కొండూరు భాస్కర్ సౌజన్యంతో ఆర్థిక సహాయం అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లో ఇటీవల అనారోగ్యం తో గ్రామ పంచాయితీ సిబ్బంది పల్లెర్ల యాదయ్య మరణించినారు . ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని కొండూరు భాస్కర్ పరామర్శించి , కొండూరు భాస్కర్ సౌజన్యం తో 5000 రూపాయలను ఆర్థిక సాయం అంద జేశారు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల రాజు, కాసుల వెంకన్న, పల్లెర్ల సుధాకర్,కొండూరు సాయి, పల్లెర్ల పెంటయ్య, నాగరాజు, మచ్ఛగిరి,స్వామి, పడిగే0 లింగుస్వామి, పల్లెర్ల క్రిష్ణ, సహదేవ్ తదితరాలు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో గురువారం బిసి మండల నాయకులు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి యాదవ్ మాట్లాడుతూ నవంబర్ మూడవ తేదీన మిర్యాలగూడలో నిర్వహించే బీసీ గర్జన ను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1947 దేశానికి స్వాతంత్రం వస్తే 1993 మండల్ కమిషన్ అమలు చేసే వరకు దాదాపు నాలుగు దశబ్దాలు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. రాజకీయ రంగంలో నేటికి లేదు .మండల్ అమలుతో వచ్చిన ఇరువై ఏడు శాతం రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ రంగాలలో మాత్రమే ఇది కూడా అరకొరగా అమలవుతుందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు తెచ్చి ఉన్న కొద్ది అవకాశాలు గండి కొట్టారని అన్నారు. ఈ మహాసభలో తమ్మడబోయిన అర్జున్ కోకన్వీనర్ బీసీ జాతీయ చైతన్య వేదిక, సూరజ్ యాదవ్ మండల్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ,ఆర్ కృష్ణయ్య మాజీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ,దేశ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.
Nov 03 2024, 16:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.2k