సమాచార హక్కు వికాస సమితి (SHVS) కనగల్ మండల అధ్యక్షుడిగా ఆదిమల్ల దేవేందర్ నియామకం
నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ మండల సమాచార హక్కు వికాస సమితి (SHVS) అధ్యక్షుడిగా ఆదిమల్ల దేవేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు SHVS వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణ రెడ్డి గారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆదిమల్ల దేవేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణ రెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాచార హక్కు చట్టం (RTI)పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే మండల వ్యాప్తంగా సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా పని చేయడం. మరియు సామాన్య ప్రజలకు చట్టపరమైన సమస్యల్లో అండగా నిలవడం నా ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొని దేవేందర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. "సదా ప్రజా సేవలో, సమాచార హక్కు పరిరక్షణలో ముందుంటాను" అని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.



















Jul 13 2026, 09:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.8k