/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz పెద్దపల్లి జిల్లా: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి Mane Praveen
Mane Praveen

Aug 03 2024, 18:58

పెద్దపల్లి జిల్లా: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ - మహ్మద్ జాహెద్ పాషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. ఒక వ్యక్తికి తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమి తన పేరు మీద మార్పిడి చేసి పాసుబుక్ జారీ చేయడం కోసం ఆ వ్యక్తి నుండి పదివేల రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. కాల్వశ్రీరాంపూర్ మండల తహశీల్దార్ మహ్మద్ జాహెద్ పాషా... ఇతని ప్రైవేట్ వ్యక్తి (అసిస్టెంట్) దాసరి ధర్మేందర్ సహాయంతో రూ. 3000, ప్రైవేట్ డ్రైవర్  మహమ్మద్ అంజాద్  ల సహాయంతో రూ. 7000 లంచం డబ్బులు తీసుకున్నాడు.

Mane Praveen

Aug 03 2024, 18:37

NLG: టీఎస్పీఎస్సీ ఫలితాలలో ఏఈఈ ఉద్యోగం సాధించిన నాంపల్లి మండల వాసి
టీఎస్పీఎస్సీ విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఈ.ఈ ఫలితాలలో నాంపల్లి మండలం, కేతపల్లి గ్రామానికి చెందిన పోలేపల్లి ప్రసాద్ తండ్రి ముత్తయ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సహాయ కార్యనిర్వహక ఇంజనీరుగా ఉద్యోగం సాధించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు మరియు గ్రామ ప్రజలు, పోలేపల్లి ప్రసాద్ కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Mane Praveen

Aug 02 2024, 22:25

NLG: స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్
నల్లగొండ:  ఈనెల 5 నుండి ప్రారంభం కానున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా అన్ని ఇంటి స్థాయిలో, కమ్యూనిటీ స్థాయిలో మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేసి సేకరించడం, రహదారులను ప్రజా స్థలాలను శుభ్రం చేయడం, పాఠశాలల్లో పరిశుభ్రతపై పోటీలు నిర్వహించడం, కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి ఎంతగానో సహాయపడతాయని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రోజూ చేపట్టవలసిన చర్యలను క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వార్డు ఆఫీసర్లు మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 02 2024, 21:45

NLG: పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించిన కౌన్సిలర్
నల్గొండ పట్టణంలోని 26 వ వార్డు లో వార్డు కౌన్సిలర్ బషీర్ ఇవాళ వార్డు లో వున్నా పరిసరాల పరిశుభ్రత గురించి ఇంటిఇంటికి తిరిగి తడి,పొడి చెత్త ను వేరు చేయాలి వార్డు ప్రజలకు సూచించారు. అదేవిధంగా వార్డు లో వున్న సమస్యలు.. చెట్లు పెరిగి కరెంట్ తీగలకు అనుకోవడం, మురికి కాలువల సమస్యలు, మంచి నీటి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి మున్సిపల్ వర్కర్ల తో మాట్లాడి వార్డు ప్రజల సమస్యలను తీర్చారు. కార్యక్రమంలో 26 వ వార్డు వాలంటీర్ నాగుల జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 02 2024, 21:36

పదోన్నతుల పండుగలో పాల్గొన్న నల్గొండ ఫిజికల్ డైరెక్టర్లు

ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల పదోన్నతుల పండుగ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన ఒలంపిక్ అసోసియేషన్, హాకీ అసోసియేషన్, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు ఇమామ్ కరీం, M.బాలరాజుయాదవ్ లు పాల్గొన్నారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడమే కాకుండా, క్రీడా పాలసీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని త్వరలోనే నూతన స్టేడియంలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలపడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Mane Praveen

Aug 02 2024, 09:44

NLG: సాగర్ ప్రస్తుత నీటిమట్టం 544. 60 అడుగులు
నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. ఇవాళ ఉదయం  అందిన సమాచారం ప్రకారం
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 544. 60 అడుగులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలకు గాను 198. 0450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో 3, 27, 969 క్యూసెక్కులు రాగా, ఔట్ ఫ్లో 30, 747 క్యూసెక్కు లుగా నమోదయింది.

Mane Praveen

Aug 01 2024, 22:12

TG: స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
TG: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఈ నెల 5 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న మౌళిక  సమస్యలను పరిష్కరించాలన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లతో సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడమే కాకుండా అవి మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.

కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఎలుసింగ్ మేరు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ శాఖ కమిషనర్ వీపీ గౌతమ్, అధికారులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 01 2024, 21:34

ఎస్సీ హాస్టల్ కు సొంత భవనం నిర్మించాలి: కెవిపిఎస్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం:
కుల వివక్ష వ్యతిరేక  పోరాట సంఘం (KVPS ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునుగోడు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడెం మండల కేంద్రంలో ఎస్టీ,ఎస్సీ బాలుర హాస్టల్ కెవిపిఎస్ మునుగోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా KVPS జిల్లా ఉపాధ్యక్షులు బొట్టు శివకుమార్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం  విఫలమైందని ఆరోపించారు. తక్షణమే ఎస్టీ హాస్టల్ కు ప్రహరి గోడ నిర్మాణం చేయాలి, ఎస్సీ హాస్టల్ కు సొంత భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల వలయంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని, తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కెవిపిఎస్ తరపున  డిమాండ్ చేశారు. ప్రస్తుతం అద్దె భవనం ఉంటున్న ఎస్సీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు సరైన రీతిలో లేవు.ఎస్టీ హాస్టల్లో ఇంకా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు.

తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని  ప్రభుత్వం డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బాణావత్ దేవా, మిట్టపల్లి ఆనంద, పర్వతం కిరణ్ కుమార్, సైదులు, నరసింహ, యాకోబు, యాదయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.

       

Mane Praveen

Aug 01 2024, 08:29

RR: నేడు మీర్ ఖాన్ పేటకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఈ రోజు గురువారం సాయంత్రం 4:00 గంటలకు రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం, మీర్ ఖాన్ పేట గ్రామం లో..  రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం  మొట్టమొదటగా "*స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ"* కి  శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మహేశ్వlరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, పీసీసీ మెంబర్ మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవ భాస్కర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

Mane Praveen

Jul 31 2024, 17:25

AITUC నాయకుల అరెస్టు చేయడం అప్రజాస్వామికం: జిల్లా ప్రధాన కార్యదర్శి
నల్గొండ: సివిల్ సప్లై హమాలీ , మధ్యాహ్న భోజనం, ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ, చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్న కార్మికులను జిల్లా వ్యాప్తంగా  ఎక్కడికక్కడ అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సివిల్ సప్లై, మధ్యాహ్న భోజనం, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమానికి AITUC పిలుపునివ్వడం జరిగింది.
హైదరాబాద్ వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కార్మికులను అరెస్ట్ చేయడం జరిగింది. నల్గొండలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తో పాటు కార్మికులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంబించి ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందని అన్నారు. సమస్యలు పరిష్కరించామంటే అరెస్టులతో నిర్బంధించడం వల్ల సమస్యలు పరిష్కారం కావని రెచ్చగొట్టే చర్యలు తప్ప మరోటి కాదని  పేర్కొన్నారు.
సివిల్ సప్లై హామాలి కార్మికుల వేతన కాలం డిసెంబర్ 2023 తో ముగిసి ఏడు నెలలు అయిన వేతనాలు పెంచమని సివిల్ సప్లై హమాలీ కార్మికులు కోరుతున్న వేతనాలు పెంచకుండా జాప్యం చేస్తుందనీ ఆరోపించారు.

అధికారులు ఎన్ని సార్లు అడిగినా కబుర్లతో కాలయాపన చేస్తున్నారు తప్ప హమాలి రేట్లు పెంచడం లేదని విమర్శించారు . మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచుతామని గత ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందని మరియు ట్రాన్స్పోర్ట్ రంగ  కార్మికులను ఆదుకుంటామని చెప్పారని గుర్తు చేశారు.

అరెస్టులతో ఉద్యమాల్ని ఆపలేరని కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో AITUC డివిజన్ కార్యదర్శి వి. లెనిన్, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, యాదయ్య, వెంకటయ్య, లక్ష్మయ్య, శ్రీను, రవి, నాగరాజు తదితరులు  పాల్గొన్నారు.