సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై బిగ్ ట్విస్ట్..
సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్టే ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ (సోమవారం) విచారణ జరిగింది. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పందన తెలియజేయాలని కేంద్ర ఏజెన్సీలను కోర్టు కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.
మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది.
సీబీఐ, ఈడీ కేసులలో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక కవిత తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. 463 మంది సాక్షులను విచారించామని ధర్మాసనం పేర్కొంది.
కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె ఆశలన్నీ సుప్రీంకోర్టు పైనే పెట్టుకున్నారు. ఇవాళ తనకు బెయిల్ వస్తుందని ఆమె భావించినట్టు సమాచారం. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(క్రిమినల్) దాఖలు చేశారు. అక్కడ కూడా వాయిదా పడింది. ఇక బెయిల్ కోసం మరో వారం పాటు కవిత వేచిచూాడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడైనా బెయిల్ వస్తుందో రాదో వేచిచూడాల్సి ఉంది.
ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరూ కవితకు బెయిల్ అంశంపై చర్చించారని జోరుగా ప్రచారం సాగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కోర్టులో నిరాశే ఎదురవ్వడం గమనార్హం.
ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్షీట్లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయని... అందులో కవిత మాత్రమే మహిళ అని ఆమె తరుఫు సీనియర్ న్యాయవాదులు గతంలో ఢిల్లీ హైకోర్టులో వాదించారు. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయని తెలిపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల తీరును ఆమె తరుఫు న్యాయవాది తప్పుబట్టారు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయని.. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదని.. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయని వాటి కింద కవితకు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.





తాజా ఆరోపణలతో అదానీ స్టాక్స్ పడిపోతాయా? మార్కెట్ నిపుణుల సమాధానమిదే..! అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. సెబీ చైర్పర్సన్ మాధుబి పురి బచ్, ఆమె భర్తకు అదానీ ఆఫ్షోర్ వ్యాపారంలో వాటాలు ఉన్నాయని ఆరోపించింది. మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన క్రమంలో సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అదానీ గ్రూప్ స్టాక్స్ పతనమవుతాయా? మార్కెట్ నిపుణుల ఏమంటున్నారు? అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్ని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, ఈసారి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్ పర్సన్ మాధుబి పురి బచ్ని ఈ అంశంలోకి తీసుకొచ్చింది. అదానీ గ్రూప్ మారిషస్ ఆఫ్షోర్ ఫండ్స్లో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కొత్త ఇన్వెస్ట్గేటివ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పనితీరుపై చర్చకు దారితీసింది. సోమవారం ఆగస్టు 12వ తేదీన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పతనమయ్యే అవకాశం ఉందా? అనేది ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మరి ఈ అంశంపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? 2023లో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ అదానీ గ్రూప్పై తీవ్ర ఆరోపణలు చేసింది. కృత్రిమంగా షేర్ల విలువను పెంచి లాభపడిందని, స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినప్పటికీ ఆ సమయంలో గ్రూప్ కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. సుమారు 100 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి. అయితే, ఆ తర్వాత తమ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూప్ షేర్లు వేగంగా కోలుకున్నాయి. హిండెన్బర్గ్ ఆరోపణల ముందు సమయంలోని విలువను దాటి ట్రేడింగ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్నకు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. అవి అదానీ పోర్ట్స్ అండే సెజ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఎన్డీటీవీ ఉన్నాయి. తాజా ఆరోపణలపై స్టాక్ మార్కెట్ నిపుణులు స్పందిస్తున్నారు. 2023తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు వేరని గుర్తు చేశారు. హిండెన్బర్గ్ తాజా ఆరోపణల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్లో అదానీ స్టాక్స్లో భారీ అమ్మకాలు ఉండకపోవచ్చని, అలాగే స్టాక్ మార్కెట్ సైతం భారీ నష్టాల్లోకి వెళ్లే అవకాశాలేమీ ఉండకపోవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు హిండెన్బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ కారణంగా భారత స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మొదట్లో ప్రభావం కనిపించవచ్చు కానీ, మార్కెట్లో కొనుగోళ్లు ఉంటాయి. అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. మార్కెట్లు ప్రారంభమైన తర్వాత అదానీ స్టాక్స్ కాస్త ఒత్తిడికి గురికావచ్చు. కానీ, మళ్లీ రికవరీ అవుతాయి.' అని ఇండిట్రేడ్ క్యాపిటల్ ఛైర్మన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నట్లు మింట్ వెల్లడించింది.
తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Siva Kumar) స్పందించారు.




Aug 12 2024, 15:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.6k