిజెపి మహాజన్ సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల కాలంలో చేసిన సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ఎలికట్టే శక్తి కేంద్రం ఇంచార్జ్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్ అందిస్తూ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రధాన మంత్రికి మద్దతు తెలపండి అని ప్రచారం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో అంత్యోదయ స్ఫూర్తి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6, 000 రూపాయల ఆర్థిక సహాయం, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అపూర్వ వృద్ధి, ఈశాన్య రాష్ట్రాల చారిత్రక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వంలో కొత్త శకం, రైతు సంక్షేమానికి పెద్దపీట,

నారీ నారాయణి: మహిళా సాధికారత, భారతదేశ అమృతకాలం భావితరం సశక్తీకరణ, అందరికీ ఆరోగ్యకరమైన జీవితం, మధ్య తరగతికి సులభతర జీవితం, సశక్త భారతదేశం, నేడు భారతదేశంలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కరోనా కష్టకాలంలో దేశ ప్రజలకు వాక్సినేషన్, వందే భారత్ మిషన్, భారతదేశం భద్రత పటిష్టం, ఆర్టికల్ 370 రద్దు, వసుదైవ కుటుంబం, డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా భారతదేశాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీర్చిదిద్దాడన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల రూరల్ అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్, ఎలికట్టే బూత్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి సందీప్, లింగస్వామి, చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, నకిరేకల్ ఎస్సీ మోర్చా కన్వీనర్ కోరబోయిన లింగస్వామి బూత్ కమిటీ అధ్యక్షులు రావుల వెంకన్న, ఈదుల పవన్, శ్రీనివాస్, నవీన్, రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జనగర్జనకు భారీ ఏర్పాట్లు

•వంద ఎకరాల్లో నిర్వహణకు కసరత్తు

•పనులు, జనసమీకరణలో నిమగ్నమైన హస్తం శ్రేణులు, పొంగులేటి వర్గీయులు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వర్గీయుల చేరిక నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఖమ్మంలో 2వతేదీన నిర్వహించ తలపెట్టిన సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

రాహుల్‌గాంధీ రానున్న ఈ సభకు తెలంగాణ జనగర్జన సభగా పేరుపెట్టిన నేతలు.. సభను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం-వైరా రోడ్డులో ఎస్‌ఆర్‌గార్డెన సమీపంలోని వంద ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి.. యంత్రాలు, ట్రాక్టర్ల సాయంతో చదును చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం ఆ స్థలానికి సమీపంలోని మరో 50ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఓ వైపు పార్టీ నేతలు, శ్రేణులతో పాటు త్వరలో పార్టీలో చేరబోయే పొంగులేటి అనుచరులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు అన్ని జిల్లాల నుంచి 4లక్షల నుంచి 5 లక్షల మంది వరకు జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. రాహుల్‌గాంధీతోపాటు కర్నాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు ఈ సభకు హాజరుకానున్నారు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మరికొందరు ఇతర జిల్లాల నేతలు అదే సభలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈసభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున ఈ సభ ఎన్నికల శంఖారావానికి వేదిక కానుందని, రాష్ట్ర కాంగ్రె్‌సలో కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని నేతలు ఆశిస్తున్నారు. రాహుల్‌సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించబోతున్నామని, 5 లక్షల మంది అంచనాతో సభా ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తెలంగాణ జనగర్జన పేరిట జరిగే ఈసభతో తెలంగాణలో కాంగ్రె్‌సను ఎన్నికల దిశగా నడిపించేందుకు సిద్ధమవుతున్నామన్నారు.

రేపు ఖమ్మానికి రేవంత్?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి గురువారం ఖమ్మం రానున్నారు. 2వతేదీన ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన ఖమ్మం రానున్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, జనసమీకరణ తదితర అంశాలపై చర్చించి సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించున్నారు.

Hyderabad : హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరొక భారీ మోసం..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరొక భారీ మోసం వెలుగు చూసింది. పన్ను రిఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసింది. 40 కోట్ల రూపాయల స్కామ్‌ని ఐటీ అధికారులు బయటపెట్టారు..

దీనిలో 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్‌లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు జరిగాయి. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీలు, వ్యక్తులపై కేసులు నమోదుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

ముందస్తుగా కంపెనీలు, వ్యక్తులకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. అదనపు కన్సల్టెంట్‌లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురంలోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ స్కాం లో కన్సల్టెంట్లు, ఉద్యోగులు ఉన్నారని ఐటీ అధికారులు తెలిపారు. కన్సల్టెంట్‌లు, ఏజెంట్ల రీఫండ్ మొత్తంపై 10% కమీషన్ కోసం రిటర్న్‌లను దాఖలు చేశారు. 2017లో సైతం ఐటీ ఇదే తరహా మోసాన్ని గుర్తించింది. 200 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్‌లను క్లెయిమ్ చేశారని ఐటీ అధికారులు తెలిపారు..

తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం

తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

సాయిచంద్ మృతిపట్ల ముఖ్యమంత్రి సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు.

చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని కొనియాడారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు...

Festivals: ఒకే రోజు రెండు పండగలు.. ఆలయాలు, ఈద్గాల్లో భక్తుల రద్దీ

తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. తొలి ఏకాదశి, బక్రీద్ పండగలు ఒకే రోజు కావడంతో ప్రార్థనలు, పూజలతో భక్తులు నిమగ్నమైపోయారు. ఆలయాల వద్ద భక్తులు..

మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తూ కొంతమంది ఉపవాస దీక్ష ఉంటున్నట్లు తెలిపారు. వర్షం కారణంగా కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని భక్తులు చెప్పారు.

పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు నిర్ణయించారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగే మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే రూట్లకు మళ్లించనున్నారు. ప్రయాణికులు సహకరించి వారు సూచించిన మార్గాల్లో ప్రయాణం సాగించాలని పోలీసులు కోరారు..

ఆలయాలు, మసీదుల దగ్గర పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఒకే రోజు హిందూ-ముస్లిం పండగలు రావడం సంతోషంగా ఉందని పలువురు తెలిపారు..

ప్రధాని ఇంట అర్ధరాత్రి బీజేపీ కీలక నేతలు.. వాటి గురించే చర్చ!

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట బుధవారం అర్ధరాత్రి ఈ సమావేశం జరగ్గా..

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్‌ నేతలు కొందరు హాజరయ్యారు.

ప్రధాని మోదీ ఇటీవలె అమెరికా, ఈజిప్ట్‌ పర్యటన ముగించుకుని వచ్చారు. అప్పటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. తాజాగా బీజేపీ కార్యకర్తలను సైతం ఉద్దేశించి ప్రసంగించారాయన. అదే సమయంలో జులై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలంతా అర్ధరాత్రి సమావేశమై చర్చించడం గమనార్హం.

బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో.. అభ్యర్థుల జాబితా తయారు, బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన గురించి ప్రధానంగా చర్చించినట్లు భోగట్టా. ఎన్నికల అంశంతో పాటు ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపాలని కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అందునా తాజాగా ప్రధాని గళం వినిపించిన యూనిఫామ్‌ సివిల్‌కోడ్‌ను మేనిఫెస్టోలో కొనసాగించే అంశాన్ని సైతం లేవనెత్తినట్లు ఓ బీజేపీ కీలక నేత చెబుతున్నారు. ఈ భేటీ ఆధారంగా.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం వీలైనంత త్వరలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది..

హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌:జూన్ 29

బక్రీద్‌ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాత నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మీరాలం ట్యాంక్‌ ఈద్గా ప్రాంతంలో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటాయని తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..

పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారు బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్య ఈ రూట్లలో అనుమతిస్తారు.

ఈ వాహనాలను జూ పార్కు, మసీద్‌ అల్హా హో అక్బర్‌ ఎదురుగా పార్కు చేయాలి

సాధారణ ట్రాఫిక్‌కు ఈద్గా రోడ్డు వైపు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపూరా, పురానాపూల్‌ వైపు మళ్లిస్తారు.

శివరాంపల్లి, ధనమ్మ హట్స్‌ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ధనమ్మ హట్స్‌ రోడ్డు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్‌ను ఈద్గా వైపు అనుమతించరు. ఈ వాహనాలు ధనమ్మ హట్స్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి శాస్త్రిపురం, ఎన్‌ఎస్‌కుంట రూట్లలో వెళ్లాలి.

ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలను పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే వాటిని పురానాపూల్‌ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.

ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్‌ జంక్షన్‌ వద్ద నుంచి మళ్లిస్తారు.

కాలాపత్తర్‌ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్‌ ఠాణా వైపు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు, సాధారణ వాహనాలను మోచీ కాలనీ, బహదూర్‌పురా వైపు మళ్లిస్తారు.

ఈటలకు సెక్యూరిటీ.. డీజీపీకి కేటీఆర్ కీలక ఆదేశాలు

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఇదే అంశమై డీజీపీ అంజనీకుమార్ తో ఫోన్ లో కేటీఆర్ మాట్లాడారు.

ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు. ఈటలకు భద్రత పెంపుపై డీజీపీ సమీక్ష చేయనున్నారు.

కాసేపట్లో ఈటల ఇంటికి సీనియర్ ఐపీఎస్ అధికారి వెళ్లనున్నారు. అయితే నిన్న ప్రెస్ మీట్ లో ఈటల భార్య జమున ఈటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో ప్రాణ హాని ఉందని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గంటల వ్యవధిలోనే ఈటలకు ‘‘వై కేటగిరి’’ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే ఈటలకు సెక్యూరిటీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డీజీపీని ఆదేశించడంతో హుజురాబాద్ ఎమ్మెల్యే భద్రతపై ఉత్కంఠ నెలకొంది....