/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి Mane Praveen
Mane Praveen

Sep 06 2024, 21:11

NLG: వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
నల్లగొండ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వినాయకచవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు.

వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని విజ్ఞప్తి చేశారు.

Mane Praveen

Sep 06 2024, 15:19

NLG: సిఐటియు ఆధ్వర్యంలో  మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
ఆశా డే సందర్భంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని, శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో మర్రిగూడ మండల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ కు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆశాలు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ స్కీం లో పనిచేసే ఆశాలు దళిత, బలహీన వర్గాలకు చెందిన వారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఆశలను కార్మికులుగా గుర్తించాలి, గ్రాడ్యుటీ మరియు పెన్షన్తో సహా అన్ని సామాజిక భద్రత ప్రయోజనాలకు నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ కాకుండా చెల్లించాలి.అన్ని రకాల పెండింగ్ బిల్లు లు తక్షణమే చెల్లించాలి. ఆశా లకు పనిభారం తగ్గించాలి. పారితోషకం లేని పనులు చేయించ కూడదని అన్నారు.

అదేవిధంగా అంగన్వాడీ లకు గ్రేడ్ వర్జింపజేసి ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును స్కీం వర్కర్ లో భాగమైన ఆశలకు వర్తింపచేయాలని ఆరు నెలల వేతనంతో కూడిన ప్రస్తుత సెలవులు అమలు చేయాలని, 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, మెడికల్ సెలవుల కోసం కచ్చితంగా నిబంధనలు రూపొందించాలని, అదేవిధంగా విధుల కోసం ఆశలకు ప్రయాణ ఖర్చులను వాస్తవ రూపంలో చెల్లించాలి. లేబర్ కోడ్స్ ను ఉపసంహరించుకోవాలి. ఆశలను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, మట్టం భాగ్యమ్మ ఏర్పుల పద్మ, ఊరిపక్క మేరీ, అందుగుల యాదమ్మ, రామావత్ జయమ్మ, లక్ష్మి, విజయమ్మ , సుజాత తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 06 2024, 14:34

TG: వరద బాధితులకు ఒక నెల జీతాన్ని ఇచ్చిన భువనగిరి ఎంపీ చాపల కిరణ్ కుమార్ రెడ్డి
HYD: వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు,  భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తన ఒక నెల జీతం రూ.1.85 లక్ష లను ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.

ఈ మేరకు సంబంధిత  చెక్కును అందజేశారు. వరద సహాయ కార్యక్రమాల కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ఒక నెల జీతాన్ని అందించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు.

Mane Praveen

Sep 06 2024, 07:52

ఉత్తమ గ్రంథ పాలకులుగా అవార్డును స్వీకరించిన డా.దుర్గాప్రసాద్
HYD: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ఉన్నత విద్యలో రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రంథ పాలకులుగా అవార్డును డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ పొందారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, కే.కేశవరావు ప్రభుత్వ సలహదారు, తెలంగాణ శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఏబీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీల చేతుల మీదుగా అవార్డును గ్రంథ పాలకులు దుర్గాప్రసాద్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు లభించడం ద్వారా తనకు ప్రోత్సాహకంగా ఉందని, ఇంకా మంచిగా గ్రంధాలయ సేవలు విద్యార్థులకు అందిస్తానని తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ కు రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథపాలకులు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జోష్ణ ప్రభ, అధ్యాపక, కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో బుర్ర వెంకటేశం ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉన్నత విద్య, దేవసేన- కళాశాల విద్య, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి మరియు ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ బాల భాస్కర్, కళాశాల విద్య అకాడమిక్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 05 2024, 22:24

నల్లగొండ లో కొవ్వొత్తుల ర్యాలీ
దేశంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులను నిరసిస్తూ, నల్లగొండ పట్టణ కేంద్రంలో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. కలకత్తా లో జూనియర్ డాక్టర్ పై , కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళల పై జరిగిన అత్యాచారం, హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

PDSU, PYL, IFTU, BCP, TJS, TSU పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 05 2024, 22:18

NLG: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: సీఐ రాజశేఖర్ రెడ్డి
నల్లగొండ: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, డీఎస్పీ శివరాం రెడ్డి సూచనల మేరకు, నేడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ మండప నిర్వాహకులతో,  పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పలు సూచనలు చేశారు.

1) ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు  ప్రతి విగ్రహాన్ని విధిగా ఆన్లైన్ చేసుకోవాలని, ప్రతి విగ్రహానికి పోలీస్ వారి నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని విగ్రహాన్ని ఆన్లైన్ చేసుకోవడం వల్ల పోలీస్ వారు ప్రతి రోజు రాత్రి పూట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జియో టాగ్ చేసి, నిఘా పెడతామని  తెలిపారు. 
2)మండపాలను రోడ్ కి అడ్డంగా నిర్మించటం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మండపాలను నిర్మించుకోవాలి.
3)ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందిని సంప్రదించి, వారి వద్ద నుండి పర్మిషన్ తీసుకుని, తగు జాగ్రత్తలు పాటిస్తూ, మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
3)నిమజ్జనం రోజు గణేష్ మండపాల నిర్వాహకులు రాత్రి వరకు ఉండకుండా తొందరగా తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం చేయాలి.
4)DJ లకు పర్మిషన్ లేదు. సౌండ్ బాక్స్ లకు కూడా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. ఒక వేళ DJ లు పెట్టినట్లయితే అట్టి DJ లను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.
5)తప్పనిసరిగా మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, లడ్డు విషయంలో దీపం విషయంలో జాగ్రత్తలు వహించాలని కోరారు. 

అదే విధంగా ప్రతి గణేష్ మండపం వద్ద భక్తి భావం పెంపొందించేలా, సమాజ వికాసానికి సంబంధించిన వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అంతేతప్ప రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని అసభ్యకరంగా ఉండే పాటలు డాన్సులు చేయవద్దు అని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఐ సందీప్ రెడ్డి, ఎస్.ఐ శంకర్, ఎస్.ఐ సైదులు, సురేష్, వార్డు కౌన్సిలర్లు సమద్, అభిమన్యు, శ్రీను, కంకణాల నాగిరెడ్డి, పూజిత శ్రీను, బాబా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సంపత్, హషం, నర్సిరెడ్డి, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 05 2024, 22:08

NLG: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సంధర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉపేందర్  మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా సంస్కరణల రూపశిల్పి అని ఆయన సేవలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవి,స్టాఫ్ క్లబ్ సెక్రటరీ జి.బాగ్య లక్ష్మి,యన్ యస్ యస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యన్.కోటయ్య , యమ్. వెంకటరెడ్డి,  ఏ.మల్లేశం, అనిల్ కుమార్,యమ్. సావిత్రి, కళాశాల బోధనా బోధనేతర సిబ్బంది,యన్ యస్ యస్ వాలంటీర్స్ మరియు విద్యార్దిని విద్యార్దులు   పాల్గొన్నారు.

Mane Praveen

Sep 05 2024, 19:15

NLG: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ
హైస్కూల్ కు చెందిన హిందీ స్కూల్ అసిస్టెంట్ ఎస్కే సలీం 2024-జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని, జిల్లా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును ప్రకటించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన ఇవాళ ఉపాధ్యాయుడు సలీం కు సన్మానం నిర్వహించారు.

ఈ మేరకు పాఠశాలలో విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 05 2024, 13:15

ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీస్
సూర్యాపేట జిల్లా:
ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీస్ లు మొత్తం రూ.5,44,000/- విలువ గల వస్తువులు సీజ్ చేశారు.

4 చైన్ స్నాచింగ్ కేసులు, 10 బైక్ దొంగతనం కేసులు ఛేదించిన తిరుమలగిరి పోలీస్, CCS సిసిఎస్ పోలీసులు.

3.95 లక్షల విలువగల 13 బైక్స్, 1.49 లక్షల విలువగల 3.7 తులాల బంగారు ఆభరణాలు సీజ్, ఇద్దరు నిందితుల రిమాండ్

Mane Praveen

Sep 05 2024, 13:07

TG: గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్.. ఇక అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రక్షాళన
ఇప్పటి వరకు గురుకులాలు అంటే కులం, మతం ప్రాతిపదికన కొనసాగుతున్నాయనే అపోహ ప్రజల్లో అయితే.. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఉన్న గురుకులం వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్నది. కులం, మతం ప్రాతిపదికన కాకుండా అందరికీ ఒకే తరహా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలని డిమాండ్ వస్తుండడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఇండిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నది. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.

ప్రస్తుతం ఉన్న గురుకులం వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై స్టూడెంట్స్, పేరెంట్స్, విద్యావేత్తలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఏకపక్షంగా విధానాలు రూపొందించి, పిల్లలపై రుద్దడం వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. విస్తృతంగా అభిప్రాయాలు సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు 55 ప్రశ్నలతో కూడిన క్వశ్చనేర్‌ను రూపొందించింది. ఫీల్డ్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా గురుకులాల్లో వసతులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ప్రస్తుతం రెసిడెన్సియల్ స్కూల్స్‌లో ఉన్న సిస్టమ్‌ పై సమగ్రంగా ఆధ్యయనం చేస్తుండగా.. ముందుగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలపై ఆరా తీస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,024 గురుకులాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెసిడెన్సియల్) ఉండగా, అందులో కేవలం 324 గురుకులాలకే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా స్కూల్స్ ప్రైవేటు భవంతుల్లోనే కొనసాగుతున్నాయి. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో దశలవారీగా అన్ని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఒక్కో గురుకులం కనీసం 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్నది. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో క్లాస్ రూమ్స్, లైబ్రరీ, మోడ్రన్ డైనింగ్, కిచెన్, రీడింగ్ టెబుల్స్, వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది.

ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సంబంధించి దాదాపు రూ.70 కోట్ల వరకు అద్దె పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. త్వరలో వాటిని క్లియర్ చేసి, ఆ బిల్డింగ్స్‌లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఓనర్లకు టార్గెట్ పెట్టనుంది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్ల నిర్మాణం, బెడ్స్, దోమల బెడదను ఆరికట్టేందుకు రెగ్యులర్‌గా ఫాగింగ్, కిటికీలకు జాలీల ఏర్పాటుకు ఆదేశించనున్నారు. పాములు సంచరించకుండా, పరిసరాలను క్లీన్ చేసేందుకు ప్రత్యేక చొరవ చూపనున్నారు. అలాగే సొంత బిల్డింగ్స్ ఉన్న గురుకులాల్లో సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు రంగంలోకి దిగనున్నారు. అందుకోసం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ప్రస్తుతం గురుకులాల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ చార్జీలతో నాణ్యమైన ఫుడ్ అందించలేకపోతున్నారు. ప్రస్తుతం 5,6,7 క్లాస్ స్టూడెంట్స్‌కు రోజుకు రూ.31.6 పైసలు అందిస్తుండగా.. 8,9,10 చదవుతున్న పిల్లలకు రూ.36.66 పైసలు, ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్‌కు రూ.50 ఖర్చు చేస్తున్నారు. ఈ చార్జీలతో టిఫిన్, లంచ్, డిన్నర్, వారంలో రెండుసార్లు నాన్ వెజ్ అందించడం కష్టంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. అందుకని త్వరలో మెస్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ఒక్కో విద్యార్థికి పౌష్ఠికాహారం అందించేందుకు ఎంత మేరకు మెస్ చార్జి ఇవ్వాలనే ఆంశంపై ఆరా తీస్తున్నది.

విస్తృత అభిప్రాయాల మేరకే గురుకులాలను ప్రక్షాళన చేస్తాం. ఏకపక్షంగా నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించదు. పిల్లలకు సరైన విద్యతోపాటు, ఆధునిక వసతులు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రస్తుత అకడమిక్ ఇయర్ నుంచే గురుకులాల్లో మార్పులకు శ్రీకారం చుట్టాం. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆ వర్గం, ఈ వర్గం అనే తేడా లేకుండా ఆడ్మిషన్ కోసం స్టూడెంట్స్‌ను చేర్చుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పెండింగ్‌లో ఉన్న అద్దెలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే అన్నిరకాల సౌకర్యాలు అందించాలని ఓనర్లను ఆదేశించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.