NLG: జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
నల్లగొండ: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంత ఖర్చయినా కానివ్వండి.. ఎన్ని కష్టాలైనా రానివ్వండి.. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల వద్ద ఏర్పాటుచేసిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.
మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితులు తలెత్తబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఫ్లోరైడ్ బారిన పడి నల్గొండ ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు. మూసీలో కొట్టుకొచ్చే శవాలు, కళేబరాల నుంచి విముక్తి కలిగించి ఈ జిల్లాలో వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడే విధంగా గోదావరి నుంచి నీటిని తరలించి కృష్ణా నదిలో కలిసే వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలను ప్రవహింపజేసి దేశానికే తలమానికంలా నిలబెట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. 44 కిలోమీటర్ల ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటిని ఇవ్వాలని ప్రణాళికలు సిద్దం చేశామని, బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించామన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా పోరాటాల గడ్డ నల్గొండ జిల్లాలో ఉత్సవాలు చేసుకోవడం సంతోషకరం.
21 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2400 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగిందని చెప్పారు. 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పరంగా 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఏ రాష్ట్రానికి లేదని అన్నారు.
నల్గొండ రింగ్ రోడ్డు ను పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్డు తో పాటు 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, ఎంపీ లు చామాల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, పాల్గొన్నారు.

నల్లగొండ: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంత ఖర్చయినా కానివ్వండి.. ఎన్ని కష్టాలైనా రానివ్వండి.. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల వద్ద ఏర్పాటుచేసిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.

నల్లగొండ: నాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను 65 శాతం, బ్రాహ్మణ వెల్లంల ను 75 శాతం పూర్తి చేసుకున్నాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నల్లగొండ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించారు.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
అంతకుముందు థర్మల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పైలాన్ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్లోని 800 మెగావాట్ల యూనిట్-2 వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు.
నల్లగొండ జిల్లా: నేడు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మంత్రులతో కలిసి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రితో కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ తల్లికి పూలు సమర్పించారు.
నల్లగొండ: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభ సందర్భంగా, నల్లగొండకు వచ్చిన నేపథ్యంలో.. సాయంత్రం ఎస్ ఎల్ బి సి మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు, వివిధ గ్రామాల నుండి మండలాల నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సులలో, ఇతర ప్రైవేటు వాహనాల్లో జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
నల్లగొండ:
సంగారెడ్డి జిల్లా: బ్యాంక్ లో రుణం పొందడం కోసం ఫిర్యాదుదారునికి నోడ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.15,000/- లంచం తీసుకుంటూ.. శుక్రవారం మహదేవపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
Dec 08 2024, 13:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.3k