మునుగోడు నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని ఒక ప్రకటనలో తెలిపారు. అన్నా, చెల్లెళ్లు అక్కా, తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ ను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారత తో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని పేర్కొన్నారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని ఒక ప్రకటనలో తెలిపారు. అన్నా, చెల్లెళ్లు అక్కా, తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ ను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారత తో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లా:
నల్లగొండ:
నల్లగొండ జిల్లా టీజీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ హైదరాబాదులోని సాగర్ రింగ్ రోడ్డు ప్రయాణికుల ప్రాంగణం వద్ద బస్సులను పరిశీలించారు.
రైతుబడి కార్యక్రమంలో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ సుధారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బొమ్మపాల గిరిబాబు
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ లు తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులకు ఎంపికయ్యారు. వారిద్దరూ అన్నదమ్ములు కావడం విశేషం.
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న మద్దిమడుగు బిక్షపతి గారు పాల్గొని మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి యువతను చైతన్య పరుస్తూ భారత రాజ్యాంగ హక్కులు పూర్తిస్థాయిలో తెలియపరుస్తూ అవగాహన సదస్సు నిర్వహిస్తూ, జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొంది ఇప్పుడు గౌరవ డాక్టరేట్ తీసుకోవడం చాలా సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా సమతా సైనిక దళ్ అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని భారత రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరుడికి అందే విధంగా నిరంతరం పనిచేస్తుందని వారు గుర్తు చేశారు.
నల్గొండ: అక్టోబర్ లో జరిగే ఓపెన్ స్కూల్ 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు పరీక్ష ఫీజును ఈనెల 30 వ తేదీలో చెల్లించాలని డిఈఓ బిక్షపతి మరియు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జగదీష్ కుమార్ తెలిపారు.
అభ్యర్థులు మీసేవ కేంద్రం ద్వారా పరీక్ష ఫీజును చెల్లించి రసీదు ను సంబంధిత స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కు అందజేయాలన్నారు. పరీక్ష ఫీజును నిర్ణీత రుసుము తో ఈనెల 22 నుండి 30 వ తేదీ లోపు చెల్లించాలని పేర్కొన్నారు.
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన, ఈరోజు యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో సైన్స్ విభాగంలో ప్రాథమిక స్థాయి పరీక్ష నిర్వహించారు.అనంతరం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించి, రక్షాబంధన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
అదేవిదంగా పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సైదులు, తిరుపతి ,పాఠశాల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Aug 19 2024, 20:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.9k