/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: చెరువుగట్టు లో పెరిగిన భక్తుల రద్దీ Mane Praveen
Mane Praveen

Aug 04 2024, 20:25

NLG: చెరువుగట్టు లో పెరిగిన భక్తుల రద్దీ
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి, మండలంలోని చెరువుగట్టు గ్రామంలో ఈరోజు శ్రీ శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. ఉచిత దర్శనం లో స్వామి వారిని దర్శించుకోవడానికి గంటకు పైగా సమయం పడుతుంది. అయితే భక్తులు అమావాస్య రాత్రి చెరువుగట్టు గుట్టపైన దైవ సన్నిధిలో నిద్రించి.. ఉదయం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది.

Mane Praveen

Aug 03 2024, 21:28

RR: జిల్లా బిజెపి ఎస్టీ మోర్చా ఇన్చార్జిగా కేతావత్ భాస్కర్ నాయక్
రంగారెడ్డి రూరల్ జిల్లా బిజెపి పార్టీ ఎస్టీ మోర్చా ఇన్చార్జిగా కేతావత్ భాస్కర్ నాయక్ నియామకం అయ్యారు.

ఈ సందర్భంగా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ.. ఎస్టి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న తనకు జిల్లా బిజెపి ఎస్టీ మోర్చా ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చిన బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జె కళ్యాణ్ నాయక్, ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేనావత్ రవి నాయక్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కు, ఎస్టీ మోర్చా జాతీయ, రాష్ట్ర నాయకులకు ధన్యవాదములు అని తెలిపారు.
                                                                                                            

Mane Praveen

Aug 03 2024, 21:02

ఏపీ లింగోటం: విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ
క్లీన్ హోం గ్రీన్ హోం ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో, ఈ రోజు నార్కట్ పల్లి మండలంలోని ఏపీ లింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.

Mane Praveen

Aug 03 2024, 19:44

అనిశా కు చిక్కిన పర్వతగిరి ఎస్ ఐ
వరంగల్:
ఒక కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు నోటీసులు ఇవ్వడానికి, స్టేషన్ బెయిల్ మంజూరు చేయటం కోసం వరంగల్ కమీషనరేట్ పరిధి లోని పర్వతగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకన్న తన డ్రైవర్ అయిన, పి. సదానందం ఏఆర్ కానిస్టేబుల్  ద్వారా నలభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు.

Mane Praveen

Aug 03 2024, 18:58

పెద్దపల్లి జిల్లా: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ - మహ్మద్ జాహెద్ పాషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. ఒక వ్యక్తికి తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమి తన పేరు మీద మార్పిడి చేసి పాసుబుక్ జారీ చేయడం కోసం ఆ వ్యక్తి నుండి పదివేల రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ మహ్మద్ జాహెద్ పాషా... ఇతని ప్రైవేట్ వ్యక్తి (అసిస్టెంట్) దాసరి ధర్మేందర్ సహాయంతో రూ. 3000, ప్రైవేట్ డ్రైవర్  మహమ్మద్ అంజాద్  ల సహాయంతో రూ. 7000 లంచం డబ్బులు తీసుకున్నాడు.

Mane Praveen

Aug 03 2024, 18:37

NLG: టీఎస్పీఎస్సీ ఫలితాలలో ఏఈఈ ఉద్యోగం సాధించిన నాంపల్లి మండల వాసి
టీఎస్పీఎస్సీ విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఈ.ఈ ఫలితాలలో నాంపల్లి మండలం, కేతపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి ప్రసాద్ తండ్రి ముత్తయ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సహాయ కార్యనిర్వహక ఇంజనీరుగా ఉద్యోగం సాధించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు మరియు గ్రామ ప్రజలు, పోలేపల్లి ప్రసాద్ కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Mane Praveen

Aug 02 2024, 22:25

NLG: స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్
నల్లగొండ:  ఈనెల 5 నుండి ప్రారంభం కానున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా అన్ని ఇంటి స్థాయిలో, కమ్యూనిటీ స్థాయిలో మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేసి సేకరించడం, రహదారులను ప్రజా స్థలాలను శుభ్రం చేయడం, పాఠశాలల్లో పరిశుభ్రతపై పోటీలు నిర్వహించడం, కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి ఎంతగానో సహాయపడతాయని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రోజూ చేపట్టవలసిన చర్యలను క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వార్డు ఆఫీసర్లు మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 02 2024, 21:45

NLG: పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించిన కౌన్సిలర్
నల్గొండ పట్టణంలోని 26 వ వార్డు లో వార్డు కౌన్సిలర్ బషీర్ ఇవాళ వార్డు లో వున్నా పరిసరాల పరిశుభ్రత గురించి ఇంటిఇంటికి తిరిగి తడి,పొడి చెత్త ను వేరు చేయాలి వార్డు ప్రజలకు సూచించారు. అదేవిధంగా వార్డు లో వున్న సమస్యలు.. చెట్లు పెరిగి కరెంట్ తీగలకు అనుకోవడం, మురికి కాలువల సమస్యలు, మంచి నీటి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి మున్సిపల్ వర్కర్ల తో మాట్లాడి వార్డు ప్రజల సమస్యలను తీర్చారు. కార్యక్రమంలో 26 వ వార్డు వాలంటీర్ నాగుల జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 02 2024, 21:36

పదోన్నతుల పండుగలో పాల్గొన్న నల్గొండ ఫిజికల్ డైరెక్టర్లు

ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల పదోన్నతుల పండుగ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన ఒలంపిక్ అసోసియేషన్, హాకీ అసోసియేషన్, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు ఇమామ్ కరీం, M.బాలరాజుయాదవ్ లు పాల్గొన్నారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడమే కాకుండా, క్రీడా పాలసీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని త్వరలోనే నూతన స్టేడియంలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలపడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Mane Praveen

Aug 02 2024, 09:44

NLG: సాగర్ ప్రస్తుత నీటిమట్టం 544. 60 అడుగులు
నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. ఇవాళ ఉదయం  అందిన సమాచారం ప్రకారం
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 544. 60 అడుగులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలకు గాను 198. 0450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో 3, 27, 969 క్యూసెక్కులు రాగా, ఔట్ ఫ్లో 30, 747 క్యూసెక్కు లుగా నమోదయింది.