నల్లగొండలో ఆగస్టు 9న జరిగే సదస్సును జయప్రదం చేయండి: ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి పిలుపు
*మర్రిగూడ మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ*
నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడంలో పాలక పార్టీలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయని ప్రాజెక్టుల డిపిఆర్ ను ఆమోదించి నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయాలని కోరుతూ.. ఆగస్టు 9న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు వేలాదిగా జనం తరలి వచ్చి జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ.. అత్యధిక ఫ్లోరిన్ ఈ ప్రాంతంలోనే ఉన్నదని దీనివల్ల ప్రజల తీవ్రమైన అనారోగ్యాన్ని గురవుతున్నారని అన్నారు. సాగునీరు లేకపోవడం వలన భూములు బీడులుగా మారాయని తెలిపారు. కూలీలు, ప్రజలు గ్రామాలకు గ్రామాలు వలసలు పోయే పరిస్థితి దాపురించిందని అన్నారు.కేసీఆర్ హయాంలో గత పది సంవత్సరాల అధికారంలో కొనసాగినా ఫ్లోరిన్ బాధితుల గురించి ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ తాగునీరు, సాగునీరు అందించడానికి అవసరమైన డిండి ఎత్తిపోతల పథకాన్ని డిపిఆర్ ఆమోదించకపోవడం చాలా అన్యాయం అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జీవోఎంఎస్ నెంబర్ 105 ద్వారా డీపీఆర్ ను ఆమోదించారని కానీ 107 జీవో ద్వారా డిండి ఎతిపోతుల పథకం డీపీఆర్ ను ఆమోదించలేదని తెలిపారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ డిండి ప్రాజెక్టు విషయంలో దృష్టి సారించలేదని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే డిపిఆర్ ను ఆమోదించి తగినన్ని నిధులు విడుదల చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇటీవల సిపిఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టుల పరిశీలన చేయడం జరిగిందని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ కలిసి వినతి పత్రం అందించినట్లు తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల పూర్తి కి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆగస్టు 9న శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, మర్రిగూడ మండల కార్యదర్శి, ఏర్పుల యాదయ్య, నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, సిపిఎం నాయకులు బొట్టు శివకుమార్, మైల సత్తయ్య, కొమ్ము లక్ష్మయ్య, నీలకంఠం రాములు, కొట్టం యాదయ్య, దామెర లక్ష్మి, మల్లేటి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

*మర్రిగూడ మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ*
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ.. అత్యధిక ఫ్లోరిన్ ఈ ప్రాంతంలోనే ఉన్నదని దీనివల్ల ప్రజల తీవ్రమైన అనారోగ్యాన్ని గురవుతున్నారని అన్నారు. సాగునీరు లేకపోవడం వలన భూములు బీడులుగా మారాయని తెలిపారు. కూలీలు, ప్రజలు గ్రామాలకు గ్రామాలు వలసలు పోయే పరిస్థితి దాపురించిందని అన్నారు.కేసీఆర్ హయాంలో గత పది సంవత్సరాల అధికారంలో కొనసాగినా ఫ్లోరిన్ బాధితుల గురించి ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ తాగునీరు, సాగునీరు అందించడానికి అవసరమైన డిండి ఎత్తిపోతల పథకాన్ని డిపిఆర్ ఆమోదించకపోవడం చాలా అన్యాయం అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జీవోఎంఎస్ నెంబర్ 105 ద్వారా డీపీఆర్ ను ఆమోదించారని కానీ 107 జీవో ద్వారా డిండి ఎతిపోతుల పథకం డీపీఆర్ ను ఆమోదించలేదని తెలిపారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ డిండి ప్రాజెక్టు విషయంలో దృష్టి సారించలేదని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే డిపిఆర్ ను ఆమోదించి తగినన్ని నిధులు విడుదల చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇటీవల సిపిఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టుల పరిశీలన చేయడం జరిగిందని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ కలిసి వినతి పత్రం అందించినట్లు తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల పూర్తి కి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆగస్టు 9న శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, మర్రిగూడ మండల కార్యదర్శి, ఏర్పుల యాదయ్య, నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, సిపిఎం నాయకులు బొట్టు శివకుమార్, మైల సత్తయ్య, కొమ్ము లక్ష్మయ్య, నీలకంఠం రాములు, కొట్టం యాదయ్య, దామెర లక్ష్మి, మల్లేటి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఫౌండేషన్ సభ్యులు నాతి స్వామి, ఎం వి ఎన్ ట్రస్ట్ ఇంచార్జ్ నర్సిరెడ్డి, ముఖ్య అతిథి, మరియుకన్వీనర్ డాక్టర్ అక్కినపల్లి మీనయ్య, ఏఎస్పి భాస్కర్ గౌడ్ సమక్షంలో ఆదివారం నల్గొండ పట్టణంలో విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాతి గణేష్ , మల్లం మహేష్, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి, మండలంలోని చెరువుగట్టు గ్రామంలో ఈరోజు శ్రీ శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు.
ఉచిత దర్శనం లో స్వామి వారిని దర్శించుకోవడానికి గంటకు పైగా సమయం పడుతుంది. అయితే భక్తులు అమావాస్య రాత్రి చెరువుగట్టు గుట్టపైన దైవ సన్నిధిలో నిద్రించి.. ఉదయం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది.
రంగారెడ్డి రూరల్ జిల్లా బిజెపి పార్టీ ఎస్టీ మోర్చా ఇన్చార్జిగా కేతావత్ భాస్కర్ నాయక్ నియామకం అయ్యారు.
అదేవిధంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కు, ఎస్టీ మోర్చా జాతీయ, రాష్ట్ర నాయకులకు ధన్యవాదములు అని తెలిపారు.
క్లీన్ హోం గ్రీన్ హోం ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో, ఈ రోజు నార్కట్ పల్లి మండలంలోని ఏపీ లింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
వరంగల్:
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ - మహ్మద్ జాహెద్ పాషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. ఒక వ్యక్తికి తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమి తన పేరు మీద మార్పిడి చేసి పాసుబుక్ జారీ చేయడం కోసం ఆ వ్యక్తి నుండి పదివేల రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.
కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ మహ్మద్ జాహెద్ పాషా... ఇతని ప్రైవేట్ వ్యక్తి (అసిస్టెంట్) దాసరి ధర్మేందర్ సహాయంతో రూ. 3000, ప్రైవేట్ డ్రైవర్ మహమ్మద్ అంజాద్ ల సహాయంతో రూ. 7000 లంచం డబ్బులు తీసుకున్నాడు.
టీఎస్పీఎస్సీ విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఈ.ఈ ఫలితాలలో నాంపల్లి మండలం, కేతపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి ప్రసాద్ తండ్రి ముత్తయ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సహాయ కార్యనిర్వహక ఇంజనీరుగా ఉద్యోగం సాధించారు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు మరియు గ్రామ ప్రజలు, పోలేపల్లి ప్రసాద్ కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
నల్లగొండ: ఈనెల 5 నుండి ప్రారంభం కానున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా అన్ని ఇంటి స్థాయిలో, కమ్యూనిటీ స్థాయిలో మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేసి సేకరించడం, రహదారులను ప్రజా స్థలాలను శుభ్రం చేయడం, పాఠశాలల్లో పరిశుభ్రతపై పోటీలు నిర్వహించడం, కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి ఎంతగానో సహాయపడతాయని అన్నారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రోజూ చేపట్టవలసిన చర్యలను క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వార్డు ఆఫీసర్లు మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Aug 05 2024, 16:10
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.4k